-
డేటా... దూకుడు!
ఉదయాన్నే లేస్తూ ఓ సెల్పీ.. వెంటనే దానిని ఫేస్బుక్, వాట్సాప్ల్లో పోస్టింగ్.. కొత్త సాంగ్ వచ్చిందా.. కొత్త స్టెప్పులు నేర్చుకుని వెంటనే టిక్టాక్లో డాన్సింగ్.. ఈసారి నా డబ్స్మాష్ వీడియో యూట్యూబ్లో ఎలాగైనా సరే వైరల్ అవ్వాల్సిందే.. ఇవీ భారతీయుల ఆలోచనలు. పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరూ ఇంటర్నెట్ను తెగ వాడేస్తున్నారు. ఎంతలా అంటే ప్రపంచంలో డేటా వినియోగిస్తున్న వారిలో మనమే టాప్లో ఉండేంతలా. ఇదే విషయాన్ని మొబైల్ యాప్స్ల రేటింగ్లను నిర్ధారించే ‘సెన్సర్ టవర్ డేటా’ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత దేశ జనాభా దాదాపు 130 కోట్లు. ప్రపంచ దేశాలన్నింటికీ అతిపెద్ద మార్కెట్ మన దేశమే. అందుకు సోషల్ మీడియా ఏమీ తీసి పోదు. అందుబాటులోకి వస్తోన్న స్మార్ట్ఫోన్ ధర లు, ఇంటర్నెట్ డేటా ప్యాకేజీల వల్ల సోషల్ మీడియా వాడకంలో పట్టణాలు, పల్లెల్లోనూ అనూహ్య పెరుగుదల నమోదవుతోంది. ఎంత లా అంటే ప్రపంచ సోషల్మీడియా వాడకంలో మనదే 40% భాగస్వామ్యం ఉండేంతలా. సోషల్ మీడియాలో ఎన్ని కొత్త యాప్లు వచ్చిన ఇండియాలో వాటికి కొత్త వినియోగదారులు పుట్టుకొస్తూనే ఉన్నారు. టిక్టాక్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్లకు సంబంధించి ఇండియన్ల వినియోగం అసాధా రణ స్థాయిలో ఉంది. అమెరికా, యూరప్లను తలదన్ని మనదేశం అగ్రస్థానం దక్కించుకుంది. టిక్టాక్.. కొంతకాలంగా టిక్టాక్ సృష్టిస్తోన్న హంగామా అంతా ఇంతా కాదు. యువత, టీనేజీ, పిల్లలు, వృద్ధులు అంతా దీన్ని తెగవాడేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది సెప్టెంబర్లో ఈ యాప్ను అధికం(44 శాతం)గా మనమే డౌన్లోడ్ చేసుకున్నాం. ఒక్క సెప్టెంబర్లోనే 6 కోట్ల మంది ఈ యాప్ను కొత్తగా డౌన్లోడ్ చేసుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు ఈ యాప్ క్రేజ్ ఎంతగా ఉందో. మార్చిలో టిక్టాక్ యాప్ను ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల మంది డౌన్లోడ్ చేయగా అందులో 8 కోట్ల మంది భారతీయులే కావడం గమనార్హం. 15 సెకన్లకు ఓ కొత్త వీడియో ఇందులో అప్లోడ్ అవుతోంది. ప్రధాన సోషల్ మీడియా యాప్లైన ఫేస్బుక్, వాట్సాప్లకు ఇది తీవ్ర పోటీనిస్తోంది. వినియోగంలో భారత్ టాప్ప్లేస్లో ఉండగా.. అమెరికా, టర్కీ తర్వాత స్థానాల్లో నిలిచాయి. మరికొన్ని విశేషాలు ►టిక్టాక్లో 41 శాతం మంది 16 నుంచి 24 ఏళ్ల వయసులోపు వారే. ►యూజర్లలో 56 శాతం పురుషులు,44 శాతం మహిళలు. ►ప్రతీరోజు సగటు వినియోగదారుడు గడుపుతున్న సమయం 52 నిమిషాలు. ►90 శాతం వినియోగదారులు రోజుకు ఒక్కసారైనా యాప్ ఓపెన్ చేస్తున్నారు. ►ఇంతవరకూ టిక్టాక్ చూసిన వారి సంఖ్య సరాసరిగా 100 కోట్లు. ఫేస్బుక్.. ఫేస్బుక్ యూజర్లు ఇండియా 24.1 కోట్లు అమెరికా 24 కోట్లు ఇండోనేషియా 13 కోట్ల ఫేస్బుక్ విషయానికి వస్తే.. గత నెలలో ఇండియన్లు అత్యధికంగా డౌన్లోడ్ చేసుకున్న యాప్ల్లో ఇది రెండోస్థానంలో నిలిచింది. ఈ సెప్టెంబర్లో ఇండియాలో కొత్తగా 5 కోట్ల మంది ఫేస్బుక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా డౌన్లోడ్ చేసుకున్న 100 శాతంలో భారత్ భాగస్వామ్యం 23 శాతంగా నమోదైంది. ఉదయాన్నే లేచిన దగ్గర నుంచి పడుకునే దాకా భారతీయులు అధికంగా వినియోగిస్తున్న యాప్ల్లో ఫేస్బుక్ కూడా ఒకటి. ఎన్ని యాప్లొచ్చినా దీనికి ఉండే ఆదరణ తగ్గకపోవడం గమనార్హం. ఫేస్బుక్కి అగ్రరాజ్యం అమెరికాలో 24 కోట్ల మంది యూజర్లు ఉండగా.. భారత్లో మాత్రం 24.1 కోట్ల మంది ఉన్నారు. జనవరి నుంచి జూన్ వరకు ఫేస్బుక్ యూజర్ల పెరుగుదల భారత్లో 12 శాతంగా నమోదైంది. యూట్యూబ్ యూజర్లు అమెరికా50 కోట్లు ఇండియా 24 కోట్లు జపాన్12 కోట్లు యూట్యూబ్కు సైతం.. ఇండియాలో ఆదరణ పెరుగు తున్న వాటిలో యూట్యూబ్ కూడా ముందువరసలో ఉంది. మన దేశంలో 26.5 కోట్ల మంది యూజర్లు ఉన్నారు. 1,200 చానళ్లకు 10 లక్షలకుపైగా సబ్స్క్రై బర్లు ఉన్నారు. ఐదేళ్ల క్రితం కేవలం 2 చానళ్లకు మాత్రమే 10 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉండేది. కాలక్రమంలో ఈ చానళ్లకు మంచి ఆదరణ దక్కుతోంది. వీటిలో 95 శాతం ప్రాంతీయ భాషలకు చెందినవి కావడం గమనార్హం. నీల్సన్ సర్వే ప్రకారం.. అధికంగా ఆదరణ ఉన్న వీడియోల్లో స్పోకెన్ ఇంగ్లిష్, ఇతర విద్యా సంబంధమైన కంటెంట్ ఉంది. -
టిక్టాక్తో యువతకు ఐసిస్ వల
యువతను ఉగ్రవాదం వైపు మళ్లించేందుకు ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్ట్ గ్రూప్ (ఐసిస్) రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతుంది. యువత విశేషంగా వాడుతున్న టిక్టాక్ ద్వారా వారిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. 500 మిలియన్ల మంది యూజర్లను కలిగి ఉన్న టిక్టాక్ను వేదికగా చేసుకుని 16 - 24 సంవత్సరాల వయసున్న యువతకు ఐసిస్ వల వేస్తున్నట్టు వెల్లడైంది. చిన్న చిన్న వీడియోలను పోస్ట్ చేసి యువతను తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఐసిస్ సంబంధిత అకౌంట్ల నుంచి ఈ వీడియోలు పోస్ట్ చేసినట్టు గుర్తించిన టిక్టాక్ ఈ ఖాతాలను తొలగించినట్టు ‘వాల్ స్ట్రీట్ జర్నల్’ తెలిపింది. సిరియా నుంచి అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోవడంతో పోరాటాన్ని ఉధృతం చేయాలని ఐసిస్ భావిస్తోంది. ఇందులో భాగంగా యువతను పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసేందుకు టిక్టాక్ను వేదికగా వాడుకుని ప్రచారం చేస్తోంది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న రెండు డజన్ల ఖాతాలను గుర్తించి శాశ్వతంగా తొలగించినట్టు టిక్టాక్ ప్రకటించింది. ఐసిస్ సాగిస్తున్న ప్రచారం తమ కంపెనీ నియమాలకు విరుద్ధమని, ఉగ్రవాద వీడియోలను తమ మాధ్యమంలో స్థానం లేదని స్పష్టం చేసింది. అయితే అత్యధిక యూజర్లను కలిగియున్న భారత్లోనూ టిక్టాక్ పెను సవాళ్లు ఎదుర్కొంటుంది. హింసను ప్రేరేపించే, రెచ్చగొట్టే వ్యాఖ్యలు, సైబర్ వేధింపులు వంటి సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే టిక్టాక్ను కేంద్ర ప్రభుత్వం పలుసార్లు హెచ్చరించడంతో పాటు కొన్ని వారాలపాటు నిషేధించింది. టిక్టాక్ మాధ్యమంగా #ఆరెస్సెస్, #రామమందిరం, #హిందూ, #బీజేపీ వంటి హాష్ ట్యాగ్లను ఉపయోగించి కొందరు హిందు అతివాదులు విద్వేషపూరిత వీడియోలు పోస్ట్ చేస్తున్నారు. ఒక్క భారత్లోనే కాక ప్రపంచవ్యాప్తంగా టిక్టాక్ సవాళ్లు ఎదుర్కొంటొంది. ఇరవైకి పైగా దేశాలలో టిక్టాక్ వినియోగదారులు ఉన్నారు. -
రహస్య వివాహం చేసుకున్న నిక్కీ మినాజ్
ప్రముఖ ర్యాపర్ నిక్కీ మినాజ్(36) ఎట్టకేలకు తన ప్రియుడు, బ్యాడ్బాయ్ కెన్నెత్ పెర్రీని రహస్య వివాహం చేసుకొని ఒక్కటయ్యారు. ఈ మేరకు ఆమె తన ట్విటర్ ఖాతాలో ఉన్న పేరును 'మిసెస్ పెట్టీ'గా మార్చారు. అంతేకాక సోమవారం ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన వీడియోలో.. 'ఒనికా తాన్య మరాజ్-పెట్టీ 10.21.19' అనే క్యాప్షన్ను ఇచ్చారు. ఒనికా తాన్య మరాజ్ అనేది నిక్కీ మినాజ్ అసలు పేరు. పెట్టీ అనేది తన ప్రియుడి పేరు. ఇద్దరూ అధికారికంగా వివాహ బంధంతో ఒక్కటయ్యారు అనేలా తేదిని జత చేశారు. ఇప్పటికే పెళ్లితంతు ముగిసిందనే అర్థం వచ్చేలా.. తన పేరుతో పాటు ప్రియుడి పేరు, తేదీను జత చేశారు. ఇక వీడియోలో మిస్టర్ అండ్ మిసెస్ ఉన్న మగ్లతో పాటు వధూవరులనే అర్థానిచ్చే రెండు బేస్బాల్ క్యాప్లు ఉన్నాయి. దీంతో ఒక్కసారిగా షాక్కు గురైన ఆమె ఫ్యాన్స్.. ఆ వెంటనే తేరుకొని నిక్కీ మినాజ్కు శుభాకాంక్షలు చెబుతున్నారు. అయితే మ్యారేజ్ లైసెన్స్ గడువు ముగియనుండడంతో.. ప్రియుడిని ఉన్నపళంగా వివాహం చేసుకొందని.. మళ్లీ రెండోసారి గ్రాండ్గా వివాహం చేసుకోనుందనే పుకార్లు సోషల్మీడియాలో గుప్పుమంటున్నాయి. నిక్కీ తాను పెళ్లి చేసుకుంటున్నాను అనే వార్తను.. జూన్ 21న ఒక రేడియోలో అధికారింగా ప్రకటించారు. అందులో ఆమె.. తన బాయ్ఫ్రెండ్ మ్యారెజ్ లైసెన్స్ పొందడంతో 90 రోజుల్లోపే పెళ్లి చేసుకోనున్నాని స్పష్టం చేశారు. గతేడాది నుంచి పెట్టీతో డేట్ చేస్తున్న నిక్కీ.. పెట్టీతో ప్రేమలో ఉన్నట్టు తొలిసారిగా గత డిసెంబర్లో ఇన్స్టాగ్రామ్లో ధృవీకరించారు. లైంగిక ఆరోపణలతో దోషిగా తేలిన కెన్నెత్ పెట్టీను.. నిక్కీ ఏరికోరి వివాహం చేసుకోవడం గమనార్హం. View this post on Instagram 👰🏽🤵🏽😢🙏🏽🎀 Onika Tanya Maraj-Petty 10•21•19 A post shared by Barbie (@nickiminaj) on Oct 21, 2019 at 8:22pm PDT -
ఫేక్ వెడ్డింగ్ కార్డ్పై అలియా స్పందన
-
వైరలవుతున్న అలియా, రణ్బీర్ వెడ్డింగ్ కార్డు!
ముంబై: బాలీవుడ్ హీరో రణ్బీర్ కపూర్, హీరోయిన్ అలియా భట్ జనవరి 22న పెళ్లి చేసుకోబోతున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ఓ వెడ్డింగ్ కార్డు చక్కర్లు కొడుతోంది. గత కొద్ది కాలంగా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన ఈ జంట వివాహ బంధంతో ఒక్కటి అవ్వనున్నారని వస్తున్న వార్తల్లో నిజం లేదని తేలింది. ముంబై విమానాశ్రయంలో ఫ్లైట్ కోసం వేచి చూస్తున్న అలియాను.. వివాహం, వెడ్డింగ్ కార్డుపై వస్తున్న వార్తలను గురించి అడగ్గా 'ఆమె సిగ్గుపడుతూ.. నేను ఏమి చెప్పాలి? పెళ్లిపై వస్తున్న పుకార్లలో నిజం లేదంటూ తల అడ్డంగా ఊపింది.' దీంతో వీరి వివాహం జనవరి 22న జోధ్పూర్లోని ఉమేద్ భవన్ ప్యాలెస్లో జరగనుందని వస్తున్న వార్తలో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టమైంది. వివాహ ఆహ్వాన పత్రికను కూడా క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అందులో ఉన్న తప్పులు కొట్టొచిన్నట్లు కనిపిస్తున్నాయి. అలియా భట్ తండ్రి పేరు వాస్తవానికి మహేష్ భట్ అయితే, ఆహ్వాన పత్రికలో మాత్రం ముఖేష్ భట్ అని తప్పుగా ఉంది. అంతేకాక అలియా భట్ పేరుతో పాటు తేదిలో కూడా అక్షర దోషాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. వివాహానికి సంబంధించి వస్తున్న వార్తలను అలియా చిరునవ్వుతో కొట్టి పారేయడంతో.. వైరల్ అవుతున్న వెడ్డింగ్ కార్డ్ ఫేక్ అని తేలింది. -
ప్రేమను వ్యక్తపరచడానికి మాటలు అవసరమా?
వినికిడి లోపం గల ఓ తండ్రి తన కుమార్తెతో సైగలతో సంభాషిస్తున్న వీడియోను అమెరికా మాజీ బాస్కెట్బాల్ ప్లేయర్ రెక్స్ చాప్మన్ ట్విటర్లో తాజాగా షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్గా మారింది. వినికిడి లోపం గల ఓ తండ్రి అప్పుడే పుట్టిన తన చిన్నారితో సైగలతో మాట్లాడే మాటాలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రేమకు భాష లేకపపోతే ఏంటి? తండ్రి తనపై కురిపిస్తున్న ఆత్మీయ స్పర్శ, ప్రేమ చాలు అనేలా.. ఆ చిన్నారి చూస్తున్న చూపులు నెటిజన్లను కంటతడి పెట్టిస్తుంది. This hearing-impaired father expressing love to his newborn daughter in sign-language is the definitely Twitter content I’m here for...💪😍😇😊🔥 pic.twitter.com/CEvINcmRaX — Rex Chapman🏇🏼 (@RexChapman) October 18, 2019 వినికిడి లోపం ఉన్న ఆ తండ్రి అప్పుడే పుట్టిన తన బిడ్డతో సైగలతో మాట్లాడుతుంటే.. ఆ పాపాయి తదేకంగా నువ్వు చెప్పే ప్రతీది తనకు అర్థమవుతోంది అన్నట్లు చూస్తోంది. కుమార్తెపై ఈ మూగ తండ్రి కురిపిస్తున్న ప్రేమను చూసిన ప్రతి ఒక్కరికి నిమిషం పాటు.. నోట మాట రాదంటే నమ్మండి. ఈ వీడియోను చూసి కొందరు ఆశ్చర్యపోతుంటే.. మరికొందరు మాత్రం ఆ తండ్రి సైగలకు అర్థాన్ని వెతికే పనిలో పడ్డారు. సంకేత భాషను అర్థం చేసుకున్న కొద్దిమంది నెటిజన్లు.. ఆ తండ్రి తన చిన్నారితో.. ‘హేయ్ నేను మీ డాడీని. నేను నిన్ను అమితంగా ప్రేమిస్తున్నాను. నువ్వు చాలా అందంగా ఉన్నావు. నీ కళ్లు ఆకుపచ్చ రంగులో అద్భుతంగా ఉన్నాయి. నీ అందమైన చిరునవ్వు బావుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. వెచ్చని దుప్పటిలో ఉన్న ఓ చిన్నదానా..! నేను నిన్ను ప్రేమిస్తున్నానే..' అంటున్నాడని ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. 'ప్రేమ అన్ని భాషలను మించిపోయింది' అని మరోక నెటిజన్ పేర్కొన్నాడు. -
కుమార్తెను ప్రపంచానికి పరిచయం చేసిన హీరో!
మలయాళ నటుడు దిలీప్, అతని భార్య కావ్య మాధవన్ తమ కూతురు మహలక్ష్మీ తొలి ఫోటోను ఇన్స్టాగ్రామ్లో తాజాగా షేర్ చేశారు. తన కుమార్తె మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు కావడంతో.. ఆమెను ప్రపంచానికి పరిచయం చేశాడు. అభిమానులతో పంచుకున్న ఈ ఫోటోలో మహలక్ష్మీ తన తండ్రి దిలీప్, తల్లి కావ్యతో పాటు అక్క (దిలీప్ మొదటి భార్య కూతురు మీనాక్షి), నానమ్మలతో కనిపిస్తుంది. మహలక్ష్మీ మొదటి పుట్టిన రోజు వేడుకలకు మలయాళ సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ప్రముఖులు హాజరయ్యారు. మలయాళ నటిని అపహరించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు 2017లో ఆరోపణలు ఎదుర్కొన్న నటుడు దిలీప్కు మహలక్ష్మీ రెండో భార్య కూతురు. ప్రముఖ మలయాళ నటి మంజు వారియర్తో 17 ఏళ్ల పాటు సాగిన సుదీర్ఘ వైవాహిక జీవితానికి 2015లో ముగింపు పలికాడు. ప్రస్తుతం 51ఏళ్ల దిలీప్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరగా శుభరాత్రి అనే చిత్రంలో కనిపించిన ఈ నటుడు, తాజాగా జాక్ డెనియల్తో తెర మీద కనిపించనున్నాడు. -
ప్రధానికి అమూల్ డూడుల్ శుభాకాంక్షలు!
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ రాజకీయ నాయకులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే పాల ఉత్పత్తులలో అగ్రస్థానంలో ఉన్న అమూల్ సంస్థ కూడా ప్రధాని మోదీకి ట్వీటర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. అయితే అందరిలాగే అమూల్ కూడా ఏదో ‘హ్యాపీ బర్థ్ డే మోదీ జీ’ అంటూ ట్వీటర్లో పోస్ట్ చేసుంటారులే అనుకుంటున్నారా? అయితే మీరు పప్పులో కాలేసినట్టే!. అవునండి మీరే చూడండి మరి.. మోదీ కార్టూన్ బొమ్మల డుడూల్ వీడియోను ప్రత్యేకంగా తయారు చేసి పోస్ట్ చేసింది. ‘గౌరవ ప్రధాని నరేంద్ర మోదీకి 69వ పుట్టిన రోజు శుభాకాంక్షలు!’ అంటూ క్యాపన్తో పోస్ట్ చేసి అందరికన్నా భిన్నంగా శుభాకాంక్షలు తెలిపింది. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లంతా ఫిదా అయిపోయి ‘అమూల్ అంటే బ్రాండ్ కాదు.. భారత్ ఎమోషన్’ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఈ వీడియోలో మోదీ మొదటి సారి ప్రధాని అయిన తర్వాత ఆయన చేపట్టిన స్వచ్ఛ భారత్ పథకం నుంచి ఆయన పర్యటించిన అమెరికా, రష్యా, చైనాతో పాటు పలు విదేశి పర్యటించిప ఫోటోలను ఈ వీడియోలో చూపించారు. అంతేకాకుండా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్తో వైట్ హౌజ్ బయట సమావేశం అయిన ఫొటోతో పాటు, ఇటీవల చంద్రయాన్-2 విఫలం నేపథ్యంలో ఇస్రో చీఫ్ కె. శివన్ను ఓదారుస్తూ ఆయనను హత్తుకున్న యానిమేటెట్ ఫోటో ఈ వీడియోలో చివరలో కనిపిస్తాయి. #Amul wishes the Hon. PM Shri Narendra Modi @narendramodi a very happy 69th birthday! #happybirthdaynarendramodi pic.twitter.com/E039hOXwlT — Amul.coop (@Amul_Coop) September 16, 2019 -
సిలిండర్తో నటుడి వింత చేష్టలు!
ముంబై: బాలీవుడ్ యాక్షన్ హీరో, కండల వీరుడు విద్యుత్ జమాల్ ఫుల్ సిలిండర్తో ఏకంగా వర్కవుట్లు చేయడం మొదలెట్టాడు. సోషల్ మీడియాలో తరచూ తను చేసే వర్కవుట్ సెషన్ వీడియోలు పోస్ట్ చేసే జమాల్, గురువారం తాజాగా పోస్ట్ చేసిన వీడియోతో అందరిని హడలెత్తిస్తున్నాడు. అంతేకాక తాను ఫుల్ సిలిండర్తో చేసిన విన్యాసాలను మీరూ ట్రై చేయండి అని ట్విటర్లో పోస్ట్ చేశాడు. విద్యుత్ జమాల్ నటుడిగా మాత్రమే కాక, మార్షల్ ఆర్టిస్ట్గా, స్టంట్స్మాన్గా బాలీవుడ్లో మంచి పేరుంది. ఆయన నటించిన జంగ్లీ, కమాండో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొల్తాకొట్టినా.. తను చేసిన యాక్షన్ సీన్స్కు గాను ప్రతిష్టాత్మకమైన రెండు జాకీచాన్ అవార్డులు వరించాయి. అయితే జమాల్ తాజాగా 'సాకులు చెప్పడం మాని.. ఇలా ఫుల్ సిలిండర్తో కలరియపట్టు ట్రై చేయండి. మీ బాడీ ఇలాంటి వర్కవుట్లు చేయగలదని మీ మెదడుకు తెలియదు' అని అంటూ వీడియోను పోస్ట్ చేశారు. Ab yeh karke dekho! For the non-believers, THIS is a FULL cylinder. Ur body is ready to train, ur mind just doesn’t know it. Stop the excuses! #ITrainLikeVidyutJammwal #kalaripayattu #desiworkout pic.twitter.com/8hTZPAHWpU — Vidyut Jammwal (@VidyutJammwal) September 5, 2019 వీడియో చూసిన వారిలో కొంతమంది మెచ్చుకొంటుండగా, మరి కొంతమంది మాత్రం జోక్లతో హోరెత్తిస్తున్నారు. ‘ఇలా చేస్తే మమ్మీ చెప్పుతో కొడుతుంది’ అని ఒకరు ఫన్నీగా అంటే, ‘సిలిండర్ బుక్ చేయడం మర్చిపోయా..! గుర్తు చేసింనందుకు థ్యాంక్స్’ అని మరొకరు, అసలు ఇలాంటి వారి వల్లే మాకు అమ్మాయి దొరకడం లేదని వేరొకరు కిర్రాక్ కామెంట్లు పెట్టారు. కానీ కొంతమంది మాత్రం నీకు ఇలా చేయడం వచ్చా..? అని ఛాలెంజ్ విసురుతున్నారు. Ye to koi bhi kar lega , ye kar ke dikhao👇😆🤣 pic.twitter.com/r2kgPst6AK — Bhrustrated (@AnupamUncl) September 5, 2019 -
కుంబీపాకం.. కోడి రక్తం..
ఆవిడెందుకు అలా మొహం పెట్టింది అని అడక్కండి.. ఎందుకంటే.. బతికున్న బురద చేపని తినమంటే.. మీరైనా అలాగే మొహం పెడతారు... అప్పుడే అయిపోలేదు.. వేడివేడి కోడి రక్తం ఇంకా వెయిటింగ్లో ఉంది.. చైనాలోని గ్వియ్జోలో ఉన్న ఓ సేల్స్ కంపెనీ టార్గెట్స్ పూర్తి చేయని ఉద్యోగులకు విధించిన శిక్ష ఇది.. ఇలా దాదాపు పాతిక మందికి ‘అపరిచితుడు’ సినిమాలోని కుంబీపాకం టైపు శిక్షలను అమలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలమయ్యారు.. అటు అధికారులూ ఈ ఘటనపై విచారణ మొదలుపెట్టారు.. ఇంతకీ దీనిపై వివరణ ఇచ్చిన కంపెనీ ప్రతినిధి ఏమంటాడో తెలుసా? వీళ్లంతా స్వచ్ఛందంగానే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారట.. అంతేనా.. భవిష్యత్తులో లక్ష్యాలను పూర్తి చేయడానికి ఇది ప్రేరణగా ఉంటుందని సెలవిచ్చాడు.. ఇలాంటోడ్ని ఏం చేయాలంటారు?? -
వైరల్ అవుతున్న శ్రీరెడ్డి ఫోటో
వివాదాస్పద వ్యాఖ్యలతో సంచలనాలకు తెరలేపిన నటి శ్రీరెడ్డి. క్యాస్టింగ్ కౌచ్ వ్యవహారంలో టాలీవుడ్ను ఊపేసి.. ప్రస్తుతం చెన్నైకి మకాం మార్చేసింది. అడపాదడపా సోషల్ మీడియాలో పోస్ట్లు చేస్తూ.. వస్తోన్న ఆమె తాజాగా ఓ ఫోటోను పోస్ట్ చేసింది. ఓ వ్యక్తి కాలిపై తన కాలును పెట్టి ఉన్న పిక్ను పోస్ట్చేసింది. అయితే తాను చేసే ప్రతీ పోస్ట్కు ఏదో ఒక క్యాప్షన్ ఇచ్చే శ్రీరెడ్డి ఈ సారి మాత్రం ఫోటోను మాత్రమే షేర్ చేసింది. దీంతో ఆమె ఫాలోవర్స్కు అనుమానాలు పుట్టుకొచ్చాయి. అతనెవరు? అంటూ ప్రశ్నించసాగారు. అతను ప్రేమికుడా? అంటూ అడిగిన నెటిజన్లకు.. స్నేహితుడంటూ సమాధానమిచ్చింది. పవన్ కళ్యాణ్పై సైతం సంచలన వ్యాఖ్యలు చేసింది. జనసేనను ఏ పార్టీలోనూ కలపనని చేసిన వ్యాఖ్యలపై శ్రీరెడ్డి తన స్టైల్లో స్పందించింది. ‘పవన్ గారు మీ పార్టీని మరేతర పార్టీలోనూ కలపకండి. ఒక్క విషపు చుక్క కూడా విలువైన మొత్తం ద్రావణాన్ని పాడు చేస్తుంది. మీరు మాకు వద్దు’ అంటూ పోస్ట్ చేసింది. -
కూతురికి 'నైరా' అని పేరు పెట్టిన నటి!
గర్భం ధరించినప్పటి నుంచి ఓ బిడ్డకు జన్మనిచ్చే వరకూ సోషల్ మీడియాలో పలు పోస్ట్లు పెట్టి వార్తల్లో నిలిచారు నటి సమీరా రెడ్డి. ‘అసంపూర్ణమైన సంపూర్ణం’ అనే హ్యాష్ట్యాగ్తో సోషల్ మీడియాలో మాతృత్వంపై తన ఆలోచనలను పంచుకున్నారు. శరీరాకృతి ఎలా ఉన్నా దానిని స్వీకరించాలని సమీరా రెడ్డి తన భావాలను వ్యక్తపరచడంతో చాలా మంది భారత మహిళలకు ఆమె ఓ ప్రేరణగా మారారు. ఈ నెల ప్రారంభంలో ఓ బిడ్డకు జన్మనిచ్చిన సమీరా, తన కుమార్తెకు 'నైరా' అని నామకరణం చేశారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్లో తన అభిమానులతో పంచుకుంటూ.. 'మా గారాలపట్టి నైరాను వర్డే కుటుంబానికి స్వాగతం పలుకుతున్నాం' అని పేర్కొన్నారు. 'నైరా' అనేది సరస్వతి దేవి పేరని ఆమె తెలిపారు. అంతేకాకుండా హీబ్రూలో 'మొక్క' అని అర్థం వస్తుందని, అమెరికన్ మూలంలో ‘నైట్ బోర్డర్‘ అనే అర్థం కూడా ఉందని ఆమె తెలిపారు. దీంతో ఈ అరుదైన పేరుకి వెంటనే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆమోదం లభించింది. సమీరా షేర్ చేసిన పోస్ట్కు స్పందించిన ఫ్యాషన్ డిజైనర్లు నీతా లుల్లా, అనితా డోంగ్రే పేరు చాలా బావుందని ప్రశంసించారు. తన భర్త అక్షయ్ వర్దే, తాను ఓ కుమార్తెను కోరుకున్నామని అనుకున్నట్లే కుమార్తె జన్మించడంతో సంతోషంగా ఉందని గతంలో సమీరా రెడ్డి ఓ పోస్ట్ ద్వారా తెలిపిన సంగతి తెలిసిందే. -
మొసలిని మింగిన కొండచిలువ!
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యం... చూసిన వారంతా బాబోయ్! అనకుండ ఉండలేరు. కొండచిలువ మొసలికి మధ్య జరిగిన పోరాటంలో చివరికి మొసలిపై పైథాన్ గెలుపు సాధించింది. ఆలివ్ పైథాన్ మంచి నీటి మొసలితో పోరాడి చివరకు దానిని పూర్తిగా మింగేసింది. ఈ పోరాట దృశ్యాన్ని మొదటి నుంచి చివరి వరకు ఓ ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించి అందులో కొన్ని ఫోటోలను జీజీ వైల్డ్ లైఫ్ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలను చూసిన నెటిజన్లంతా కామెంట్లు పెట్టకుండా ఉండలేక పోతున్నారు. ‘ఇంత భయంకరమై కొండచిలువను జూలో కూడా చూడలేదని, ఇలాంటి ఘటనను దగ్గర చూసే అవకాశం కూడా ఎప్పుడు రాలేదని’ కామెంట్లు పెట్టారు. సామాజిక మాధ్యమంలో సెన్సేషనల్గా మారిన ఈ ఫోటోలకు ఇప్పటివరకు 23 వేల కామెంట్లు, 48 వేల షేర్లు, 23 వేల లైక్లు వచ్చాయి. -
ఆగస్టులో అపరిమిత సెక్స్ ఫెస్టివల్
న్యూయార్క్ : ‘కామి కాలేనివాడు మోక్షగామి కాలేడు’ అన్న భారతీయ వివాదాస్పద సాధువు రజనీష్ సూత్రాన్ని ఆచరించాలనుకున్నారేమోగానీ ‘వంద మంది అమ్మాయిలతో అపరిమిత సెక్స్ ’ అంటూ నిర్వహకులు ఇస్తున్న పిలుపు నేడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అమెరికాలోని నేవెడ రాష్ట్రంలో ‘సెక్స్ ఐలాండ్’ పేరిట ఆగస్టు రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోయే వేడుకలకు అప్పుడే టిక్కెట్ల అమ్మకం ప్రారంభమైంది. ఇప్పటికే 13 మంది బ్రిటీషర్లు సహా 30 మంది టక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఒక్కో టిక్కెట్ ఆరువేల డాలర్లు. నాలుగు రోజులపాటు ఈ సెక్స్ వేడుకల్లో టెక్కెట్లు కొనుక్కొని వచ్చే పురుష పుంగవులు ప్రతి రోజు ఇద్దరు అందమైన అమ్మాయిలను ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుంది. వీరు గుర్రాలపై, బైకులపై నగ్నంగా విహరించడమే కాకుండా, ఎలక్ట్రానిక్ లాంచీలపై కూడా తమ కామ క్రీడల్లో క్రీడించవచ్చు. హెలికాప్టర్ విహారం ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని నిర్వాహకులు తెలియజేస్తున్నారు. గతేడాది ఈ సెక్స్ వేడుకలను వెనిజులాలోని ఓ దీవిలో నిర్వహించారు. ‘డ్రగ్స్ అండ్ ఫ్రెండ్లీ వెకేషన్’గాను పిలిచే ఈ వేడుకల్లో నిషేధిత మాదక ద్రవ్యాలను కూడా యథేశ్చగా సరఫరా చేశారట. విషయం తెలిసే కాబోలు, సెక్స్ వేడుకల రోజుల్లో దాడులు నిర్వహిస్తామని, డ్రగ్స్ చట్టాలను ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని ‘అమెరికాస్ డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్’ అధికారులు హెచ్చరిక జారీ చేశారు. డ్రగ్స్తోని విదేశీ పర్యాటకులు దొరికినట్లయితే వారిని అదుపులోకి తీసుకొని సమీపంలోని వలసదారుల కేంద్రానికి తరలించి వారిని వారి వారి దేశాలకు పంపిస్తామని కూడా హెచ్చరించారు. అంతేకాదు, సెక్స్కు సంబంధించిన నియమ నిబంధనలను ఉల్లంఘించినా అసలు వేడుకలే జరగకుండా అడ్డుకుంటామని అమెరికా పోలీసులు కూడా నిర్వాహకులను హెచ్చరించారు. 18 ఏళ్ల ప్రాయంలోని వారిని సెక్స్కు అనుమతిస్తే కూడా కఠిన చర్యలు తప్పవని చెప్పారు. అమెరికాలో పరిమితంగా వ్యభిచారానికి అనుమతించిన ఏకైక రాష్ట్రం నేవడ. అందుకనే నిర్వాహకులు ఈ రాష్ట్రాన్ని ఎంపిక చేసుకున్నారు. మొదటి సెక్స్ ఫెస్టివల్ గతేడాది కొలంబియాలోని కార్టెజెనా అనే ప్రైవేటు దీవిలో నిర్వహించాలనుకున్నారు. వేడుకలపై గొడవ మొదలవడంతో దక్షిణ అమెరికా ప్రభుత్వం వాటిని అడ్డుకుంది. దాంతో వ్యభిచారం చట్టబద్ధమైన వెనిజులాలోని ఇస్లా మార్గరిటలో జరిగింది. ఈ సారి కూడా ‘ఆర్గ్ హాలీడే’ అనే పొర్న్ వీడియో సంస్థతో కలసి ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ ఈ వేడుకలను నిర్వహిస్తోంది. అమెరికా పోలీసులు, డ్రగ్స్ విభాగం హెచ్చరికలకు భయపడరాదని ‘ది గుడ్ గర్ల్ కంపెనీ’ వారు తెలిపారు. స్థానిక చట్టాలకు అనుగుణంగా అన్ని వ్యవహారాలు నడుస్తాయని, తాము స్థానిక చట్టాలను ఉల్లంఘించడం లేదని వారు చెప్పారు. తమ అమ్మాయిలెవరికి సుఖ రోగాలు లేవని, అందరికి ముందుగానే వైద్య పరీక్షలు చేయించామని, తమ అమ్మాయిలు కండోమ్స్కు కట్టుబడి ఉంటారని తెలిపారు. -
అందరినీ సంతృప్తి పరచలేను!
సినిమా: అందరినీ సంతృప్తి పరచడం సాధ్యం కాదని నటి రకుల్ ప్రీత్సింగ్ అంటోంది. తమిళం, తెలుగు, హిందీ చిత్రాల్లో నటిస్తున్నా, ఇటీవల ఈ జాణకు హిట్స్ కరువయ్యాయనే చెప్పాలి. ముఖ్యంగా కోలీవుడ్లో సూర్యతో జతకట్టిన ఎన్జీకే చిత్రంపై చాలా ఆశలు పెట్టుకుంది. అయితే ఇటీవల తెరపైకి వచ్చిన ఈ చిత్రం రకుల్కు పూర్తిగా నిరాశనే మిగిల్సింది. కోలీవుడ్లో దేవ్ చిత్రం తరువాత ఈమె చవిచూసిన రెండవ అపజయం ఎన్జీకే. ఇక తెలుగులోనూ అర్జెంట్గా ఆ బ్యూటీకి ఒక హిట్ కావాలి. అయితే ప్రస్తుతం నాగార్జునతో మన్మథుడు–2 చిత్రంలో నటిస్తోంది. ఈమెకు ఆశాదీపం ఆ చిత్రమే. ఇకపోతే కోలీవుడ్లో విజయ్ సరసన నటించి అవకాశం ఎదురుచూస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో మరిన్ని అవకాశాల కోసం రకుల్ప్రీత్సింగ్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటోంది. అందులో భాగంగా గ్లామరస్ ఫొటోలను సోషల్ మీడియాకు విడుదల చేస్తూ చర్చల్లో నానుతోంది. తన అవకాశాల మాటెలా ఉన్నా, నెటిజన్లు మాత్రం ఈ అమ్మడిని ఒక ఆట ఆడుకుంటున్నారనే చెప్పాలి. కొందరు అభిమానులను ఆ ఫొటోలు ఎంజాయ్మెంట్ను ఇస్తున్నా, మరి కొందరి విమర్శలను రకుల్ప్రీత్సింగ్ ఎదుర్కోకతప్పడం లేదు. అయితే విమర్శలు ఎప్పుడూ రుచించవు. వాటి గురించి రకుల్ప్రీత్సింగ్ కూడా విరుచుకుపడుతోంది. ఈ అమ్మడు ఏం అంటుందో చూద్దాం. సామాజిక మాధ్యమాల్లోని కొందరు పనీ పాటా లేని వారు ఉంటారని అంది. అలాంటి వారికి ఇంకొకరిని విమర్శించడమే పని అని విరుచుకు పడింది. అయినా తన తల్లిదండ్రులు, స్నేహితుల అభిప్రాయాలనే తాను గౌరవిస్తానని ఇతరుల గురించి పట్టించుకోవలసిని అవసరం తనకు లేదని అంది. అంతే కాకుండా అందరినీ సంతృప్తి పరచడం తన వల్ల కాదనీ రకుల్ప్రీత్సింగ్ చెప్పుకొచ్చింది. ఏదేమైనా ఉత్తరాది భామ కథా ఈ అమ్మడికి ఆ పాటి టెక్ ఉండటం సహజమే. -
వైరల్ వీడియో : జాన్వీ బెల్లీ డ్యాన్స్
అందాల తార స్వర్గీయ శ్రీదేవీ ముద్దుల తనయగా వెండితెరకు పరిచయమైంది జాన్వీ కపూర్. మొదటి సినిమా ధడక్ ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయినా.. జాన్వీ లుక్స్కు మంచి స్పందన వచ్చింది. ఇక ఫస్ట్ మూవీ ఫలితం ఎలాగున్నా బీటౌన్లో జాన్వీ ఫాలోయింగ్ బాగానే ఉంది. జాన్వీ ప్రస్తుతం తన తదుపరి చిత్రాలకు రెడీ అవుతూ ఉంది. జిమ్లో కసరత్తులు చేస్తున్న వీడియోలు, పొట్టి దుస్తుల్లో కెమెరా కళ్లకు చిక్కుతూ సోషల్ మీడియాలో విపరీతంగా ఫాలోయింగ్ను సంపాదించుకుంది. తాజాగా జాన్వీ బెల్లీ డ్యాన్స్ చేస్తూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక అభిమానులు ఊరికే ఉంటారా? లైక్లు, కామెంట్లతో ఈ వీడియోను షేర్ చేస్తూ హల్చల్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పటివరకు 3లక్షలకు పైగా వ్యూస్ను దక్కించుకుంది. జాన్వీ ప్రస్తుతం ‘తక్త్’ అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
జాన్వీ కపూర్ బెల్లీ డ్యాన్స్
-
సియాచిన్లో భారత సైనికుల తిండితిప్పలు
-
పగలని గుడ్డు.. జవాన్లకు నో ఫుడ్డు!
శ్రీనగర్ : ఎముకల కొరికే చలిలో గస్తీ నిర్వహిస్తున్న భారత సైనికలు బుక్కెడు బువ్వ కోసం నానా కష్టాలు పడుతున్నారు. దేశ రక్షణ కోసం ప్రపంచంలోనే అతి ఎత్తైన సైనిక గస్తీ ప్రాంతం సియాచిన్ గ్లేసియర్లో మైనస్ 40-70 డిగ్రీల చలి మధ్యన ప్రాణాలకు తెగించి మరీ విధులు నిర్వహిస్తున్నారు. ఆ మంచు పర్వతాల్లో శత్రువుల కంటే... మంచుతోనే యుద్ధం చేస్తున్నారు. అక్కడి వాతావరణానికి తాగే నీటితోపాటూ తినే ఏ పదార్థమైనా ఇట్టే గడ్డకట్టిపోతుంటాయి. ఎంతలా అంటే... సుత్తితో పగలగొట్టినా పగలనంత గట్టిగా ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాము తిండి కోసం పడే తిప్పలు ఎలా ఉంటాయో వివరిస్తూ... ఓ జవాన్ ట్విట్టర్లో వీడియోని పోస్ట్ చేశారు. సియాచిన్ గ్లేసియర్లో జీవించడం ఎంత కష్టమో.. భారత సైన్యం చేస్తున్న సేవ ఏంటో ఈ వీడియోని చూస్తే అర్థం అవుతోంది. ఆ వీడియోలో ఏముందంటే.. ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్ ఇటుకలా గడ్డకట్టడం దాన్ని సుత్తెతో కొట్టినా పగలలేదు. వేడి చేస్తే తప్పా ఆ జ్యూస్ తాగాలేరు. ఇక దుంపలు, ఉల్లిపాయలు, టమాటాలు కోడిగుడ్లు, అల్లం... ఇలా అన్నీ రాళ్లలాగా గట్టిగా ఉంటాయి. గడ్లు గట్టిగా కొట్టినా పగలదంటూ ఆ సైనికులు తమ బాధను వివరించారు. గుడ్లు, అల్లం, ఉల్లిపాయలు ఇలా ఏది పగలగొట్టాలన్నా ఓ యుద్ధం చేసినట్లేనని, ఇంత దారుణమైన పరిస్థితుల్లో తాము పహారా కాస్తున్నామని సైనికులు తమ గోడును వెల్లబోసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుండగా.. చాలా మంది నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతూ సైనికుల సేవలను కొనియాడుతున్నారు. What it is like to save freedom of 1.3 billion people. #IndianArmy Jawans explains one part of it. Enjoy your freedom also be thankful to all our Jawans for making it happen. pic.twitter.com/uFEyoG1vQl — 👁️ INTEL ⚔️ Defence 🌏 OSINT ☢️ Conflict 💬 News (@Ind4Ever) June 8, 2019 -
ఇలా జరగడం లైఫ్లో మొదటిసారి : స్నేహా ఉల్లాల్
ఉల్లాసంగా.. ఉత్సాహంగా, కరెంట్, సింహా చిత్రాలతో ఫేమస్ అయిన స్నేహా ఉల్లాల్.. వెండితెరపై కనిపించి చాలా కాలమవుతోంది. అయితే తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్తో స్నేహా ఉల్లాల్ మళ్లీ వార్తల్లోకెక్కింది. తాను మొదటిసారిగా ఆసుపత్రిలో చేరారని, ఇలా జరగడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. అంతేకాకుండా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. ‘జీవితంలో మొదటిసారి ఆసుపత్రి పాలయ్యాను. విపరీతమైన జ్వరంతో ఇబ్బంది పడుతున్నాను. ఎంతకీ తగ్గకపోవడంతో హాస్పిటల్ లో చేరాల్సి వచ్చింది. భయం అనిపించింది.. కానీ కొంత సమయం తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్ గా ఫీల్ అవుతున్నాను. నన్ను ఎంత వీలైతే అంత విశ్రాంతి తీసుకోమని డాక్టర్లు చెప్పారు. అది బోరింగ్ గా ఉంటుంది కదా.. అయితే నాతో నెట్ ఫ్లిక్స్ ఉంది. నాపట్ల కేర్ తీసుకునే మనుషులు నాతో ఉన్నారు. వీలైనంత త్వరగా మళ్ళీ వర్క్ లైఫ్ లోకి రావాలనుకుంటున్నా.. మీ అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా’ అని సుదీర్ఘమైన పోస్ట్ చేశారు. View this post on Instagram So i was hospitalised for the first time in my life.I had a very high fever that wasn’t dying down despite multiple treatments.It was scary.BUT. After a while of terrible health , im finally a lil better.I have been asked to rest it out as much as possible.So thats going to be boring.But i have my Netflix and a bunch of very caring #foreverkindofpeople with me to keep me going.Cant wait to get back to work. I wish you all good health. A post shared by Sneha Ullal (@snehaullal) on Jun 2, 2019 at 4:46am PDT -
ఐష్పై ఒబెరాయ్ ట్వీట్.. సోనమ్ ఫైర్
ముంబై : బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ సరదాగా చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల నేపథ్యంలో ఆయన షేర్ చేసిన మీమ్ పెడర్థాలకు దారితీసింది. బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యారాయ్ను కించపరిచే విధంగా ఉన్న ఆ మీమ్పై యావత్ భారతం మండిపడుతోంది. మహిళా అనే కనీస గౌరవం లేకుండా ఒబెరాయ్ ప్రవర్తించాడని దుమ్మెత్తిపోస్తుంది. ఇంతకీ ఒబెరాయ్ చేసిన తప్పు ఏంటంటే.. ఒకప్పటి గర్ల్ఫ్రెండ్ అయిన ఐశ్వర్య వ్యక్తిగత జీవితాన్ని కించపరుస్తూ.. ఎగతాళిగా రూపొందించిన మీమ్ను షేర్ చేయడం. ఆమె బాయ్ఫ్రెండ్స్ను ప్రస్తావిస్తూ.. చాలా జుగుప్సాకరంగా రూపొందించిన ఆ మీమ్ను ట్వీట్ చేయడం.. నెటిజన్లకు ఆగ్రహం తెప్పిస్తోంది. బాలీవుడ్ నటుడు సల్మాన్ఖాన్తో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఒపీనియన్ పోల్గా.. తనతో ఐశ్వర్య ఉన్న ఫొటోను ఎగ్జిట్ పోల్గా.. అభిషేక్ బచ్చన్, తన కూతురు ఆరాధ్యతో ఐశ్వర్య ఉన్న ఫొటోను రిజల్ట్గా పేర్కొంటూ ఏ మాత్రం సోయి లేకుండా ట్వీట్ చేశాడు. పైగా వెటకారంగా ‘హహహ.. క్రియేటివ్.. ఇక్కడ రాజకీయాలు లేవు. జీవితం మాత్రమే’ అనే క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ట్వీట్ చూసిన ప్రతి ఒక్కరు ఆగ్రహానికి గురవుతున్నారు. ఒబెరాయ్ ఒళ్లు మరిచి ట్వీట్ చేశాడని మండిపడుతున్నారు. చాలా అమర్యాదకంగా ప్రవర్తించాడని, వెంటనే ఆ ట్వీట్ను తొలగించాలని కామెంట్ చేస్తున్నారు. నరేంద్రమోదీ సినిమాలో మోదీ పాత్ర చేసినంత మాత్రానా.. ప్రధానని ఫీలవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు. మహిళలను గౌరవించడం నేర్చుకో అంటూ బుద్ది చెబుతున్నారు. బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ సైతం ఒబెరాయ్ చర్యను తప్పుబట్టారు. చాలా అసహ్యంగా ఉందని కామెంట్ చేశారు. ఈ ట్వీట్ నేపథ్యంలో మహారాష్ట్ర మహిళా కమిషన్ ఒబెరాయ్పై కేసు నమోదు చేసింది. ప్రధాని నరేంద్రమోదీ బయోపిక్ ‘పీఎం నరేంద్రమోదీ’ లో ఒబెరాయ్ మోదీ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. ఎన్నికల కోడ్ వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. ఇక ఎగ్జిట్ పోల్స్ అన్ని బీజేపీకి పట్టం కట్టిన విషయం తెలిసిందే. Haha! 👍 creative! No politics here....just life 🙏😃 Credits : @pavansingh1985 pic.twitter.com/1rPbbXZU8T — Vivek Anand Oberoi (@vivekoberoi) 20 May 2019 -
వ్యక్తీకరణ
‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని. స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతా బెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. మాధవ్ శింగరాజు ప్రియాంక చోప్రా, ప్రియాంక గాంధీ.. వీళ్లలా ప్రియాంక శర్మ పెద్ద పేరున్న వ్యక్తి కాదు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ఒక ‘మీమ్’ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసి, షేర్ చేసిందన్న ఆరోపణపై ఈ నెల పదవ తేదీన దాస్నగర్ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశాక కానీ.. ప్రియాంక శర్మ అనే ఒకరు బీజేపీ యువ మోర్చాలో కార్యకర్తగా ఉన్నారన్న సంగతి దేశానికి తెలియరాలేదు. మే ఆరున న్యూయార్క్లో జరిగిన ‘మెట్ గాలా’ ఫ్యాషన్ ప్రదర్శనలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా విచిత్ర వేషధారణలో కనిపించారు. ఆ వేషాన్ని ప్రియాంక శర్మ మమతకు వేసి, ఆ ఫొటోను నెట్లో పెట్టడమే పోలీసులు ఆమెను అరెస్టు చేసి జైల్లో పెట్టడానికి కారణం. ఆమెను తక్షణం బెయిలు మీద విడుదల చేయాలని సుప్రీంకోర్టు గత మంగళవారం ఆదేశించింది. ఆ సందర్భంలోనే కోర్టు ఒక వ్యాఖ్య కూడా చేసింది. మనకున్న భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఇతరుల పరువు మర్యాదలకు భంగం కలిగించకూడదని. అంతేకాదు, మమతకు క్షమాపణ చెప్పాలని కూడా ప్రియాంక శర్మకు ఆదేశించింది. అయితే తనేం క్షమాపణ చెప్పబోవడం లేదని జైలు నుంచి బయటికి వచ్చీరాగానే పెట్టిన ప్రెస్ మీట్లో ప్రియాంక ప్రకటించారు! మొత్తం ఐదు రోజులు జైల్లో ఉన్నారు ప్రియాంక. ఈ ఐదు రోజులూ జైలు అధికారులు తనను తీవ్రమైన మానసిక క్షోభకు గురి చేశారని, కనీసం తాగడానికి కూడా నీళ్లివ్వకుండా ప్రతిరోజూ జైలు గదులు మారుస్తూ హింసించారనీ ఆరోపించారు. అయితే ఇదంతా కూడా ప్రియాంక కోరి తెచ్చుకున్నదే.ఏదైనా ఒక సామాజిక మార్పును ఆశించిగానీ, ప్రజల్లో ఏదైనా ఒక ప్రగతిశీల ఆలోచనను రేకెత్తించేందుకు గానీ మమత ఫొటోను ఆమె మార్ఫింగ్ చేయలేదు. రాజకీయ ప్రత్యర్థిని వ్యక్తిగతంగా కించపరచడానికి.. ఏమీ తోచక చేసిన పని మాత్రమే అది. ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ఈ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! స్త్రీని స్త్రీ పరిహసించడంలో అసాధారణత ఏమీ లేదనుకున్నా.. మమత సాధారణమైన వ్యక్తేం కాదు. పోరాట పటిమగల రాజనీతిజ్ఞురాలు. ఆమె ఫొటోను మార్ఫింగ్ చేయడం పిల్ల చేష్ట కూడా కాదు. పని లేని చేష్ట.మమతను సాటి మహిళగా కాకుండా ఒక ముఖ్యమంత్రిగా ప్రియాంక శర్మ చూసినప్పటికీ.. ప్రియాంకను బీజేపీ యూత్ లీడర్లా కాకుండా సాటి మహిళగా మమత చూశారని.. 2012 నాటి పాత కేసునొకదాన్ని గుర్తు చేసుకుంటే.. పోలిక తెలుస్తుంది. అదీ ‘ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్’ కేసే. మమతా బెనర్జీ తొలిసారి ముఖ్యమంత్రి అయిన మరుసటి ఏడాది.. ఆమెను, రైల్వే మంత్రి ముకుల్ రాయ్ని, మాజీ రైల్వే మంత్రి దినేశ్ త్రివేదీలను కలిపి కార్టూన్గా వేసి, ఆ కార్టూన్ని ఈ–మెయిల్గా పార్వర్డ్ చేసిన జాదవ్పూర్ యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగం సీనియర్ ప్రొఫెసర్ అంబికేశ్ మహాపాత్ర పైన, ఆ ఈ–మెయిల్ను అందుకున్న సుబ్రతాసేన్ గుప్తా అనే ఆయనపైన రెండు కేసులు నమోదయ్యాయి. ఒకటి పరువునష్టం కేసు. ఇంకోటి ఒక స్త్రీ శీలప్రతిష్టకు భంగం కలిగించిన కేసు. ఈ రెండు కేసులూ ఇప్పటికీ నడుస్తున్నాయి! బెయిల్ మీద ఉన్న మహాపాత్ర నేటికీ విచారణకు హాజరవుతున్నారు. సుబ్రతా సేన్గుప్తా గతవారమే తన 79 ఏళ్ల వయసులో చనిపోయారు. ప్రియాంక శర్మ పోస్ట్ చేసిన మీమ్తో పోలిస్తే, అప్పట్లో మహాపాత్ర ఫార్వర్డ్ చేసిన కార్టూన్ ఎంతో అర్థవంతమైనది. శుభ్రమైన ఒక పొలిటికల్ సెటైర్. అయినప్పటికీ ‘గౌరవనీయులపై చేసిన ఆక్షేపణీయమైన వ్యాఖ్య’గా పరిగణించి ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. రైల్వే మంత్రిగా ఉన్న దినేశ్ని తప్పించి, ఆ పదవిని మమత.. ముకుల్కి ఇప్పించారని మహాపాత్ర కార్టూన్ వేశారు. మమత ముకుల్తో అంటున్నట్లుగా ఉన్న ఆ కార్టూన్లోని కామెంట్లను 1974 నాటి సత్యజిత్ రే మిస్టరీ మూవీ ‘సోనా కెల్లా’లోని డైలాగులతో మహాపాత్ర సంకేతపరిచారు. ఫలితం ఇప్పటికీ అనుభవిస్తున్నారు. ప్రియాంక విషయంలో మమత మరీ అంతగా గట్టిగా ఉండకపోవచ్చు.సెటైర్కి ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తారు. ప్రభుత్వం ఒకలా స్పందిస్తుంది. తీవ్రవాదులు ఒకలా స్పందిస్తారు. అసలు ఏ విధంగానూ స్పందించకుండా ఇగ్నోర్ చేసేవారూ ఉంటారు. గత ఏడాది ఆరంభంలో కశ్మీర్లో జరిగిన ఒక అత్యాచార ఘటనతో లింక్ చేస్తూ సీతమ్మవారిని సీన్లోకి తెచ్చి ఆమె చేత రామభక్తులపై కామెంట్ చేయించిన కార్టూన్ ఒకటి హైదరాబాద్ నుంచి ఫేస్బుక్లో పోస్ట్ అయింది. దాన్నెవరూ పట్టించుకోలేదు. జైల్లో పడేయడం కన్నా పెద్ద శిక్ష ఇగ్నోర్ చేసి పడేయడం. ఫ్రీడమ్ని ఎక్స్ప్రెస్ చేయాలనుకునేవారు ఒక్క హైదరాబాద్లోనే, ఒక్క బెంగుళూరులోనే, ఒక్క పశ్చిమబెంగాల్లోనే ఉండరు. ఫ్రాన్స్లోనూ ఉంటారు. అక్కడొక పెద్ద గుంపే ఉంది. ఆ గుంపు ఒక పత్రికనే నడుపుతోంది. ఆ పత్రిక పేరు ‘చార్లీ హెబ్డో’. వ్యంగ్య రచనల వారపత్రిక.గవర్నమెంటు మీద కార్టూన్లు వేసినన్నాళ్లూ ఏమీ కాలేదు కానీ.. ఒక మతం మీద సెటైర్లు వేసినందుకు ఆ పత్రిక ముఖ్య సంపాదకుడిని, ముగ్గురు కార్టూనిస్టులను పత్రికా కార్యాలయంలోకి వెళ్లి మరీ కాల్చి చంపారు తీవ్రవాదులు.2015లో జరిగింది ఈ ఘటన. ప్రజల్లో ఇస్లాం ఫోబియాను కలిగించే విధంగా ఫ్రెంచ్ రచయిత మిషెల్ వెల్బెక్ రాసిన వివాదాస్పద వ్యంగ్య నవల ‘సబ్మిషన్’ (ఆ ఘటనకు రెండ్రోజుల క్రితమే మార్కెట్లోకి వచ్చింది) లోని అంశాలపై వెల్బెక్ని సమర్థిస్తూ సెటైర్లు ఉన్నాయి.ఆ సెటైర్లే తీవ్రవాదులకు ఆగ్రహం తెప్పించాయి.‘వ్యక్తీకరణ స్వేచ్ఛ’ ఉండాల్సిందే. స్వేచ్ఛను వ్యక్తీకరించాలనుకోవడం మాత్రం తగని పని.స్వేచ్ఛను వ్యక్తీకరించడానికి గీతలు గియ్యడం, రాతలు రాయడం ఒక సృజనాత్మక విపరీతం. అలాంటి ఒక విపరీతమే మమతాబెనర్జీపై ప్రియాంక శర్మ క్రియేట్ చేసిన మీమ్. జైల్లో తననెంతో మానసిక క్షోభకు గురిచేశారని అంటున్న ప్రియాంకకు.. తన చేష్ట ద్వారా మమతను అభిమానించేవాళ్లను తను ఎంతటి క్షోభకు గురి చేసి ఉంటుందోనన్న ఆలోచన వచ్చి ఉంటుందా? కేసు జూలైకి వాయిదా పడింది. ఆలోపు వస్తుందేమో మరి.. ఆలోచన! ప్రియాంక శర్మ : ఇటీవల ఎన్నికల ప్రచారంలో కొందరు మేల్ లీడర్స్ మహిళా అభ్యర్థులపై సభ్యత లేకుండా చేసిన కామెంట్ల కన్నా తక్కువైనదేమీ కాదు ప్రియాంక శర్మ మార్ఫింగ్ మీమ్. పైగా ఇది ఒక స్త్రీ ఇంకో స్త్రీని తక్కువ చేయడం! -
చదువులమ్మ ఒడిలో ‘మావో’ల కలకలం!
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్లోని శాతవాహన వర్సిటీలో మావోయిస్టు కార్యక్రమాల పేరిట సామాజిక మాధ్యమాల్లో సాగిన ప్రచారం వివాదాస్పదమవుతోంది. ‘నక్సలైట్ కార్యకలాపాలపై శాతవాహన యూనివర్సిటీలో పోలీసుల ఆరా’శీర్షికన రాసిన లేఖ సోమవారం ఉదయం నుంచి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అయింది. ‘నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం, కరీంనగర్’పేరిట ఈ లేఖ వాట్సాప్ గ్రూపుల్లో మీడియాతో పాటు విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల ఫోన్లలో చక్కర్లు కొట్టింది. అయితే మీడియా గ్రూపులకు స్వయంగా పోలీసుశాఖ పంపించడం గమనార్హం. దీంతో పోలీస్ శాఖ తరఫున అధికారికంగా నక్సలైట్ బాధితులు లేఖ విడుదల చేసినట్లు భావించారు. దీనిపై పోలీసు శాఖ అధికారులను ‘సాక్షి’సంప్రదించగా, యూనివర్సిటీలో రెండు విద్యార్థి సంఘాల మధ్య జరుగుతున్న గొడవల నేపథ్యంలో వచ్చిన పోస్టును సమాచారం కోసం షేర్ చేశామే తప్ప, అధికారికంగా కాదని వెల్లడించారు. కాగా సాయంత్రం ఇదే సంఘం తరఫున వచ్చిన మరో పోస్టును గ్రూపులో కాకుండా విడిగా జర్నలిస్టులకు పోస్టు చేశారు. తెలంగాణ విద్యార్థి వేదికకు తీవ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనేందుకు సాక్ష్యాలుగా టీవీవీ అనుకూల విద్యార్థులు ప్రొఫెసర్ సాయిబాబా, వరవరరావుల అరెస్టును వ్యతిరేకిస్తూ నల్ల జెండాలు ప్రదర్శించిన ఫొటోను, విడుదల చేసిన పోస్టర్ను పంపించారు. టీవీవీ, ప్రొఫెసర్కు వ్యతిరేకంగా పోస్టు నిషేధిత మావోయిస్టు తీవ్రవాద సంస్థకు అనుబంధంగా పనిచేస్తున్న తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) సంఘంలో సభ్యత్వాలు నమోదవుతున్నాయని ఆ పోస్టులో పేర్కొన్నారు. కొరివి సూర్యుడు, కరికె మహేశ్, దొగ్గల రాజు అనే టీవీవీ నాయకులు మరికొందరితో కలసి ఇటీవల ఛత్తీస్గఢ్ వెళ్లి మావోయిస్టు చంద్రన్నను కలసి తీవ్రవాదుల నుంచి పెద్ద ఎత్తున నిధులు తెచ్చారని ఆరోపించారు. ఇక్కడ అసోసియేట్ ప్రొఫెసర్గా ఉన్న సూరేపల్లి సుజాత స్టడీటూర్ల పేరుతో విద్యార్థులను ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతాలకు తీసుకెళ్లి తీవ్రవాదులను కలిపిస్తూ, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తయారు చేయిస్తున్నట్లు ఆరోపించారు. తీవ్రవాద సంస్థలకు అనుకూలంగా పనిచేసే విద్యార్థి సంఘాల్లో చేరకుండా తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని సూచించారు. ఈ వాట్సాప్ లేఖను పోలీస్ శాఖ మీడియా గ్రూపుల్లో పంపించింది. నక్సలైట్లకు వ్యతిరేకంగా ఏబీవీపీ ధర్నా యూనివర్సిటీలో మావోయిస్టు అనుకూల విద్యార్థి సంఘం కార్యకలాపాలు సాగిస్తుందని ఓ వైపు మీడియా, పోలీసు, ప్రొఫెసర్, విద్యార్థుల గ్రూపుల్లో వీడియో వైరల్ అవుతున్న సమయంలో మధ్యాహ్నం ఏబీవీపీ విద్యార్థి సంఘం స్పందించింది. యూనివర్సిటీ పరిపాలన విభాగంలోకి వెళ్లిన విద్యార్థి సంఘం నాయకులు తెలంగాణ విద్యార్థి వేదికకు, నక్సలైట్లకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రిజిస్ట్రార్ చాంబర్ ముందు బైఠాయించారు. రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్కు వినతిపత్రం ఇచ్చి వెళ్లారు. తీవ్రవాద కార్యకలాపాలు లేవు యూనివర్సిటీలో చోటు చేసుకున్న పరిణామాలపై రిజిస్ట్రార్ ఉమేష్ కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ వర్సిటీలో ఎలాంటి తీవ్రవాద కార్యకలాపాలు సాగడం లేదని స్పష్టం చేశారు. ఒకటి రెండు విద్యార్థి సంఘాల తీరులోనే తెలంగాణ విద్యార్థి వేదిక అనేది కూడా ఉన్నట్లు పేర్కొన్నారు. అది నిషేధిత సంఘమో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. రెండు నెలల క్రితం స్టడీ టూర్ కింద యూనివర్సిటీ నుంచి అధికారికంగానే భద్రాచలం వెళ్లినట్లు తెలిపా రు. ప్రొఫెసర్ సూరెపల్లి సుజాతతోపాటు ఇతర స్టాఫ్ కూడా ఉందని, తనకు భద్రాచలం అనే చెప్పారని, ఛత్తీస్గఢ్ వెళ్లారో లేదో తెలియదని అన్నారు. పెంచల శ్రీనివాస్ అనే కాంట్రాక్టు లెక్చరర్ లైంగిక వేధింపుల ఆరోపణలపై కమిటీ నివేదిక ఇచ్చారని, వీసీ పరిధిలో ఉందని చెప్పారు. వాట్సాప్ పోస్టులో ఉన్నవన్నీ తప్పులేనని అంగీకరించారు. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థే: మరో ప్రకటన సోమవారం ఉదయమే తెలంగాణ విద్యార్థి వేదిక లక్ష్యంగా కరీంనగర్ నక్సలైట్ బాధిత కుటుంబాల సంక్షేమ సంఘం పేరుతో వాట్సాప్ పోస్టు రాగా, మధ్యాహ్నం మూడు గంటలకు మరో ప్రకటన వెలువడింది. టీవీవీ మావోయిస్టు అనుబంధ సంస్థ అని చెప్పడానికి ఆధారాలు ఇవి కావా? అంటూ కొన్ని సాక్ష్యాలను విడుదల చేశారు. ప్రొఫెసర్ జి.ఎన్.సాయిబాబా, వరవరరావుల అరెస్టుకు నిరసనగా తెలంగాణ విద్యార్థి వేదిక తరఫున మే 17న ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ధర్నాకు సంబంధించిన పోస్టర్ను, శాతవాహన యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు నల్లజెండాలు ప్రదర్శిస్తున్న ఫొటోలను విడుదల చేశారు. వీటిని కూడా పోలీస్ పీఆర్ఓ జర్నలిస్టులకు తన ఫోన్ ద్వారా పంపించడం గమనార్హం. -
బొద్దింకలతో కొత్త చాలెంజ్
ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచాన్నే ఏలుతోంది.. ఏ నిమిషంలో ఎవరు ఫేమస్ అయిపోతారో తెలియదు.. ఏ అంశం వైరల్ అవుతుందో తెలియదు.. అదంతా సోషల్ మీడియానే డిసైడ్ చేస్తుంది. అదీ సోషల్ మీడియా మహిమ. ఐస్ బకెట్ చాలెంజ్, రైస్ బకెట్ చాలెంజ్.. ఇలా చాలా చాలెంజ్లు సోషల్ మీడియా పుణ్యమా అని తెగ వైరల్ అయిపోయాయి. ఇప్పుడేమో తాజాగా మరో చాలెంజ్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. బొద్దింక తెలుసు కదా.. దాన్ని ముఖంపై పెట్టుకుని సెల్ఫీ దిగి దాన్ని సోషల్మీడియాలో పోస్ట్ చేయాలి. బొద్దింకను చూస్తేనే ఆమడ దూరం పారిపోతాం.. అలాంటిది ముఖంపై వేసుకుని ఫొటో దిగడమా.. వాక్ అనుకోకండి. అదే మరి చాలెంజ్ అంటే.. అసలు ఇది ఎక్కడ మొదలైందంటే.. గత నెలలో మయన్మార్కు చెందిన అలెక్స్ ఆంగ్ అనే యువకుడు పెద్ద బొద్దింకను ముఖం మీద పెట్టుకుని ఫొటో దిగి ఫేస్బుక్లో పెట్టాడు. అంతే ఒక్కరోజులో ఈ పోస్ట్ను దాదాపు 20 వేల మంది షేర్ చేశారు. ఇక అప్పటినుంచి మయన్మార్, ఫిలిప్పీన్స్, ఇండోనేసియాల్లో బొద్దింకతో సెల్ఫీ దిగి పోస్ట్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్కువగా అమెరికన్ జాతికి చెందిన బొద్దింకలను వాడుతున్నారు. ఈ బొద్దింకలను ఆగ్నేయాసియా దేశాల్లో ఇంట్లో పెంచుకుంటుంటారు. చూడాలి ఇంకా ఎలాంటి చాలెంజ్లను మనం చూడాల్సి వస్తుందో! -
ఎడారిలో బందీ
అల్గునూర్: ఉన్న ఊరిలో ఉపాధి కరువై గల్ఫ్ బాట పట్టిన కరీంనగర్ వాసి ఒకరు దేశం కాని దేశంలో బందీగామారి నరకయాతన అనుభవిస్తున్నాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం మక్తపల్లి గ్రామానికి చెందిన పాలేటి వీరయ్య ఏజెంట్ చేసిన మోసం.. యజమాని (కఫిల్) కర్కశత్వంతో సౌదీలో బందీ అయ్యాడు. వీరయ్యకు భార్య, ఇద్దరు కుమా రులున్నారు. స్థానికంగా సరైన ఉపాధి లేకపోవడం తో భార్య, బిడ్డలను వదిలి గల్ఫ్ వెళ్లాడు. రెండేళ్లుగా యజమాని చెప్పిన పనులు చేస్తున్నాడు. అయితే.. ఇటీవల వీరయ్య తల్లి చనిపోయింది. దీంతో ఊరికి వెళ్తానని బతిమాలుకున్నా షేక్ పంపించలేదు సరికదా వేధింపులు మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు తన ఆవేదనను.. అక్కడ పడుతున్నకష్టాలను సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి వెల్లడించాడు. ఉపాధి నిమిత్తం గతంలో ఖతార్ వెళ్లిన వీరయ్య.. రెండేళ్ల తర్వాత స్వదేశానికి వచ్చాడు. తర్వాత కూడా సొంతూల్లో పనేమీ దొరక్కపోవడంతో సుమారు రూ.1.50 లక్షలు అప్పు చేసి రెండేళ్ల క్రితం మళ్లీ గల్ఫ్ ఏజెంట్ యాదగిరి ద్వారా చిగురుమామిడికి చెందిన తిరుపతితో కలిసి సౌదీ అరేబియా వెళ్లాడు. వ్యవసాయం అని చెప్పిన ఏజెంట్ వీరయ్య, తిరుపతి గల్ఫ్ వెళ్లేందుకు చిగురుమామిడి మండలం ఓగులాపూర్కు చెందిన ఏజెంట్ యాదగిరిని సంప్రదించారు. దీంతో ఆయన పని ఇప్పిస్తానని చెప్పి నమ్మించాడు. సౌదీ అరేబియాలో ఖర్జూర తోట లు చూసుకోవాలని తెలిపాడు. దీనికి అంగీకరించిన వీరిద్దరి వద్ద రూ.1.50 లక్షలు తీసుకున్నాడు. రెండేళ్ల క్రితం తనతోపాటు ఇద్దరినీ సౌదీకి తీసుకెళ్లాడు. అక్కడకి వెళ్లిన తర్వాత షేక్ ఇద్దరినీ అబుదాబికీ 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖాకా ప్రాంతంలో సుమా రు వంద ఒంటెలకు కాపలా ఉండాలని, వాటి బాగోగులు చూసుకోవాలని ఆదేశించారు. ఇందుకు నెలకు రూ.20 వేలు ఇస్తానని చెప్పాడు. లక్షన్నర అప్పు చేసి సౌదీ వెళ్లిన ఇద్దరూ ఇండియాకు తిరిగి రాలేక షేక్ చెప్పిన పనికి అంగీకరించారు. రెండేళ్లుగా ఒంటెల బాగోగులు చూసుకుంటున్నారు. షేక్ ఎప్పుడు టిఫి న్ పంపిస్తే అప్పుడే తింటుండేవారు. ఎంత కష్టమైనా వీసా గడువు ముగిసేవరకు పని చేయాలని నిర్ణయించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ కూడా బాగానే ఉంటున్నామని చెప్పేవారు. తల్లికి కొరివిపెట్టేందుకు రాలేక.. వీరయ్య తల్లి వీరమ్మ 45 రోజుల క్రితం స్వగ్రామం మక్తపల్లిలో చనిపోయింది. కుటుంబసభ్యులు ఫోన్ లో వీరయ్యకు సమాచారం అందించారు. ఇదే విషయాన్ని వీరయ్య తన షేక్కు వెళ్లి చెప్పాడు. తన తల్లికి తలకొరివి పెట్టాలని, ఇండియా పంపించాలని వేడుకున్నాడు. షేక్ మాత్రం ఇందుకు ససేమిరా అన్నా డు. దీంతో వీరయ్య తల్లి కోసం ఇండియా వెళ్లాలని అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన వీసా గడువు కూడా దగ్గర పడుతుందని తెలిపాడు. తనను షేక్ ఇంటికి పంపించడంలేదని తన ఆవేదనను ఫోన్ లో సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. వీరయ్య వస్తాడని కుటుంబ సభ్యులు రెండు రోజులు వీరమ్మకు అంత్యక్రియలు నిర్వహించకుం డా ఎదురు చూశారు. సోషల్ మీడియాలో వీడియో చూసిన తర్వాత అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ క్రమంలో పోలీసులు షేక్ను పిలిపించి ఇండియా పంపాలని సూచించారు. పది రోజుల్లో పంపిస్తానని ఆ షేక్ పోలీసుల ముందు అంగీకరించాడు. ఒంటె చనిపోయిందని దాడి పోలీసులకు ఫిర్యాదు చేసిన కొన్ని రోజులకే వీరయ్య కాపలా ఉండేచోట ఓ ఒంటె చనిపోయింది. ఈ విషయం తెలుసుకున్న షేక్ వీరయ్యపై దాడి చేశాడు. ఒంటె నిర్లక్ష్యంతోనే చనిపోయిందని పళ్లు రాలిపోయేంతలా తీవ్రంగా కొట్టాడు. ఈ విషయాన్ని కూడా వీరయ్య తన సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. తనను ఇండియా పంపేందుకు షేక్ అంగీకరించడంలేదని, ఒంటె చనిపోతే తనపై దాడి చేశాడని అం దులో తెలిపాడు. వీరయ్య సెల్ఫీ వీడియో విషయం తెలవడంతో ఆగ్రహించిన షేక్ వెంటనే వీరయ్య సెల్ఫోన్ లాక్కున్నాడు. ఆయన ఎవరితోనూ మాట్లాడకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నాడు. దీంతో నెల రోజులుగా కుటుంబ సభ్యులతో కూడా వీరయ్య మాట్లాడడంలేదు. ఈ క్రమంలో వీరయ్య గతంలో సోషల్ మీడియాలో చేసిన సెల్ఫీ వీడియో పోస్టు ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ వీడియోపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. వీరయ్యను కాపాడాలంటూ.. విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. స్పందించిన కేంద్ర మంత్రి మూడు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీరయ్య వీడియో చూసిన పలువురు దానిని షేర్ చేయడంతో ఈ విషయం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి వెళ్లింది. అధికారులు వీరయ్య కుటుంబం గురించి తెలుసుకుని కొడుకు హరీశ్కు ఫోన్ చేశారు. వివరాలు తెలుసుకున్నారు. విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ కూడా సౌదీలోని భారతీయ రాయబార కార్యాలయ అధికారులతో మాట్లాడారు. వీరయ్యను స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. భారత దౌత్య కార్యాలయం అధికారులు బాధితుడితో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికీ.. వీరయ్యనుంచి స్పందన రాలేదు. కాగా.. వీరయ్య ఆచూకీ కనుక్కునేందుకు సహకరించాలని సౌదీలోని ఎన్నారైలకు మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. మా నాన్నను తీసుకురండి.. ప్లీజ్! మా నాన్న ఏజెంట్ను నమ్మి సౌదీఅరేబియా వెళ్లాడు. వీసా గడువు కూడా రెండేళ్లే. గడువు ముగిసి ఇప్పటికే నెల రోజులైంది. అయినా ఇండియాకు పంపేందుకు షేక్ నిరాకరిస్తున్నాడు. ఈ విషయాన్ని తిరుపతి ఫోన్ నుంచి మాకు ఫోన్ చేసి చెప్పాడు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మా నాన్నను ఎలాగైనా ఇండియాకు క్షేమంగా తీసుకురావాలి. నెల రోజులుగా మాకు ఎలాంటి సమాచారం లేదు. ఎలా ఉన్నాడో తెలియదు. రోజురోజుకూ ఆందోళన పెరుగుతోంది. – హరీశ్, వీరయ్య కొడుకు, మక్తపల్లి