-
జీడిమెట్ల న్యూ ఎల్బీనగర్ లో దారుణం
-
హైదరాబాద్ జీడిమెట్ల పరిధి షాపూర్ లో బస్సులో మంటలు
-
ఇంట్లో ఉంటున్న కూతురిపై పలుమార్లు తండ్రి లైంగికదాడి
-
జీడిమెట్లలో ఇద్దరు అమ్మాయిలు అదృశ్యం
హైదరాబాద్: ఇంట్లో చెప్పాపెట్టకుండా ఇద్దరు బాలికలు వెళ్లిపోయిన సంఘటన జీడిమెట్ల పీఎస్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్స్పెక్టర్ ఎం.పవన్ చెప్పిన వివరాల ప్రకారం.. చింతల్ ద్వారకానగర్కు చెందిన శ్రీనివాస్, విజయ్ ఇళ్లు పక్కపక్కనే ఉన్నాయి. శ్రీనివాస్ కుమార్తె దీక్షిత 9వ తరగతి, విజయ్ కుమార్తె పూజ పదో తరగతి చదువుతున్నారు. వీరిద్దరూ వేర్వేరు పాఠశాలల్లో చదువుతున్నప్పటికీ.. పొరుగు ఇళ్లలో ఉండటంతో స్నేహితులయ్యారు. పూజ రెండు రోజుల క్రితం వినాయక మండపం వద్దకు వెళ్లడంతో తల్లిదండ్రులు మందలించారు. మంగళవారం ఉదయం స్కూల్కు వెళ్లేందుకు యూనిఫాం వేసుకుంది. పాలు తాగుతుండగా అవి మీద పడటంతో డ్రెస్ మార్చుకుంది. పక్కింట్లో ఉండే దీక్షిత బయట నుంచి గడియపెట్టి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఇద్దరూ ప్రణాళిక ప్రకారమే 8 గంటల కంటే ముందే ఇళ్లలోంచి వెళ్లిపోయారు. దీక్షిత బాత్రూంకు గడియ పెట్టడం, పూజ డ్రెస్ మార్చుకోవడంపై అనుమానం వచి్చన ఇరువురి తల్లిదండ్రులు చుట్టు పక్కల వెతికారు. ఎక్కడా ఆచూకీ లభించకపోవడంతో జీడిమెట్ల పీఎస్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా.. ఇద్దరు బాలికలు సికింద్రాబాద్లో రైలు ఎక్కి వరంగల్ వెళ్లినట్లు గుర్తించారు. వరంగల్ నుంచి ఆంధ్రాకు గాని చెన్నైకి గాని వెళ్లే అవకాశం ఉందని, ఓ బాలిక బంధువు సంగారెడ్డికి చెందిన యువకుడికి పూర్తి విషయాలు తెలిసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సదరు యువకుడిని ప్రశ్నించేందుకు జీడిమెట్ల ఠాణాకు తీసుకువచ్చినట్లు సమాచారం. -
హైదరాబాద్: డమ్మీ బాంబుతో బ్యాంకులో హల్చల్
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల షాపూర్నగర్ ఆదర్శ్ బ్యాంక్ దగ్గర గురువారం డమ్మీ బాంబు బెదిరింపు ఘటన చోటు చేసుకుంది. బాడీ మొత్తానికి బాంబు తరహా సెటప్ చేసుకుని ఓ వ్యక్తి హల్ చల్ చేశాడు. మామూలుగా బ్యాంకులోకి ఎంట్రీ ఇచ్చిన ఆ వ్యక్తి.. హఠాత్తుగా తాను మానవబాంబునని, తన దగ్గర బాంబు ఉందంటూ బెదిరింపులకు దిగాడు. రూ.2 లక్షలు ఇవ్వాలని, లేకుంటే బ్యాంకును పేల్చేస్తానని బెదిరించాడు. దీంతో బ్యాంక్ సిబ్బంది భయపడ్డారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై జీడిమెట్ల పోలీసులకు అలర్ట్ వెళ్లింది. హుటాహుటిన సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు నిందితుడిని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు.. అది డమ్మీ బాంబుగా తేల్చారు. సదరు వ్యక్తిని జీడిమెట్లకే చెందిన శివాజీగా గుర్తించారు. అతను ఎందుకు అలా చేశాడన్నదానిపై తేల్చేందుకు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు. -
Hyderabad: వివాహేతర సంబంధం: భర్తను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్న భార్య
హైదరాబాద్: వేరే మహిళతో అక్రమ సంబంధాన్ని బయటపెట్టిన భార్య బంధువులపై భర్త కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.సీఐ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. గాజులరామారం వల్లభాయ్నగర్కు చెందిన విజయ్కుమార్కు మెదక్ జిల్లా చేగుంట మండలం నార్సింగికి చెందిన స్వప్నతో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలున్నారు. కాగా విజయ్కుమార్ మూడేళ్లుగా మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తూ వస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను సైతం దూరం పెడుతూ విడాకులు ఇవ్వాల్సిందిగా వేధిస్తూ వస్తున్నాడు. కొన్ని నెలలుగా ఇంటి రావడంలేదు, కుటుంబ సభ్యులు ఫోన్లు చేసినా స్పందించడం లేదు. శనివారం రాత్రి సదరు మహిళతో విజయ్కుమార్ ఉన్నట్లు తెలుసుకున్న స్వప్న, ఆమె అక్కలు శ్యామల, మంజుల, బాబాయి శ్రీనివాస్ అక్కడికి వెళ్లారు. అతడిని రెడ్హ్యాండెడ్గా పట్టుకుని నిలదీయగా వారి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్య స్వప్నను కొడుతున్న విజయ్కుమార్ను అడ్డుకున్న శ్రీనివాస్పై కత్తితో దాడి చేయగా అతని మెడభాగం, చేతిపై తీవ్ర గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రుడిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరి్పంచి చికిత్స అందిస్తున్నారు. ఆదివారం బాధిత మహిళ స్వప్న జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జీడిమెట్లలో కుప్పకూలిన పురాతన భవనం
సాక్షి, మేడ్చల్ జిల్లా: జీడిమెట్లలో పురాతన భవనం కుప్పకూలింది. చెరుకుపల్లి కాలనీలో ఓ పురాతన బిల్డింగ్కు మరమ్మత్తులు చేస్తుండగా ఒక్క సారిగా కూలిపోయింది. పక్క నున్న 3 భవనాలపై శిథిలాలు పడటంతో పక్క బిల్డింగ్ గోడలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కూలిపోయిన భవనంలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. పక్క బిల్డింగ్లో ఇద్దరు గాయపడ్డారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: ఛీ, తను కూతురేనా?.. ప్రియుడితో మాట్లాడొద్దన్నందుకు కన్నవాళ్లను దారుణంగా.. -
లవ్ ఫెయిల్.. ప్రేమించిన యువతి కావాలని రెండేళ్లుగా..
సాక్షి, హైదరాబాద్: అప్పట్లో అతడి వయస్సు 17 సంవత్సరాలు. మైనర్ వయస్సులోనే ఓ మైనర్ (బాలిక)ను ప్రేమించాడు. బాలిక దక్కలేదని రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో ఇంటిపై మూడు రోజుల క్రితం బిల్డింగ్పై నుంచి కిందకు దూకాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ పవన్ తెలిపిన వివరాల ప్రకారం.. షాపూర్నగర్ న్యూఎన్ఎల్బీ నగర్కు చెందిన జగన్కుమార్కు ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు కాగా ఒక అబ్బాయి మణికళ్యాణ్(19). మణికళ్యాణ్ ఇంటర్ మొదటి సంవత్సరం చదివే క్రమంలో అదే కాలనీకి చెందిన ఓ బాలికను ప్రేమించాడు. ఈ విషయం ఇరు కుటుంబాలకు తెలియడంతో బాలిక తల్లిదండ్రులు ఆమెను తీసుకుని వారి సొంతప్రాంతం కర్ణాటకకు వెళ్లారు. దీంతో అప్పటి నుంచి మణికళ్యాణ్ మద్యానికి బానిసయ్యాడు. రాత్రిపూట మద్యం సేవించి ఇంటికొచ్చి ప్రేమించిన అమ్మాయి కావాలంటూ గొడవపడేవాడు. ఈనెల 13వ తేదీన మద్యం సేవించి ఇంటికి వచ్చిన మణికళ్యాణ్ రాత్రి 12గంటల సమయంలో బిల్డింగ్పై నుంచి కిందకు దుకాడు. తీవ్ర గాయాల అవ్వడంతో విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మణికళ్యాణ్ను ఓప్రైవేట్ అస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మణికళ్యాణ్ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో అగ్నిప్రమాదం
-
జీడిమెట్ల ఫార్మా కంపెనీలో పేలిన రియాక్టర్.. ఇద్దరు మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్ల ఫార్మా కంపెనీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్ పేలి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రవీందర్ రెడ్డి, కుమార్లుగా గుర్తించారు. -
అయ్యో పాపం.. పసికందును రేకుల ఇంటిపై వదిలివేత
సాక్షి, హైదరాబాద్: కన్నబిడ్డను చూసి నోరులేని మూగజీవి సైతం మురిసిపోతుంది. తనివితీరా బిడ్డను చూసుకుని పురిటి నొప్పులను సైతం మరిచిపోతుంది. ప్రపంచంలో తెంచుకోలేనిది పేగు బంధం అంటారు. అలాంటిది ఓ తల్లి తన కన్నబిడ్డ పేగు సైతం ఎండకముందే ఆ బంధాన్ని తెంచేసుకుంది. తల్లి చనుబాల రుచిని సైతం ఎరగని చిన్నారిని ఓ రేకుల ఇంటిపై ఉంచి వెళ్లిపోయారు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల డివిజన్ డివిజన్ పరిధిలోని అయోధ్యనగర్లో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఓ ఇంటిపై ఉన్న యువకుడు.. కింద నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దాలను విన్నాడు. కిందకు చూడగా ఓ రేకుల ఇంటిపై పసికందు కనిపించింది. ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో చిన్నారిని రేకుల ఇంటి నుంచి కిందకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పసికందుకు షాపూర్నగర్లో ప్రథమ చికిత్స అందించి నిలోఫర్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు.. -
వ్యక్తి దారుణ హత్య.. మృతదేహాన్ని మూటగట్టి ఇంటి ముందు పడేసి..
సాక్షి, హైదరాబాద్: ఓ ఆటో డ్రైవర్ దారుణ హత్యకు గురయ్యాడు. అంతమొందించిన దుండుగలే మృతదేహాన్ని గోనె సంచీలో మూటగట్టి ఇంటి ముందే మృతదేహాన్ని వదిలేయడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సంజయ్గాంధీనగర్లో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం, వెలిమెల గ్రామానికి చెందిన సురేష్ (28) 2016లో రేణుకను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కొన్నేళ్ల నుంచి సంజయ్గాం«దీనగర్లో ఓ అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి ఆరేళ్లు, నాలుగేళ్ల వయసున్న ఇద్దరు ఆడ పిల్లలున్నారు. సురేష్ ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తుండగా రేణుక ఇంటి వద్దనే ఉంటోంది. ఆదివారం భర్త సురేష్ను ఆహారం తీసుకురమ్మని రేణుక బయటకు పంపింది. అర్ధరాత్రి అయినా సురేష్ ఇంటికి తిరిగి రాలేదు. ఫోన్ సైతం ఇంట్లో వదిలి వెళ్లినట్లు గుర్తించారు. సోమవారం తెల్లవారుజాము 5 గంటల ప్రాంతంలో ఇంటి ముందు గోనె సంచీలో మృతదేహం ఉన్నట్లు ఇంటి యజమాని గుర్తించాడు. దగ్గరకు వెళ్లి చూడగా సురేష్ రక్తపు మడుగులో ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందడంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.. భార్యే హత్య చేయించిందా..! మృతుడు సురేష్ హత్య వెనుక భార్య హస్తమున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మరి కొంత మంది వ్యక్తులతో కలిసి రేణుక పథకం ప్రకారం హత్య చేసి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో జీడిమెట్ల పోలీసులు రేణుకను కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. -
పెళ్లి భోజనంలో మాంసం పెట్టరా? వరుడి ఫ్రెండ్స్ గొడవ.. వివాహం రద్దు..
జీడిమెట్ల: పెళ్లిలో పెట్టిపోతలకంటే కీలక పాత్ర పోషించేది పెళ్లి విందు. ఆ విందులో వధువు తరఫున వారు మాంసం పెట్టలేదన్న కోపంతో పెళ్లి రద్దు చేసుకున్నారు. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వడంతో ఈ నెల 30న పెళ్లి చేసేందుకు ఇరువర్గాల వారు ఒప్పుకున్నారు. వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట రింగ్బస్తీకి చెందిన అబ్బాయికి కుత్బుల్లాపూర్కు చెందిన అమ్మాయికి పెళ్లి సంబంధం కుదిరింది. 28వ తేదీ తెల్లవారుజామున 3గంటలకు పెళ్లి ముహూర్తం పెట్టుకున్నారు. బంధువులంతా షాపూర్నగర్లోని ఓ కల్యాణ మండపానికి చేరుకున్నారు. వధువు కుటుంబీకులు ఏర్పాటు చేసిన విందులో అందరూ భోజనం చేస్తున్నారు. చివరిబంతిలో పెళ్లి కొడుకు మిత్రులు కూర్చున్నారు. వారికి వెజ్ ఐటమ్స్ వడ్డించారు. దీంతో కొంతమంది లేచి ‘మాంసాహారం లేదా’అని అడిగారు. లేదని వధువు కుటుంబీకులు చెప్పడంతో.. విందులో మాంసం పెట్టకపోవడమేమిటని వరుడి స్నేహితులు వధువు బంధువులతో వాగ్వాదానికి దిగారు. అలా తిండి దగ్గర మొదలైన గొడవ ఇరువర్గాలు కొట్టుకునేవరకు వెళ్లింది. దీంతో పెళ్లి రద్దు అయినట్లు ప్రకటించారు. కాస్త నెమ్మదించాక విషయం పోలీసుల వరకూ వెళ్లింది. జీడిమెట్ల సీఐ పవన్.. ఇరు కుటుంబాలను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చారు. దీంతో నవంబర్ 30(రేపు)న పెళ్లి జరిపించేందుకు ఇరు వర్గాలు ఒప్పుకున్నారు. చదవండి: ఎయిర్పోర్టులో కొత్త టెర్మినల్ ప్రారంభం -
ప్రేమిస్తున్నానంటూ యువతికి పెళ్లైన వ్యక్తి ప్రపోజ్
సాక్షి, హైదరాబాద్ (జీడిమెట్ల): పెళ్లయిన వ్యక్తి వేరే యువతిని ప్రేమించగా ఆమె అతడి ప్రేమను తిరస్కరించడంతో ఎలుకల మందు సేవించి చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతిచెందిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై సతీష్రెడ్డి వివరాల ప్రకారం.. చింతల్ చంద్రానగర్కు చెందిన మలిన్(28), మమత భార్యాభర్తలు. వీరికి తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. మలిన్ బాలానగర్లోని ఓ రబ్బర్ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అదే పరిశ్రమలో పనిచేసే ఓ యువతిని మలిన్ ప్రేమిస్తున్నాడు. ఈ విషయాన్ని సదరు యువతి ముందు వ్యక్తపరచగా ఆమె తిరస్కరించింది. దీంతో మలిన్ ఈ నెల 13వ తేదీన ఇంట్లో ఎలుకల మందు సేవించి అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. దీంతో మలిన్ భార్య మమత చికిత్స నిమిత్తం అతడిని 108లో గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స అనంతరం మలిన్ను గురువారం వైద్యులు డిశ్చార్జి చేశారు. అదేరోజు మలిన్కు చాతిలో నొప్పి రావడంతో మమత అతడిని మళ్లీ గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లగా పరిస్థితి విషమించడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తుండగానే మలిన్ మృతిచెందాడు. మలిన్ భార్య మమత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (నన్ను వాడుకొని వదిలేశాడు.. అన్యాయం జరిగిందంటూ సినీనటి నిరసన) -
సాంబార్ లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావనడంతో..
