Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్‌ Hyderabad: Three Arrested in a Brothel raid at Jeedimetla | Sakshi
Sakshi News home page

Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్‌

Published Wed, Aug 31 2022 6:56 AM | Last Updated on Wed, Aug 31 2022 6:56 AM

 Hyderabad: Three Arrested in a Brothel raid at Jeedimetla - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వ్యభిచార గృహంపై బాలానగర్‌ ఎస్‌ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళా ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఎస్సై గౌతమ్‌ వివరాల ప్రకారం.. చింతల్‌ వాణీనగర్‌లో సరిత(39), పార్వతి(27)అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్‌ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహితురాళ్లతో పాటు విటుడు బోయిన్‌పల్లికి చెందిన బండి రాజేందర్‌(34)లను అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు.

చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్‌ విద్యార్థితో జంప్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement