-
తండ్రి స్నాప్చాట్ వద్దన్నాడని..16 ఏళ్ల బాలిక సూసైడ్
ఈ మధ్య కాలంలో యువత ఆత్మహత్య ఘటనలు ఎక్కువైపోతున్నాయి. చిన్న చిన్న విషయాలకే కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్ పరీక్షలో ఫెయిల్ అయ్యామని, తల్లిదండ్రులు మందలించారని, ఫోన్ కొనియ్యలేదని, స్నేహితులు అల్లరి చేశారని.. ఇలాంటి చిన్న చిన్న కారణాలతో ప్రాణాలు తీసుకుంటున్నారు.. తాజాగా మహారాష్ట్రలో ఇలాంటి తరహా ఘటనే చోటు చేసుకుంది.ప్రముఖ మెసేజింగ్ యాప్ స్నాన్చాట్ను వాడొద్దని తండ్రి మందలించినందుకు 16 ఏళ్ల బాలిక బలవన్మరణానికి పాల్పడింది. థానే జిల్లాలోని డోంబివిలీ ప్రాంతంలోని శుక్రవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. బాలిక తన ఫోన్లో స్నాప్చాట్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకుంది. ఇది చూసిన ఆమె తండ్రి ఆమెను సున్నితంగా స్నాప్చాట్ను వాడొద్దని సూచించాడు. తండ్రి మాటలకు ఆగ్రహానికి గురైన సదరు బాలిక రాత్రి తన గదిలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఉదయం గది తలుపులు తెరవకపోడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు డోర్లు బద్దలు కొట్టి చూడగా.. అప్పటికే బాలిక ఫ్యాన్కు విగతజీవిగా వేలాడుతూ కనిపించింది. సమాచారం అందుకున్న మాన్పాడ పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు ప్రమాదవశాత్తు మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడి కోసం భర్తను అతి దారుణంగా..
ఇటీవల ఆదిలాబాద్ పట్టణంలోని ఖుర్షీద్నగర్కు చెందిన ఆటో డ్రైవర్ ఖలీల్ తనకు భార్య ఉన్నప్పటికీ మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఇది వరకే పెళ్లి జరిగినా ప్రేమించి రెండో వివాహం చేసుకున్నారు. పదేళ్లలోనే వారి కాపురం కుప్పకూలింది. భార్యపై అనుమానంతో కర్రలతో దాడి చేసి హత్య చేశాడు. ఆమె మరణించగా, భర్త కటకటాల పాలయ్యాడు. మృతురాలి పిల్లలతో పాటు మొదటి భార్య, ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు.ఈ నెల 12న నార్నూర్ మండలం నాగలకొండకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజానంద్ హత్యకు గురయ్యాడు. రెండు రోజుల్లో ఆయన పదోన్నతి పొందనుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆయన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని హత్యకు పన్నాగం పన్నారు. నిండు ప్రాణాన్ని బలిగొన్నారు. ఈక్రమంలో భార్య జైలు పాలు కాగా, కుమారుడు అనాథగా మిగిలాడు. జిల్లా వ్యాప్తంగా ఈ హత్య కలకలం రేపింది.గతేడాది ఆదిలాబాద్ పట్టణంలోని సుందరయ్యనగర్ కాలనీకి చెందిన ఓ వివాహిత భుక్తాపూర్కు చెందిన ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకుంది. విషయం తెలిసిన భర్త పలుసార్లు మందలించాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. తర్వాత ఆ యువకుడితో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన భర్త గుడిహత్నూర్ మండలం సీతాగోంది సమీపంలోని గర్కంపేట వద్ద తన బంధువులతో కలిసి హతమార్చాడు. భార్యతో పాటు యువకుడిని సైతం కర్రతో బాది హత్య చేశారు.ఆదిలాబాద్ పట్టణంలోని రాంనగర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్గా పనిచేస్తూ జీవనం సాగించేవాడు. ఆయన ప్రేమ వివాహం చేసుకొని సంతోషంగా ఉంటున్న సమయంలో వరుసకు బంధువు అయిన ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. కుటుంబీకులకు తెలియకుండా జిల్లా కేంద్రంలోని ఓ ఆలయంలో ఎవరికి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు. దీంతో అమ్మాయి తరఫున వారు కోపోద్రిక్తులై గుడిహత్నూర్ మండలంలోని డంపింగ్ యార్డు సమీపంలోని అటవీ ప్రాంతంలో గతేడాది హతమార్చారు. ఇష్టపడి పెళ్లి చేసుకున్న ఆమెను కాదని మరో యువతితో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతోనే హత్యకు దారి తీసింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలు రోడ్డున పడ్డారు.జిల్లాలో గతేడాది జరిగిన హత్యలు: 18ఈఏడాది (ఇప్పటివరకు) జరిగిన హత్యలు:06ఆదిలాబాద్టౌన్: వివాహేతర సంబంధాలతో బంధాలు తెగిపోతున్నాయి. భార్యపై అనుమానంతో భర్త హత్యకు పాల్పడుతుండగా, మరికొంత మంది మహిళలు ఇతర వ్యక్తులతో సంబంధాలు ఏర్పర్చుకొని విలువైన జీవితాలను బలిగొంటున్నారు. ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే కాటికి పంపుతున్న ఘటనలు జిల్లాలో అనేకం చోటుచేసుకుంటున్నాయి. జీవితాంతం తోడుగా ఉంటానని బాస చేసిన దంపతులు ఈ సంబంధాల కారణంగా లోకానికే దూరమవుతున్నారు. కుటుంబంతో సంతోషంగా ఉంటూ సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టాల్సిన కొంతమంది భార్యభర్తలు వెకిలి చేష్టలకు పాల్పడుతున్నారు. తమ జీవిత భాగస్వామిని మోసం చేస్తూ వివాహేతర సంబంధాలకు ఆకర్షితులవుతున్నారు. ఇందులో పురుషులతో పాటు మహిళలు ఉంటున్నారు. వీరి తప్పిదానికి కుటుంబ పరువు వీధిపాలు కావడంతో పాటు పిల్లల భవిత ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొన్ని బంధాలు విడిపోతుండగా, మరికొందరు తప్పు చేసిన వారిని అంతమొందిస్తున్నారు. దారుణ హత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో ఇరువురి కుటుంబాల్లో విషాదం నెలకొంటుంది. వీరే కాకుండా ప్రేమలో పడిన జంటలు సైతం ఆఘాయిత్యాలకు పాల్పడుతుండం గమనార్హం.హత్యలకు ఒడిగడుతున్నారు..వివాహేతర సంబంధాలతో జిల్లాలో హత్యలు పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకు ఆరు ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇందులో ఇటీవల చోటు చేసుకున్న రెండు ఘటనలు జిల్లాలో సంచలనం రేపాయి. బాధిత కుటుంబాల్లో తీరని విషాదం నింపాయి. ఒకరు రెండో భార్యపై అనుమానంతో హత్య చేయగా.. ఓ ఉపాధ్యాయుడి భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పర్చుకొని భర్తనే కడతేర్చింది. ఇంకొంత మంది ప్రేమికులు, కొంతమంది వివాహేతర సంబంధాల కారణంగా వారి కుటుంబీకులు, బంధువులు హత్యలకు పాల్పడుతుండగా, దంపతుల్లో ఎవరో ఒకరు అవమానాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు ఒడిగడుతున్నారు. పెరుగుతున్న టెక్నాలజీ కారణంగా చెడుదారులకు ఆకర్షితులై ఇలాంటి ఘటనలకు కారణమవుతున్నాయి. తరచూ ఫోన్లో మాట్లాడడాన్ని గ్రహించడంతో భార్య భర్తల మధ్య గొడవలు చోటుచేసుకొని కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. ఇదిలా ఉండగా మద్యం, గంజాయి మత్తులో సైతం కొంత మంది హత్యలకు పాల్పడుతున్నారు. క్షణికావేశంతో విలువైన జీవితాలను గాలిలో కలుపుతున్నారు. దంపతుల్లో ఒకరు తప్పు చేస్తే వారిని హతమార్చడానికి పన్నాగం పన్నుతుండగా, ప్రేయసి ప్రియుడితో కలిసి భర్తను కడతేర్చేందుకు సైతం వెనుకాడటం లేదు.ఇష్టం లేకుంటే విడిపోవాలిదంపతుల్లో చాలా వరకు అనుమానాలతోనే హత్యలు జరుగుతున్నాయి. ఇష్టం లేనప్పుడు విడిపోవడం మంచిది. పోలీస్స్టేషన్లలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లు అందుబాటులో ఉన్నాయి. స్టేషన్కు వచ్చి కౌన్సెలింగ్ తీసుకోవాలి. అవసరమైతే ఫిర్యాదు చేయాలి. చట్టప్రకారం చర్యలు తీసుకోబడతాయి. కోర్టును ఆశ్రయించాలి. అంతే తప్పా విలువైన ప్రాణాలను తీయడం సరికాదు. రెండు కుటుంబాల్లో విషాదచాయలు అలుముకుంటాయి. పిల్లల భవిష్యత్తు అంధకారంగా మారుతుంది. క్షణికావేశంతో తీసుకున్న నిర్ణయంతో జీవితాంతం బాధపడాల్సి వస్తుంది.– ఎల్.జీవన్రెడ్డి, డీఎస్పీ, ఆదిలాబాద్ -
యువకుడిపై దాడి కేసులో నిర్లక్ష్యం..
నాగోలు: దళిత యువకుడిపై దాడి కేసులో పోలీసులు స్పందించలేదు. బాధితుడు తీవ్ర గాయాలపాలై హాస్పిటల్లో చికిత్స పొందిన అనంతరం ఠాణాను ఆశ్రయించినా నిర్లక్ష్యం వహించిన నాగోలు ఇన్స్పెక్టర్ పరశురాంపై రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోసి బదిలీ వేటు వేశారు. ఇదే కేసులో నాగోలు ఎస్ఐ మధు, ఏఎస్ఐ అంజయ్యపై అధికారులు చర్య తీసుకునే అవకాశం ఉందని సమాచారం. కాగా.. నాగోలు ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా ఎల్బీనగర్ డీఐ సుధాకర్ను నియమించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఎల్బీనగర్లోని భరత్నగర్ కాలనీకి చెందిన దాసరి గౌతమ్ అలియాస్ బద్దు (20) ప్రైవేట్ ఉద్యోగి. నాగోలు సాయినగర్ కాలనీలో నివాసం ఉండే వేముల మల్లేష్ అతని కుమారుడు (16), గౌతమ్ల మధ్య గతంలో గొడవ జరిగింది. ఈ నేపథ్యంలో గౌతమ్ను అంతం చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 6న నాగోలు సాయినగర్ కాలనీలో స్నేహితుడి ఇంట్లో నిద్రస్తున్న గౌతమ్పై మల్లేష్, నరేష్ అనిల్, జ్యోతి, నాగరాజు, పవన్కుమార్, మరో ఇద్దరు మైనర్లు దాడి చేశారు. భవనం పైఅంతస్తు నుంచి కిందకు లాక్కు వచ్చి రాయి, కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో గౌతమ్కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం టెలిఫోన్ స్తంభానికి కట్టేసి కర్రలతో విచక్షణారహితంగా దాడి చేశారు. గౌతమ్ మృతి చెందినట్లు భావించి నిందితులు అక్కడి నుంచి వెళ్లి పోయారు. అనంతరం గాయపడిన గౌతమ్ను కుటుంబ సభ్యులు అంబులెన్స్లో ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. బాధితుడు గౌతమ్ తనపై జరిగిన దాడిపై ఈ నెల 21న నాగోలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కానీ.. ఇన్స్పెక్టర్ పరశురాం స్పందించలేదు. దీంతో బాధితుడు తగిన ఆధారాలతో ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఈ నెల 22న ఏడుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఇద్దరు జువైనల్ అఫెండర్లను హోంకు తరలించారు.ఉప్పల్ ఎస్ఐపై కూడా.. ఉప్పల్: విధుల్లో నిర్లక్ష్యం వహిస్తూ, పోకరీలతో అంటకాగుతున్నాడనే ఆరోపణలను ఎదుర్కొంటున్న ఉప్పల్ ఎస్ఐ సీహెచ్ శంకర్పై రాచకొండ సీపీ సస్పెన్షన్ వేటు వేశారు. ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ ఆదివారం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. వివరాలు ఇలా ఉన్నాయి. ఉప్పల్ భగాయత్ లే అవుట్లో ప్రేమ జంట ఇచి్చన ఫిర్యాదుపై ఉప్పల్ ఎస్ఐ కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం వహించాడని, ఇందుకోసం భారీగా ముడుపులు తీసుకున్నట్లు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీస్ ఉన్నతాధికారులు శనివారం ఉప్పల్ ఎస్ఐ శంకర్పై విచారణకు ఆదేశించి, ఆదివారం శంకర్ను సస్పెండ్ చేస్తూ రాచకొండ సీపీ ఆదేశాలు జారీ చేశారు. ఎస్ఐతో పాటు ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డిని రాచకొండ సీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్గా డీఐ మన్మథరావును నియమించారు. -
గురి తప్పింది..! బైక్ టైర్ను కాల్చబోతే స్నాచర్ కాలిలోకి తూటా
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్లోని సిటీలైట్ హోటల్ వద్ద యాంటీ స్నాచింగ్ టీమ్ పోలీసులు.. పారిపోతున్న స్నాచర్ల బైక్ టైర్ను కాల్చాలని ప్రయతి్నంచినట్లు టాస్్కఫోర్స్ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్ ప్రకటించారు. ఆ తూటా బైక్ వెనుక కూర్చున్న నేరగాడి కాలులోకి దూసుకుపోయినట్లు వివరణ ఇచ్చారు. గురువారం తెల్లవారుజామున చోటు చేసుకున్న ఉదంతంలో తప్పించుకున్న ఇద్దరు స్నాచర్లను పట్టుకున్నట్లు ఆదివారం టాస్్కఫోర్స్ డీసీపీ పేర్కొన్నారు. రెండు ‘పనులు’ చేస్తున్నా చాలక.. ఫలక్నుమాలోని అన్సారీ రోడ్ ప్రాంతానికి చెందిన మసూద్ ఉర్ రెహా్మన్ పదో తరగతితో చదువుకు స్వస్తి చెప్పాడు. బతుకుతెరువు కోసం వెల్డర్గా, క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఈ రెండు పనుల్లోనూ వచ్చే ఆదాయం విలాసాలకు సరిపోకపోవడంతో తేలిగ్గా డబ్బు సంపాదించడంపై దృష్టి పెట్టాడు. దీనికోసం దోపిడీలు, చోరీలు చేయాలని పథకం వేశాడు. నాచారం, మైలార్దేవ్పల్లిల్లో మూడు నేరాలు చేసి జైలుకు వెళ్లాడు. ఈ కేసుల్లో బెయిల్పై బయటకు వచి్చన ఇతడి వ్యవహార శైలి మారలేదు. మసూద్ తరచూ ముషీరాబాద్లో ఉండే తన బంధువు ఇంటికి వెళ్లేవాడు. అక్కడే ఇతడికి స్క్రాప్ వ్యాపారం చేసే ఫజల్ ఉర్ రెహ్మాన్తో పరిచయం ఏర్పడింది. వాహనంపై తిరుగుతూ వరుస నేరాలు.. సెల్ఫోన్ స్నాచింగ్స్ చేయాలని నిర్ణయించుకున్న మసూద్ తనకు సహకరించాల్సిందిగా ఫజల్ను కోరాడు. దీనికి అతడు అంగీకరించడంతో ఇద్దరూ రెండు కత్తుల్ని దగ్గర పెట్టుకుని బుధవారం రాత్రి ద్విచక్ర వాహనంపై బయటకు వచ్చారు. తొలుత చాదర్ఘాట్లోని ఓ బార్ వద్ద ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశారు. ఈ వాహనాన్ని అదును చూసుకుని విక్రయించాలని భావించారు. అప్పటి వరకు భద్రంగా ఉంచడం కోసం భోలక్పూర్ వరకు తీసుకువెళ్లి ఓ ప్రాంతంలో దాచారు. అదే రాత్రి అట్నుంచి వీరిద్దరు సికింద్రాబాద్ వైపు వెళ్లారు. గురువారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలోని గణేష్ టెంపుల్ వద్ద ఓ వ్యక్తి వీరికి కనిపించాడు. కత్తులతో బెదిరించి సెల్ఫోన్ దోపిడీ.. అతడిని అడ్డుకున్న వీరిద్దరు సెల్ఫోన్ గుంజుకోవడానికి ప్రయతి్నంచారు. బాధితుడు ఎదురు తిరగడంతో వాహనం దిగిన ఇరువురూ కత్తులతో బెదిరించి ఫోన్ లాక్కున్నారు. అక్కడి నుంచి తమ వాహనంపై క్లాక్ టవర్ వైపు వెళ్తూ తమ చేతిలో ఉన్న కత్తుల్ని చూపిస్తూ పాదచారులకు భయభ్రాంతులకు గురి చేశారు. ఇటీవల నగరంలో చోటు చేసుకున్న నేరాల నేపథ్యంలో యాంటీ స్నాచింగ్ టీమ్స్ రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తున్నాయి. పాదచారుల అరుపులు సమీపంలో పెట్రోలింగ్ చేస్తున్న బృందం చెవిన పడ్డాయి. అప్రమత్తమైన పోలీసులు ఆ ఇద్దరి వద్దకు చేరుకుని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. మసూద్, ఫజల్ కత్తులు చూపిస్తూ పోలీసులను కూడా బెదిరించారు. పట్టుకునే ప్రయత్నాల్లో కాల్పులు.. అక్కడి నుంచి పారిపోతున్న ఇద్దరు నిందితులను యాంటీ స్నాచింగ్ టీమ్ వెంబడిస్తూ పోయింది. బాటా షోరూమ్ వద్ద మరో పాదచారి నుంచి ఫోన్ స్నాచింగ్ చేయడానికి వీళ్లు ప్రయతి్నంచి సిటీ లైట్ హోటల్ వద్దకు చేరుకున్నారు. వీరి వ్యవహారశైలిని గమనించిన ఇద్దరు పోలీసులూ పట్టుకోవడానికి చేసిన ప్రయత్నాల్లో భాగంగా వారి వాహనం ఆపాలని నిర్ణయించుకున్నారు. దీనికోసం తమ వద్ద ఉన్న తుపాకీతో దాని టైర్పై గురిచూసి కాల్చారు. ఈ తూటా వాహనం వెనుక కూర్చున్న నేరగాడి కాలిలోకి దూసుకుపోయింది. మరో తూటా పేలి్చనా ఫలితం లేకపోవడంతో ఇద్దరూ వాహనంపై పారిపోయారు. టాస్్కఫోర్స్, నార్త్జోన్ పోలీసులు ముమ్మరంగా గాలించి ఇద్దరినీ పట్టుకున్నారు. వీరి నుంచి చోరీ సొత్తు, కత్తులు స్వా«దీనం చేసుకున్నారు. -
కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్య?
చిల్పూరు: జనగామ జిల్లా చిల్పూరు మండలం రాజవరం సమీపంలోని కేజీబీవీలో 9వ తరగతి విద్యారి్థని ఇస్లావత్ వర్షిణి (14) అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. అయితే బాలిక ఆత్మహత్య చేసుకుందని భావిస్తున్నారు. కుటుంబ సభ్యులు, పాఠశాల వర్గాలు, ఎస్సై ముత్యం రాజేందర్ కథనం ప్రకారం.. రాజవరం జీపీ పరిధి ఫకీర్తండాకు చెందిన ఇస్లావత్ తీరమ్మ, కిషన్ దంపతుల కూతురు వర్షిణిని శుక్రవారం కేజీబీవీలో 9వ తరగతిలో చేరి్పంచారు.అదే రోజు సాయంత్రం భోజనం పెట్టే సమయంలో వర్షిణి రాకపోవడంతో ఎస్ఓ పిలవగా.. ఆకలిగా లేదని సమాధానం చెప్పింది. ఆ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయిన వర్షిణి, శనివారం ఉదయం మేల్కొనలేదు. గదులు శుభ్రం చేసేందుకు వచి్చన సిబ్బంది పలకరించినా సమాధానం రాకపోవడంతో ఆమె కప్పుకున్న దుప్పటి తీయగా వాంతులు చేసుకున్నట్లు గమనించారు. పక్కన కూల్డ్రింక్ బాటిల్ కనిపించడంతో అనుమానంతో ఇన్చార్జి స్పెషల్ ఆఫీసర్ (ఎస్ఓ) సోనికి తెలియజేయగా బాలిక తల్లిదండ్రులతోపాటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముందుగా వర్షిణిని స్టేషన్ఘన్పూర్ ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స చేసి వరంగల్ ఎంజీఎంకు పంపించారు. అక్కడ చికిత్స పొందుతూ వర్షిణి ఆదివారం ఉదయం మృతి చెందింది. ఇష్టం లేదని చెప్పింది.. : ఎస్ఓ ఈ విషయమై ఇన్చార్జి ఎస్ఓ సోని మాట్లాడుతూ, శుక్రవారం వర్షిణి విద్యాలయంలో చేరిన సమయంలో తనకు హాస్టల్లో ఉండడం ఇష్టం లేదని చెప్పిందని వెల్లడించారు. ఈ విషయాన్ని బాలిక తల్లి దృష్టికి తీసుకెళ్లామని, ఆమె కూడా అదే విషయాన్ని చెప్పారని అన్నారు. ఒకటి రెండు రోజుల్లో సర్దుకుంటుందని ఆమె అన్నారని తెలిపారు.కాగా, బాలిక వెంట తెచ్చుకున్న కూల్డ్రింక్లో పురుగు మందు కలిపి తెచ్చుకుని ఉంటుందని అనుమానిస్తున్నారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బాలిక మరణానికి కారణాలు ఆస్పత్రి వర్గాల పూర్తి నివేదిక వచ్చాక తెలుస్తుందని వారు చెప్పారు. ఇదిలా ఉండగా.. తన తండ్రి మద్యం తాగినప్పుడల్లా తల్లిని కొడుతుంటే అడ్డుగా ఉండేదానినని.. తనను హాస్టల్లో చేర్పిస్తే గొడవ జరిగినప్పుడు ఎవరు ఆపుతారని వర్షిణి సిబ్బందితో అన్నట్లు తెలిసింది. -
తెల్లవారితే పెళ్లి చూపులు.. అంతలోనే మృత్యు ఒడికి..
బంజారాహిల్స్: మరుసటి రోజే ఆ యువకుడికి పెళ్లి చూపులు.. ఉదయంలోగా ఇంటికి వెళ్లేందుకు బైక్పై బయలుదేరాడు. అతివేగంతో వచి్చన టిప్పర్ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం వివరాలు.. వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన కృష్ణమ్మ, సుధాకర్ దంపతుల కుమారుడు శివశంకర్ (30) రాయదుర్గం సమీపంలోని అడాప్్ట్స ఐటీ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. దుర్గం చెరువు సమీపంలోని ఓ హాస్టల్లో ఉంటున్నాడు. ఆదివారం పెళ్లి చూపులు ఉండటంతో శనివారం అర్ధరాత్రి మాదాపూర్ నుంచి బైక్పై స్వగ్రామానికి బయలుదేరాడు. రెండు నెలల క్రితమే ఎంతో ముచ్చటపడి కొనుక్కున్న బుల్లెట్ బైక్పై హెల్మెట్ ధరించి జూబ్లీహిల్స్ అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో వెళ్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి అతివేగంతో వచి్చ న టిప్పర్ శివశంకర్ బైక్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ను పోలీసులు గుర్తించారు. డ్రైవర్ పరారయ్యాడు. మరికొన్ని గంటల్లో స్వగ్రామంలో ఉండాల్సిన శివశంకర్ విగత జీవిగా మారడంతో విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు, బంధుమిత్రులు పోలీస్స్టేషన్ ఆవరణలో కన్నీరుమున్నీరుగా విలపించారు. ఇంటికి బాధ్యతలను మోస్తున్న శివశంకరే కన్నుమూయడంతో కన్నవారు గుండెలవిసేలా రోదించారు. పెళ్లి చూపుల కోసం ఏర్పాట్లు చేసుకునే క్రమంలో ఈ దుర్ఘటన జరగడంతో శివశంకర్ పని చేస్తున్న సంస్థలో, స్వగ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తల్లడిల్లుతున్న పేగుబంధం..
ఖమ్మం: రెక్కాడితే కాని డొక్కాడని ఆ కుటుంబాన్ని ఓ ప్రమాదం కోలుకోలేని దెబ్బతీసింది. చేతికి అందివచ్చిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అచేతన స్థితికి చేరగా.. కుటుంబానికి పెద్ద దిక్కయిన తండ్రి వడదెబ్బతో మృతిచెందాడు. మరో కొడుకు ఉపాధి లేక చిన్న చిన్న పనులు చేస్తున్నా కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత తల్లిపై పడటంతో ఏంచేయాలో పాలుపోని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇప్పటికే రోడ్డుప్రమాదంలో గాయపడిన కుమారుడికి చికిత్స కోసం రూ.22 లక్షల మేర అప్పు చేసిన ఆ కుటుంబం తండ్రి మృతితో మరింత కష్టంలో పడిపోయింది.రోడ్డు ప్రమాదంలో గాయపడి..ఖమ్మం నగరంలోని 16వ డివిజన్ కొత్తూరు గ్రామానికి చెందిన వల్లెపు నరసింహారావు, నళిని దంపతులకు ఇద్దరు కొడుకులు. వీరిలో వల్లెపు అవినాష్ గతేడాది నవంబర్ 8న ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. కుక్క అడ్డు రావడంతో తప్పించబోయి ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో అతను తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లాడు. అవినాష్ను చికిత్స కోసం హైదరాబాద్లోని పలు ఆస్పత్రులకు తిప్పారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇప్పటి వరకు బంధువులు, తెలిసిన వారి వద్ద రూ.22 లక్షల వరకు అప్పులు చేసి అతని చికిత్సకు ఖర్చు చేశారు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉన్న ఆయన వైద్యానికి రోజుకు రూ.10 వేలు ఖర్చు అవుతోంది.వడదెబ్బతో తండ్రి..ఇదే పరిస్థితితో ఇబ్బందులు పడుతుండగా.. యజమాని నరసింహారావు కూడా మరణించాడు. ఎండల్లో పనిచేయడంతో వడదెబ్బకు గురై ఈ నెల 6న మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. ఒక పక్క కొడుకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి ఉండగా.. ఇలా భర్త అర్ధాంతరంగా ముగియడంతో ఆమె గుండె పగిలింది. ఇక మరో కొడుకు అభిలాష్ హైదరాబాద్లో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. అది ఖర్చుల వరకు కూడా సరిపోవడం లేదని నళిని వాపోయింది. ప్రస్తుతం నళిని కూలీ పనులకు వెళ్తూ నెట్టుకొస్తోంది. తమను ఆదుకోవాలని వేడుకుంటోంది. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు 79896 32983 నంబర్లో సంప్రదించాలని బంధువులు కోరారు. -
పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య.. కన్నుమూత!
ఖమ్మం: కంచుమేళం శాశ్వతంగా ఆగిపోయింది. ఆదివాసీ సంప్రదాయ కళల రక్షకుడు, మణుగూరు మండలం బావికూనవరం గ్రామానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సకిని రామచంద్రయ్య (65) తుదిశ్వాస విడిచారు. అంతరించిపోతు న్న గిరిజన కళలను కాపాడుతూ, కాలినడకన మారుమూల గ్రామాల్లో తిరుగుతూ భవిష్యత్ తరాలకు అందించిన జానపద కళాకారుడు, డోలు వాయిద్య కారుడు అయిన రామచంద్రయ్య కొంతకాలంగా గొంతు సంబంధిత సమస్యతో బాధపడుతూ మృతి చెందారు.రెండు తెలుగు రాష్ట్రాల్లో కంచుతాళం, కంచుమేళంతో ఆదివాసీ కథలు అలవోకగా, కళ్లకు కట్టినట్లు వివరించగలగిన ఏకైక కళాకారుడు రామచంద్రయ్య మృతిపట్ల మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ ్వరరావు సంతాపం తెలిపారు.కుటుంబ సభ్యులకు కలెక్టర్ హామీ..భద్రాద్రి కలెక్టర్ జితేష్ వి.పాటిల్ కూనవరంలోని రామచంద్రయ్య మృతదేహాన్ని సందర్శించారు. కుటుంబసభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఆర్థిక సాయం, స్థలం సమస్య ప్రస్తావించగా, పరిశీలించి సమస్య పరిష్కరిస్తానని, అంత్యక్రియల అనంతరం తన వద్దకు రావాలని కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చారు.అందని నాటి ప్రభుత్వ సాయం..సకిని రామచంద్రయ్య వనదేవతల వీరగాథలు చెప్పడంతో పాటు రెండేళ్లకోసారి వచ్చే ఆదివాసీ జాతరైన సమ్మక్క సారలమ్మ, పగిడిద్ద రాజుల వంటి దేవరుల కథను కళ్లకు కట్టినట్లుగా గానం చేయడంతో పాటు సమ్మక్క సారలమ్మ తల్లులను గద్దెల వద్దకు తీసుకు వచ్చే క్రమంలో కీలకంగా వ్యవహరిస్తారు. అంతరించిపోతున్న ఆదివాసీ కళలను కాపాడుతున్న తీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2022 జనవరి 25న పద్మశ్రీ అవార్డు అందజేసింది.అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ చేతుల మీదుగా సత్కరించింది. ఆ వెంటనే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.కోటి ఆర్థికసాయంతో పాటు 426 చదరపు గజాల ఇంటి స్థలం అందిస్తామని ప్రకటించింది. కానీ ఇవ్వలేదు. అనారోగ్యంతో ఉన్న తనకు ఆర్థిక సాయం అందించి, కాపాడాలని కలెక్టరేట్ చుట్టూ తిరిగినా, అధికారులకు విన్నవించినా మోక్షం కలగలేదు. కళాకారులకు అందించే రూ.10 వేల పింఛన్ అందించడంలోనూ జాప్యం జరిగింది.పలుమార్లు కలెక్టర్లకు విన్నవించి నా ఆర్థికసాయం ట్రెజరీ నుంచి రావాలంటూ సమాధానం రావడంతో వైద్య పరీక్షలకు అప్పులు చేసి రూ.4 లక్షలతో వైద్యం చేయించుకున్నారు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికల ప్రచార సమయంలో మణుగూ రు వచ్చిన రాష్ట్ర మంత్రి ధనసరి సీతక్కను కలిసి న్యాయం చేయాలని వేడుకోగా.. ఆమె ఆర్థిక సా యం అందించారు. ఎన్నికల కోడ్ ముగిశాక కలవా లని సూచించగా, ఆయన కుటుంబ సభ్యులు ఈ నెల 21న మళ్లీ సీతక్కను కలిశారు. దీంతో నాలుగైదు రోజుల్లో చెక్కు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. కాగా ఈ లోపే రామచంద్రయ్య మృతి చెందారు.జానపద కళకు తీరని లోటు: భట్టిఖమ్మంవన్టౌన్ : అంతరించిపోతున్న డోలు వాయిద్యానికి జీవం పోసి గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడిన పద్మశ్రీ సకిని రామచంద్రయ్య మృతి జానపద కళకు తీరని లోటని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారసత్వంగా వచ్చిన గిరిజన సంప్రదాయ కళను జీవనాధారంగా చేసుకొని డోలు వాయిద్యానికి దేశవ్యాప్తంగా గుర్తింపు సాధించి పెట్టారని కొనియాడారు. రామచంద్రయ్య కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరం..ఖమ్మంమయూరిసెంటర్: కోయ అధ్యయన వేదిక ఆత్మీయ మిత్రుడు, సమ్మక్క సారలమ్మ తదితర కోయ వీరపురుషుల కథా గాయకుడు, పద్మశ్రీ పురస్కార గ్రహీత సకిని రామచంద్రయ్య ఆర్థిక ఇబ్బందులతో మరణించడం బాధాకరమని ప్రముఖ కవులు పద్దం అనసూయ, డాక్టర్ గూడూరు మనోజ, జయధీర్ తిరుమలరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన వయసు పైబడి మరణించలేదని, గత ప్రభుత్వం ఇస్తామన్న రూ. కోటి ఆర్థిక సాయం నేటికీ అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కోయ ఆదివాసీ కళాకారుడు ఇలాంటి స్థితిలో మృతిచెందడం కలచి వేస్తోందని తెలిపారు. -
అతనికి 40..ఆమెకు 19
తుమకూరు : అతనికి 40 సంవత్సరాలు.. పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే 19 సంవత్సరాల యువతిని ఆకర్షించి వెంట తీసుకెళ్లాడు. ఏం జరిగిందో ఏమో ఆ యువతి చెరువులో శవమై తేలింది. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈఘటన తుమకూరు జిల్లా కొరటిగెరె తాలూకా మావత్తురుగ్రామంలో వెలుగు చూసింది. ఇదే తాలూకా కోళాల సమీపంలోని బైరగొండ్లు గ్రామానికి చెందిన రంగశ్యామయ్య(40), లక్ష్మయ్యన పాళ్య గ్రామానికి చెందిన ఆనన్య(21)లు ప్రేమికులు. రంగశ్యామయ్యకు ఇప్పటికే వివాహమైంది. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అనన్య బీకాం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయం అనన్య ఇంట్లో తెలిసింది. రంగశ్యామయ్యను వివాహం చేసుకుంటానని అనన్య పేర్కొనగా కుటుంబ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. పెళ్లి జరిగిన వ్యక్తితో వివాహం ఏమిటని మందలించారు. ఈక్రమంలో ఈ జంట మూడు రోజుల క్రితం ఊరు విడిచి వెళ్లింది. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మావత్తురు చెరువులో మహిళ శవం తేలియాడుతుండగా స్థానికులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు వెళ్లి పరిశీలించగా అనన్యగా గుర్తించారు. గట్టుపై ఇద్దరి పాదరక్షలు, కారు ఉన్నాయి. వీరిద్దరూ కారులో సంచరించినట్లు అనుమానిస్తున్నారు. రంగశ్యామయ్య కూడా ఇదే చెరువులో దూకి ఉంటాడని భావించి మృతదేహం కోసం అగ్నిమాపక సిబ్బంది గాలింపు చేపట్టారు. అనన్య మృతదేహాన్ని శవపరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. -
వేధించినందుకే.. కిరాతకంగా హతమార్చారు!
కరీంనగర్: వేధించినందుకే కరీంనగర్ జిల్లా మానకొండూర్కు చెందిన అనంతోజు సాయికిరణ్(29)ను ఆసిఫాబాద్ జిల్లాకు చెందిన దంపతులు హతమార్చారని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. మానకొండూర్ మండల కేంద్రానికి చెందిన సాయికిరణ్ తన భార్య అనూషతో కలిసి గతంలో సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం కొండాపూర్లోని ఓ కోళ్ల ఫారంలో పని చేసేవాడు.అక్కడే పని చేస్తున్న ఆసిఫాబాద్ జిల్లా బెజ్టూర్ మండలం బరెగూడకు చెందిన బట్టి శ్రీనివాస్, అతని భార్య సునీతతో సాయికిరణ్కు పరిచయం ఏర్పడింది. దాన్ని ఆసరాగా చేసుకొని అతను సునీతతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఈ విషయమై శ్రీనివాస్, సాయికిరణ్ మధ్య గొడవలు జరిగాయి. తర్వాత సాయికిరణ్ తన భార్యతో కలిసి స్వగ్రామం వచ్చి, కట్టె కోత మెషిన్ పనిలో చేరాడు. తన భర్త గత ఏప్రిల్ 18న పనిమీద వెళ్తున్నానని వెళ్లి, తిరిగి రాలేదని అనూష పోలీసులకు ఫిర్యాదు చేసింది.వారు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సాయికిరణ్ గతంలో పని చేసిన కోళ్ల ఫారంకే వెళ్లాడని, అక్కడ శ్రీనివాస్, సునీతతో గొడవ పడ్డాడని, అతనికి గాయమైందని ఫారం యజమాని ఫోన్ ద్వారా అనూషకు సమాచారం ఇచ్చాడు. ఈ గొడవతో శ్రీనివాస్ దంపతులు కోళ్ల ఫారం నుంచి తమ స్వగ్రామం వెళ్లిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.అయినా, సాయికిరణ్ సునీతకు ఫోన్ చేస్తూ వేధించసాగాడు. దీంతో వారు విసిగిపోయి, అతన్ని చంపేయాలని పథకం వేశారు. శ్రీనివాస్ తన భార్య సునీతతో సాయికిరణ్కు ఫోన్ చేయించి, ఏప్రిల్ 19న దహెగాంకు పిలిపించాడు. మరో ఇద్దరితో కలిసి, కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి, హతమార్చారు. అనంతరం సాయికిరణ్ మృతదేహాన్ని అక్కడే వ్యవసాయ బావిలో పడేసి, మహారాష్ట్ర పారిపోయారు.పోలీసులు దాదాపు 2 నెలలు శ్రమించి, ఈ కేసులో ఎ–1 బట్టి శ్రీనివాస్, ఎ–2 సునీత, ఎ–3 తమ్మిడి గంగారాం, ఎ–4 భీమంకర్ శ్యామ్రావులను శనివారం అరెస్టు చేశారు. వారిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చారు. 15 రోజుల కస్టడి విధించడంతో జైలుకు పంపినట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న మానకొండూర్ సీఐ రాజ్కుమార్ను, పోలీసు సిబ్బందిని అభినందించారు. -
సూపర్ పోలీస్
సాక్షి, హైదరాబాద్: ‘మెడలో లావుపాటి బంగారం గొలుసు వేసుకొని, ఫోన్ మాట్లాడుతూ ఎంచక్కా రోడ్డు మీద నడుచుకుంటూ వెళుతున్నాడు ఓ బాటసారి. వెనకాలే బైక్ మీద వచ్చిన ఇద్దరు స్నాచర్లు అతని మెడ మీద నుంచి చెయిన్ను స్నాచింగ్ చేసే ప్రయత్నం చేయగా.. వెంటనే బైక్ వెనకాల నుంచి బుల్లెట్ పేలింది. అంతే బైక్ వెనక కూర్చున్న స్నాచర్ కాలిలో బుల్లెట్ దిగింది. ఏం జరుగుతుందో అర్థం కాని స్నాచర్ల బైక్ రేస్ పెంచి అక్కణ్నుంచి ఉడాయించారు’... ఇదీ స్నాచర్లను పట్టుకునేందుకు హైదరాబాద్ పోలీసులు వేసిన ప్లాన్. ఇటీవల కాలంలో నగరంలో ధార్, బవారియా గ్యాంగ్ల వరుస చెయిన్ స్నాచింగ్ల నేపథ్యంలో సిటీ పోలీసులు స్నాచర్ల కోసం వల వేశారు. స్థానిక ఠాణా, సీఆర్ హెడ్ క్వార్టర్స్ పోలీసులతో యాంటీ స్నాచింగ్ డెకాయ్ టీమ్లను ఏర్పాటు చేశారు.ముందు చెయిన్, వెనక తుపాకీ..సిటీలోని ప్రతి పోలీసు స్టేషన్, సీఆర్ హెడ్ క్వార్టర్స్ నుంచి ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురితో ఈ టీమ్ ఉంటుంది. ఠాణాకు చెందిన పోలీసు మఫ్టీ డ్రెస్లో మెడలో చెయిన్ వేసుకొని, బయటికి కనిపించేలా రోడ్డు మీద ఫోన్ మాట్లాడుతూ వెళ్తుంటాడు. ఇతనికి కాస్త దూరంలో తుపాకీతో సీఆర్ హెడ్ క్వార్టర్ పోలీసు నిఘా పెడుతూ నడుస్తుంటాడు. వీరిని సామాన్యులుగా భావించిన స్నాచర్లు స్నాచింగ్ చేసేందుకు వీరిని వెంబడిస్తారు. స్నాచింగ్ చేసే క్రమంలో పోలీసులు అప్రమత్తమై నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. ఒకవేళ వారు పారిపోయేందుకు ప్రయత్నిస్తే.. వెనకాల తుపాకీతో గస్తీ కాస్తున్న పోలీసు వెంటనే నిందితులపై కాల్పులు జరుపుతారు.రెండు చోట్ల కాల్పులు, ఏడుగురు అరెస్టు..ఈ క్రమంలో శుక్రవారం రాత్రి చిలకలగూడ పీఎస్ పరిధిలోని ఆలుగడ్డ బావి ప్రాంతంలో మెడలో చెయిన్ వేసుకొని పోలీసులు వెళుతుండగా.. వెనక నుంచి ఇద్దరు స్నాచర్లు బైక్ వచ్చి స్నాచింగ్ చేసేందుకు ప్రయత్నించారు. దీంతో వెనక నుంచి మరో పోలీసు కాల్పులు జరపడంతో ఓ స్నాచర్కు కాలులో బుల్లెట్ దిగింది. గాయంతోనే బైక్ మీద పారిపోయిన ఇద్దరు నిందితులను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. ఇదే తరహాలో శనివారం మార్కెట్ స్టేషన్ పరిధిలోని బాట వద్ద స్నాచింగ్ చేసేందుకు వచ్చిన రెండు బృందాలపై పోలీసులు కాల్పులు జరిపి, ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఐదుగురు ఇచ్చిన సమాచారంతో మరో ఇద్దరు స్నాచర్లను పోలీసులు పట్టుకున్నారు. మొత్తం ఏడుగురిని అరెస్టు చేసి, విచారిస్తున్నారు. శనివారం నుంచి టాస్క్ఫోర్స్ పోలీసులలో ఏర్పాటు చేసిన ‘ఆపరేషన్ ఛబుత్రా’ టీమ్స్ పని చేయనున్నాయి. అర్థరాత్రి వీధుల్లో తిరిగే ఆకతాయిలను ఈ బృందాలు పట్టుకొని, కౌన్సెలింగ్ ఇస్తాయి. -
ఫలక్నుమాలో యువకుడి దారుణ హత్య
చాంద్రాయణగుట్ట: గత కొన్ని రోజులుగా పాతబస్తీలో వరుస హత్యలు స్థానికులను కలవరానికి గురి చేస్తున్నాయి. ముఖ్యంగా ఫలక్నుమా, ఛత్రినాక ఏసీపీ డివిజన్ల పరిధిలో వరుసగా దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. శాలిబండ, ఛత్రినాక పోలీస్స్టేషన్ల పరిధిలో వారం వ్యవధిలో జరిగిన ఘటనలు మరువక ముందే తాజాగా ఫలక్నుమా ఠాణా పరిధిలో ఓ యువకుడి హత్యోదంతం చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధంతో పాటు మహిళను వేధింపులకు గురి చేస్తుండడంతో బాధితురాలు సోదరుడు ఓ యువకుడిని హతమార్చిన ఘటన ఫలక్నుమా పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బహదూర్పురా హసన్నగర్కు చెందిన డ్రైవర్ జాకీర్ అలీ (29)కి అయిదేళ్ల క్రితం ఫలక్నుమా అచ్చిరెడ్డి నగర్కు చెందిన ఓ మహిళతో ఏర్పడిన పరిచయం వివాహేతర సంబంధానికి దారి తీసింది. సదరు మహిళకు అప్పటికే భర్త, అయిదుగురు పిల్లలు సైతం ఉన్నారు. ఇటీవల కాలంలో జాకీర్ అలీ వేధింపులను తట్టుకోలేకపోయిన బాధితురాలు ఈ విషయాన్ని తన సోదరుడు షఫీ దృష్టి తీసుకెళ్లింది. షఫీ పలుమార్లు హెచ్చరించినా జాకీర్ తన ప్రవర్తనలో మార్పు రాలేదు. శుక్రవారం అర్ధరాత్రి వివాహిత భర్త లేని సమయంలో ఇంటికి చేరుకొని ఆమెను వేధించసాగాడు. దీంతో సదరు మహిళ తన సోదరుడికి ఫోన్ చేసి చెప్పింది. ఆగ్రహానికి గురైన షఫీ అక్కడికి చేరుకొని అతన్ని మందలించే క్రమంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. షఫీ వెంటనే జాకీర్ తలపై ఇనుప రాడ్తో బాదడంతో పాటు, గడ్డపారతో అతని ముఖంపై కొట్టడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
చదువుకోమన్నందుకు చంపేశాడు!
సాక్షి, చైన్నె: దేశం గాని దేశానికి వెళ్లి బిడ్డల కోసం కార్మికుడిగా రేయింబవళ్లు తండ్రి శ్రమిస్తుంటే, ప్రయోజకుడై ఆయనకు తోడు ఉండాల్సిన పెద్ద కుమారుడు ఉన్మాది అయ్యాడు. చదువుకోమని పదేపదే వేధిస్తున్నారనే ఆగ్రహంతో కని పెంచిన తల్లిని, తోడ పుట్టిన తమ్ముడిని హతమార్చాడు. తానూ ఆత్మహత్యాయ త్నం చేసినా ధైర్యం చాలక పోలీసులకు పట్టుబడ్డాడు. ఉత్తర చైన్నె పరిధిలోని తిరువొత్తియూరులో ఈ దా రుణ ఘటన శనివారం వెలుగు చూసింది. వివరాలు.. తిరువొత్తియూరు తిరునగర్ మొదటి వీధికి చెందిన మురుగన్(50) ప్రొక్లయినర్ ఆపరేటర్. ఓమన్ దేశంలో పనిచేస్తున్నాడు. ఆయనకు భార్య పద్మ(45), కు మారులు నితీష్(21), సంజయ్(15) ఉన్నారు. పద్మ అన్నాసాలైలోని ఓ అక్కుపంచర్ క్లినిక్లో పనిచేయగా, నితీష్ వేళచ్చేరిలోని ఓ కళాశాలలో బీఎస్సీ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సంజయ్ స్థానికంగా పాఠశాలలో పదో తరగతి పూర్తి చేసిన ప్లస్–1లో చేరడానికి సిద్ధమయ్యాడు. ఈ పరిస్థితులలో శుక్రవారం తన పెద్దమ్మ మహాలక్ష్మి కుమార్తె ప్రియ ఇంటికి నితీష్ వెళ్లాడు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ఇంటి ముందు ఓ బ్యాగ్ ఉంచి వెళ్లాడు. ప్రియ వాట్సాప్కు ఈ సమాచారం చేర వేశాడు. ఇంటికి వచ్చినానంతరం రాత్రి సమయంలో ఈ మెసేజ్ చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనకు లోనైంది.ఇంటికి వెళ్లి చూడగా...నితీష్పెట్టిన మెసేజ్లను వాట్సాప్లో చూసుకున్న ప్రియ తీవ్ర ఆందోళనతో తన తల్లి మహాలక్ష్మికి సమాచారం అందించింది. తన మెసేజ్లో అమ్మ, తమ్ముడి ని చంపేశా? అని ఉన్మాదంతో నితీష్ వ్యాఖ్యలు చేసి ఉండటం కలవరాన్ని రేపింది. హుటాహుటిన మహాలక్ష్మి , ప్రియ పద్మ ఇంటికి వెళ్లి చూశారు. ఇంటిలో రెండు మూటలలో గొంతులు తెగిన స్థితిలో పద్మ, సంజయ్ మృతదేహాలు బయట పడ్డాయి. దీంతో పోలీసు కంట్రోల్ రూమ్కు సమాచారం అందించారు. అర్ధరా త్రి వేళ ఈ హత్యల సమాచారం తిరువొత్తియూరులో కలకలాన్ని సృష్టించింది. నితీష్ కోసం పోలీసులు తీవ్ర వేట మొదలెట్టారు. పలగై తొట్టి కుప్పం బస్టాండ్లో నిద్రపోతున్న నితీష్ను వేకువ జామున పోలీసు లు పట్టుకున్నారు. అతడిని విచారించగా ఉన్మాదం బయట పడింది.చదువుకోమన్నందుకే..వేళచ్చేరిలోని ఓ కళాశాలలో చదువుతున్న నితీష్ చదువుపై దృష్టి పెట్టడం మానేశాడు. దీంతో అన్ని సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యాడు. దీంతో తల్లి పదే పదే చదువుకోవాలని, విదేశాలలో తండ్రి పడుతున్న కష్టాలను గుర్తు చేస్తూ, మందలిస్తూ వచ్చింది. తమ్ముడు సంజయ్ సైతం ఇదే విషయాన్ని తనకు గుర్తుచేస్తూ రావడంతో నితీష్ ఉన్మాదిగా మారాడు. తనను చదువుకో మని పదేపదే హెచ్చరించడాన్ని తీవ్రంగా పరిగణించి మనో వేదనకు లోనయ్యాడు. ఆత్మహత్య చేసుకోవా లని నిర్ణయించుకున్నాడు. అయితే అంతుకు ముందు గా తన తల్లి, తమ్ముడిని చంపేయాలన్న ఉన్మాద నిర్ణయానికి వచ్చేశాడు. గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఉన్న తల్లి గొంతుపై విచక్షణా రహితంగా కత్తితో పొడి చి చంపేశాడు. ఆ తర్వాత తమ్ముడు సంజయ్ను కూ డా అలాగే చంపేశాడు. తాను ఉపయోగించి న కత్తిని అక్కడే ఓ కవర్లో ప్యాక్ చేసి పెట్టి, మృత దేహాలను మూట కట్టి పడేసి బయటకు వెళ్లిపోయాడు. రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవాలని తొలుత నిర్ణయించి, ధైర్యం చాలక వెనక్కి వచ్చేశాడు. తర్వాత స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. అనంతరం అక్కడి థియేటర్లో నైట్ షో చూశాడు. చివరకు ఇంటి తాళం, సెల్ఫోన్ ప్రియ ఇంటి వద్ద ఉంచి సముద్రంలో దూకి ఆత్మహత్యా ప్ర యత్నం చేసి ధైర్యం చాలక, ఎక్కడికి వెళ్లాలో తెలియక బస్టాండ్కు వచ్చి పడుకుని నిద్ర పో యాడు. నితీష్ను అరెస్టు చేసిన పోలీసులు కట కటాల్లోకి నెట్టారు. కాగా ఈ హత్య సమాచారంతో ఒమన్ నుంచి తండ్రి చైన్నెకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. -
కట్టుకున్నవాడే కడతేర్చాడు..
గజపతినగరం : మండలంలోని బంగారమ్మపేటలో ఇటీవల ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవడంతో కేసు నమోదు చేసిన పోలీసులు అది ఆత్మహత్య కాదు...హత్య అని తేల్చారు. కట్టుకున్న భర్తే భార్యను అమానుషంగా చంపడంతో అతడ్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి బొబ్బిలి డీఎస్పీ పి.శ్రీనివాసరావు శనివారం స్థానిక గజపతినగరం పోలీస్స్టేషన్ ఆవరణలో వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. బంగారమ్మపేటకు చెందిన నక్కా జగదీష్కు అదే గ్రామానికి చెందిన తాడుతూరి అనూష (తనూజ)తో మూడు నెలల కిందట వివాహం జరిగింది. మొదట్లో వీరి కాపురం సజావుగా సాగినా, జగదీష్కు అనుమానం ఎక్కువ కావడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు నెలకొన్నాయి. అక్కడకు కొద్ది రోజుల తర్వాత అనూషను కన్నవారింటిలో ఉంచి జగదీష్ ఉద్యోగం నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లాడు. ఈ నెల 16న గ్రామానికి వచ్చిన జగదీష్ అనూషకు ఫోన్ చేసి ఇంటి సమీపంలో ఉన్న పశువుల శాల వద్దకు రమ్మన్నాడు. దీంతో ఆరోజు (ఆదివారం) రాత్రి అనూష తన ఇంటి సమీపంలోని పశువులశాల వద్దకు రాగా.. ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. సహనం కోల్పోయిన జగదీష్ భార్య మెడకు నైలాన్ తాడుతో ఉరి వేశాడు. ఇదిలా ఉండగా గ్రామానికి చెందిన బోని ప్రసాద్ అనే వ్యక్తి తనను వేధిస్తున్నాడని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని అనూష సెల్ నుంచి ఆమె తండ్రి, సోదరుడు, స్నేహితురాళ్లతో పాటు తన సెల్కు కూడా జగదీష్ మెసేజ్లు పంపించాడు. దీంతో మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు బోని ప్రసాద్ను పోలీసులు అరెస్ట్ చేసి విచారించగా.. అతను నేరం చేయలేదని తేలింది. ఈ పరిస్థితుల్లో భర్త జగదీష్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా... అసలు విషయం బయట పడింది. భార్యను తనే హత్య చేసినట్లు జగదీష్ ఒప్పుకోవడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.బోని ప్రసాద్ ఇంటిపై దాడితన కుమార్తె మృతికి కారణమనే అపోహతో అనూష తండ్రి, కుటుంబ సభ్యులు ప్రసాద్ ఇంటిపై దాడి చేసి అతని తండ్రి గోవిందరావుపై దాడి చేశారు. దీంతో గోవిందరావు ఫిర్యాదు మేరకు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో స్థానిక సీఐ ఎన్వీ ప్రభాకరరావు, ఎస్సై యు.మహేష్, తదితరులు పాల్గొన్నారు. -
నవవధువుపై అత్యాచారయత్నం
సాక్షి,బళ్లారి: ఇటీవల వివాహమైన నవవధువుపై ఓ దుర్మార్గుడు అత్యాచారయత్నానికి పాల్పడగా సదరు మహిళ తిరగబడటంతో చాకుతో హత్యాయత్నానికి పాల్పడిన ఘటన దావణగెరె జిల్లాలో చోటు చేసుకుంది. దావణగెరె జిల్లా జగళూరు తాలూకా చిక్కమ్మనహట్టి గ్రామంలోని గొల్లలదొడ్డికి చెందిన ఓ మహిళకు ఇటీవల వివాహమైంది. ఆమె రెండు రోజుల క్రితం పుట్టింటికి రావడంతో పక్కంటి కాటెప్ప(30) అనే వ్యక్తి ఇంట్లో ఎవరూ లేరని గమనించి మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో చాకుతో పొడవడంతో గట్టిగా అరిచింది. దీంతో ఇరుగుపొరుగు వారు వెంటనే అక్కడికి చేరుకోవడంతో అత్యాచారయత్నానికి పాల్పడిన వ్యక్తి పారిపోవడానికి యత్నించాడు. వెంటనే గ్రామస్తులు కూడా పరుగు తీసి సదరు వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు గాయపడిన మహిళను స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. -
అమానుషం: మహిళపై కర్రతో దాడి.. వీడియోలు తీసిన జనం
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళపై కొందరు వ్యక్తులు విచక్షనారహితంగా దాడి చేశారు. బహిరంగ ప్రదేశంలో అందరూ చూస్తుండగానే కర్రతో కొట్టారు. అయితే చుట్టూ ఉన్న వారు దీన్నంతటినీ వీడియోలు తీస్తూ.. ప్రేక్షకుల్లా చూస్తూ ఉండిపోయారే తప్ప అక్కడ జరుగుతున్న దారుణాన్ని ఆపేందుకు ముందుకు రాకపోవడం సిగ్గుచేటు.మోదీ కేబినెట్లో కేంద్రమంత్రిగా నియమితులైన సావిత్రి ఠాకూర్ స్వగ్రామమైన ధార్ జిల్లాలోని తండా ప్రాంతంలోఈ ఘటన వెలుగు చూడటం గమనార్హం. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది.మహిళను కొందరు వ్యక్తులు అందరూ చూస్తుండగానే కర్రతో దారుణంగా కొట్టారు. నలుగురు వ్యక్తులు మహిళను పట్టుకోగా.. ఓ వ్యక్తి బలమైన కర్రతో కొడుతూ కనిపించాడు. ఈ దాడిలో తనను కాపాడండి అంటూ ఆ మహిళ ఎంత వేడుకున్నా ఎవరూ ముందుకు రాలేదు. పైగా అక్కడ జరుగుతున్న దాన్ని తమ సెల్ఫోన్లలో రికార్డు చేస్తూ చోద్యం చూశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.#MadhyaPradesh का जिला धार..बेटी बचाओ का नारा था.. मगर यह लोग तो बेटियों पर खुलेआम जुल्म कर रहे है। @DGP_MP#आदिवासी_हिंदू_नहीं_हैं#मदन_दिलावर_माफी_मांगों Atal Setu Rs 1Sudi Ram Ram The Star योगी आदित्यनाथ Israel Nazis pic.twitter.com/tLZR7t5bS1— Abdul Qadir khan (@AbdulKh10143143) June 22, 2024 మరోవైపు ఈ ఘటనపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ పాలనలో మహిళల భద్రత లేదంటూ మండిపడింది. మధ్యప్రదేశ్లో వేధింపులు, మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టడంలో మీ ప్రభుత్వం ఎందుకు విఫలమవుతోందని ప్రశ్నించింది. మహిళలపై అఘాయిత్యాలలో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని విరుచుకుపడింది. వీడియో వైరల్గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. వెంటనే ఘటనాస్థలికి చేరుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడిని నూర్ సింగ్గా పోలీసులు గుర్తించారు. అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు.. మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. అయితే ఈ ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. బాధితురాలికి న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని ధార్ జిల్లా ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. -
HYD: చిలుకలగూడలో కాల్పలు కలకలం
సికింద్రాబాద్: చిలకలగూడలో అర్ధరాత్రి సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా హల్చల్ చేసింది. వీరని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. ఈ క్రమంలోనే వారిపైకి కాల్పులు జరిపినట్టు సమాచారం. అయితే పోలీసులు వెర్షన్ వేరేగా ఉంది.చిలకలగూడలో సెల్ ఫోన్ స్నాచింగ్ చేస్తున్న ముఠా తిరుగుతోంది. ఎప్పటి నుంచో ఫిర్యాదులు అందుకుంటున్న పోలీసులు నిన్న రాత్రి సడెన్ డెకాయ్ ఆపరేషన్ చేశారు. అప్పటికే ఆ ప్రాంతంలో ఉన్న ఆ ముఠా పారిపోయేందుకు యత్నించింది.పారిపోతున్నా దొంగల ముఠాను పట్టుకునేందుకు పోలీసులు వెంబడించారు. ఈ క్రమంలోనే కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠాపై ఒక రౌండ్ కాల్పులు చేశారని అంటున్నారు. ముగ్గురు సెల్ ఫోన్ స్నాచింగ్ ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు. వారి పారిపోయే క్రమంలోజరిగిన పెనుగులాటలో మిస్ఫైర్ అయిందని పోలీసులు చెబుతున్నారు. -
యువతితో వీడియో కాల్ మాట్లాడుతూ యువకుడి ఆత్మహత్య
దుండిగల్: ఓ యువతితో చివరిసారిగా వీడియో కాల్ మాట్లాడుతూ తాను చనిపోతున్న దృశ్యాలను చూపిస్తూ ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన దుండిగల్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం కన్నారం గ్రామం చెర్రీ తాండాకు చెందిన రాజు కుమారుడు డి.శ్రీకాంత్(22) డి.పోచంపల్లిలోని సర్వే నం.120లో తన అన్నా వదినలతో కలిసి ఉంటున్నాడు. అతడు గండిమైసమ్మలోని గ్లాండ్ ఫార్మా పరిశ్రమలో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. తమ సొంత గ్రామంలో పొలం పనులు ఉండటంతో అన్నా వదినలు 15 రోజుల క్రితమే ఊరికి వెళ్లిపోగా శ్రీకాంత్ ఒక్కడే ఉంటున్నాడు. కాగా గురువారం రాత్రి శ్రీకాంత్ ఫోన్లో ఎవరితోనో గొడవ పడ్డాడు. తన గదిలోకి వెళ్లి తాడుతో రాడ్డుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. శ్రీకాంత్ చివరిసారిగా ఓ యువతితో ఫోన్లో వీడియో కాల్ మాట్లాడినట్లు గుర్తించారు. మంచంపై ఫోన్ పెట్టి తాను ఉరి వేసుకుని చనిపోతున్న దృశ్యాలను వీడియో కాల్ ద్వారా ఆ యువతికి చూపించినట్లు తెలుస్తోంది. ప్రేమ వ్యవహారమా.. లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేశారు. -
మండి బిర్యానీ తిని తిరిగొస్తూ..
చాంద్రాయణగుట్ట: బైక్పై ట్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ వచ్చి అదుపు తప్పిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందగా, మరో యువకుడు తీవ్ర గాయాలకు గురయ్యాడు. ఛత్రినాక పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఛత్రినాక జయప్రకాష్ నగర్కు చెందిన అమర్సింగ్ కుమారుడు ఠాకూర్ రాధాకిషన్(24) ఏసీ మెకానిక్. స్నేహితుడి బర్త్డే వేడుకలకు వెళ్లేందుకు స్నేహితుడైన రోహన్ చౌకట్ వద్ద శుక్రవారం తెల్లవారుజామున బైక్ తీసుకున్నాడు.అనంతరం ఇదే ప్రాంతానికి చెందిన వైజనాథ్ ఇంగ్లే అలియాస్ సోను(30), మక్దూంపురాకు నిఖిల్(18)తో కలిసి బైక్పై త్రిబుల్ రైడింగ్ చేసుకుంటూ చాంద్రాయణగుట్టలో మండి బిర్యానీ తినేందుకు వెళ్లారు. బిర్యానీ తిన్న తర్వాత తిరిగి వస్తుండగా రాధాకిషన్ బైక్ నడుపుతుండగా, మధ్యలో సోను, వెనుక భాగంలో నిఖిల్ కూర్చున్నారు. తెల్లవారుజామున 3.30 గంటలకు కందికల్ ఆర్వోబీ(రైల్వే ఓవర్ బ్రిడ్జి)పై అతివేగంగా బైక్ నడపడంతో డివైడర్కు తాకుతూ, ఆపై స్తంభానికి ఢీకొట్టారు. ఈ ఘటనలో వైజనాథ్ ఇంగ్లే అక్కడికక్కడే మృతి చెందగా, తీవ్ర గాయాలపాలైన రాధాకిషన్ను ఎల్బీ నగర్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. గాయాలతో నిఖిల్ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇద్దరు యువకుల మృతితో స్థానికంగా విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా ఎవరి పుట్టిన రోజు లేదని, కేవలం బిర్యానీ తినేందుకు వెళ్లామని క్షతగాత్రుడు నిఖిల్ తెలిపాడని పోలీసులు వెల్లడించారు. -
క్షుద్ర పూజలు అవాస్తవం
గోపాలపట్నం: విమాన్నగర్లో క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఎయిర్పోర్టు సీఐ చక్రధరరావు స్పష్టం చేశారు. స్థానికంగా నివసిస్తున్న బోర రాజేష్ 10 రోజులుగా పెద్ద అరుపులతో పూజలు చేస్తున్నాడన్న ఆరోపణతో గురువారం రాత్రి స్థానికులు అతనిపై దాడులు చేశారు. అతని ఇంటి అద్దాలు పగలగొట్టారు. దీన్ని కొందరు వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు రాజేష్ ఇంటిని తనిఖీ చేశారు. ఎక్కడా క్షుద్ర పూజలు చేసిన ఆనవాళ్లు కనిపించకపోవడంతో.. ఎవరో దురుద్దేశపూర్వకంగా ప్రచారం చేసినట్లు గుర్తించారు. ఇక్కడ క్షుద్ర పూజలు జరిగినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని సీఐ తెలిపారు. అయితే స్థానికులు మాట్లాడుతూ రాజేష్ 10 రోజులుగా అర్ధరాత్రి సమయంలో పెద్దగా అరుస్తూ పూజలు చేస్తున్నాడని, అడిగితే తాను అమ్మవారికి పూజలు చేసుకుంటున్నానని చెబుతున్నాడని భయాందోళన వ్యక్తం చేశారు. దీనిపై రాజేష్ మాట్లాడుతూ తన అన్న బోర అప్పరావురెడ్డి ఓ రోడ్డు వివాదంలో తనపై కక్ష పెట్టుకుని ఈ విధంగా దుష్ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. దీనిపై పోలీసులు తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. -
లారీ ఢీకొని పీజీ విద్యార్థిని మృతి
పెనుమంట్ర: పెనుగొండ రోడ్డులోని నెగ్గిపూడి లాకుల సమీపంలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో దేవగానుగుల గీతావాణి(23) మృతిచెందింది. మార్టేరు శివరావుపేటకు చెందిన గీతావాణి పరీక్షలు రాసేందుకు స్కూటర్పై పెనుగొండ వెళ్తుండగా లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గీతావాణికి వేలివెన్నుకు చెందిన వెంకటేశ్వరరావుతో రెండేళ్ల క్రితం వివాహమైంది. ఎంబీఏ చదువుతున్న గీతావాణి పరీక్షలు రాసేందుకు వారం రోజుల క్రితం పుట్టింటికి వచ్చి పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో పరీక్షలు రాస్తోంది. భర్త వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీఐ రజనీ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నట్లు పెనుమంట్ర ఇన్చార్జి ఎస్సై వెంకటేశ్వరరావు తెలిపారు. -
బహిర్భూమికి వెళ్లిన యువతిపై దుండగుల అత్యాచారం
-
మేడ్చల్లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
అత్యంత విషాదంగా తమిళనాడు కల్తీ సారా ఘటన.. మరణాలు ఎన్నంటే?
Updates..👉మృతుల కుటుంబాలకు సీఎం స్టాలిన్ పరిహారం.. Death toll due to Kallakurichi hooch tragedy rises to 34. Tamil Nadu CM MK Stalin announces Rs 10 lakhs each for the family of deceased and Rs 50,000 each for the people under treatment. A one-man commission, comprising former judge Justice B Gokuldas, announced for probing the…— ANI (@ANI) June 20, 2024 👉తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.10 లక్షలు, చికిత్స పొందుతున్న వారికి రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు.👉కల్తీ మద్యం ఘటనపై మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి గోకుల్దాస్తో కూడిన వన్ మ్యాన్ కమిషన్ ఈ అంశంపై విచారణ జరిపి మూడు నెలల్లో నివేదికలు సమర్పించాలని ప్రకటించింది. 👉 తమిళనాడు కల్తీసారా ఘటన అత్యంత విషాదంగా మారింది. కల్లకురిచ్చి జిల్లా కరుమాపురం గ్రామంలో కల్తీ సారా తాగిన ఘటనలో మృతుల సంఖ్య 37కి చేరుకుంది. #DGNews |The #deathtoll in the Kallakurichi illicit #liquor incident has risen to 37.#tamilnadu #Kallakurichi #Resign_Stalin #DMK #DMKGovt— Saji Agniputhiran (@Sajiagniputhira) June 20, 2024 👉 కాగా, సారా తయారీలో మోతాదుకు మించిన మిథనాల్ను వినియోగించినట్లు తేలింది👉 నేడు తమిళనాడు అసెంబ్లీ సెషన్ ప్రారమైంది. ఈ నేపథ్యంలో కల్తీ సారా విషయంపై అధికార-విపక్షాల వాగ్వాదంతో అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.👉 ఇక, ఈ కేసును సీబీసీఐడీకి అప్పగించి విచారణ చేపట్టాలని సీఎం స్టాలిన్ ఆదేశాలు జారీ.👉 ఈ కేసులో కల్తీ సారా తయారు చేసిన గోవిందరాజు సహా ఓ మహిళ, యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.👉 కల్తీ సారా ఘటనలో దాదాపు 100 మంది బాధితులు ఉన్నట్టు తెలుస్తోంది. 👉ఈ ఘటనలో మరో 35 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. 👉ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సీరియస్ అయ్యారు. సీఎం స్టాలిన్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘కళ్లకురిచిలో కల్తీ మద్యం సేవించి మృతి చెందారనే వార్త విని దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ ఘటనలో నేరానికి పాల్పడిన వారిని అరెస్టు చేశాం. ఈ క్రమంలో నిరక్ష్యంగా ఉన్న అధికారులపై కూడా చర్యలు తీసుకున్నాం. సమాజాన్ని నాశనం చేసే ఇలాంటి నేరాలకు పాల్పడే వారిపై తక్షణమే చర్యలు తీసుకుంటాం అని కామెంట్స్ చేశారు. Tamil Nadu CM tweets, "I was shocked and saddened to hear the news of the deaths of people who had consumed adulterated liquor in Kallakurichi. Those involved in the crime have been arrested in this matter. Action has also been taken against the officials who failed to prevent…— ANI (@ANI) June 19, 2024 👉గోవిందరాజు అనే వ్యక్తి కల్తీ సారాను తయారు చేసినట్టు అధికారులు గుర్తించారు. 👉మరోవైపు.. ఘటనపై విచారణకు ఆదేశించిన ప్రభుత్వం జిల్లా ఎస్పీ సమయసింగ్ మీనాపై సస్పెన్షన్ వేటు వేసింది. అలాగే కలెక్టర్ శ్రావణ్కుమార్ను బదిలీ చేసింది. వీరి స్థానంలో కలెక్టర్గా ప్రశాంత్, ఎస్పీగా చతుర్వేదిని నియమించారు. 👉ఇదిలా ఉండగా.. 18 ప్రత్యేక వైద్య బృందాలను చెన్నై నుంచి కళ్లకురిచ్చి పంపించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఆ జిల్లాలోని ఎక్సైజ్ విభాగం ఉన్నతాధికారులందరిపై వేటు వేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. #WATCH | Tamil Nadu: At least 25 people died and several were hospitalised after reportedly consuming illicit liquor in Tamil Nadu's Kallakurichi district: District Collector MS Prasanth(Visuals from Kallakurichi Government Medical College) pic.twitter.com/WI585Cbxbk— ANI (@ANI) June 19, 2024 👉ఇక, ప్రస్తుతం కళ్లకురిచ్చి ప్రభుత్వ ఆస్పత్రిలో సారా సేవించిన వారు 40 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలోని జిప్మర్ ఆస్పత్రికి తరలించారు. VIDEO | #TamilNadu: Several people were reported dead, and many others hospitalised after consuming spurious liquor in #Kallakurichi district.(Full video available on PTI Videos - https://t.co/n147TvqRQz) pic.twitter.com/IFicB26zG0— Press Trust of India (@PTI_News) June 20, 2024