సాక్షి, హైదరాబాద్: ఇడ్లీలోకి సాంబార్ అడిగినందుకు ఓ కస్టమర్పై టిఫిన్ సెంటర్ సిబ్బంది దాడిచేసి గాయపరిచిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. షాపూర్నగర్ రంగాభుజంగా సినిమా థియేటర్కు ఎదరుగా ఉన్న గోకుల్ టిఫిన్ సెంటర్కు సోమవారం ఉదయం ఉపేందర్రెడ్డి అనే వ్యక్తి అతని స్నేహితులతో కలిసి టిఫిన్ చేసేందుకు వచ్చి ఇడ్లీ తీసుకున్నారు. అనంతరం ఇడ్లీలోకి సాంబార్ కావాలని హోటల్ సిబ్బందిని కోరగా వారు లేదంటూ సమాధానం చెప్పడంతో సాంబారు లేకుండా ఇడ్లీ ఎందుకు ఇస్తున్నావంటూ ఉపేందర్రెడ్డి సిబ్బందితో గొడవకు దిగాడు. ఈ విషయంలో ఉపేందర్రెడ్డి, హోటల్ సిబ్బందికి మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. ఈ క్రమంలో హోటల్ పనిచేస్తున్న కాలీదాస్ అనే వ్యక్తి పూరిచేసే కర్రతో దాడిచేసి ఇద్దరిని గాయపరిచాడు. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న జీడిమెట్ల పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ఇరు వర్గాలను శాంతింపజేశారు. అనంతరం ఉపేందర్రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: కేంద్రం సూచనలతో.. కంటోన్మెంట్లో టోల్ట్యాక్స్ రద్దు -
Hyderabad: గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం.. ముగ్గురి అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: వ్యభిచార గృహంపై బాలానగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేసి ఇద్దరు మహిళా ఆర్గనైజర్లతో పాటు ఓ విటుడిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిని జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. ఎస్సై గౌతమ్ వివరాల ప్రకారం.. చింతల్ వాణీనగర్లో సరిత(39), పార్వతి(27)అనే ఇద్దరు మహిళలు ఓ గదిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎస్ఓటీ పోలీసులు మంగళవారం రాత్రి దాడి నిర్వహించి ఇద్దరు నిర్వాహితురాళ్లతో పాటు విటుడు బోయిన్పల్లికి చెందిన బండి రాజేందర్(34)లను అదుపులోకి తీసుకుని జీడిమెట్ల పోలీసులకు అప్పగించగా పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) -
బయోటెక్ కంపెనీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు
-
జీడిమెట్లలో భారీ అగ్నిప్రమాదం
-
Hyderabad: మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి.. అతి కిరాతకంగా..
సాక్షి, హైదరాబాద్(జీడిమెట్ల): అనుమానమే పెనుభూతమైంది.. కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు.. తన ముగ్గురు పిల్లల సాక్షిగా భర్త భార్యను అతికిరాతకంగా కొన్ని గంటల పాటు హింసించి కొట్టి చంపిన ఘటన జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని దేవేందర్నగర్ బతుకమ్మబండలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు వివరాల ప్రకారం.. బతుకమ్మబండలో నివాసముండే కర్ణి మమత(38), బాలకృష్ణ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. కాగా బాలకృష్ణ ఇద్దరు కుమారులతో కలిసి ఏసీ సర్వీసింగ్ పనులు చేస్తుండగా మమత ఇంట్లోనే ఉంటుంది. గతేడాది కాలంగా భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మమతపై అనుమానంతో ఉన్న బాలకృష్ణ గురువారం ఉదయం నుంచే ఆమెను ఇంట్లో బంధించి మద్యం తాగిస్తూ మత్తులో ఉంచి కొట్టడం మొదలుపెట్టాడు. ఆమెను కొన్ని గంటల పాటు విపరీతంగా కొట్టడంతో దెబ్బలకు తాళలేక మమత శుక్రవారం ఉదయం మృతిచెందింది. స్థానికుల జోక్యంతో భర్త కట్టుకథ అట్టర్ ఫ్లాప్.. మమత మృతిచెందిన విషయం ఆమె ఇద్దరు కుమారులతో పాటు కుమార్తెకు సైతం తెలుసు. కాగా వారు ఇంటి తలుపులు గేట్లు మూసుకుని మృతదేహంతో ఇంట్లోనే ఉన్నారు. అనంతరం అందరూ కలిసి శుక్రవారం ఉదయం ఇంటి మొత్తాన్ని కడిగారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో మృతదేహాన్ని తరలించేందుకు ప్లాన్ వేసుకుని ఇంటి వద్దకు అంబులెన్స్ను పిలిపించారు. మమత మృతదేహాన్ని అంబులెన్స్లోకి మారుస్తుండగా అనుమానం వచ్చిన స్థానికులు మమతకు ఏమైంది? ఒంటిపై దెబ్బలు ఏంటి అని ఆమె భర్త బాలకృష్ణను నిలదీశారు. మమత నిన్నటి నుంచి కనిపించలేదని, ఆమె అపస్మారక స్థితిలో బయట దొరికితే తీసుకువచ్చానని బాలకృష్ణ కట్టుకథ అల్లబోయాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు బాలకృష్ణను నిలవరించి పోలీసులకు సమాచారం అందించారు. చదవండి👉🏼 (మార్కాపురం: ఆ భయంతోనే యువతి ఆత్మహత్యాయత్నం) రంగంలోకి దిగి చర్యలు తీసుకున్న పోలీసులు.. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, సతీష్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించి మమత ఒంటిపై తీవ్రమైన దెబ్బలను గుర్తించారు. ఆమె భర్తే హత్య చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించుకున్న పోలీసులు బాలకృష్ణతో పాటు కుమారులు లక్ష్మణ్, శంకర్లను సైతం అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మేమే శిక్షిస్తామంటూ పోలీసులతో స్థానికుల వాగ్వాదం.. ఇళ్ల మధ్యే ఉన్న నరరూప రాక్షసుడిని తామే శిక్షిస్తామని స్థానికులు కొద్దిసేపు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఇంతలో కలుగచేసుకున్న ఎస్సై సతీష్రెడ్డి స్థానికులను సముదాయించి శిక్షపడేలా మేము చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు బాలకృష్ణను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
జీడిమెట్ల.. వ్యభిచార గృహంపై దాడి.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, జీడిమెట్ల: గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ఇంటిపై జీడిమెట్ల పోలీసులు దాడి చేశారు. సీఐ బాలరాజు వివరాల ప్రకారం.. ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా నల్లజెల్ల మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన పత్తి వీరరాజు(33) జీడిమెట్ల టీఎస్ఐఐసీ కాలనీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. విశ్వసనీయ సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం అట్టి గృహంపై దాడి చేసి నిర్వాహకుడు వీరరాజు, విటుడు చీకోటి శ్రీకాంత్(28), యువతి(24)లను అదుపులోకి తీసుకున్నారు. యువతిని రెస్క్యూ హోంకు తరలించి నిర్వాహకుడు, విటుడిపై కేసు నమోదు చేశారు. చదవండి: ఢిల్లీలో దారుణం.. ఇంటి ముందే బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు -
కాపు కాసి కడ తేర్చారు..
జీడిమెట్ల: తన అక్కతో తరచు గొడవ పడుతున్నాడనే నెపంతో బావమరుదులు బావతో పాటు అతని సోదరుడిని విచక్షణ రహితంగా కత్తితో పొడిచి హత్య చేశారు. గురువారం రాత్రి జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని సుభాష్నగర్లో చోటు చేసుకున్న సంఘటన స్థానికులను భయాందోళను గురిచేసింది. ►జీడిమెట్ల ఇన్స్పెక్టర్ కె.బాలరాజు వివరాల ప్రకారం.. సుభాష్నగర్కు చెందిన మోక వెంకటేష్(32) ఏడేళ్ల క్రితం ఉప్పల్ చిలకానగర్కు చెందిన తనకంటే పెద్దదైన రేఖ(40)ను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరికి ఒక పాప(4), బాబు(2) ఉన్నారు. వెంకటేష్ పెయింటర్గా పని చేస్తుండగా రేఖ ఇంటి వద్దనే ఉంటుంది. కాగా వీరిద్దరి మద్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ►గురువారం ఉదయం వెంకటేష్ రేఖల మధ్య గొడవ జరిగింది. ఆమెపై చేయి చేసుకుని సుభాష్నగర్లోనే ఉండే తల్లి వద్దకు వెళ్లాడు. తన భర్త వెంకటేష్ గొడవపడి తనను కొట్టాడని రేఖ చిలుకానగర్లో ఉండే తన తమ్ముళ్లకు చెప్పింది. ►దీంతో బావ వెంకటేష్పై కోపంతో రగిలిపోయిన రేఖ సోదరులు వినయ్(25), మధు(22)లు రాత్రి సుభాష్నగర్కు వచ్చి వెంకటేష్ కోసం కాపు కాస్తున్నారు. అదే సమయంలో వెంకటేష్ తన సొంత సోదరుడైన పోతురాజు(25), తన చెల్లెలి భర్త కృష్ణ(25)లతో కలిసి మద్యం తాగి రాత్రి 10గంటలకు ఇంటికి వస్తున్నాడు. వీరు ముగ్గురు సుభాష్నగర్ పోచమ్మ గుడి వద్దకు చేరుకోగానే వినయ్ వారిస్తూ ఒక్కసారిగా దాడికి దిగాడు. ►తన వెంట తెచ్చుకున్న కత్తితో వెంకటేష్ కడుపులో పొడుస్తుండగా అతని తమ్ముడు మధు వెంకటేష్ను పట్టుకున్నాడు. తన అన్న వెంకటేష్ను పొడుస్తుండగా అడ్డుగా వెళ్లిన వెంకటేష్ సోదరుడు పోతురాజును సైతం వినయ్ విచక్షణ రహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న వెంకటేష్ బావ కృష్ణను సైతం పొడవడానికి ప్రయత్నించగా వెంకటేష్ సోదరి అనిత తన భర్తను చంపవద్దని ప్రాధేయపడింది. ఈ ఘటనలో తీవ్రగాయాలైన పోతురాజు అక్కడికి అక్కడే మృతిచెందగా వెంకటేష్ అస్పత్రిలో చికిత్సపొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందాడు. పోలీసుల అదుపులో నిందితులు.. ఘటనాస్థలికి వెళ్లిన జీడిమెట్ల సీఐ బాలరాజు, ఎస్సైలు మన్మద్, గౌతమ్లు పంచనామా నిర్వహించి వినయ్, మధు, రేఖలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుడు పోతురాజుపై 32కేసులు.. హత్య కాబడ్డ వెంకటేష్ సోదరుడు మృతుడు పోతురాజుపై వివిధ పోలీస్స్టేషన్లలో 32కేసులు ఉన్నాయి. ఇతను తాళం వేసిన ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడుతూ జైలు నుంచి వచ్చి ఫాస్ట్ఫుడ్ సెంటర్లో పని చేస్తున్నాడు. ఇంటి ఆడపడుచు పసుపుకుంకాలతో సంతోషంగా ఉండాలని ఏ అన్నదమ్ములైన కోరుకుంటారు. కానీ వీరి విషయంలో అది రివర్స్గా ఉంది. అక్కను కొట్టాడనే కోపంతో రగిలిపోయిన బావమర్దులిద్దరూ కలసి సొంత బావ ఉసురుతీశారు. అంతేకాకుండా అడ్డుకోవడానికి వచ్చిన బావ తమ్ముడిని సైతం కడ తేర్చారు. బంధాలు, బాంధవ్యాలు మరచి సొంతవాళ్లను చంపుకుంటున్న నేటి సమాజంలో మానవత్వం చచ్చిపోతున్నదనడానికి ఈ ఘటనే నిదర్శనం. -
హైదరాబాద్: పెళ్లై నాలుగు నెలలు గడవకముందే..
సాక్షి, జీడిమెట్ల: పెళ్లై నాలుగు నెలలు కూడా అవ్వలేదు.. కొత్త జంట కొత్త ఆశలతో నగరానికి వచ్చారు. కానీ వీరి దాంపత్యాన్ని ఓర్వలేని మృత్యువు ప్రైవేట్ ట్రావెల్స్ రూపంలో వచ్చి నూతన పెళ్లి కొడుకుని కబళించింది. ఈ హృదయవిదారక సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ.కె.బాలరాజు వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పశ్చిమగోదావరి జిల్లా టి.నరసాపురం మండలం అప్పలరాజుగూడెంకు చెందిన రామచందర్రావు కుమారుడు దుర్గ సత్యవరప్రసాద్ ఐటీఐ చేశాడు. హైదరాబాద్ జీడిమెట్లలోని కలోరమ ప్రింటర్స్లో మెషిన్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు.కాగా వరప్రసాద్కు గత నెలల క్రితం వారి సొంత ప్రాంతం పరిధిలోని ద్రాక్షాయనితో వివాహం జరిగింది. భార్య ద్రాక్షాయనితో కలిసి సొంత ఊరికి వెళ్లిన వరప్రసాద్ మంగళవారం ఉదయం నగరానికి చేరుకున్నాడు. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో డ్యూటీకి వెళ్లేందుకు ఇంటి నుంచి వచ్చాడు. షాపూర్నగర్లోని డీసీపీ కార్యాలయం ముందు రోడ్డు దాటుతున్నాడు. చదవండి: కన్న తల్లిపై కర్కశత్వం.. పెనంతో కొట్టి చంపిన కూతురు ఈ క్రమంలో గాజులరామారం నుంచి షాపూర్నగర్ వైపు వస్తున్న నేషనల్ ట్రావెల్స్ బస్సు(టీఎస్09యూబీ1994) రోడ్డు దాటుతున్న వరప్రసాద్ను ఢీకొట్టగా కిందపడిపోయాడు. ఈ ఘటనలో తలకు తీవ్రగాయాలైన వరప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఘటనా స్థలికి చేరుకున్న జీడిమెట్ల పోలీసులు వరప్రసాద్ భార్య ద్రాక్షాయని ఫిర్యాదు మేరకు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంకా వీడని జీడిమెట్ల బాలిక డెత్ మిస్టరీ
-
బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?
సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్నగర్కు చెందిన బచ్చన్సింగ్, పూర్ణంకౌర్ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్సింగ్ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్నగర్కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది. బయటకు వెళ్లిన అరగంట అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో రా త్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్ అయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2:30 గంటలకు జీడిమెట్ల పోలీసులకు పైప్లైన్ రోడ్డులోని ఓ అపార్ట్మెంట్ వద్ద బాలిక మృతదేహం పడి ఉందని అపార్ట్మెంట్ వాచ్మెన్ అమ్రిత్ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీ సులు బాలిక తల్లిదండ్రులను ఘటనా స్థలికి పిలిపించి వాకబు చేయగా వారి కూతురేనని తెలిపారు. బాలిక చున్నీ అపార్ట్మెంట్ 5వ ఫ్లోర్లో లభించగా ఆమె 5వ అంతస్తు నుంచి కిందకు దూకిందెమో.. అన్నట్లుగా పోలీసులు పోలీసులు వ్య క్తం చేశారు. బాలిక తలపై లోతు గాయం అవ్వడంతో పాటు నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. చదవండి: నిజామాబాద్లో రెచ్చిపోయిన రౌడీమూకలు పోస్టుమార్డమ్ రిపోర్టులో ఆత్మహత్యే.. బాలిక పోస్టుమార్డమ్ నివేదికలో మాత్రం హత్య చే యబడ్డ ఆనవాళ్లు లేనట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక తానంతట తానే అపార్ట్మెంట్పై నుంచి దూ కిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? సోమవారం రాత్రి బాలికను కుటుంబ సభ్యులెవ రూ బయటకు పంపకపోవడంతో బాలిక ఒక్కతే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన నాలుగు గంటలకే శవ మై కనిపించింది. అంతే కాకుండా తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్మెంట్ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్థుకు ఒక్కతే ఎలా వెళ్లగలిగింది? ఒకవేళ వెళ్లినా అపార్ట్మెంట్పైన రేలింగ్ చాలా ఎత్తులో ఉన్న ందున బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాన్ని బాలిక బంధువులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేమికుల దినోత్సవం రోజే ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. మరో ఆరు నెలల్లో పెళ్లి చేయాలనుకున్నాం.. బాలికకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో పెళ్లి చేయలేదు. మరో ఆరు నెలల్లో 18 ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని అనుకున్నామని బాలిక తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఇంతలోనే బాలిక మృతి చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. -
జీడిమెట్లలో బాలిక అనుమానాస్పద మృతి
సాక్షి, హైదరాబాద్: జీడిమెట్లలో ఓ బాలిక అనుమానాస్పద మృతి చెందిండం కలకలం రేపుతోంది. సుభాష్ నగర్కు చెందిన 17 ఏళ్ల బాలిక సోమవారం రాత్రి ఇంట్లో నుంచి ఆదృశ్యమైంది. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బాలిక ఆచూకీ కోసం వెతుకుతుండగా మంగళవారం తెల్లవారుజామున బాలిక మృతుహదేహం లభ్యమమైంది. జీడిమెట్ల పైప్ లైన్ రోడ్డులోని నిర్మాణంలో ఉన్న ఓ భవనంలో రక్తపు మడుగుల్లో బాలిక మృతదేహం కనిపించింది. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బాలికను హత్య చేశారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డాగ్ స్వాడ్, క్లూస్ టీంతో తనిఖీలు చేపట్టారు. అనుమానితులను, భవన నిర్మాణ కార్మికులు, స్థానికులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు.