-
ఫ్రాన్సెన్స్ హాగెన్ చిచ్చు..ఫేస్బుక్పై బాంబు పేల్చిన ఆస్ట్రేలియా ?!
యూజర్ల భద్రత కంటే డబ్బుకే ప్రాధాన్యం ఇస్తుందంటూ మాజీ ఉద్యోగిని ఫ్రాన్సెన్స్ హాగెన్ పెట్టిన చిచ్చు ఫేస్ బుక్ను రోజుకో మలుపు తిప్పుతున్నాయి. ఈ ఆరోపణలే ఫేస్బుక్ పేరు సైతం మార్చే దిశగా జుకర్ బెర్గ్ ప్రయత్నాలు ప్రారంభించారంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా సంస్థలకు ఆస్ట్రేలియా ప్రభుత్వం 10 మిలియన్ల జరిమానా విధించే యోచనలో ఉందని తెలుస్తోంది. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం సోషల్ మీడియాపై కొత్త చట్టాల్ని అందుబాటులోకి తెచ్చే ప్రయత్నంలో ఉంది. చట్టాల ప్రకారం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న సోషల్ మీడియా సంస్థలకు 10 మిలియన్ల వరకు జరిమాన విధించేందుకు ఆస్ట్రేలియా సిద్ధమైంది. అదే జరిగితే ముందుగా ఫేస్బుక్ జరిమానా కట్టాల్సి ఉంటుందనే అనే ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. ఇటీవల సోషల్ మీడియా చట్టాల్ని మరింత కఠిన తరం చేస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. ఈ సందర్భంగా ఆస్ట్రేలియా అటార్నీ జనరల్ మైఖేలియా క్యాష్ మాట్లాడుతూ.. సోషల్ ఫోరమ్ సైట్ రెడ్డిట్తో పాటు బంబుల్ వంటి డేటింగ్ యాప్లను నిర్వహిస్తున్న సోషల్ మీడియా కంపెనీలు యూజర్ల వయస్సును నిర్ధారించడానికి డేటాను సేకరిస్తున్నాయి. ఈ విషయంలో కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పిల్లల ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తాం. ముసాయిదా చట్టం ప్రకారం.. సోషల్ మీడియా కంపెనీలు 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న యూజర్లు తల్లిదండ్రుల అనుమతి తప్పని సరి, చట్టాల్ని ఉల్లంఘించిన సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలు 10 మిలియన్ జరిమానా విధించాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం యోచిస్తుందని అన్నారు. మానసిక ఆరోగ్యం,ఆత్మహత్యల నివారణపై ఆస్ట్రేలియా సహాయ మంత్రి డేవిడ్ కోల్మాన్ మాట్లాడుతూ..ఫేస్బుక్ యువతీ యువకుల మానసిక ఆరోగ్యంపై ప్రభావాన్ని చూపుతున్నాయని వ్యాఖ్యానించారు. ''ఆస్ట్రేలియన్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ కార్యాలయం ప్రతినిధులు సోషల్ మీడియా సంస్థల చట్టాల ఉల్లంఘనపై విచారణ, జరిమానా విధించే అధికారం ఉందని తెలిపారు. విచారణలో ఉల్లంఘన నిజమైతే 10మిలియన్లు లేదా సంస్థల వార్షిక టర్నోవర్లో 10శాతం, ఆర్ధిక ప్రయోజనం కోసం ఉల్లంఘిస్తే మూడు రెట్లు జరిమానా విధించే అధికారం ఉందని స్పష్టం చేశారు. చదవండి: ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు! -
ఫేస్బుక్ సంచలన నిర్ణయం.. పేరు మార్పు!
Facebook Name Change Says Verge: సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఫేస్బుక్ సంచలన నిర్ణయం తీసుకోనుందా? ఫేస్బుక్ పేరు మారబోతోందా? ప్రముఖ టెక్ బ్లాగ్ ది వెర్జ్ అవుననే అంటోంది. ఈ మేరకు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ కీలక నిర్ణయం ప్రకటించబోతున్నాడంటూ తాజాగా తన వెబ్సైట్లో వెర్జ్ ఓ కథనం ప్రచురించింది. అక్టోబర్ 28న జరగబోయే కంపెనీ వార్షిక సమావేశంలో ఈ మేరకు ఫేస్బుక్ పేరు మార్చే అంశంపై జుకర్ బెర్గ్ స్పందించనున్నట్లు ది వెర్జ్ కథనం పేర్కొంది. ఒకవేళ అది జరిగినా.. ఇన్స్ట్రాగ్రామ్, వాట్సాప్, ఓకులస్లను తదితర ఫేస్బుక్ సంబంధిత సర్వీసులు మాత్రం పేరెంట్ కంపెనీ(ఫేస్బుక్ కంపెనీ) కిందనే నడుస్తాయి. మెటావర్స్ లాంటి భారీ ప్రాజెక్టు దిశగా పేస్బుక్ అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో పేరు మార్చడం ద్వారా రిఫ్రెష్నెస్ ఉంటుందని జుకర్బర్గ్ అండ్ కో భావిస్తున్నట్లు వెర్జ్ తన కథనంలో పేర్కొంది. అయితే కొత్త పేరు ఏంటన్న విషయంపై మాత్రం ఆ కథనం స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు ఫేస్బుక్ కూడా ఈ పేరుమార్పు కథనంపై స్పందించేందుకు నిరాకరించడంతో .. ఇదొక రూమర్గానే భావించాల్సి ఉంటుంది.ఇక కంపెనీలు ఇలా పేర్లు మార్చుకోవడం కొత్తేం కాదు. అమెరికా టెక్ దిగ్గజం ఆల్ఫాబెట్ కంపెనీ(గూగుల్ పేరెంట్ కంపెనీ) నుంచి గూగుల్ ఇలాగే పేరు మార్చుకుని కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఫేస్బుక్ అధినేత ఉక్కిరి బిక్కిరి గత కొద్ది రోజులుగా వస్తున్న ఆరోపణులు మార్క్ జుకర్ బెర్గ్కు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మాజీ ఎంప్లాయి ఫ్రానెస్స్ హాగెన్ ఆరోపణలు, అక్టోబర్ 4 రాత్రి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఫేస్బుక్కు అనుసంధానంగా ఉన్న వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ దాదాపు 7 గంటల పాటు స్తంభించిపోవడం, దీంతో అసౌకర్యానికి గురైన 2.7 బిలియన్ యూజర్లు ప్రత్యామ్నాయ సోషల్ నెట్ వర్క్లను వినియోగించుకునేందుకు మొగ్గు చూపడం, ఆ సర్వీసుల విఘాతం వల్ల రూ.50 వేల కోట్ల నష్టం వాటిల్లడం, ఉద్యోగుల విషయంలో వివక్షతో పాటు ఫెడరల్ రిక్రూట్మెంట్ రూల్స్ను ఉల్లంఘించిందంటూ ఫేస్బుక్ కు రూ.107 కోట్ల ఫైన్ విధించడం..ఆ ఫైన్ కట్టేందుకు జుకర్ బెర్గ్ ఒప్పుకోవడం, ఫేస్బుక్ సీఈఓగా మార్క్ జుకర్ బెర్గ్ రాజీనామా చేస్తున్నారంటూ బ్రిటన్కు చెందిన ఓ ప్రముఖ టాబ్లాయిడ్ సంచలన కథనాలు వెలుగులోకి రావడం జుకర్ బెర్గ్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందుకే ప్రస్తుతం ఈ విపత్తు నుంచి బయట పడేందుకు ఫేస్బుక్ పేరు మారిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ జుకర్బెర్గ్ ఫేస్బుక్ బోర్డుతో సమాలోచనలు జరుపుతున్నట్లు ది వెర్జ్ తన కథనంలో పేర్కొంది. ఫేస్బుక్ పేరు మార్చడం వల్ల న్యాయపరమైన ఇబ్బందుల నుంచి బయటపడొచ్చనేది మరి కొందరి వాదన. అయితే ఫేస్బుక్ పేరు మారిస్తే..ఫేస్బుక్కు పెట్టబోయే కొత్త పేరేంటీ? పేరు మార్పును ఎప్పుడు ప్రకటిస్తారని అంశంపై కొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది. వాట్ నెక్ట్స్ ప్రస్తుతం సోషల్ మీడియా నెట్ వర్కింగ్ సైట్లతో బిజీగా ఉన్న జుకర్ బెర్గ్..భవిష్యత్ టెక్నాలజీ 'మెటావర్స్'ను డెవలప్ చేసే పనిలో ఉన్నారు. ఇందుకోసం యూరప్లో 10వేల మందిని నియమించుకోబోతున్నట్లు ప్రకటించారు. మెటావర్స్ అనేది వర్చువల్ రియాలిటీ స్పేస్. ఇటీవల ఫేస్బుక్, వర్క్ప్లేస్ అనే వర్చువల్ రియాల్టీ మీటింగ్స్ యాప్, హారిజన్స్ అనే సోషల్ స్పేస్తో ప్రయోగాలు చేస్తోంది. పనిచేసే ప్రదేశాల కోసమే కాకుండా, వాస్తవికతలో సంభాషించేందుకు అవసరమైన వర్చువల్ రియాలిటీ యాప్లను ఫేస్బుక్ రూపొందిస్తోంది. ఇందుకోసం 50 మిలియన్ డాలర్ల (సుమారు రూ.375 కోట్లు)ను ఫేస్బుక్ పెట్టుబడిగా కేటాయించింది. అయితే ఈ టెక్నాలజీ పూర్తి స్థాయిలో వినియోగం రావాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: ఉద్యోగాల్లో వివక్ష.. భారీ మూల్యం చెల్లించనున్న ఫేస్బుక్ -
విషాద గాథ: కాపాడినోడి చేతిలోనే కన్నుమూసింది
Ndakasi Selfie Pose Gorilla No More: ఫేస్బుక్ మీద ఆరోపణల తర్వాత సోషల్ మీడియా మనుషుల మీద మానసికంగా ప్రభావం చూపెడతాయా? లేదా? అనేది ప్రస్తుతం చర్చలో నడుస్తోంది. ఇలాంటి తరుణంలో ఓ ఘటన ఇంటర్నెట్లో యూజర్లను భావోద్వేగాల్ని ప్రదర్శించేలా చేస్తోంది. కొన్నేళ్ల క్రితం మనిషితో సెల్ఫీకి ఫోజులిచ్చిన ఓ గొరిల్లా.. చివరికి తనను కాపాడిన వ్యక్తి ఒడిలోనే తుదిశ్వాస విడిచి అందరితో కంటతడి పెట్టిస్తోంది. సెల్ఫీ స్టార్ ఎండకశి.. కొండ జాతికి చెందిన గొరిల్లా ఇది (Mountain Gorilla). 2019లో తన తోటి గొరిల్లా ఎన్డెజెతో కలిసి పార్క్ రేంజర్ మాథ్యూ షమావూ తీసిన సెల్ఫీకి సీరియస్ ఫోజు ఇచ్చింది. అప్పటి నుంచి ఈ గొరిల్లా వరల్డ్ ఫేమస్ అయ్యింది. ఎండకశి మీద మీమ్స్, కథనాలు ఎన్నో వచ్చాయి. కొన్ని డాక్యుసిరీస్లలోనూ కనిపించింది. చివరికి పద్నాలుగేళ్ల వయసులో.. దాని చిన్నప్పటి నుంచి సంరక్షిస్తున్న ఆండ్రే బౌమా కౌగిలిలోనే కన్నుమూసింది అది. View this post on Instagram A post shared by Virunga National Park (@virunganationalpark) సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి విపరీతంగా వైరల్ అవుతోంది. అనారోగ్య సమస్యలతోనే ఎండకశి చనిపోయినట్లు పార్క్ నిర్వాహకులు తెలిపారు. చిన్నపిల్లలా చూసుకున్నా. కానీ, వీడు నన్ను వదిలేసి వెళ్లిపోయాడు అంటూ ఆండ్రే పేరిట ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. This picture of two gorillas 🦍 posing for a selfie is one of the best things I’ve seen this week! 😭😭 pic.twitter.com/ftj2k3s1DF — A̶l̶h̶a̶j̶i̶ 𝔻𝕣𝕦𝕟𝕜𝕒𝕣𝕕 (@The_Nifemi) April 19, 2019 కాంగో విరుంగ నేషనల్ పార్క్లో సెన్వెక్వే సెంటర్లో ఇంతకాలం పెరిగింది ఎండకశి. విశేషం ఏంటంటే.. ఈ సెంటర్లో పెరిగే గొరిల్లాలన్నీ దాదాపు అనాథలే!. విరుంగ నేషనల్ పార్క్లో నివసించే గొరిల్లాలను, సాయుధులైన మిలిటెంట్లు కాల్చి చంపుతూ వస్తున్నారు. ఈ క్రమంలో 2007లో ఎండకశి తల్లిని సైతం కాల్చి చంపారు. ఆ టైంలో తల్లి శవం మీద గట్టిగా పడుకున్న నెలల వయసున్న పిల్ల గొరిల్లా(ఎండకశి)ని పార్క్ రేంజర్ ఆండ్రే బౌమా కాపాడి.. ఇంతకాలం ఆలనా పాలనా చూసుకున్నాడు. ఇక ఈ ఘటన తర్వాత కొండ గొరిల్లాలను సంరక్షించేందుకు కాంగో భారీ ఆపరేషన్ నిర్వహించింది. ఇది సత్ఫలితం ఇవ్వగా.. 2007లో 720 కొండ గొరిల్లాల సంఖ్య.. ఇప్పుడు ఆ సంఖ్య 1,063కి చేరిందని తెలుస్తోంది. Sharing again, selfie of the century, a ranger and friends at Virunga National Park in DR Congo. On #WorldRangerDay pic.twitter.com/Kp3BCkCHCS — Parveen Kaswan, IFS (@ParveenKaswan) July 31, 2020 చదవండి: ఆకలేస్తుందన్నాడు.. సాయం చేస్తే.. చివర్లో ట్విస్ట్ ఇచ్చాడు -
ఐఫోన్ లవర్స్కు శుభవార్త
ఐఫోన్ లవర్స్కు శుభవార్త. ఆపిల్ సంస్థ ప్రతినిధులు 'ఐఫోన్13 సిరీస్' విడుదల తేదీని ప్రకటించి సస్పెన్స్కు తెరదించినట్లు వార్తలు వస్తున్నాయి. గత కొంత కాలంగా ఐఫోన్ వినియోగదారులు ఐఫోన్ 13 విడుదల కోసం ఎంతగానే ఎదురు చూస్తున్నారు. రకరకాల కారణాల వల్ల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఈ నేపథ్యంలో ఐఫోన్ 13 సిరీస్ సెప్టెంబర్ 17 న విడుదలవుతున్నట్లు తెలుస్తోంది. చైనా సోషల్ మీడియా దిగ్గజం వైబూ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించింది. సెప్టెంబర్ లోనే ఐఫోన్ 13ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ తో పాటు సెప్టెంబర్ 30న ఆపిల్ తన సంస్థకు చెందిన మరో నాలుగు కొత్త ప్రాడక్ట్ లను విడుదల చేయనుంది' అంటూ కొన్ని స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆ స్క్రీన్ షాట్ల ప్రకారం ఐఫోన్ 13 సిరీస్ తో పాటు ఐఫోన్ 13ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్లను సెప్టెంబర్ 17 నుంచి అమ్మకాలు జరపాల్సి ఉండగా..సెప్టెంబర్ తరువాత ఎయిర్ పాడ్స్3 ని విడుదల చేయనుంది. అధికారికంగా ఐఫోన్ 13 విడుదల తేదీ ఎప్పుడనేది కన్ఫాం కాకపోయినప్పటికీ..ఆపిల్ మాత్రం సెప్టెంబర్ 17న విడుదల చేస్తుందని మార్కెట్ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ప్రతిసారి ఆపిల్ ప్రాడక్ట్ తేదీ విడుదల ఎప్పుడనే అంశంపై సోషల్ మీడియాలో వార్తలు వస్తుంటాయి. ఆ వార్తల్ని ఖండించని ఆపిల్ సంబంధిత తేదీల్లోనే విడుదల చేయడం.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలకు ఊతమిచినట్లైంది. చదవండి : ఆకట్టుకునే ఫీచర్లకు పెట్టింది పేరు ఈ స్మార్ట్ ఫోన్ -
కంచెకి ఇరువైపులా.. గుండెల్ని పిండేస్తున్న దృశ్యాలు
కాబూల్: అఫ్గానిస్తాన్ తాలిబన్ల వశమైనప్పట్నుంచి ప్రతిరోజు హృదయవిదారక ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా కాబూల్ విమానాశ్రయంలో దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రతీ ఒక్కరి గుండెల్ని పిండేస్తున్నాయి. తాలిబన్ల అరాచక పాలనకి భయపడి ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవడానికి కాబూల్ విమానాశ్రయానికి వేలాదిగా తరలివస్తూ ఉండడంతో వారిని అడ్డగించడానికి తాలిబాన్లు ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. ఈ కంచెకి ఒకవైపు అమెరికా, బ్రిటన్ సైనిక దళాలు, మరోవైపు మూటా ముల్లె, పిల్లాపాపల్ని చేతపట్టుకున్న అఫ్గాన్ ప్రజలు.. ఇక వారిని అడ్డగిస్తూ గాల్లోకి కాల్పులు జరుపుతున్న తాలిబన్లు.. ఇవే దృశ్యాలు, దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారుతున్నాయి. ఆ వీడియో భయానకం కాబూల్ విమానాశ్రయం దగ్గర తీసిన ఒక వీడియో అందరిలోనూ భయాందోళనలు పెంచుతోంది. తాలిబన్ల క్రూరత్వానికి ఇదొక ప్రత్యక్ష నిదర్శనంగా నిలిచింది. పసిపిల్లలతో ఉన్న కుటుంబాలను చెదరగొట్టడానికి తాలిబన్లు గాల్లోకి కాల్పులు జరుపుతున్నారు. ఆ కాల్పులకు భీతిల్లిన పిల్లలు బిగ్గరగా ఏడుస్తున్న వీడియో ఒకటి అమెరికా చానల్ ప్రసారం చేసింది. ఒకరిద్దరు సాయుధులైన తాలిబన్లు గాల్లోకి బదులుగా ఎదురుగా ఉన్న జనంవైపే గురిచూసి పేలుస్తున్న దృశ్యాలు అందరి వెన్నులో వణుకు పుట్టించాయి. చదవండి : తాలిబన్ల పైశాచికత్వం: వంట బాలేదని మంటల్లో వేశారు 169 మంది అమెరికన్ల ఎయిర్లిఫ్ట్ అమెరికన్లతో పాటుగా, తాము మద్దతు ఇచ్చిన ప్రభుత్వానికి అండగా ఉన్న అఫ్గాన్లను సురక్షిత దేశాలకు తరలిస్తామని ఆ దేశ అధ్యక్షుడు బైడెన్ ఇచ్చిన హామీ ఎందరో అఫ్గాన్లలో ఆశలు కల్పించింది. తాలిబన్ల నుంచి తమకు రక్షణ దొరుకుతుందన్న ఆనందంలో వారు కట్టు బట్టలతో విమానాశ్రయానికి తరలివస్తున్నారు. తాత్కాలికంగానైనా అఫ్గాన్లకు తాము ఆతిథ్యమిస్తామంటూ ఇప్పటివరకు 13 దేశాలు ముందుకు వచ్చాయి. కాబూల్ విమానాశ్రయం వెలుపల బారన్ హోటల్లో చిక్కుకుపోయిన 169 మంది అమెరికన్లని హెలికాప్టర్ల ద్వారా లిఫ్ట్ చేసి మరీ తీసుకువెళ్లారు. విమానాశ్రయం దగ్గరకు రావొద్దు అమెరికా ప్రభుత్వం ఆదేశాలు లేకుండా ఎవరూ కాబూల్ విమానాశ్రయం చుట్టుపక్కలకి కూడా రావొద్దని అఫ్గాన్లో అమెరికా రాయబార కార్యాలయం తమ పౌరుల్ని హెచ్చరించింది. విమానాశ్రయం వెలుపల పరిస్థితులు దారుణంగా ఉన్నాయని, ఎవరి ప్రాణాలకు భద్రత లేదని దౌత్య కార్యాలయం తన అధికారిక వెబ్సైట్లో ఉంచింది. అమెరికన్లు ఎవరూ ఆందోళన చెందవద్దని ఈ నెల 31లోగా తరలింపు ప్రక్రియ పూర్తవుతుందని రాయబార కార్యాలయం పేర్కొంది. Now - Another morning, another gunshot with struggle for escape. Kabul international airport. pic.twitter.com/eScU7ERM5V — Muslim Shirzad (@MuslimShirzad) August 19, 2021 -
రద్దు చేసిన సెక్షన్ కింద కేసులా?
న్యూఢిల్లీ: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) చట్టంలోని సెక్షన్ 66ఏ కింద ఇంకా కేసులు నమోదు చేయడం ఏమిటని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఈ సెక్షన్ను రద్దు చేస్తూ 2015 మార్చి 24న శ్రేయా సింఘాల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని ఉద్ఘాటించింది. 66ఏ సెక్షన్ కింద కేసులు పెట్టడంపై అభ్యంతరం తెలుపుతూ పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్(పీయూసీఎల్) అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పై కోర్టు స్పందించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు(యూటీ), హైకోర్టులకు నోటీసులిచ్చింది. 4వారాల్లోగా సమాధానం ఇవ్వాలంది. పీయూసీఎల్ పిటిషన్పై కోర్టు విచారణ చేపట్టింది. పోలీసు శాఖ రాష్ట్రాల పరిధిలోని అంశమైనా ఈ కేసులో రాష్ట్రాలు, యూటీలనూ ప్రతివాదులుగా చేర్చడమే సరైన మార్గమని అభిప్రాయపడింది. సెక్షన్ 66ఏ సమగ్రమైన ఉత్తర్వు జారీ చేస్తామని, తద్వారా ఈ వ్యవహారంపై వివాదానికి తెరపడుతుందని ఆశిస్తున్నట్లు వెల్లడించింది. విచారణ సందర్భంగా పీయూసీఎల్ తరపున సీనియర్ అడ్వొకేట్ సంజయ్ వాదనలు వినిపించారు. ఈ కేసులో పోలీసు, న్యాయ శాఖకు సంబంధించిన అంశాలు ఉన్నాయని సంజయ్ తెలిపారు. సెక్షన్ 66ఏను రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలదేనని కేంద్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. పీయూసీఎల్ దాఖలు చేసిన పిటిషన్పై స్పందిస్తూ ఈ మేరకు న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. సెక్షన్ 66ఏను సవాలు చేస్తూ తొలుత మహారాష్ట్రకు చెందిన న్యాయ విద్యార్థి శ్రేయా సింఘాల్ 2012లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ సెక్షన్ను 2015లో కోర్టు రద్దు చేసింది. అయినప్పటికీ రాష్ట్రాల్లో ఈ సెక్షన్ కింద కేసులు నమోదవుతున్నాయి. అభ్యంతరకరమైన, సమాజంలో అశాంతిని సృష్టించే అవకాశం ఉన్న సందేశాలను సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చేయకుండా నిరోధించేందుకు సెక్షన్ 66ఏను చేర్చారు. ఇలాంటి సందేశాలను సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు రుజువైతే దోషికి మూడేళ్ల వరకూ జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు. సెక్షన్ 66ఏ కింద దేశవ్యాప్తంగా పోలీసులు వేలాది కేసులు నమోదు చేశారు. -
ఒళ్లు గగుర్పొడిచే వీడియో.. ఎలుకలను నంజుకుతిన్న రెండు తలల పాము
పాములు ఏ రకం అయినా కావొచ్చు. ఏ జాతికి చెందినదైనా ఉండొచ్చు. దానిపై మనుషులకు ఉండేది ఒకే ఫీలింగ్. అదే భయం. పామంటే ఉండే వణుకు మనల్ని ఎన్నటికీ వీడదు. పాముల్లో రెండు తలల పాము చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. తాజాగా రెండు తలల పాముకు చెందిన ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఎక్కడ జరిగిందో తెలీయరాలేదు కానీ..రెండు తలలు కలిగిన ఓ పాము రెండు ఎలుక పిల్లలను పట్టుకొని ఒక్కో నోటితో ఒక్కో దాన్ని ఎంచక్కా లాగించేసింది. దీనికి సంబంధించిన వీడియోను జంతువుల సాహసం కోసం ప్రపంచాన్ని పర్యటిస్తున్న వ్లాగర్ బ్రియాన్ బార్జిక్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో వైరల్గా మారింది. వీడియోలో రెండు తలలున్న బెన్ అండ్ జెర్రీ అనే పాము మాటువేసి ఎలుకను పట్టుకొని అమాంతం మింగేసి ఆకలి తీర్చుకుంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ‘రెండు తలల పాము కావాలి. ఎక్కడ దొరుకుతుంది. ఇంతకుముందెన్నడూ రెండు తలల పామును నేను చూసిందే లేదు’ అంటూ కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. లేట్ ఎందుకు మీరు కూడా ఆ వీడియోపై ఓ లుక్కేయండి.! View this post on Instagram A post shared by B R I A N B A R C Z Y K (@snakebytestv) -
ఇక అక్కడ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’!
కాన్బెరా: తమ మాధ్యమాలలో కనిపించే వార్తలకు, వార్తాకథనాలకు సంబంధించి ఆయా ఆస్ట్రేలియన్ వార్తాసంస్థలకు ఫేస్బుక్, గూగుల్ డబ్బులు చెల్లించేలా ఆస్ట్రేలియా కొత్త చట్టం తీసుకువస్తోంది. సంబంధిత బిల్లుపై వచ్చేవారం ఆస్ట్రేలియా పార్లమెంటులో చర్చ జరగనుంది. డిసెంబర్ నెలలోనే ఈ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. అప్పటినుంచి సెనెట్ ఎకనమిక్స్ లెజిస్టేషన్ కమిటీ ఈ బిల్లును క్షుణ్నంగా అధ్యయనం చేసి, ముసాయిదా బిల్లులో ఎలాంటి మార్పులు అవసరం లేదని శుక్రవారం నివేదిక ఇచ్చింది. ఈ ‘మీడియా బార్గెయినింగ్ కోడ్’ ఆచరణ సాధ్యం కాదన్న గూగుల్, ఫేస్బుక్ల వాదనను కమిటీ తోసిపుచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఫేస్బుక్, గూగుల్ సంస్థలు తమ ప్లాట్ఫామ్స్పై కనిపించే వార్తలకు సంబంధిత ఆస్ట్రేలియా వార్తా సంస్థలకు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ మేరకు ఆయా వార్తాసంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం అమల్లోకి వస్తే.. ఆస్ట్రేలియాలో తమ సెర్చ్ ఇంజిన్ సేవలను నిలిపేస్తామని గూగుల్ ఇప్పటికే హెచ్చరించింది. తమ యూజర్లు ఆస్ట్రేలియాకు సంబంధించిన వార్తలను షేర్ చేసుకోకుండా నిషేధిస్తామని ఫేస్బుక్ కూడా పేర్కొంది. -
రక్తపు వరద : యుగాంతం? వైరల్
జకార్తా : ఇండోనేషియాలో రక్తపు రంగులో వరద అక్కడి జనాలను భయభ్రాంతులకు గురిచేసింది. ‘నెత్తుటి వర్షం..యుగాంతం’ అంటూ సోషల్ మీడియా ప్రచారం ఊపందుకుంది. ఈ వరద బీభత్సానికి సంబంధించి వేలాది ఫోటోలు, వీడియోలు ట్విటర్లో హల్చల్ చేశాయి. ఇండోనేషియా సెంట్రల్ జావాలోని పెకలోంగన్ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. ఇండోనేషియా గ్రామమైన జెంగ్గోట్లో భారీవర్షాలతో శనివారం వరదలు సంభవించాయి. దీంతో సమీపంలోని బాతిక్ కర్మాగారంలోని రంగులు వరద నీటిలో కలిసి పోయాయి. ఫలితంగా రక్తాన్ని పోలిన ముదురు ఎరుపు రంగు వరద నీటిలో కలిసిపోయి గ్రామాన్ని చుట్టుముట్టింది. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఆందోళనకు దారి తీసింది. ఈ గందరగోళ వాతావరణం నేపథ్యంలో పెకలొంగన్ అధికారులు స్పందించి వివరణ ఇచ్చారు. ఎర్రరంగు వరద బాతిక్ డై కారణంగా వచ్చిందని, ఆందోళన అవసరం లేదని విపత్తు నివారణ అధికారి డిమాస్ అర్గా యుధా ప్రకటించారు. దీంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఇండోనేషియాలోని పెకలోంగన్ సాంప్రదాయ పద్ధతిలో తయారు చేసే రంగులకు ప్రసిద్ధి చెందింది. ముఖ్యంగా బాతిక్ ఫాబ్రిక్ అనే పెయింట్ తయారీకి పెట్టింది పేరు. ఇక్కడ నదులు వేర్వేరు రంగులను సంతరించుకోవడం మామూలే. గత నెలలో వరద సమయంలో నగరానికి ఉత్తరాన ఉన్న మరో గ్రామాన్ని ప్రకాశవంతమైన ఆకుపచ్చ నీరు చుట్టిముట్టింది. pic.twitter.com/TjtpJIjUKN — Raja Purwa (@Raj4Purwa) February 6, 2021 -
ఫేక్ న్యూస్ : సుప్రీం నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ: ఫేస్బుక్, ట్విట్టర్ వంటి సామాజిక మాధ్యమాల్లో వచ్చే తప్పుడు వార్తలు, విద్వేషపూరిత ప్రసంగాలకు ఆయా సంస్థలనే బాధ్యులుగా చేయాలన్న విషయంలో అభిప్రాయం తెలపాల్సిందిగా సుప్రీంకోర్టు సోమవారం కేంద్రం, సంబంధిత వర్గాలకు నోటీసులు ఇచ్చింది. ఇందుకు సంబంధించి దాఖలైన పిటిషన్ను ప్రధానన్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వి.రామ సుబ్రమణియన్ల ధర్మాసనం విచారించింది. ఈ పిటిషన్ను, మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేకంగా మీడియా ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలంటూ గతంలో దాఖలైన పిల్తో కలిపి విచారణ చేపడతామని తెలిపింది. మీడియా, చానెళ్లు, నెట్వర్క్లపై వచ్చే ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేకంగా ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలంటూ దాఖలైన పిల్ను జనవరి 25వ తేదీన విచారించిన ధర్మాసనం.. కేంద్రంతోపాటు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్ కాస్టర్స్ అసోసియేషన్లకు నోటీసులు జారీ చేసింది. -
కొడుకుతో మహేష్.. మనవడితో బాలయ్య..
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. బీబీ3 అనే వర్కింగ్ టైటిల్తో ఈ సినిమా రూపొందుతోంది. బాలయ్యకు జోడిగా సయేషా సైగల్ నటించనున్నారు. ఓ వైపు సినిమాలు, రాజకీయాలతో బిజీగా ఉన్న బాలయ్య సమయం చిక్కినప్పుడల్లా తన కుటుంబంతో గడుపుతుంటారు. ఈ క్రమంలో బాలయ్య తన ముద్దుల మనవడు ఆర్యవీర్తో సరదాగా దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో బాలయ్య తన చిన్న కూతురు తేజస్విని కుమారుడితో ఫోటోకు ఫోజిచ్చారు. చదవండి: బాలకృష్ణ ఫస్ట్ లుక్ విడుదల Adorable pic of NataSimha #NandamuriBalakrishna with his grandson #Aryaveer pic.twitter.com/GJArAZZsFQ — BARaju (@baraju_SuperHit) November 11, 2020 సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ స్టార్ అయినప్పటికీ తన ఫ్యామిలీకి ఎంత ప్రాముఖ్యత ఇస్తారో అందరికి తెలిసిన విషయమే. ఇటీవల మహేష్ కుటుంబ సభ్యులతో కలిసి హాలిడే వెకేషన్స్కు వెళ్లాడు. ఎయిర్ పోర్ట్ దగ్గరి నుంచి టూర్కు చెందిన ప్రతి ఫోటోను మహేష్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బుధవారం సూపర్స్టార్ తన కొడుకు గౌతమ్తో దిగిన ఫొటోను షేర్ చేశాడు. ‘ఇప్పుడు అతన్ని హగ్ చేసుకోవడం చాలా కష్టం.. కానీ ప్రేమతో దగ్గరికి తీసుకోవడానికి సరైన సమయం, కారణం కూడా అవసరం లేదు’ అంటూ మహేష్ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ అభిమానులు ఆకర్షిస్తోంది. చదవండి: విహార యాత్రకు మహేష్ బాబు ఫ్యామిలీ It's a lot more difficult to hug him now ❤️❤️❤️ Never needed a reason or a perfect time. 🤗🤗#TravelDiaries #ItsActionsThatMatter pic.twitter.com/g6JrYfih4d — Mahesh Babu (@urstrulyMahesh) November 11, 2020 చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నారు సమంత అక్కినేని. ప్రస్తుతం సినిమలు తగ్గించిన సామ్ పలు బిజినెస్లతో తన జోరును కొనసాగిస్తున్నారు. సినిమాలు, బిజినెస్, ఫిట్నెస్.. ఇలా అన్నింటిలోనూ చాలా కేరింగ్గా ఉంటున్నారు. తాజాగా సమంత షేర్ చేసిన ఓ ఫిట్నెస్ వీడియోను చూస్తే మీరే వారెవ్వా అంటారు. ఇంటి ముందు గ్రాస్లో ట్రైనర్ సమక్షంలోనే వర్కవుట్స్ చేస్తున్న వీడియోను సామ్ తన ఇన్స్టాగ్రామ్లో అభిమానులతో పంచుకున్నారు. ఈ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.. చదవండి: బిగ్బాస్: సమంత జ్యువెలరీ ఖరీదెంతో తెలుసా View this post on Instagram May all beings everywhere be happy and free ,and may the thoughts ,words , and actions of my own life contribute in some way to that happiness and to that freedom for all. #day2ofplantbasedtransformation with @krishna__vikas Breaking the myth that one cannot enhance their performance, build lean muscle etc on a plant based diet... Let’s do this 💚 A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) on Nov 9, 2020 at 8:24pm PST నవంబర్ 10న దర్శకుడు క్రిష్ జాగర్లమూడి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఇండస్ట్రీలో ప్రముఖులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ క్రమంలో క్రిష్కు బర్త్డే విషెస్ తెలిపారు నటుడు పవన్ కల్యాణ్. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్లో పవన్ కల్యాణ్ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. కాగా క్రిష్. పవన్ కళ్యాణ్తో ఓ పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ మూవీ చేస్తున్నాడు. ‘వకీల్ సాబ్’ సినిమా తర్వాత ఈ సినిమా షూటింగ్ మొదలు కానుంది. ప్రస్తుతం క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. కోహినూర్ నేపథ్యంలో సాగే చారిత్రాత్మక కథ అయిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో నటిస్తున్నాడు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన `గ్రీన్ ఇండియా` ఛాలెంజ్ను తాజాగా హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పూర్తి చేశారు. హీరో నాగచైతన్య విసిరిన ఈ ఛాలెంజ్ను స్వీకరించిన రకుల్ హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో మొక్కలు నాటారు. అనంతరం తమ అభిమానులు మొక్కలు నాటాలని కోరారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో ఫోటోలు షేర్ చేశారు. Late but finally accepted #HaraHaiTohBharaHai #GreenindiaChallenge Thank you @chay_akkineni for nominating me .so I have Planted 3 saplings. Further I want to nominate not actors but all my fans to plant 3 trees each and tag me to continue the chain. pic.twitter.com/QFdsRKWcji — Rakul Singh (@Rakulpreet) November 11, 2020 -
జానకమ్మ క్షేమంగా ఉన్నారు
‘ప్రముఖ గాయని ఎస్. జానకి లేరు’ అనే వార్త సోషల్ మీడియాలో ప్రచారమైంది. ఈ వార్తను ఉద్దేశించి ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసిన వీడియో సారాంశం ఇది. ప్రియమైన మిత్రులకు... నేను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యంని. సోమవారం ఉదయం నుంచి జానకి అమ్మ క్షేమసమాచారాలు అడుగుతూ నాకు దాదాపు 20 ఫోన్ కాల్స్ వచ్చాయి. ఎవరో సోషల్ మీడియాలో ‘ఆమె ఇక లేరు’ అని ప్రచారం చేశారు. ఏంటీ నాన్సెన్స్. నేను ఆమెతో మాట్లాడాను. చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నారు. కళాకారులను బాగా అభిమానించేవారికి ఇలాంటి వార్తలు గుండెపోటు తెప్పిస్తాయి. దయచేసి సోషల్ మీడియాను పాజిటివ్ విషయాలకు వాడండి. ఇలాంటి నెగటివ్ విషయాలకు కాదు. హాస్యం కోసం సోషల్ మీడియాని వాడొద్దు. ‘లాంగ్ లివ్ జానకి అమ్మా. ఆమె చాలా ఆరోగ్యంగా ఉన్నారు. సేఫ్గా ఉన్నారు’. జెంటిల్మెన్ ఎందుకిలాంటి వార్తలు ప్రచారం చేçస్తున్నారు? ఇంతకీ మిమ్మల్ని జెంటిల్మెన్ అనాలా? అందరికీ ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను. ‘జానకికి చిన్న శస్త్ర చికిత్స జరిగింది. ఆమె క్షేమంగా ఉన్నారు’ అని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. -
'ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు'
సాక్షి, విజయవాడ: సోషల్ మీడియాలో అసత్యప్రచారాలపై ఏపీ సీఐడీ కొరడా ఝుళిపిస్తోంది. విశాఖ ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ విషయంలో అసత్య ప్రచారం చేసిన గుంటూరు వాసి రంగనాయకమ్మపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. కాగా... ఇప్పుడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తప్పుపడుతూ పెట్టిన పోస్టుకు సహకరించిన రఘునాద్ మల్లాడిపై సీఐడీ దృష్టి సారించింది. సున్నితమైన అంశంలో ప్రభుత్వంపై ప్రజలకు నమ్మకం పోయేలా ప్రచారం జరిగిందని సీఐడీ ఎస్పీ సరిత తెలిపారు. చదవండి: గుర్రాల నుంచే కోవిడ్ వ్యాక్సిన్ ఆమె బుధవారం రోజున మీడియాతో మాట్లాడుతూ.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాల విషయంలో హెచ్చరికలు చేస్తున్నా పోస్టింగులు పెట్టినందువల్లే రంగనాయకమ్మను అరెస్ట్ చేశాము. ఏ వయసు వారు తప్పు చేసినా శిక్ష తప్పదు. మొదటిసారి తప్పు చేసిన వారికి న్యాయస్థానం 3 ఏళ్ల జైలుశిక్ష , రూ.5 లక్షల జరిమానా విధిస్తుంది. రెండోసారి తప్పుచేస్తే ఐదేళ్ల జైలు శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తుందని సీఐడీ ఎస్పీ సరిత హెచ్చరించారు. చదవండి: బెంగళూరుని బెంబేలెత్తించిన భారీ శబ్ధాలు -
చిన్నారుల అద్భుత ప్రదర్శన.. వీడియో వైరల్
డిస్పూర్: జనాదరణ పొందిన అస్సామీ ప్రేమ పాట ‘ఈ హాహీ బాల్ లాగే’ పాటను ఓ చిన్నారిపాడుతుంటే, మరో బాలుడు డ్రమ్స్ వాయిస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. బాలుడు సొంతంగా తయారు చేసుకున్న డ్రమ్సెట్తో వాయిస్తుంటే, బాలిక తన మృధువైన స్వరంతో పాటను పాడుతూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. రూపాలి ప్రణమిత ఫేస్బుక్లో షేర్ చేసిన ఈ వీడియోలో పిల్లలు అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారు. అమ్మాయి పాటకు తగ్గా, సరైన బీట్స్తో బాలుడు మ్యూజిక్తో అదరగొట్టాడు. ఇక బాలుడు డ్రమ్సెట్ కోసం వినియోగించిన అట్టపెట్టెలు, అరటి చెట్టు కొమ్మలు, మెటల్ ట్రేలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ వీడియో పోస్ట్ చేసిన సమయం నుంచి నాలుగున్నర లక్షల మంది వీక్షించగా, 1800లకు పైగా కామెంట్లు రావడం విశేషం. పిల్లల సంగీత కచేరీ అద్భుతమని వారిద్దరికి మంచి భవిష్యత్తు ఉండాలని ఆకాంక్షిస్తూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. -
ఓ గాడ్! మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా?
కార్పొరేట్ దిగ్గజం ఎం అండ్ ఎం ఛైర్మన్ ఆనంద్ మహీంద్రాకు ఏదైనా వినూత్న విషయం కంట పడితే చాలు.. వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటారు. ఈయన పెట్టే ప్రతి పోస్టుకు నెటిజన్లు ఫిదా అయిపోతుంటారు. కరోనాను అధిగమించేందుకు ఇటీవల పలు సూచనలు చేసిన ఆయన తాజాగా వాట్సాప్ వండర్ బాక్స్ పేరుతో మరో పోస్ట్ చేశారు. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశమంతా లాక్డౌన్ అవులవుతున్న నేపథ్యంలో ఉద్యోగులంతా ఇంటి నుంచి వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇంటి నుంచి ఉద్యోగం చేస్తున్న వారి వేషాధారణకు సంబంధించిన ఓ ఫన్నీ మీమ్ను ట్విటర్లో షేర్ చేశారు. (కరోనా : బ్యాంకు ఉద్యోగి చిట్కా వైరల్) ‘ఇది నా వాట్సాప్ వండర్ బాక్స్ నుంచి వచ్చింది. ఇది వాస్తవానికి దగ్గరగా ఉంది. కొన్ని సందర్భాలలో ఇంటి నుంచి ఆఫీస్ పనులు చేసేపటప్పుడు వీడియో కాల్లో నేను చొక్కా, లుంగీని ధరించేవాడిని. ఎందుకంటే ఆ సమయంలో నిలబడాల్సిన అవసరం లేదు కాబట్టి. ఇక ఇప్పుడు ఈ ట్వీట్ తర్వాత కూడా లుంగీ కట్టుకోవాలని నా సహచరులు నాకు సూచిస్తారేమో..’ అంటూ ట్వీట్ చేశారు. ఇక ఆనంద్ మహీంద్రా పోస్ట్ చేసిన ఈ ట్వీట్ కాస్తా వైరల్ అవ్వడంతో నెటిజన్లు వేగంగా స్పందిస్తున్నారు. అంతపెద్ద కార్పొరేట్ దిగ్గజం లుంగీ ధరించడంపై షాక్కు గురవుతున్నారు. ‘ఓ మై గాడ్.. మీరు ఇంట్లో లుంగీ ధరిస్తారా’ అంటూ ఓ నెటిజన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ('శ్రీనివాస గౌడకు గోల్డ్ మెడల్ ఇవ్వండి') On a lighter note, this is from my #whatsappwonderbox. And I have a confession to make:On some Video Calls from home, I DID wear a lungi under my shirt. Didn’t have to stand up at any point during the meetings, but I suspect my colleagues may ask me to do so after this tweet! pic.twitter.com/e1IElefNaa — anand mahindra (@anandmahindra) April 5, 2020 -
టీడీపీ కుట్ర; ఇదీ.. అసలు కథ
ఈ క్లిప్పింగ్లో రాయి పట్టుకుని వెళుతున్న యువకుడి పేరు ఎన్ సద్దాం. పుంగనూరుకు చెందిన ఈ వ్యక్తి సోషల్ డెమెక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎస్డీపీఐ) తరఫున 21, 22 వార్డులకు పోటీ చేస్తున్న వారికి మద్దతుగా నామినేషన్ సెంటర్కు వచ్చారు. నామినేషన్ సెంటర్లో అప్పటికే వైఎస్సార్సీపీ నాయకులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఉండడం, వారు వచ్చిన తర్వాత వెళ్లాలని అధికారులు సూచించడంతో సద్దాం అడ్డుతగిలారు. వారు వచ్చేంత వరకూ మేమెందుకు వేచి ఉండాలంటూ గొడవపడ్డారు. ఈ క్రమంలో చోటుచేసుకున్న గొడవలో వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసేందుకు రాయితో వెళుతున్నారు. వాస్తవం ఇలా ఉంటే ఎల్లో మీడియా అధికార పార్టీ కార్యకర్తలు రాళ్లు చేతుల్లో పట్టుకుని తిరుగుతున్నా అడ్డుకునే వారు లేరని ఫోకస్ చేసింది. ఈ క్లిప్పింగ్లో ఉన్న వ్యక్తి పేరు కె.పద్మనాభం అలియాస్ పప్పురాయల్. టీడీపీ వర్గీయుడిగా, రౌడీషీటర్గా తిరుపతి నగరవాసులకు సుపరిచితుడు. సుగుణమ్మ ఎమ్మెల్యేగా ఉండగా అమెకు ప్రత్యక్షంగా శుభాకాంక్షలు వెల్లడిస్తూ సోషియల్ మీడియాలో పోస్టులు, బ్యానర్లు సైతం వేసే వ్యక్తి. అలాంటి వ్యక్తి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మను దూషించారని ‘బరితెగింపు’ పేరుతో టీడీపీ నేత మన్నెం శ్రీనివాసులపై వైఎస్సార్సీపీ నేత దాడి చేసినట్లు ఎల్లో మీడియా ప్రముఖంగా ప్రచారం చేసింది. వాస్తవానికి పప్పురాయల్, మన్నెం శ్రీనివాసులు ఇరువురు చిన్ననాటి స్నేహితులు. ఇప్పటికీ కలిసిమెలిసే ఉన్నారు. ఫ్యామిలీ ఫొటోలు కూడా అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. కాగా ఎమ్మెల్యేను దూషించారంటూ, మన్నెం శ్రీనివాసులపై దాడి చేశారంటూ వండివార్చింది. పప్పుయాదవ్ తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మకు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు ఈ రెండు క్లిప్పింగ్స్ పరిశీలిస్తే ఎన్నికలను అడ్డుకోవడానికి టీడీపీ, ఎల్లో మీడియా ఎలా కుట్ర చేసిందో ఇట్టే అర్థమవుతుంది. పక్కా ప్రణాళికతో వ్యవహరిస్తూ వార్తలను తమకు అనుకూలంగా వండి వార్చాయి. వాటినే ఎన్నికల అధికారి పరిగణనలోకి స్వీకరించారు. ఎలాంటి విచారణ లేకుండానే ఏకపక్ష చర్యలు చేపట్టారని పలువురు విశ్వసిస్తున్నారు. అందులో భాగంగానే కలెక్టర్ నారాయణగుప్తా, తిరుపతి అర్బన్ ఎస్పీ రమేష్రెడ్డితో పాటు పలువురు అధికారుల బదిలీల నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు భావిస్తున్నారు. రోజుకొక దుష్ప్రచారం ‘తస్కరించు.. తిరస్కరించు.. బహిష్కరించు.. మూడంచెల కుట్ర’ ప్రజాస్వామ్యానికి పునాది రాయి.. ఇలా రోజుకొక వార్త వండివార్చడం. వాటినే సుమోటోగా రాష్ట్ర ఎన్నికల అధికారి స్వీకరించడం వెనుక కుట్రకోణం బహిర్గతమవుతోందని పరిశీలకులు భావిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్వల్ప వివాదాలు సర్వసాధారణం. ఎన్నికలు వాయిదా పడాలనే టీడీపీ సంకల్పానికి ఎల్లో మీడియా అండగా నిలిచింది. అందుకు తగ్గట్లుగా పక్కా ప్రణాళికతో వ్యవహరించారు. జిల్లావ్యాప్తంగా దౌర్జన్యకర ఘటనలు తీవ్రంగా ఉన్నట్లు ఫోకస్ చేసింది. (ఎన్నికల వాయిదా; తెర వెనుక ఏం జరిగింది?!) ప్రజాభిమానం లేకపోవడంతో.. తెలుగుదేశం పార్టీని ప్రజలు తిరస్కరిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఆ విషయం తేటతెల్లమైంది. అందుకు కారణం గడిచిన ఐదేళ్లలో నియంతృత్వం రాజ్యమేలడం, ఓ వర్గం వారినే సంక్షేమ పథకాలకు అర్హులుగా ఎంపిక చేయడం, రాష్ట్రాభివృద్ధి లేకపోగా టీడీపీ కార్యకర్తల ఉన్నతికి మాత్రమే పనిచేయడం లాంటవని పలువురు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిఎం హోదాలో వైఎస్.జగన్మోహన్రెడ్డి 6నెలల్లో మంచి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకుంటానని ప్రజలకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రాజకీయాలతో నిమిత్తం లేకుండా సంక్షేమ పథకాలు అర్హులందరికీ వర్తింపజేశారు. ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బడుగు బలహీన వర్గాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో 59 శాతం సీట్లు కేటాయించాలని రిజర్వేషన్ రూపొందించారు. 50 శాతానికి మించి సీట్లు ఇవ్వరాదంటూ టీడీపీ నేత బిర్రు ప్రతాప్రెడ్డితో ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు కోర్టులో కేసు వేయించారు. రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు చేపట్టాలని కోర్టు ఆదేశాలు జారీ చేయడంతో వైఎస్సార్సీపీ టికెట్ల కేటాయింపులో 34 శాతం బీసీలకు దక్కేలా చర్యలు చేపట్టింది. స్క్రీన్ప్లే, డైరెక్షన్ టీడీపీయే కరోనా వైరస్ స్వైన్ప్లూ, యబోలా, సార్స్ వైరస్ కంటే ప్రమాదకరమైంది కాదని వైద్య వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కరోనాలో 2శాతం కూడా మరణాలు లేవని, యబోలా వైరస్ వల్ల 30శాతం మరణాలు తలెత్తాయని వారు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ అత్యంత ప్రమాదకారిగా ప్రచారం చేస్తూ దాని ఆధారంగానే ఎన్నికలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకోవడం వెనుక స్క్రీన్ ప్లే, డైరెక్షన్ తెలుగుదేశం పార్టీయేనని పలువురు వెల్లడిస్తున్నారు. మార్చిలోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి అయితే 14వ ఆర్థిక సంఘం నిధులు రాష్ట్రానికి దాదాపు రూ.5వేల కోట్లు లభించే అవకాశం ఉంది. ఆ నిధులు రాకుండా ఉండాలనే కుట్రను తెలుగుదేశం పన్నిందని పలువురు మేధావులు భావిస్తున్నారు. ఎల్లో మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఉన్నతాధికారులపై చర్యలు చేపట్టడం, స్థానిక సంస్థల ఎన్నికలు 6వారాలు వాయిదా వేయడం తదితర నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. (చదవండి: ఆరువారాల కుట్ర!) -
నయా హెయిర్ స్టైల్.. 40 మిలియన్ల వ్యూస్
కురులపైనా శ్రద్ధ కేవలం అమ్మాయిలకే ఉంటుంది అనుకుంటే పొరపాటే.. వాస్తవానికి అబ్బాయిలు కూడా జుట్టుపై ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారట. ఉన్న కొంచెం జుట్టు అయినా రకరకాలుగా సోకులు పడుతుంటారు. జుట్టును అటు వేసి.. ఇటు వేసి.. సగం కత్తిరించి వివిధ స్టైల్లో తిప్పుతుంటారు. అయితే ఎన్ని రకాలుగా ప్రయత్నించినా కొంతమంది ఇంకేదో కొత్తదనం కావాలి అని అనుకుంటారు. అలా అనుకునే వారి కోసమే ఓ హెయిర్ స్టైల్ నిపుణుడు వెరైటీగా ట్రై చేశాడు. తన దగ్గరికి వచ్చన ఓ కస్టమర్కు జుట్టును స్టైల్ చేయడానికి మంటను ఉపయోగించాడు. జట్టును దువ్వి ఆపై దానికి మంట పెట్టగా.. అది చల్లారడానికి వస్తుంటే దాన్ని వెంట వెంటనే రెండు దువ్వెనలతో స్టైల్గా క్రాఫ్ చేశాడు. అయితే కస్టమర్కు మాత్రం ఎలాంటి నొప్పి లేకుండా ప్రశాంతంగా కూర్చుని ఉన్నాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను మొదటగా టిక్టాక్లో నవంబర్లో ప్రకాశ్ అనే వ్యక్తి షేర్ చేశారు. ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారనే విషయం స్పష్టంగా తెలియనప్పటికీ ఖచ్చితంగా ఇండియాలోనే జరిగుంటుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే దీనిని టిక్టాక్లో 30 మిలియన్ల మంది వీక్షించగా.. ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్లోనూ షేర్ చేస్తున్నారు. ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అన్నింట్లో కలిసి ఇప్పటి వరకు ఈ వీడియోను 43 మిలియన్ల మంది చూశారు. కాగా దీనిని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు. తాము కూడా ఒక్కసారైనా ఇలాంటి హెయిర్ స్టైయిల్ చేయించుకోవాలని తహతహలాడుతున్నారు. అయితే ఇలాంటి ప్రయోగాలు చేయడం వల్ల ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని, ఇంట్లో ఇలాంటివి చేయకండంటూ కొందరు నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. This is an origin story for a hairstyle like mine.pic.twitter.com/gBKrhr1AQH — 𝙹𝚘𝚜𝚑 𝙶𝚛𝚞𝚋𝚋𝚜 (@JoshuaGrubbsPhD) January 27, 2020 -
భయానకం: అలలు అతడిని లాక్కెళ్లాయి!
బలమైన అలలు ఇరవై ఏళ్ల యువకుడిని సముద్రంలోకి ఈడ్చుకెళ్లిన ఘటన అమెరికాలో జరిగింది. సముద్ర తీరాన బండపై నిలుచున్న వ్యక్తిపైకి ఒక్కసారిగా అలలు ఎగసిపడ్డాయి. ఈ ఘటన డిసెంబర్ 20న కాలిఫోర్నియా సముద్ర తీరాన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియోను ‘యుఎస్ శాంటా క్రజ్ ఫేస్బుక్’ పేజీ నిర్వాహకులు షేర్ చేశారు. ‘తీర ప్రాంతాల పర్యాటనకు వెళ్లిన వారు జాగ్రత్త. సముద్ర తీరం అంచులకు అస్సలు వెళ్లకండి. లేదంటే ఈ కుర్రాడి లాగే మిమ్మల్ని అలలు మింగొచ్చు జాగ్రత్త’ అంటూ హెచ్చరించారు. ఇక తొమ్మిది సెకండ్ల నిడివి గల ఈ వీడియో చూసి నెటిజన్లు షాకవుతున్నారు. ‘వామ్మో! ఆ వ్యక్తి బండరాయిపై చీమలా కనిపిస్తున్నాడు. అదృష్టవంతుడు.. లేదంటే క్షణాల్లో చచ్చేవాడే’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సదరు వ్యక్తి క్షేమంగా ఉన్నట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. -
ఆ బాలుడి సంకల్పాన్ని చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే..!
-
ఆ బాలుడి సంకల్పానికి ఫిదా అవ్వాల్సిందే!
న్యూఢిల్లీ: మనో నిబ్బరం ఉండాలేగానీ సాధించలేనిది ఏదీ ఉండదు. ఇందుకు ఈ దివ్యాంగ బాలుడి ఆటే నిదర్శనం. అతని ధైర్యం ముందు వైకల్యం ఓటమితో తల వంచింది. సంకల్ప బలంతో.. మనో నిబ్బరంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపిస్తున్నాడు. తన మిత్రులతో కలసి వారితో సమానంగా క్రికెట్ ఆడుతూ.. కళ్లు చెదిరే షాట్స్ కొట్టడమే కాకుండా వికెట్ల మధ్య అతను చేతులతో చేసే రన్నింగ్ను చూసి అతని సంకల్పానికి కళ్లు ఆర్పకుండా చూస్తూ ఉండిపోతున్నారు. ఐఎఫ్ఎస్ అధికారిని సుధా రమెన్ ట్వీట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. చదవండి: స్ర్కీన్ మీదనే కాదు.. నిజజీవితంలోనూ హీరోనే..! ‘అతడి ఆట చూసి నాకు మాటలు రావడం లేదు. క్రికెట్ను ఇష్టపడేవారు.. ఇష్టం లేనివారు తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది’ అంటూ ఆమె ఈ వీడియోను పోస్టు చేశారు. వీడియోని చూసిన నెటిజన్లు అతడి ఆటకు హాట్సాఫ్ చెప్తున్నారు. కాళ్లను నేలపై ఈడ్చుకుంటూ మరో చేతితో బ్యాట్ పట్టుకొని పరిగెత్తడం చూస్తే నిరాశలో ఉన్నవారికి, వైకల్యంతో బాధపడతున్న ఎంతో మందికి అతడు స్ఫూర్తిగా నిలుస్తాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ఆ పోస్ట్ నాది కాదు: టీనా దాబీ
న్యూఢిల్లీ: దేశం నలుమూలలా పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అట్టుడుకుతున్న నేపథ్యంలో.. కొంతమంది దుండగులు ప్రముఖుల పేరుతో నకిలీ ఫేసుబుక్ ఖాతాలు సృష్టించి.. అగ్నికి ఆజ్యం పోస్తున్నారు. తాజాగా మంగళవారం ఐఏఎస్ అధికారిణి టీనా దాబి పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా సృష్టించి పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నట్లుగా హిందీ భాషలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. 'ఐఏఎస్ టీనా దాబి' పేరుతో నకిలీ ఫేస్బుక్ ఖాతా వెలువడటంపై టీనా దాబీ ప్రముఖ మీడియా సంస్థ ఏఎన్ఐకు వివరణ ఇచ్చారు. అది నకిలీ ఖాతా అని, ప్రజలను పక్కదోవ పట్టించడానికి ఇలా తప్పుడు మార్గాలను ఎంచుకున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొన్నారు. కాగా ఢిల్లీకి చెందిన దళిత యువతి టీనా దాబి నాలుగు సంవత్సరాల క్రితం (2015) ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పరీక్షలో మొదటి ర్యాంకును కైవసం చేసుకొన్నారు. ఆ తర్వాత తన బ్యాచ్మేట్ అయిన కశ్మిరీ ఐఏఎస్ అథర్ ఖాన్ను ప్రేమించి.. గతేడాది పెళ్లి చేసుకున్నారు. తరువాత, ఇద్దరికి రాజస్థాన్లోని భిల్వారాలో పోస్టింగ్ లభించింది. కాగా టీనా భర్త అథర్ సివిల్ సర్వీసెస్లో రెండవ ర్యాంకు సాధించడం విశేషం. ఇక పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ నుంచి మతపరమైన హింసను ఎదుర్కొని 2014 డిసెంబర్ 31 న లేదా అంతకు ముందు భారత్కు వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు త్వరితగతిన భారత పౌరసత్వం కల్పించేందుకు వీలుగా పౌరసత్వ సవరణ చట్టం రూపొందించిన విషయం తెలిసిందే. చదవండి: సివిల్స్ టాపర్ టీనా దాబి -
కండోమ్ వాడండి.. రేప్లను అంగీకరించండి!
దిశ ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఓ సినీ నిర్మాత మహిళలకు ఇచ్చిన కీచక సలహాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. డేనియల్ శ్రావణ్ అనే చిత్ర నిర్మాత ‘మహిళలు ప్రయాణించేటప్పుడు కండోమ్ను తీసుకెళ్లాలి. పురుషుల లైంగిక కోరికను అంగీకరించాలి’ అంటూ తన ఫేస్బుక్ అకౌంట్లో కీచక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు రావడంతో సంబంధిత పోస్టును అతను తొలగించాడు. అతని పూర్తి పోస్టు ఇది.. ‘18 సంవత్సరాలు నిండిన మహిళలు ముఖ్యంగా భారతీయ మహిళలు లైంగిక విద్య పట్ల అవగాహన ఉండాలి. మహిళలు పురుషుల లైంగిక కోరికలను తిరస్కరించకూడదు. అప్పుడే ఇలాంటి చర్యలు జరగవు. 18 సంవత్సరాలు నిండిన యువత కండోమ్లను ఉపయోగించాలి. ఇదోక సాధారణ విషయం. వ్యక్తి తన లైంగిక కోరిక నెరవేరినప్పడు మహిళలను చంపాలని ప్రయత్నించడు. నిజానికి ప్రభుత్వం ఆత్యాచారం తర్వాత జరిగే మరణాలను తగ్గించడానికి ఓ పథకాన్ని రూపొందించాలి. సమాజం, ప్రభుత్వం నిర్భయ చట్టం, పెప్పర్ స్ప్రేలతో రేపిస్టులను భయపెడుతున్నాయి. పురుషులకు కేవలం తన లైంగిక వాంఛను తీర్చుకోవడానికే ఇలాంటి చర్యలకు పాల్పడతారు. దీన్ని మహిళ తిరస్కరించడంతో వారిలో ఒక చెడు ఆలోచన రేకెత్తి ఇలాంటి దారుణానికి దారితీస్తుంది .అంతేగానీ బాధితులను చంపాలనే ఆలోచన వారికి ఉండదు.అందుకే మహిళలు అత్యాచారాన్నిఅంగీకరించాలి‘ అని డేనియల్ పేర్కొన్నాడు. ఈ పోస్ట్ వైరల్గా మారడంతో సెలబ్రిటీలతో సహా నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘ఇలాంటి పనికిమాలిన సలహాలను ఇచ్చే వారికి కూడా ప్రభుత్వం మరణ శిక్ష విధించాలి. వెధవ డానియల్’. ‘ఇదొక కౄరమైన ఆలోచన ముందు దీన్ని నీకు నువ్వు అమలు చేసుకో’. ‘ఇలాంటి సలహాలను పట్టించుకోకండి. ఇతనికి వైద్య సహాయం అవసరం.’ ఇలాంటి సలహాలను ఇచ్చే వారిని ఉరి తీయాలి. అప్పుడే ఇంకోసారి ఇలా వాగరు’...అంటూ డేనియల్పై నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు. -
బిల్గేట్స్ టిప్ ఫొటో ఫేక్
న్యూఢిల్లీ: అపర కుబేరుడు, మైక్రోసాఫ్ట్ అధినేత బిల్గేట్స్ జీవితం.. భావితరాలకు స్పూర్తిదాయకం అంటూ సోషల్మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటో ఒకటి నకిలీదని తేలింది. అపర కుబేరుడు బిల్గేట్స్.. రెస్టారెంట్ వెయిటర్కు టిప్ ఇస్తూ.. తాను ఒక సాధారణ వుడ్కట్టర్ (వడ్రంగి) కుమారుడినని తెలుపుతూ ఫేస్బుక్లో చాలామంది ఫార్వర్డ్ చేస్తున్న ఈ ఫొటోలో ఏమాత్రం నిజం లేదని.. ప్రముఖ మీడియా దిగ్గజం ఇండియా టుడే చేసిన నిజ-నిర్ధారణలో తేలింది. బిల్గేట్స్ తండ్రి వుడ్కట్టర్ (కలపను నరికే వ్యక్తి) కాదని స్పష్టం చేసింది. బిల్గేట్స్ బ్లాగ్ 'గేట్స్ నోట్స్' వివరాల ప్రకారం ఆయన తండ్రి విలియం హెచ్. గేట్స్ II.. సీటెల్ నగరంలో ఒక న్యాయవాది అని, తల్లి మేరీ గేట్స్ స్కూల్ టీచర్ అని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఫొటోలో ఇలా ఉంటుంది. బిల్గేట్స్ ఒక రెస్టారెంట్కు వెళ్లి.. అక్కడ తిన్న తర్వాత వెయిటర్కు టిప్ కింద 5 డాలర్లు ఇస్తాడు. అది చూసి నోరెళ్లబెట్టిన వెయిటర్ను బిల్.. ఏమయింది అని ప్రశ్నిస్తాడు. కొద్దిసేపటి క్రితం ఇదే టేబుల్పై మీ కూతురు వచ్చి.. 500 డాలర్లు టిప్ ఇచ్చిందని.. మీరు కేవలం 5 డాలర్లు ఇవ్వడంతో ఒకింత ఆశ్చర్యానికి లోనయ్యానని చెబుతాడు. అప్పుడు బిల్గేట్స్ నవ్వి.. ఆమె ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి కుమార్తె అని, కానీ తాను ఒక సాధారణ కలప నరికే వ్యక్తి కుమారుడిని అని చెప్పుకొస్తాడు. చివరగా.. గతాన్ని ఎప్పటికీ మరువకూడదు.. ఇట్స్ యువర్ బెస్ట్ టీచర్ అంటూ వచ్చే సందేశం వస్తుంది. అయితే ఇందులో ఏమాత్రం నిజం లేదని.. బిల్ తండ్రి ఒక న్యాయవాది అని ఇండియా టుడే యాంటీ ఫేక్ న్యూస్ వార్ రూమ్ తేల్చింది. -
రణుమొండాల్ 2.O వచ్చేసింది!
ముంబై: సోషల్ మీడియా సెన్సేషన్, సింగర్ రణు మొండాల్ ‘ఏక్ ప్యార్కా నగ్మా హై’ అనే ఎవర్గ్రీన్ పాటతో ఒక్కసారిగా రాత్రికిరాత్రే స్టార్ సింగర్గా మారారు. రైల్వే స్టేషల్లో లతా మంగేష్కర్ పాడిన పాటలను రణు పాడుకుంటు ఉండగా ఓ ఇంజనీరింగ్ విద్యార్ధి తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. అది చూసిన బాలీవుడ్ సంగీత దర్శకుడు ‘హిమేశ్ రెష్మియా’ రణుకు తన సినిమాలో పాట పాడే అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక అప్పటి నుంచి రణు మొండాల్ ఎన్నో పాటలకు కాంట్రాక్టులను దక్కించుకొవడంతో పాటు పలు షోలకు అతిథిగా కూడా హాజరయ్యారు. ఇక అసలు విషయానికి వస్తే.. మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని అంటారు. ఆ ఏడుగురి మాట అటుంచింతే.. ప్రస్తుతానికి రణు మొండాల్ను పోలిన ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. గౌహతికి చెందిన ఓ మహిళా.. రణు పాడిన 'తేరి మేరి కహానీ' అనే సూపర్హిట్ పాటను ఆమె పాడడంతో వీడియో వైరల్గా మారింది. ఆ మహిళా అచ్చం రణుమొండాల్ను పోలి ఉండటంతో పాటు హావభావాలు కూడా ఒకేలా ఉండడంతో నెటిజన్లు ఆమెను ఫన్నీగా రణు మొండాల్ 2 అని అభివర్ణిస్తున్నారు. కాని కొందరు మాత్రం డూప్లికేట్ సింగర్ అని, ఈమెను కూడా స్టార్ చేయండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. View this post on Instagram #RanuMondal 2.0 in (Maligaon)Guwahati. #Special Thanks to my friend Tanmoy Dey for shooting and Sharing this vdo. Vdo Rights :- Tanmoy dey #ranumondal #himeshreshammiya A post shared by Dipankar Baishya (@chiragdipofficial) on Nov 22, 2019 at 6:23am PST ఇటీవల రణు ముఖానికి మితిమీరిన మేకప్ వేసిన ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టడంతో.. రణును విపరీతంగా ట్రోల్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కొంతమంది ఆకతాయిలు నకిలీ ఫోటో సృష్టించారని తెలియడంతో నెటిజన్లు నాలిక కరచుకున్నారు. -
నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే
'నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటా' అంటూ ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణీ, హైదారాబాదీ సానియా మీర్జా తన కుమారుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం తన కుమారుడు ఇజ్హాన్ మొదటి పుట్టినరోజు కావడంతో.. సానియా ఇన్స్టాగ్రామ్ను వేదికగా చేసుకుని సంవత్సరం క్రితం నాటి తన కుమారుని ఫోటోను జతచేశారు. View this post on Instagram Exactly one year since you came into this world and became our world .. you smiled the first day you were born and continue to spread smiles everywhere you go .. my truest,purest most amazing boy .. I LOVE YOU and I promise to be by your side until my last breath .. Happy Birthday my little angel 👼🏽 I pray Allah gives you everything you work towards and desire and continue to grow into the most loving and gentle boy that you already are .. InshaAllah .. Thank you for choosing us my little Izhaan ❤️ #HappybirthdayIzhaan A post shared by Sania Mirza (@mirzasaniar) on Oct 29, 2019 at 11:25pm PDT 'నువ్వు ఈ ప్రపంచానికి వచ్చి, నా ప్రపంచంగా మారి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది. నీవు పుట్టినప్పుడు ఎలా చిరునవ్వు చిందించావో.. అలానే నువ్వు వెళ్లిన ప్రతిచోటా నవ్వులు పంచుతావని కోరుకుంటున్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నా చివరి శ్వాస ఉన్నంత వరకూ నీ వెన్నంటే ఉంటానని నీకు వాగ్దానం ఇస్తున్నాను. నా చిన్ని తండ్రి నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు, నువ్వు కోరుకునే, చేసే ప్రతి పనిలో నీకు అల్లాహ్ దయ ఉంటుందని ఆకాంక్షిస్తున్నాను. మమ్మల్ని ఎంచుకున్నందుకు ధన్యవాదాలు ఇజాన్' అంటూ సుదీర్ఘ పోస్ట్ చేశారు. సానియా చేసిన పోస్టుకు స్పందించిన బాలీవుడ్ తారలు హుమా ఖురేషీ, నేహా ధూపియా ఇజ్హాన్కు బర్త్డే విషెస్ చెప్పారు.