-
హాస్టల్లో ఉండలేక.. పారిపోయేందుకు ప్రయత్నం
హయత్నగర్ (హైదరాబాద్): కళాశాల హాస్టల్లో ఉండలేక గోడదూకి పారిపోయేందుకు ప్రయతి్నంచిన ఓ విద్యార్థి కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ర్యాంకుల కోసం విద్యార్థులపై కార్పొరేట్ యాజమాన్యాల ఒత్తిడికి నిదర్శనంగా నిలిచిన ఈ హృదయ విదారకమైన సంఘటన గురువారం హయత్నగర్ పీఎస్ పరిధిలో వెలుగులోకి వచి్చంది. తెనాలికి చెందిన ఎ.విజయ్కుమార్ వ్యాపారం చేసుకుంటూ నగరంలోని ఈస్ట్ మారేడ్పల్లిలో నివాసముంటున్నారు.ఆయనకు ఓ కొడుకు, కూతురు సంతానం. కొడుకు గిరీశ్కుమార్ (15)ను ఇంటర్ మొదటి సంవత్సరం చదివించేందుకు పది రోజల కిందట హయత్నగర్ పీఎస్ పరిధిలోని కోహెడ వద్ద ఉన్న నారాయణ జూనియర్ కళాశాల హాస్టల్లో చేర్పించాడు. ఇక్కడ చదవడం ఇష్టం లేని విద్యార్థి తల్లిదండ్రులకు విషయం చెప్పాడు. దీంతో రెండ్రోజుల కిందట వచి్చన తల్లి కొడుకును బుజ్జగించి, మళ్లీ వచ్చి తీసుకెళ్తానని నచ్చజెప్పి వెళ్లింది. ఈ క్రమంలో హాస్టల్ నుంచి వెళ్లిపోవాలని భావించిన గిరీశ్కుమార్ బుధవారం రాత్రి కళాశాల నుంచి మెట్ల మార్గం ద్వారా బయటకు వెళ్లాడు. విద్యార్థి కనిపించక పోవడంతో నిర్వాహకులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గురువారం అర్ధరాత్రి తర్వాత కాలేజీ ప్రహరీ పక్కన గిరీశ్ మృతదేహాన్ని గురించ్తిన కాలేజీ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఒంటరిగా బయటికి వచి్చన విద్యార్థి హాస్టల్ గోడ దూకి పారిపోయేందుకు ప్రహరీ గోడ ఎక్కాడని, గోడ పక్కనే ఉన్న ట్రాన్స్ఫార్మర్ తీగలు తలకు తగిలి అక్కడికక్కడే మృతి చెందినట్లు గుర్తించారు. కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరీశ్ చనిపోయాడని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపించారు. -
హైదరాబాద్లో భారీ వర్షం.. మరో 3 రోజులు వానాలే వానలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాబోయే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.కాగా, హైదరాబాద్లో శుక్రవారం ఒక్కసారి వాతావరణం మారిపోయింది. భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. మాదాపూర్, గచ్చిబౌలి,బంజారాహిల్స్, చార్మినార్, మాదాపూర్, కొత్తపేట,చాదర్ఘాట్, మలక్పేట్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల్లో మధ్యాహ్నం వర్షం కురిసింది.రాష్ట్రంలోని కొమురం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. -
పోచారం ఇంట్లోకి దూసుకెళ్లిన బీఆర్ఎస్ నేతలు.. 12 మందిపై కేసు
సాక్షి, హైదరాబాద్: మాజీ స్పీకర్ పోచారం ఇంటికెళ్లిన బీఆర్ఎస్ నాయకులపై కేసు నమోదైంది. 12 మంది నేతలపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోచారం శ్రీనివాస్రెడ్డి ఇంట్లోకి బీఆర్ఎస్ నాయకులు దూసుకెళ్లడానికి ప్రయత్నించిన సంగతి తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్తో పాటు పలువురు హంగామా సృష్టించారు.తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి, ఆయన కుమారుడు భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ కండువా కప్పి కాంగ్రెస్లోకి సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మరోవైపు.. మాజీ స్పీకర్ పోచారం ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోచారం శ్రీనివాస్కు నివాసం వద్దకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, పార్టీ శ్రేణులు చేరుకున్నారు.పోచారం కాంగ్రెస్ పార్టీ చేరుతున్నారనే వార్తల నేపథ్యంలో వారంతా ధర్నాను దిగారు. ఇక, అంతకుముందు సీఎం రేవంత్ కాన్వాయ్ను బీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘మై గ్లామ్’లో మోడళ్లు..
స్థానిక రోడ్ నెం.1లోని పాప్ అప్ స్పేస్లో మై గ్లామ్ ఎగ్జిబిషన్ గురువారం ప్రారంభమైంది. రెండు రోజుల పాటు నిర్వహించే ప్రదర్శనలో వజ్రాభరణాలను మోడల్స్ ధరించి ర్యాంప్పై తళుక్కుమన్నారు.దేశ వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన డిజైనర్లు రూపొందించిన వజ్రాభరణాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు నిర్వాహకులు సుచరిత, మనోజ్ తెలిపారు. – బంజారాహిల్స్ఇవి చదవండి: బస్కింగ్.. జోష్! -
బస్కింగ్.. జోష్!
సాక్షి, సిటీబ్యూరో: మనం ఏదైనా బజార్లో షాపింగ్ చేస్తూ మన జేబులకు పనిచెబుతుంటాం... అక్కడే మూల ఖాళీగా ఉన్న ప్లేస్లో సంగీత బృందం మన చెవులకు పనికలపిస్తుంది.. మనం ఏదో ఖాళీ మైదానంలో వాకింగ్ చేయడానికి వెళతాం... అప్పటికే అక్కడ ఇద్దరో ముగ్గురో మ్యుజీషియన్లు కొన్ని వాయిద్యాలతో సంగీతాన్ని నడిపిస్తుంటారు.ఇలా ప్రజలు సంచరించే వీధుల్లో తమ కళను కళాకారులు ప్రదర్శించడాన్నే బస్కింగ్గా పేర్కొంటారు. పాశ్చాత్య దేశాల్లో విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ఈ బస్కింగ్ మన దేశంలో ఇంకా ప్రారంభ దశలోనే ఉంది. తాజాగా బస్కింగ్ను మెట్రో మెడ్లీ ద్వారా పూర్తి ప్రాచర్యంలోకి తెచ్చిన తొలి నగరంగా హైదరాబాద్ నిలిచింది. ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జూన్ 19 నుండి 22 వరకూ నగరంలోని మెట్రో స్టేషన్ల కారిడార్లలో గోథే–జెంట్రమ్ హైదరాబాద్ ‘మెట్రో మెడ్లీ’ని నిర్వహిస్తోంది.మెట్రో ప్రయాణికుల కోసం..ఈ ఈవెంట్లో దాదాపు 100 మందికి పైగా సంగీత విద్వాంసులు పాల్గొంటున్నారు. రోజువారీ ప్రయాణికులను ఆనందపరుస్తోంది. అమీర్పేట్, దిల్సుఖ్నగర్, ఎంజీబీ, పరేడ్ గ్రౌండ్, కూకట్పల్లి, హైటెక్ సిటీ, ఉప్పల్ వంటి మెట్రో స్టేషన్లలో బస్కింగ్ ఈవెంట్ జరుగుతుంది. ‘నగరవాసుల మెట్రో ప్రయాణానికి సంగీతంతో ఆనందాన్ని జత చేయడమే బస్కింగ్ ఉద్దేశమని’ అని గోథే–జెంట్రమ్ హై ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ నూరియా వాహనవతి ‘సాక్షి’తో చెప్పారు.జాజ్, టాలీవుడ్, రాక్ నుంచి బాలీవుడ్ వరకూ వివిధ సంగీత శైలులు వీనుల విందు చేస్తాయన్నారు. కళాకారులకు ప్రత్యక్షంగా సంగీత ప్రియుల స్పందన తెలియజేయడం ద్వారా ప్రోత్సాహాన్ని అందిస్తుందన్నారు. సంగీత కళాకారులను 20 గ్రూపులుగా విభజించారు, హైటెక్ సిటీ మెట్రో స్టేషన్ లో ప్రదర్శన ఇచ్చిన ఏకం బ్యాండ్ గాయకుడు స్లోక రాజు మాటల్లో..చెప్పాలంటే ఇదో వైవిధ్యభరిత అనుభూతి.. బుధవారం అమీర్పేట్ మెట్రో స్టేషన్లో ప్రదర్శన అందించిన కలెక్టివ్ సభ్యుడు, సాక్సాఫోన్ వాయించడంలో పేరొందిన జార్జ్ హల్ మాట్లాడుతూ, ‘నిజ జీవితంలో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ సంగీతం..వాటికి రిలాక్సేషన్ అందిస్తుంది. బస్కింగ్ నగరవాసులకు ఓ వింత అనుభూతి’ అని చెప్పారు.నాటిదే.. నేటికీ..తోలుబొమ్మల ప్రదర్శనలు లేదా పాము మంత్రగాళ్లు వంటి సంప్రదాయ వీధి ప్రదర్శనలు భారతీయ సంస్కృతిలో ఒక భాగం, అయితే అలాంటి కళారూపాలు కనుమరుగయ్యాయి. మరికొన్ని అరుదైపోయాయి. ఈ నేపధ్యంలో బస్కింగ్ పేరిట ఔత్సాహిక కళాకారుల్ని ప్రోత్సహించే ఆధునిక సంస్కృతి నగరానికి పరిచయం కావడం ఆహా్వనించదగ్గ పరిణామమే..బస్కింగ్కి వెల్కమ్..ఎటువంటి ముందస్తు అంచనాలూ లేకుండా ప్రజలకు సంగీత విందును పంచడం మరోవైపు కళాకారులకు ప్రోత్సాహం అందించడం...లక్ష్యాలుగా తొలిసారి నగరంలో బస్కింగ్ ట్రెండ్కి నాంది పలికాం. పాశ్చాత్య దేశాల్లో సర్వసాధారణమైన ఈ శైలికి ఈ స్థాయిలో వెల్కమ్ చెప్పిన తొలి నగరం మనదే. కార్యక్రమానికి మంచి స్పందన లభిస్తోంది.–నూరియా వాహనవతి, ప్రోగ్రామ్ కో–ఆర్డినేటర్ గోథే–జెంట్రమ్ఇవి చదవండి: 'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి... -
'సెల్-బే' లో.. సినీతార ‘వర్షిణి’ సందడి...
సాక్షి, సిటీబ్యూరో: ప్రముఖ టాలీవుడ్ నటి, యాంకర్ వర్షిణి గచ్చిబౌలిలోని సెల్ బే స్టోర్ వేదికగా సందడి చేశారు. షావోమీ ఆధ్వర్యంలోని సరికొత్త 5జీ హ్యాండ్సెట్ షావోమీ 14 సీవీ మోడల్ను నటి వర్షణి గురువారం ఆవిష్కరించారు.ఎప్పటికప్పుడు మారిపోతున్న సాంకేతికత అధునాతన జివన విధానానికి చేరువ చేస్తుందని ఆమె అన్నారు. వినూత్న ఫీచర్స్తో రూపొందించిన ఈ బ్రాండ్ను ఆవిష్కరించడం సంతోషమన్నారు. తెలంగాణ కస్టమర్లకు అధునాతన ఉత్పత్తులను అందించడంలో తమ సంస్థ ముందుంటుందని సెల్ బే వ్యవస్థాపకులు, ఎండీ సోమా నాగరాజు పేర్కొన్నారు.ఇండియా డిప్యూటీ హెడ్ కునాల్ అగర్వాల్, ఛానల్ సేల్స్ డైరెక్టర్ మల్లికార్జున రావు, ట్రేడ్ ఛానల్ హెడ్ సాజు రత్నం, జోనల్ హెడ్ సయ్యద్ అన్వర్, నేషనల్ రిటైల్ ఎండీ మొహమ్మద్ ఇఫ్తేకర్ పాల్గొన్నారు.ఇవి చదవండి: బే విండోకు.. డిజైన్ ఎక్స్లెన్స్! -
బే విండోకు.. డిజైన్ ఎక్స్లెన్స్!
నగరంతో పాటు పలుచోట్ల అందుబాటులోని ఫ్యాషన్ ప్రీమియర్ మిడ్–లగ్జరీ బ్రాండ్ బే విండోకు ప్రతిష్టాత్మక డిజైన్ ఎక్సలెన్స్ అవార్డ్ లభించింది. ఈ విషయాన్ని సంస్థకు చెందిన డిజైన్ లీడ్ సిద్ధాంత్ ఆనంద్ తెలిపారు.బ్రాండ్ను ప్రారంభించిన సంవత్సరంలోనే ఈ ప్రశంసలు లభించడం తమ డిజైన్ల వైవిధ్యానికి నిదర్శనమని, భారతీయతను ప్రతిబింబించే దాదాపు 1000కిపైగా అత్యాధునిక డిజైన్ల రూపకల్పన ద్వారా ఈ అవార్డుకు అర్హత పొందామని సంతోషం వ్యక్తం చేశారు.ఇవి చదవండి: ‘తాన్సేన్’ మొఘల్ వైభవం.. -
‘తాన్సేన్’ మొఘల్ వైభవం..
ఐదు దశాబ్దాల వారసత్వంతో ఆహార ప్రియులకు విభిన్న రుచులను అందిస్తున్న ఓహ్రీస్ గ్రూప్ ఔటర్రింగ్ రోడ్డు పక్కన, ఐటీ జోన్కు సమీపంలో తాన్సేన్ రెస్టారెంట్ను గురువారం ప్రారంభించింది.అద్భుతమైన పాకశాస్త్ర వారసత్వం, మొఘల్ వైభవంతో దీన్ని తీర్చిదిద్దామని సంస్థ చైర్మెన్ అమర్ ఓహ్రి పేర్కొన్నారు. లెజండరీ సంగీత కారకుడు తాన్సేన్ నుంచి ప్రేరణ పొంది గ్యాస్టోన మీ స్వచ్ఛమైన ఆనందాన్ని పొందుపరిచే రుచుల వేడుకగా ఇది నిలుస్తుందన్నారు. విభిన్న రుచులు, వంటకాల నైపుణ్యంతో ప్రతి వంటకం ఓ అద్భుత కళాఖండంలా తాన్సేన్లో ఉంటుందని చెఫ్ కన్సల్టెంట్ అనూజ్ వాధావన్ అన్నారు. - మణికొండ -
యోగమస్తు..! భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం..!!
సంప్రదాయ భారతీయ ‘యోగ’ ఇప్పుడు విశ్వవ్యాప్తమైంది. మన దేశస్తులతో పోటీ పడుతూ విదేశీయులు కూడా ఆరోగ్య‘యోగ’ం కోసం తపిస్తున్నారు. మన సంస్కృతీ సంప్రదాయాల్లో మమేకమైన ఆసనం...ఇప్పుడు ఆరోగ్యార్థుల పాలిట శాసనంగా మారింది. ఈ నేపథ్యంలో మన వాళ్లే కాకుండా పాశ్చాత్యులు కూడా యోగ సాధన కోసం నగరానికి క్యూ కడుతున్నారు. మేము సైతం అంటూ యోగ మార్గానికి జై కొడుతున్నారు. – సాక్షి, సిటీబ్యూరోసాంత్వన–ఉత్తేజమయం...దేహానికి ధ్యానంలాంటిది...యోగ. ఒక్కో ఆసనం శరీరంలోని ఒక్కో అవయవానికి సాంత్వనను, ఉత్తేజాన్ని అందిస్తుంది. యోగలోని విభిన్నమైన బ్రీథింగ్ టెక్నిక్స్ శారీరక, మానసిక ఉపశమనాన్ని నెలకొల్పుతాయి. దశాబ్దకాలంగా ఆస్వాదనతో, అంకితభావంతో యోగ చేస్తున్నాను. ఫిట్నెస్ కోసమో, మరువు తగ్గించుకోడానికి మాత్రమే కాకుండా నిత్య జీవనం పై ఎంతో ప్రభావం చూపిస్తుంది. యోగాసనాలు యవ్వనత్వాన్ని కాపాడుతూ, చర్మాన్ని సున్నితంగా ఉంచడంతో పాటు ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. దృష్టి కేంద్రీకరణ, మానసిక నిలకడ–సమతుల్యతలో యోగ మంచి ప్రభావాన్ని చూపిస్తుంది. షూటింగ్లో ఉన్నా, ఇతర ప్రాంతాల్లో ప్రయాణం చేస్తున్నా నిత్యం యోగ చేస్తుంటాను. ప్రాణాయామం, శ్వాస వ్యాయామాలు చేయడం ఇష్టం. ఎక్కువ కాలం యోగతో ప్రయాణం..ఆనందమయ జీవితానికి వారధి.– శ్రద్దాదాస్, ప్రముఖ సినీనటి.యోగ, ప్రాణాయామం, ధ్యాన సమ్మేళనం... మానవ జీవితానికి అందిన అద్భుత వరం ..యోగ. యోగాసనాలు శారీరక, మానసిక స్థిగతులపైన ఉత్తేజకర ప్రభావాన్ని చూపించడమే కాకుండా అంతర్గత శక్తిని ప్రసాదిస్తుంది. వీటి సమ్మేళనం జీవితంలో ఒక నూతన మార్గాన్ని సూచిస్తుంది. యోగలో ఎన్నో ఆసనాలు ఉన్నప్పటికీ నిత్య జీవనంలో ప్రత్యేకించిన 25–30 ఆసనాలు తప్పనిసరిగా చేయాలి. యోగ నిత్య ప్రయాణంలో క్రమ క్రమంగా శాశ్వత ప్రయోజనాలను అందిస్తుంది. ప్రస్తుత ఆధునిక, సాంకేతిక యుగంలో యోగను తప్పనిసరి దైనందిన చర్యగా మార్చుకోవాల్సిన అవసరముంది.– యోగాన్వేషి స్వప్న, యోగా శిక్షకురాలు. హైదరాబాద్. స్పృహ ‘వర్సెస్’ ఆందోళన...సామాజికంగా పెరిగిపోయిన ఆందోళన, అనిశ్చితి వంటి పరిస్థితులకు యోగ చక్కటి పరిష్కార మార్గం. ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా గతేడాది మానసిక వైద్యులను సంప్రదించిన సందర్శకులు, యాంటీ డిప్రెసెంట్స్ వాడుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని గణాంకాలు వెల్లడించాయి. సాధారణ ఆందోళన స్థాయి నుంచి అస్పష్టమైన చంచలత్వం, తీవ్ర శారీరక లక్షణాలు.. మూర్ఛపోయేంతలా మానసిక ఆందోళనలు పెరిగిపోతున్నాయి.ఆందోళన అనేది కేంద్ర నాడీ వ్యవస్థపై నియంత్రించలేని ప్రభావాన్ని చూపిస్తుంది. ఇలాంటి సమస్యలకు యోగ పరిష్కారాలను సూచిస్తుంది. భావోద్వేగ నేపథ్యంతో పనిచేసే యోగ మెదడు సిగ్నలింగ్ వ్యవస్థను తిరిగి సున్నితం చేయడంలో సహాయపడుతుంది. భారతీయ సంస్కృతిలోని యోగ ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతున్న మానసిక ఆందోళనను సమాధానపరుస్తుంది.– ఇరినా తాషె్మట్, ఉజ్బెకిస్తాన్. (కన్హా శాంతి వనంలో యోగా ఆభ్యాసకురాలు)ఐక్య వేడుకగా...అంతర్జాతీయ యోగ దినోత్సవ నేపథ్యంలో ఏటా యోగాకు పెరుగుతున్న ఆదరణ, ఉత్సాహం, ఐక్యత చూసి ఆశ్చర్యపోతున్నాను. యోగ సెషన్లో భాగంగా యోగలోని ఎనిమిది భాగాల్లో దేనిని సాధన చేసినా ఆసనం, ప్రాణాయామం, ధారణ, ధ్యానం, యామ–నియామ ప్రయోజనాలను అందిస్తుంది. అనతికాలంలోనే యోగ విశ్వవ్యాప్తమైంది. హార్ట్ఫుల్నెస్ సెంటర్ ఆధ్వర్యంలో అధికారిక వేడుకలకు ముందుగా ప్రపంచవ్యాప్తంగా వేడుకలను సమన్వయం చేస్తుంది.ఇందులో జైపూర్లోని ఓ గ్రామం నుంచి యునెస్కో–ప్యారిస్, యునైటెడ్ నేషన్స్–న్యూయార్క్ వరకూ అన్ని హార్ట్ఫుల్నెస్ బృందాలు ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగ దేశాన్ని దాటి వివిధ భాషలు, మతాలు, సంప్రదాయాలకు అతీతంగా ఐక్య వేడుకగా మారింది. యోగ కార్యక్రమాలను సిద్ధం చేయడం, నిర్వహించడం యోగ చేసిన అనుభూతిని అందిస్తుంది.– డాక్టర్ వెరోనిక్ నికోలాయ్ (ఫ్రాన్స్), హార్ట్ఫుల్నెస్ యోగ అకాడమీ డైరెక్టర్.ఇవి చదవండి: International Day of Yoga 2024: యోగా... మరింత సౌకర్యంగా! -
అందనంత అద్దెలు
సాక్షి, హైదరాబాద్: ‘‘ఇందుమతి మాదాపూర్లోని ఓ అపార్ట్మెంట్లో అద్దెకుంటోంది. 2 బీహెచ్కే ఫ్లాట్కు రూ.15 వేలతో మొదలై.. ఏటా 10 శాతం పెరుగుదలతో గత ఐదేళ్లలో కిరాయి రూ.22,500కు చేరింది. మెయింటెనెన్స్ చార్జీలు అదనం. అయితే ఇటీవలే ఇంటి యజమాని ఆమెకు ఫోన్ చేసి ఈ నెల నుంచి రూ.5 వేలు రెంట్ అదనంగా పెంచుతున్నట్లు చెప్పాడు. ఇష్టముంటే ఉండండి.. లేకపోతే ఖాళీ చేయండంటూ హుకుం జారీ చేశాడు. ఇప్పటికప్పుడు వేరే ఇల్లు వెతుక్కోవడం, షిఫ్టింగ్ అంటే వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. వీటికి తోడు స్థానికంగా ఓ ప్రముఖ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్న తన పిల్లల చదువుకు ఆటంకం కలుగుతుంది. దీంతో చేసేదేం లేక అదనపు అద్దెకు అయిష్టంగానే ఒప్పుకుంది.’’ఇది ఇందుమతి ఒక్కరికే కాదు నగరంలోని చాలా మంది పరిస్థితి ఇదే. విద్యా సంస్థలు, కార్యాలయాలు పునఃప్రారంభం కావడంతో నగరంలో అద్దెలకు డిమాండ్ బాగా పెరిగింది. ఒక ప్రాంతానికో లేదా కాలనీకో ఇది పరిమితం కాలేదు. కాస్త పేరున్న ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి ఉంది.స్కూళ్లు, ఆఫీసులున్న చోట హాట్కేక్లు..పేరున్న విద్యాసంస్థలు, ఆసుపత్రులకు చేరువలో ఉన్న ప్రాంతాల్లో గృహాలకు డిమాండ్ విపరీతంగా ఉంది. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంతూర్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టులెట్ బోర్డులు కనిపించేవి కానీ, కరోనా ప్రభావం నుంచి పూర్తిగా కోలుకున్న కంపెనీలు ఉద్యోగులను తిరిగి ఆఫీసులకు రప్పించాయి. దీంతో ఆఫీసులకు చేరువలో ఉన్న ప్రాంతాలలో అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లలో కిరాయిలు హాట్కేక్లా మారాయి.అమీర్పేట, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, మణికొండ, కూకట్పల్లి, ఉప్పల్, ఎల్బీనగర్, కొంపల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు గణనీయంగా పెరిగాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కూకట్పల్లి వంటి ప్రాంతాల్లో అద్దెలు ఆరు నెలల కాలంలో 15 శాతానికి పైగానే పెరిగాయి. బేగంపేట, ప్రకాశ్ నగర్, సోమాజిగూడ, పంజగుట్ట, బోయిన్పల్లి, మారేడుపల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20–25 శాతం అద్దెలు పెరిగాయి.నడ్డివిరుస్తున్న అద్దెలు..హైదరాబాద్లో ఇంటి అద్దెలు కిరాయిదారుల నడ్డి విరుస్తున్నాయి. తమ జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ నిట్టూర్చే సగటు జీవి.. పెరిగిన ఈ అద్దెలను భరించలేక నగర శివార్లకు తరలి వెళ్తుండటంతో అక్కడ కూడా అద్దెలు భారీగానే పెరుగుతున్నాయి. అనరాక్ సంస్థ ఇటీవల విడుదల చేసిన ఓ అధ్యయనం ప్రకారం హైదరాబాద్లోని కొన్ని ప్రాంతాల్లో అద్దెలు గతేడాదితో పోలిస్తే ఈ సంవత్సరం తొలి మూడు నెలల కాలంలోనే 10–15 శాతం పైగానే పెరిగాయి. గతంలో రూ.10–15 వేలకు నగరం నడి మధ్యలో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు అద్దెకు లభించేవి. కానీ, ఇప్పుడు రూ.20–25 వేలకు పైగా ఖర్చు చేస్తే కానీ దొరకని పరిస్థితి.అడ్వాన్స్లు, మెయింటెనెన్స్ల భారం కూడా..ఇంటిని అద్దెకు ఇవ్వాలంటే 3–4 నెలలు అడ్వాన్స్ను ఇంటి యజమానులు వసూలు చేస్తున్నారు. పైగా ఫ్లాట్ అద్దెతో పాటు ప్రతి నెలా మెయింటెనెన్స్ వ్యయం కూడా అద్దెదారుల పైనే పడుతుంది. 2 బీహెచ్కే అపార్ట్మెంట్ అద్దె రూ.25 వేలు ఉండగా.. నిర్వహణ ఖర్చు రూ.2 నుంచి రూ.5 వేలు చెల్లించాల్సి ఉంటుంది.అద్దె చట్టం ఏం చెబుతోందంటే..⇒ అద్దెదారుడు, యజమాని మధ్య నిబంధనలు.. షరతులతో కూడిన రెంటల్ అగ్రిమెంట్ రాసుకోవాలి. దీన్ని సంబంధిత జిల్లా రెంట్ అథారిటీకి సమర్పించాలి.⇒ ఓనర్ నాన్ కమర్షియల్ బిల్డింగ్ లేదా ఇళ్లకు సంవత్సరానికి 8 నుంచి 10 శాతానికి మించి అద్దె పెంచకూడదు. అది కూడా 3 నెలల ముందే కిరాయిదారునికి నోటీసు అందించాలి.⇒ కిరాయిదారులు, యజమానుల వివాదాలను పరిష్కరించడానికి ప్రతి జిల్లాలో ప్రత్యేక అద్దె అధికారులు, కోర్టు, ట్రిబ్యు నల్లను ఏర్పాటు చేయాలి.⇒ అద్దెదారుడు ప్రాపర్టీకి సంబంధించి నకిలీ పత్రాలను సృష్టించి బ్యాంకులో తనఖా పెట్టడం, రుణాలు తీసుకోవడం వంటి అక్రమాలకు పాల్పడకూడదు.⇒ ఒకవేళ అద్దెదారుడు ఇంటిని ఖాళీ చేయాలని భావిస్తే యజమానికి మూడు నెలల ముందు తెలపాలి.⇒ కిరాయిదారుడు ఇంటి లోపల విద్యుత్ వైర్లు, బోరు, నల్లా, టైల్స్, బాత్రూమ్, శాని టేషన్ వంటి వాటికి నష్టం కలిగించకూడదు. రిపేర్లకు సంబంధించి అయ్యే ఖర్చును యజమానే భరించాలి.కరోనా తర్వాత నుంచి..కరోనా కాలంలో నివాస అద్దెలు దీర్ఘకాలం పాటు నిలిచిపోయాయి. ఆఫీసుల పునఃప్రారంభం తర్వాత నుంచి అద్దెలకు డిమాండ్ పెరిగింది. హైదరాబాద్,బెంగళూరు, పుణే, ముంబై వంటి ప్రధాన నగరాల్లో కిరాయిలు గణనీయంగా పెరుగుతున్నాయి. కేంద్రం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలతో రానున్న రోజుల్లో నగరాలు అభివృద్ధి చెందడం ఖాయం. దీంతో సమీప భవిష్యత్తులో నివాసాలకు మరింత డిమాండ్ ఏర్పడుతుంది. – అనూజ్ పూరీ,చైర్మన్, అనరాక్ గ్రూప్ -
మేడ్ ఇన్ ఇండియా రోబోట్.. మోకాలి మార్పిడి ఇక మరింత సులభం
టెక్నాలజీ పెరుగుతున్న తరుణంలో ప్రతి రంగంలోనూ కొత్త ఉత్పత్తులు లేదా అప్డేటెడ్ ఉత్పత్తులు పుట్టుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ గ్లోబల్ మెడికల్ డివైజ్ కంపెనీ 'మెరిల్' అడ్వాన్స్డ్ సర్జికల్ రోబోటిక్ టెక్నాలజీ 'మిస్సో' (MISSO)ను లాంచ్ చేసింది.కంపెనీ లాంచ్ చేసిన ఈ లేటెస్ట్ రోబోటిక్ సిస్టం (రోబోట్) పూర్తిగా భారతదేశంలోనే తయారైంది. దీని ద్వారా మోకాలి మార్పిడికి (Knee Replacement) సంబంధించిన సర్జరీలు మరింత విజయవంతంగా నిర్వహించబడతాయి.ఇప్పటి వరకు భారతదేశంలోని చాలా హాస్పిటల్స్ మోకాలి మార్పిడి శస్త్రచికిత్సల కోసం ఎక్కువ డబ్బును వెచ్చించి.. విదేశీ రోబోటిక్ టెక్నాలజీలను ఉపయోగిస్తున్నాయి. అయితే మిస్సో తమ కొత్త రోబోట్ 66 శాతం తక్కువ ధరకు అందించడానికి సిద్ధమైంది. ఇది ఇతర రోబోటిక్ టెక్నాలజీలకు ఏ మాత్రం తీసిపోకుండా చాలా అద్భుతంగా పనిచేస్తుంది.ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోబోటిక్ టెక్నాలజీలు కొంత పెద్ద ఆసుపత్రులకు మాత్రమే పరిమితమై ఉన్నాయి. కానీ MISSO అనేది చిన్న ఆసుపత్రులకు, టైర్ 2, టైర్ 3 నగరాల్లోని ఆసుపత్రులకు అందుబాటులోకి తీసుకురాగల మొట్టమొదటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ రోబోట్.భారతదేశంలో 40 ఏళ్లు పైబడిన 10 మందిలో ముగ్గురు కీళ్ల అరుగుదలతో బాధపడుతున్నారు. దీనికి 'టోటల్ క్నీ రీప్లేస్మెంట్' (TKR) విధానం ద్వారా.. దెబ్బతిన్న లేదా అరిగిపోయిన మోకాలి కీలును మెటల్, అల్ట్రా-హై మాలిక్యులర్ వెయిట్ పాలిథిలిన్తో చేసిన కృత్రిమ కీలుతో భర్తీ చేస్తారు. దీనికి సర్జరీ అవసరం. సర్జరీ తరువాత ఎక్కువ నొప్పిని భరించాల్సి ఉంటుందని చాలా మంది భయపడతారు. కానీ సాధారణ సర్జరీతో పోలిస్తే.. రోబోటిక్ సర్జరీ కొంత ఉత్తమమని, దీని ద్వారా సర్జరీ జరిగితే నొప్పి కూడా కొంత తక్కువగా ఉంటుందని తెలుస్తోంది.కీళ్ల అరుగుదల అనేది భారతదేశంలో 22 నుంచి 39 శాతం జనాభాలో ఉన్నట్లు సమాచారం. మనదేశంలో ఏడాదికి 5.5 లక్షల మంది మోకాలి మార్పిడికి గురవుతున్నారు. ఐదు సంవత్సరాల క్రితంతో పోలిస్తే.. ఈ సంఖ్య గణనీయంగా పెరిగినట్లు కొన్ని గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుతం మన దేశంలో జరుగుతున్న సర్జరీలలో మోకాలి మార్పిడికి సంబంధించిన సర్జరీలు 7 నుంచి 8 రెట్లు ఎక్కువని తెలుస్తోంది.లేటెస్ట్ మిస్సో రోబోట్ లాంచ్ కార్యక్రమంలో మెరిల్లో మార్కెటింగ్ హెడ్, ఇండియా & గ్లోబల్ 'మనీష్ దేశ్ముఖ్', సన్షైన్ బోన్ చైర్మన్, చీఫ్ రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ కిమ్స్ సన్షైన్ హాస్పిటల్స్లో జాయింట్ ఇన్స్టిట్యూట్ & మేనేజింగ్ డైరెక్టర్ చైర్మన్ 'డాక్టర్ ఏ.వీ గురవ రెడ్డి' పాల్గొన్నారు. ఈ కొత్త రోబోట్ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని వెల్లడించారు. -
ఎంగేజ్ విత్ సిటీ..
లామకాన్లో సంగీత దినోత్సవం..ప్రపంచ సంగీత దినోత్సవాన్ని పురస్కరించుకుని పాశ్చాత్య సంగీత ప్రియుల కోసం అశ్రిత డిసౌజా ఆధ్వర్యంలో పాప్, జాజ్, డిస్నీ సాంగ్స్ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్లోని లామకాన్లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం సాయంత్రం 5 నుంచి 2 గంటల పాటు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరోచిన్నారుల కోసం మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్..ప్రతిభావంతులైన చిన్నారుల కోసం ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ మ్యాక్స్ కిడ్స్ ఫెస్టివల్ నిర్వహిస్తోంది. ఈ విషయాన్ని సంస్థ ప్రతినిధులు తెలిపారు.చిన్నారుల ఊహలకు డ్రాయింగ్, కలరింగ్స్తో ఊపిరిపోసే విధంగా వారిలోని ఊహాశక్తిని, సృజనను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమ ఉద్ధేశ్యమని, తమ మ్యాక్స్ స్టోర్ అందించే రీసైక్లింగ్ పేపర్తో తయారు చేసిన షాపింగ్ బ్యాగ్పై ‘భూమిని కాపాడే సూపర్హీరో’ అనే నేపథ్యంతో చిత్రాలను గీయాల్సి ఉంటుందని వివరించారు. తుది ఏడుగురు విజేతలకు పూర్తిస్థాయి ఖర్చులతో కుటుంబంతో సహా కశ్మీర్ పర్యటనను గెలుచుకుంటారని తెలియజేశారు. వివరాలకు దగ్గర్లోని మ్యాక్స్ స్టోర్లో సంప్రదించాలన్నారు. – సాక్షి, సిటీబ్యూరోఇవి చదవండి: 'షావోమీ 14 సీవీ మోడల్' ఆవిష్కరణ.. సినీతార వర్షిణి సౌందరాజన్.. -
కాఫీ పరిమళం..! ఎంతో పరవశం..!!
ఒక సిప్ గొంతులోకి వెళ్తే ఎంత ఆస్వాదిస్తామో.. పొగలు కక్కే కప్పులోంచి ఆ పరిమళం నాసికకు సోకినా అంతే గొప్పగా ఆఘ్రాణిస్తామంటారు కాఫీ ప్రియులు. అలాంటి కాఫీ ప్రియుల నాసికలకు పరీక్ష పెట్టిన కప్పా సెషన్ ఆకట్టుకుంది. ఓ వైపు కాఫీల ఘుమఘుమలు.. మరోవైపు కాఫీ గింజల ఉత్పత్తి దారులతో చర్చలు.. వెరసి నిర్వహించిన క్రాఫ్టింగ్ కాఫీ కల్చర్ ఈవెంట్ నవాబుల నగరంలో పెరుగుతున్న కాఫీ సంస్కృతికి అద్దం పట్టింది. – సాక్షి, సిటీబ్యూరోకాఫీ ప్రియులు, కాఫీ గింజల పెంపకందారులు, కేఫ్ యజమానులు స్పెషాలిటీ కాఫీ కమ్యూనిటీకి చెందిన నిపుణులను ఒకేచోట చేర్చి నిర్వహించిన కార్యక్రమం ఆకట్టుకుంది. నగరానికి చెందిన ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ ఆధ్వర్యంలో మాదాపూర్లో ఉన్న కోరమ్లో బుధవారం సాయంత్రం నిర్వహించిన ఈ ఈవెంట్లో రత్నగిరి ఎస్టేట్ నుంచి తీసుకువచ్చిన సరికొత్త స్పెషాలిటీ కాఫీలను ప్రదర్శించారు.ఆకట్టుకున్న పరిమళాల గుర్తింపు..ఈ ఈవెంట్లో భాగంగా కప్పా సెషన్ పేరిట కాఫీ ఫ్లేవర్లను గుర్తించేందుకు కాఫీ ప్రియులకు అవకాశం ఇచ్చారు. విభిన్న రకాల కాఫీలను కప్పులలో అందజేసి వాటిని నాసిక ద్వారా ఆఘ్రానించడం ద్వారా ఫ్లేవర్లను గుర్తించడం, రేటింగ్ ఇవ్వడం వంటివి చేయడంలో కాఫీ లవర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా రత్నగిరి ఇంటర్నేషనల్ మేనేజింగ్ పార్టనర్ అశోక్ పాత్రే, ఫస్ట్ క్రాక్ స్పెషాలిటీ రోస్టర్స్ నిర్వాహకురాలు ఎస్ఆర్కె చాందినీలతో ఆహుతులకు ముఖాముఖి సెషన్ నిర్వహించారు.ఇవి చవవండి: టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్.. -
టేస్ట్ 'బ్లాగుం'ది..! హాబీగా ఫుడ్ బ్లాగింగ్..
నగరంలో ఫుడ్ బ్లాగింగ్ హాబీ మారుతోంది.. చెప్పుకోదగ్గ సంఖ్యలో సభ్యులు పూర్తిస్థాయి ప్రొఫెషన్స్గా స్థిరపడుతున్నారు. చారిత్రక నేపథ్యం, ఆధునిక వైవిధ్యం.. కలగలిసిన మన నగరం వైవిధ్యమైన అభిరుచులను కలిసి ఆస్వాదించడానికి బ్లాగర్లకు అనేక అవకాశాలను అందిస్తోంది. వీటిని అందిపుచ్చుకుని నగరవ్యాప్తంగా విభిన్న రుచుల విశిష్టతలను వెలుగులోకి తెస్తున్న బ్లాగర్స్..పెద్ద సంఖ్యలో ఫాలోవర్స్ను దక్కించుకుంటూ అటు భోజన ప్రియులకు, ఇటు ఆహార ఉత్పత్తుల విక్రయదారులకు ఆప్తులుగా మారుతున్నారు. ఈ నేపథ్యంలో ఫుడ్ బ్లాగర్స్కు సంబంధించి నగరంలో చోటు చేసుకుంటున్న పరిణామాల గురించి తెలుసుకుందాం. – సాక్షి, సిటీబ్యూరోనిన్న మొన్నటి వరకూ ఫుడ్ బ్లాగింగ్ అంటే ఏంటో ఎవరికీ తెలీదు. కానీ కొంతకాలంగా నగరంలో ఫుడ్ బ్లాగింగ్ సంప్రదాయంగా మారుతోంది. ప్రస్తుతం ఫుల్–టైమ్ ఫుడ్ బ్లాగర్స్ చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నారు. ఈ విషయంలో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నయ్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. ఆ నగరాల స్థాయిలోనే మన నగరం నుంచీ బ్లాగర్లు పెరుగుతున్నారు. నిజామ్ల నగరంలో ఫుడ్ బ్లాగింగ్ కల్చర్తో మమేకమౌతున్నారు.బ్లాగర్స్ మీట్స్..నగరంలోని ఫుడ్ బ్లాగర్స్ సోషల్ మీడియా వేదికల వారీగా వేర్వేరు టీమ్స్గా ఏర్పడుతున్నారు. ఇటీవల వార్షిక ఇన్స్టాగ్రావ్ు ఫుడ్ బ్లాగర్ల సమావేశం జూబ్లీహిల్స్లోని ఫ్రోత్ ఆన్ టాప్లో జరిగింది. దీంట్లో 70 మందికి పైగా ఫుడ్ బ్లాగర్లు ఒకే చోట సమావేశమయ్యారు. సరదా సంగీతం, ఆట పాటలతో ఉల్లాసంగా గడిపారు. ‘ఈ ఈవెంట్ ద్వారా, ఇన్ఫ్లుయెన్సర్లు, బ్లాగర్లు ఒకరినొకరు కలుసుకోవడానికీ, పలకరించుకోవడానికీ, కొత్త స్నేహితులను ఏర్పర్చుకోవడానికి వేదిక నిలుస్తుందని’ నిర్వాహకులు గత ఏడేళ్లుగా ఫుడ్ బ్లాగర్గా పేరొందిన కిరణ్ సాహూ తెలిపారు.బ్లాగర్లు వ్లాగర్లుగా, ఆ తర్వాత ఇన్స్టా రీల్స్ ద్వారా కంటెంట్ డెవలపర్స్గా.. ఇటీవల కాలంలో ఇన్ఫ్లుయెన్సర్లుగా రూపాంతరం చెందుతున్నారు. ప్రస్తుతం పలు ప్రముఖ బ్రాండ్లకు ప్రచారం, ప్రమోషన్లను అందించడానికి వీరు ఖరీదైన ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారు.ఫుడీ నుంచి ఇన్ఫ్లుయన్సర్గా... వ్యక్తిగతంగా ఫుడ్ లవర్ అయిన కిరణ్ సాహూ.. సిటీలో దినదిన ప్రవర్ధమానమవుతున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్లకు కేరాఫ్లా మారారు. గత ఏడేళ్లుగా నగరంలో రుచుల జర్నీ సాగించిన ఆమె.. ఇప్పుడు రోజూ కనీసం ఒకటి నుంచి మూడు వరకూ బ్రాండ్ ప్రచార కార్యక్రమాలతో బిజీ బిజీగా ఉంటారు.‘మేం బ్లాగింగ్లోకి ప్రవేశించినప్పుడు మొత్తం లెక్కేస్తే 10మంది బ్లాగర్లు కూడా లేరు. ఇప్పుడు అన్ని స్థాయిల్లో కలిపి 1000 నుంచి 2000 మంది ఉంటారు’ అని సాక్షితో అన్నారు. ఓ వైపు కార్పొరేట్ ఉద్యోగం.. మరోవైపు చిన్న బిజినెస్ నిర్వహిస్తూనే ఫుడ్ బ్లాగర్గా రాణిస్తున్న ఈ మాదాపూర్ నివాసి... ఇష్టమైన వ్యాపకాలు ఎన్ని చేసినా కష్టం అనిపించవు అంటూ స్పష్టం చేస్తున్నారు.పురస్కారాల వంట...సిటీ ఫుడ్ బ్లాగర్స్ లక్షల సంఖ్యలో ఫాలోవర్స్కు, మిలియన్ల సంఖ్యలో వీక్షకులకు చేరువవుతున్నారు. అంతే కాదు చెప్పుకోదగ్గ సంఖ్యలో పురస్కారాలను కూడా అందుకుంటున్నారు. మెట్రో నగరాల్లోని ఫుడ్ బ్లాగర్స్కు థీటుగా బ్రాండ్స్కు ప్రచారం చేస్తూ తగినంత రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఓ చేత్తో సంపాదిస్తూనే.. మరో చేత్తో అవార్డులను కూడా సొంతం చేసుకుంటున్నారు.బిర్యానీ ఒక్కటే కాదు...వంటగది నుంచి తన ప్రయాణాన్ని ప్రారంభించి నగరంలో అత్యంత ప్రముఖ ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్స్లో ఒకరిగా మారారు హోటల్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేట్, ఫుడ్ ఇన్ఫ్లుయన్సర్, మార్కెటర్ మొహమ్మద్ జుబైర్ అలీ. సమగ్ర రుచుల సమీక్షల నుంచి ఆకట్టుకునే ఫొటోగ్రఫీ వరకూ ఆయన నిర్వహించే ‘హైదరాబాద్ ఫుడ్ డైరీస్’ పేజీ అనేక ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తోంది.రెస్టారెంట్లు లాంజ్ల నుంచి ఆకట్టుకునే వీధి తినుబండారాల వరకూ పసిగట్టి.. వాటికి బ్లాగ్లో పట్టం గట్టడమే జుబైర్ పని. హైదరాబాద్ అంటే కేవలం బిర్యానీలకు మాత్రమే కాదని, అరుదైన రుచులను అందించే వంటకాలను కలిగిన గొప్ప నగరం అంటారాయన. గత దశాబ్ద కాలంగా జుబైర్, అర డజను అవార్డులను తన బ్యాగ్లో ఉంచుకుని, జుబైర్ అనేక ప్రసిద్ధ బ్రాండ్లకు ఇన్ఫ్లుయెన్సర్గా మారాడు.ఇవి చదవండి: 'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా.. -
'ఐసైపోతారు'..! సహజ రుచులకు ఆహారప్రియులు ఫిదా..
సాక్షి, సిటీబ్యూరో: ఐస్క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చిన్న పిల్లల నుంచి పండు ముసలి దాకా ఎగిరి గంతేస్తారు.. అనారోగ్య కారణాల రీత్యా, కృత్రిమ రంగుల వినియోగం వల్ల కొందరు దీనికి దూరంగా ఉంటున్నారు. ఆరోగ్యం, ఆహారంపై కరోనా నేరి్పన గుణపాఠాన్ని నగరవాసులు బాగానే ఒంటబట్టించుకున్నారు. దీన్ని గ్రహించిన అమ్మకం దారులను నయా ట్రెండ్లో తమ వ్యాపారాలను అందిపుచ్చుకుంటున్నారు.ఆహార ప్రియుల మనసును గెలుచుకునేందుకు కొత్త తరహాలో సహజమైన పళ్ల రసాల నుంచి ఐస్క్రీమ్లు తయారు చేస్తున్నారు. వీటిని ఆరగించిన ఆహార ప్రియులు ఐస్ ఐపోతున్నారంటే నమ్మండి.. కొత్త తరహాలో మార్కెట్ను ఆక్రమించికుంటున్న ఆ ఆర్టిసానల్ ఉత్పత్తులపైనే ఈ కథనం...మనకు గతంలో ఇంపల్స్ ఐస్ క్రీమ్, టేక్–హోమ్ ఐస్ క్రీం అనే రెండు రకాలు అందుబాటులో ఉండేవి. వీటిలో టేక్–హోమ్ ఐస్ క్రీం మెజారిటీని మార్కెట్ వాటా కలిగి ఉండేది. అయితే ఈ మధ్యకాలంలో పుట్టుకొచి్చన ఆర్టిసానల్ ఐస్ క్రీమ్లు శరవేగంగా పుంజుకుంటున్నాయి. ఇటీవలి నివేదికల ప్రకారం కరోనా అనంతరం చలా కాలం తర్వాత గత వేసవిలో ఆర్టిసానల్ ఐస్క్రీమ్స్ తమ మార్కెట్ని భారీగా ఆక్రమించాయి. అదే ఊపు ఈ వేసవిలోనూ కొనసాగుతోందని విశ్లేషకులు చెబుతున్నారు.ఆర్టిసానల్ అదుర్స్...ఆర్టిసానల్ ఉత్పత్తులు కొన్నేళ్ల క్రితమే నగరవాసులకు అందుబాటులకి వచ్చాయి. ఇందులో పాలు, క్రీమ్, చక్కెర వంటి నాణ్యమైన, సహజమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. వివిధ ప్లేవర్లు, కలర్ల కోసం పప్పులు, పండ్లను మాత్రమే ఉపయోగిస్తారు. ఉదాహరణకు స్ట్రాబెర్రీ అయితే స్ట్రాబెర్రీ పండ్లను, స్వీట్ పాన్ ఐస్క్రీమ్ అయితే స్వీట్పాన్ను, మ్యాంగో ఐస్క్రీమ్లో మామిడి పండ్లను వినియోగిస్తారు.అయితే ఫ్లేవర్డ్ ఉత్పత్తుల్లా ఇవి 6–24 నెలల వరకూ నిల్వ ఉండవు. కేవలం 5–10 వారాలు మాత్రమే ఉంటాయి. ఈ ఐస్క్రీమ్లలో ఎలాంటి రసాయనాలూ లేవని నిర్ధారించడానికి వీలుగా అధిక–గ్రేడ్ ప్యాకేజింగ్లో వస్తాయి. గడ్డకట్టే ముందు, ఐస్క్రీం మిశ్రమాన్ని అధిక ఉష్ణోగ్రతల వద్ద ఉంచడం వల్ల ఇవి సురక్షితంగా బ్యాక్టీరియా రహితంగా మారతాయి.ఆర్టిసానల్కే ఆదరణ.. రుచితోపాటు ఆరోగ్యానికీ ప్రాధాన్యత ఇస్తున్నారు ఆహారప్రియులు. ఖరీదులో భారీ వ్యత్యాసం ఉన్నప్పటికీ ఆర్టిసనాల్ ఐస్క్రీమ్లనే ఇష్టపడుతున్నారు. ఒబెసిటీ సహా మరే ఇతర సమస్యలకూ దోహదం చేసే అవకాశం లేకపోవడం, పైగా పండ్లు, నట్స్ (పప్పులు) వంటివి వీటిలో విరివిగా వాడడం ఆరోగ్యానికి లాభదాయకం.– ఎ. ప్రవీణ్కుమార్, సి గుస్తా ఐస్క్రీమ్ పార్లర్విస్తృత శ్రేణి రుచులు..ఎటువంటి భయాలు లేకుండా వినియోగదారులు తమ ఉత్పత్తులనే ఎంచుకోవాలనే లక్ష్యంతో పలు ఐస్క్రీమ్ బ్రాండ్స్ ఇప్పుడు ఇదే బాట పట్టాయి. దీంతో ఇవి 1–2 రుచులకు మాత్రమే పరిమితం కాకుండా వి్రస్తుతశ్రేణిలో లభ్యమవుతున్నారు. వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఐస్ క్రీం తయారీదారులు డైరీ–ఫ్రీ నుంచి షుగర్–ఫ్రీ వరకూ ఆరోగ్యకరమైన ఉత్పత్తులపై దృష్టి సారిస్తున్నారు.ఆరోగ్య స్పృహ కలిగిన యువత, మంచి రుచిని ఆస్వాదించాలనే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని, తక్కువ కేలరీల ఐస్క్రీమ్ బార్లను కూడా పలు బ్రాండ్స్ అందిస్తున్నాయి. అలాంటి ఉత్పత్తుల్లో ప్రతి సరి్వంగ్కు కేవలం 89–99 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇతర సాధారణ ఐస్క్రీమ్లతో పోలిస్తే వీటిలో కొవ్వు 60% తక్కువగా ఉంటుంది. రకరకాల థీమ్లతో..నాంపల్లిలో రద్దీగా ఉండే ముజంజాహీ మార్కెట్ ప్రాంతంలో హ్యాండ్మేడ్ ఐస్క్రీమ్స్ లభిస్తున్నాయి. విశేషమేమిటంటే ఇక్కడ నాలుగు తరాల నుంచి నడుస్తున్న ఐస్ క్రీమ్ పార్లర్లు ఉన్నాయి. అంతేగాకుండా ఇక్కడ సీటింగ్ యూరప్ దేశాలను గుర్తుకుతెస్తోంది. అదే విధంగా జూబ్లీహిల్స్లోని డా.ఐస్ క్రీం పార్లర్, దాని పేరుకు తగ్గట్టుగా డాక్టర్ థీమ్తో ఉండే ఈ పార్లర్లో ఇక్కడ కొన్ని టాపింగ్స్ సిరంజిలను ఉపయోగించి మరీ అందిస్తారు.వనిల్లా, చాక్లెట్ తదితర రుచుల నుంచి బిర్యానీ ఫ్లేవర్ వరకూ వెరైటీ రుచులకు ఇది ప్రసిద్ధి. అలాగే జూబ్లీహిల్స్లోనే ఉన్న మిలానో ఐస్క్రీమ్, అబిడ్స్లోని సాఫ్ట్ డెన్, రోస్ట్, సిగుస్తా, ఆల్మండ్ హౌస్.. వంటివి హెల్ధీ ఐస్క్రీమ్స్కి చిరునామాగా ఉన్నాయి. యూరోపియన్ శైలిలో అందిస్తే వీటినే ఇటాలియన్ నామం జిలాటోగా పేర్కొంటారు.వీటితో ప్రమాదం..సాధారణంగా మనకు పరిచయమున్న ఐస్క్రీమ్స్ ఒబెసిటీ తదితర జీవనశైలి వ్యాధులతో పాటు మరిన్ని ఆరోగ్య సమస్యలను తెచి్చపెట్టే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. దీంతోపాటు ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి వీటికి రకరకాల రసాయనాలను మేళవించాల్సి ఉంటుంది. అలాగే ఐస్ స్ఫటికాలు ఏర్పడకుండా ఉండేందుకు ఐస్ క్రీములకు కారాజెనన్, ఎల్బిజి, గ్వార్, అకేసియా వంటివి కలుపుతారు. కొన్నిసార్లు మోనో–డిగ్లిజరైడ్స్ను కూడా కలుపుతారు.ఇవి చదవండి: బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!! -
బోటీ.. లొట్టలేసీ..! 25 ఏళ్లుగా చెరగని టేస్ట్..!!
రోడ్డు పక్కనే కదా హోటల్ అనుకొని తీసిపారేయకండి. ఈమె వద్ద ఒక్కసారి బోటికూర, తలకాయ మాంసం రుచి చూశారంటే ఇక రోజూ ఇటువైపు రావాల్సిందే.. అవును మరి.. బోటికూర లక్ష్మమ్మ పెట్టే తలకాయ మాంసం, మటన్ లివర్, బోటి కూర, చికెన్ కర్రీ కోసం ఎక్కడెక్కడి నుంచో ప్రముఖులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బడా వ్యాపారులు సైతం వచ్చి లొట్టలేసుకొని తింటుంటారు. సమపాళ్లలో మసాలా దినుసులు, ఇంట్లోనే తయారు చేసే కారంపొడి, కొబ్బరిపొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్తో ప్రత్యేకంగా బోటీ వండుతుంటానని, రుచికి అదే కారణమని అంటుంటారు బోటికూర లక్ష్మమ్మ. – బంజారాహిల్స్బంజారాహిల్స్ రోడ్ నెం.2లోని షేక్పేట మండల కార్యాలయం వద్ద ఫుట్పాత్ను ఆనుకొని రోడ్డు పక్కనే రెండు దశాబ్ధాలుగా ఆమె నిర్వహిస్తున్న మొబైల్ మెస్లో టేస్ట్ చేస్తున్న ఎంతో మంది ప్రముఖులు శెభాష్ అనకుండా ఉండలేకపోతున్నారు. ప్రతిరోజూ 12 కిలోల బోటీ వండి వంద మందికి పైగానే ఆహారప్రియులకు అందిస్తున్నారు. అందుకే వరంగల్ జిల్లా ఉల్లిగడ్డ దామెర గ్రామానికి చెందిన గన్నారం లక్ష్మమ్మ(73) ఏకంగా బోటీకూర లక్ష్మమ్మగా పేరు తెచ్చుకుంది.ఈమె బోటీ కూర గురించి ఇప్పటికే సుమారు 100 మంది యూట్యూబర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. బోటీ కోసమే వారంలో ఒకటి, రెండుసార్లు ప్రముఖ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వస్తుంటారు. తలకాయ మాంసం, మటన్ లివర్, మటన్ కూర, చికెన్ లివర్, చికెన్ కూర, ఇవన్నీ ఈమె వద్ద ప్రత్యేక రుచుల్లో లభిస్తుంటాయి. మరో నలుగురికి ఉపాధి బోటీ కూరను తానే స్వయంగా వండుతానని, ఇందులో వాడే ప్రతి మసాలా దినుసు తానే తయారు చేస్తుంటానని తెలిపారు.రాహుల్ సిప్లిగంజ్కు వడ్డిస్తూ..తాను సంపాదించడమే కాకుండా మరో నలుగురికి ఉపాధి కల్పిస్తున్నట్లు ఆమె చెప్పారు. లక్ష్మమ్మను చూసి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, శ్రీనగర్కాలనీ, ఎస్ఆర్నగర్ ప్రాంతాల్లో ఎంతోమంది మహిళలు స్ఫూర్తి పొంది ఇలాంటి మొబైల్ మెస్లు ఏర్పాటు చేసుకొని ఉపాధి పొందుతున్నారు. ఈమె టేస్ట్కు ఎవరూ సాటిరారంటూ చాలామంది యూట్యూబర్లు సైతం తమ అభిప్రాయాలు వెల్లడించడమే కాకుండా సోషల్ మీడియాలో లక్ష్మమ్మ బోటి కూర టేస్టే సెపరేట్ అంటూ పోస్టులు పెడుతుంటారు. అంతేకాదు స్విగ్గి, జొమాటో ఆర్డర్లు కూడా వస్తుండగా ఇప్పుడున్న గిరాకీ తట్టుకోలేక ఆమె సున్నితంగా తిరస్కరిస్తున్నారు. ఎంతో ఆనందం..బోటీ వండటానికి నాకు 3 గంటల సమయం పడుతుంది. ప్రతిరోజూ మధ్యాహ్నం 12 గంటలకు ఇక్కడ భోజనాలు ప్రారంభిస్తాను. మొదటి గంటలోనే వందకుపైగా బోటి కూర భోజనాలు అమ్మడవుతుంటాయి. కూర అయిపోగానే చాలా మంది వస్తుంటారు. లేదని చెప్పగానే నిరాశతో వెళ్తుంటారు. డబ్బులు సంపాదించడానికి వండటం లేదు.ఉన్నంతలోనే మంచి రుచితో అందిస్తున్నాను. రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్, గాయకుడు రాహుల్ సిప్లిగంజ్, మరో సింగర్ బిట్టు, లేడీ సింగర్ లక్ష్మీతో పాటు చాలా మంది వస్తుంటారు. బాగుంది అని చెబుతుంటే ఆనందంగా ఉంటుంది. నాతో పాటు నా కూతురు, కొడుకు, కోడలు, మనవడు, మనవరాళ్లు ఏడు చోట్ల మెస్లు నిర్వహిస్తున్నారు. అన్ని చోట్లకు నేను వండిన బోటి కూర వెళ్తుంది. – లక్ష్మమ్మఇవి చదవండి: 'సిగ్నోరా సర్వీస్ సెంటర్'! ఈ ముగ్గురు మహిళలు.. -
గాల్లో మంటలు.. హైదరాబాద్-కౌలా లంపూర్ విమానానికి తప్పిన ప్రమాదం
రంగారెడ్డి, సాక్షి: శంషాబాద్ ఎయిర్పోర్టులో గురువారం ఉదయం ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ఎగిరిన విమానం ఇంజిన్లో మంటలు చెలరేగగా, పైలట్ అప్రమత్తం కావడంతో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడగలిగారు.హైదరాబాద్ నుంచి కౌలా లంపూర్(మలేషియా) వెళ్లాల్సిన విమానం.. టేకాఫ్ అయిన కాసేపటికే కుడి వైపు ఇంజిన్లో మంటలు చెలరేగాయి. అది గుర్తించిన పైలట్ ల్యాండింగ్ కోసం అనుమతి కోరారు. ప్రమాద తీవ్రతను గుర్తించిన ఏటీసీ(ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్) ల్యాండింగ్కు అఉనమతి ఇచ్చారు. ఈ గ్యాప్లో విమానం కాసేపు గాల్లోనే చక్కర్లు కొట్టింది.ల్యాండింగ్ అయిన తర్వాత ప్రయాణికులందరినీ హుటాహుటిన బయటకు తెచ్చారు. సిబ్బంది సహా విమానంలో 130 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది. విమానం సేఫ్గా ల్యాండ్ కావడం.. అంతా సురక్షితంగా బయటపడడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
విదేశాల్లో.. రయ్ .. రయ్
ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్(ఐడీపీ)లకు ఏటేటా డిమాండ్ పెరుగుతోంది. ఉన్నత చదువులు..ఉద్యోగాలు..టూరిస్ట్ వీసాలపై విదేశాలకు వెళ్లేవారు ఐడీపీ కోసం ఆర్టీఏ కార్యాలయాల వద్ద బారులు తీరుతున్నారు. హైదరాబాద్ నుంచి వివిధ దేశాలకు వెళ్లిన నగరవాసుల్లో ఈ ఏడాది 42,471 మంది ఐడీపీ తీసుకున్నారు. – సాక్షి, హైదరాబాద్అమెరికాకే ఎక్కువగా.. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం ఏటా లక్షలాది మంది తెలుగు రాష్ట్రాల నుంచి అమెరికాకు వెళుతున్నారు. వారే పెద్దసంఖ్యలో ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకుంటున్నారు. అమెరికాతోపాటు అన్ని దేశాల్లోనూ మన డ్రైవింగ్ లైసెన్సులను అనుమతించడం వల్ల డిమాండ్ ఎక్కువగా ఉందని ఆర్టీఏ అధికారులు తెలిపారు. వివిధ ఆర్టీఏ కార్యాలయాల్లో నగరవాసులు తీసుకొనే ఐడీపీలో 60 % వరకు అమెరికాలో డ్రైవింగ్ కోసమే కావడం గమనార్హం. హెచ్ 4 వీసాపై డిపెండెంట్గా వెళుతున్న మహిళలు అక్కడకు వెళ్లిన తర్వాత ఉద్యోగాన్వేషణలో భాగంగా డ్రైవింగ్ తప్పనిసరిగా భావిస్తున్నారు. అలా ఐడీపీలు తీసుకుంటున్న మహిళల సంఖ్య కూడా ఏటా పెరు గుతూనే ఉంది. ‘హైదరాబాద్లో కారు డ్రైవింగ్ వస్తే చాలు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరుగులు తీయొచ్చు. అందుకే ఎక్కువ మంది ఐడీపీల కోసం వస్తారు.’అని ఆర్టీఏ అధికారి ఒకరు అభిప్రాయపడ్డారు. అమెరికా తర్వాత మలేసియా, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్, స్విట్జర్లాండ్, దక్షిణాఫ్రికా, స్వీడన్, సింగపూర్, హాంకాంగ్, స్పెయిన్, ఫ్రాన్స్, ఫిన్లాండ్, ఇటలీ, మారిషస్, ఐర్లాండ్ తదితర దేశాల్లో ఇండియన్ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లను అనుమతిస్తున్నారు. » అమెరికాతోపాటు కొన్ని దేశాల్లో ఏడాదిపాటు అనుమతిస్తుండగా, యూరోప్ దేశాల్లో 6 నెలల వరకు మాత్రమే అనుమతి ఉంది.» ఐడీపీపై మలేసియాలో బండి నడపాలంటే ఆ దేశ అధికార భాష మలేలోకి ఐడీపీ వివరాలు నమోదు చేసుకోవాలి. భారత రాయబార కార్యాలయం నుంచి ఈ సదుపాయం లభిస్తుంది. » ఫ్రాన్స్లోనూ ఐడీపీని ఫ్రెంచిలోకి తర్జుమా చేసుకోవడం తప్పనిసరి. » ఆ్రస్టేలియాలో మూడు నెలల వరకే అనుమతి ఉంటుంది. » కెనడాలో మూడు నెలల్లోపు అక్కడి నిబంధనల మేరకు లైసెన్సు తీసుకోవాలి. ఐడీపీ ఈజీనే... » అంతర్జాతీయ డ్రైవింగ్ పర్మిట్ తీసుకోవడం ఎంతో తేలిక. నగరంలోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, ఉప్ప ల్, మెహదీపట్నం, మణికొండ, మేడ్చల్, ఇబ్రహీంపట్నం, మలక్పేట్, కూకట్పల్లి, బండ్లగూడ, తదితర ఆర్టీఏ కార్యాలయాల నుంచి ఐడీపీ తీసుకోవచ్చు. పాస్పోర్టు, వీసాతో పాటు, పర్మనెంట్ లైసెన్సు డాక్యుమెంట్లను అందజేసి రూ.1500 ఫీజు చెల్లించాలి. సాధారణంగా అన్ని రకాల ఆర్టీఏ సేవలు ఆన్లైన్లో లభిస్తుండగా, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ మాత్రం అధికారులు నేరుగా దరఖాస్తుదారులకే అందజేస్తారు. స్పెయిన్లో డ్రైవింగ్ చేశా.. విదేశాలకు ఎక్కువగా వెళతాను. అక్కడికి వెళ్లిన తర్వాత బంధువులు, స్నేహితుల వాహనాలు అందుబాటులో ఉంటాయి. కానీ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం వల్ల ఎక్కడికి వెళ్లలేని పరిస్థితి. దీంతో హైదరాబాద్ నుంచి ఐడీపీతో వెళితే ఆ ఇబ్బంది ఉండదు. స్పెయిన్లో మూడు నెలలు ఐడీపీతోనే డ్రైవింగ్ చేశాను. – సుబ్బారెడ్డి, టూరిస్టు థాయ్లాండ్లో రైట్ డ్రైవింగే డాక్యుమెంటరీల షూటింగ్కు తరచుగా విదేశాలకు వెళతా. ఇటీవల థాయ్లాండ్లో ఓ డాక్యుమెంటరీ షూటింగ్ సందర్భంగా ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్తో వెళ్లాను. అక్కడ మన ఇండియాలోలాగే రైట్ డ్రైవింగ్. ఏ ఇబ్బంది లేకుండా హాయిగా కారులో అన్ని చోట్లకు వెళ్లాను. – మిద్దె బాలరాజు, ఆర్టిస్ట్ జర్మనీలో నిబంధనలు కఠినం.. జర్మనీలో మన ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్లపై బండి నడపడం చాలా కష్టం. మన డ్రైవింగ్ లైసెన్స్ను వారు పరిగణనలోకి తీసుకోలేదు. స్టూడెంట్గా వెళ్లాను. ఇప్పుడు ఉద్యోగం చేస్తూ జర్మనీలోనే ఉంటున్నారు. మొదట్లో హైదరాబాద్ నుంచి ఇంటర్నేషనల్ డ్రైవింగ్ పర్మిట్ తీసుకొని వెళ్లగా, 6 నెలలు మాత్రమే అనుమతించారు. ఉద్యోగరీత్యా అక్కడే ఉండాల్సి రావడంతో అక్కడి నిబంధనల మేరకు మొదట లెర్నింగ్, ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకున్నా. జర్మనీలో నిబంధనలు చాలా కఠినంగా ఉంటాయి. – తన్యా కొండ -
‘అందుకనేగా అర్ధాంగి అంటారు’.. రాచకొండ పోలీసుల పోస్ట్ వైరల్
ఇటీవల కాలంలో సైబర్ నేరాలు ఎక్కువైపోయాయి. బ్యాంక్ సిబ్బంది, ప్రభుత్వ అధికారుల పేరుతో ఫోన్లు చేసి మోసాలకు పాల్పడుతున్నారు. ఓటీపీ అడిగి బ్యాంక్లోని డబ్బులను దోచేస్తున్నారు. అయితే ఇలాంటి సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా వుండాలని ఎప్పటికప్పుడు పోలీసులు ప్రజలకు హెచ్చరిస్తూనే ఉన్నారు.ఈ మోసాల గురించి మరింత వివరంగా చెప్పేందుకు రాచకొండ పోలీసులు ఓ వినూత్న ప్రయత్నం చేశారు. ఇందుకు కాస్త హాస్యాన్ని జోడించారు. ఓ ఫన్నీ కపుల్ జోక్తో ప్రజలను హెచ్చరించారు. ఓ అర్థాంగి అమాయకత్వం సైబర్ కేటుగాళ్ల నుండి ఎలా కాపాడిందో తెలియజేస్తూ సాగిన చిన్న ఫన్నీ స్టోరీని రాచకొండ పోలీస్ కమీషనరేట్ అధికారిక ఎక్స్ మాధ్యమంలో పోస్ట్ చేశారు. చివరగా.. బ్యాంకు అకౌంట్ వివరాలు, ఓటీపీలు, ఏటీఎం లేదా క్రెడిట్ కార్డు వివరాలను ఎవరితో పంచుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని జాగ్రత్తలు చెప్పారు. రాచకొండ పోలీసుల రావుగారి 'అర్థాంగి' స్టోరీ కింద చదవండి: -
హైదరాబాద్: గచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన సాఫ్ట్వేర్ కంపెనీ
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో ఓ సాప్ట్వేర్ కంపెనీ బోర్డు తిప్పేసింది. కంపెనీ క్లోజ్ చేశామంటూ నిరుద్యోగులకు షాకిచ్చింది. ఉద్యోగులు నుంచి డిపాజిట్ ఫీజులు వసూలు చేసి బిచాణా ఎత్తేసింది. రైల్ వరల్డ్ ఇండియా పేరుతో దేశవ్యాప్తంగా ఐదు బ్రాంచ్లు ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇస్తామంటూ 800 మంది వద్ద డబ్బులు వసూలు చేసింది.సుమారు రూ.5 కోట్లు వసూలు చేసిన రైల్ వరల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఒక్క గచ్చి బౌలిలోనే దాదాపుగా 40 లక్షల రూపాయల వసూలు చేసినట్లు సమాచారం. రాయదుర్గం పోలీస్స్టేషన్లో బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
‘ఒంటికి యోగా మంచిదేగా’ మాజీ మిస్ ఇండియా ఆసనాలు (ఫొటోలు)
-
సిటీలో స్టైలిష్ హెయిర్ కట్కు క్రేజ్
స్టైల్కి, ఫ్యాషన్కి కేరాఫ్ అడ్రస్గా నగరం వృద్ధిచెందుతోంది. ఓ పక్క స్టైల్తోపాటు దానికి తగిన విధంగా కేర్ తీసుకుంటున్నారు. ఇటీవల ఓ సినిమాలో జడేసుకోపోయావా... తల్లీ.. ముడేసుకున్నా.. ముద్దుగానే ఉన్నావులే అని రావు రమేష్ అంటాడు. ఆ తరహాలోనే ప్రతిదీ స్టైలే.. ఇక హెయిర్ స్టైల్స్లోనూ అనేక రకాలు ఉన్నాయంటే అతిశయోక్తిలేదు.. బజ్కట్.. క్రూకట్, ఫాక్స్ హాక్, బాబ్, బౌల్, కోబ్ ఓవర్, ఫ్లాట్ టాప్, ముల్లె, పాంపడోర్ ఇలా పురుషులు ఫాలో అయ్యే హెయిర్ స్టైల్స్లో 30కి పైగా రకాలు ఉన్నాయి.. కాగా బిక్సీకట్, స్పైకీ పిక్సీ, ఒన్ లెగ్త్ మిడీ, మోవాక్ షార్ట్ కట్, యాంగిల్డ్ బాబ్, షార్ట్ వేవీ.. వంటి 60 రకాల హెయిర్ స్టైల్స్ ఉన్నాయి. అయితే హెయిర్ స్టైల్స్ ఎప్పటి నుండో ఉన్నప్పటికీ... ప్రొఫెషనల్స్తో చేయించుకోవడం తక్కువ.. కానీ ప్రస్తుతం సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ హెయిర్ స్టైలిస్ట్ని ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో అంతర్జాతీయ బ్రాండెడ్ సెలూన్స్ విస్తరిస్తున్నాయి. అంతేకాదు.. రెగ్యులర్గా నెల్లో కనీసం ఒక్కరైనా హెయిర్ స్టైలిస్ట్స్ సందర్శిస్తున్నారు.. హైదరాబాద్ అందమైన నగరంగానే కాకుండా అందానికీ అత్యంత ప్రధాన్యతనిచ్చే నగరంగా ప్రసిద్ధి చెందింది. నగరం వేదికగా అంతర్జాతీయ ఫ్యాషన్ స్టూడియోలు, ప్రతీ ఏటా పదుల సంఖ్యలో నిర్వహించే గ్లోబల్ ఫ్యాషన్ ఈవెంట్స్ దీనికి నిదర్శనం..అయితే గత కొంత కాలంగా అందానికి అదనపు హంగులద్దే హెయిర్ కట్స్ ట్రెండ్గా మారింది. ముఖ్యంగా ఫ్యాషన్ ఔత్సాహికులు సినీతాలకు ధీటుగా వినూత్న హెయిర్ స్టైల్స్కు మొగ్గుచూపుతున్నారు. దీనిని వేదికగా మార్చుకుని ప్రముఖ గ్లోబల్ బ్రాండ్లు, ఫేమస్ సెలూన్స్ నగరంలో సేవలు ప్రారంభిస్తున్నాయి. అంతేకాకుండా అంతర్జాతీయ సెమినార్లకూ హైదరాబాద్ కేంద్రంగా మారుతోంది. హెయిర్ స్టైలిస్ట్ వ్యాపారం, అవకాశాలు ఎక్కువగా ఉన్న నగరాల్లో హైదరాబాద్ టాప్లో ఉండటం విశేషం. ఫ్యాషన్ షోలు, ఫ్యాషన్ వీక్లతో హెయిర్ స్టైలిస్ట్ల అవసరం పెరిగింది. రానున్న కాలంలో ఐటీ, హిస్టారికల్తో పాటు ఫ్యాషన్ ఐకాన్గానూ నగరం వెలుగొందనుందని పలువురు విశ్లేషకులు అంటున్న మాట..అవకాశాలు పుష్కలం..నగరంలో నష్టపోని రంగం ఏదైనా ఉందంటే...అది హెయిర్ స్టైలింగ్ అని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ రంగంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ వృత్తిపరంగా మంచి అవకాశాలు పొందుతున్నారు. మన వ్యక్తిత్వాన్ని మరింత అద్భుతంగా చూపించడంలో ఫ్యాషన్ ఔట్లుక్ కీలకపాత్ర పోషిస్తుంది. ఈ హంగులను అందుకోవడంలో నగరవాసులు ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటారు. ప్రముఖ హెయిర్ బ్రాండ్స్, హెయిర్ కట్స్ ఇక్కడి విలాసవంతమైన జీవన విధానంలో భాగమయ్యాయి. సిటీలో బోటోసూ్మత్ ట్రీట్మెంట్ వంటి సెమినార్స్ నిర్వహిస్తే వందల మంది స్టైలిస్ట్లు పాల్గొని శిక్షణ పొందారు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు..ఇక్కడ కురులను అందంగా చూపించుకోవడానికి ఎంత ఇష్టపడుతున్నారో. –నజీబ్ ఉర్ రెహా్మన్, ప్రముఖ అంతర్జాతీయ హెయిర్ స్టైలిస్ట్.దక్షిణాది అందాలకు అంతర్జాతీయ క్రేజ్... ఇతర దేశాలతో పోలిస్తే భారత్లో శిరోజాల అందం, ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తారు. ముఖ్యంగా గ్లోబల్ ఫ్యాషన్ హంగులకు హైదరాబాద్ వేదికగా మారింది. ఇటాలియన్, జపనీస్ వంటి విభిన్న హెయిర్ స్టైల్స్ ఇక్కడ చూసి ఆశ్చర్యపోయాను. మొదటి సారి నగరంలో నిర్వహించిన లుక్ అండ్ లెర్న్ సెమినార్లో ఇక్కడి ప్రొఫెషనల్ హెయిర్ స్టైలిస్ట్లకు వినూత్న స్టైల్స్పై అవగాహన కల్పించాను. గోద్రెజ్ ప్రొఫెషనల్ బోటోస్మూత్ ట్రీట్మెంట్పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెషన్స్లో ఔత్సాహికుల స్కిల్స్ చూసి ఆశ్చర్యపోయాను. హెయిర్ కలరింగ్కు, స్ట్రటెనింగ్, స్టైల్ కట్స్కు మంచి డిమాండ్ ఉంది. మా దేశం బ్రెజిల్లో శిరోజ సౌందర్యం పైన మాత్రమే ఆసక్తి చూపిస్తారు. కానీ ఇక్కడ అధునాతన సాంకేతికత, అందం, ఆరోగ్యం మేళవింపుగా కనిపించింది. మొదటిసారి 2008లో భారతీయ మహిళల సంస్కృతిలో భాగమైన ఒక హెయిర్ స్టైల్ నన్నెంతగానో ఆకట్టుకుంది. నేను పలు దేశాల్లో శిక్షణ అందిస్తున్న సమయంలో భారతీయ అందం గురించి, ముఖ్యంగా ఇక్కడి పొడవైన జుట్టు గురించి చాలా సార్లు విన్నాను. ఇక్కడ మహిళల సౌందర్యానికి, వినూత్నమైన వ్యక్తిత్వానికి కేశాలంకరణ ప్రతిబింబంలా కనిపిస్తుంది. ప్రస్తుతం ఇక్కడి అమ్మాయిలు ట్రెండీగా కనిపిస్తున్నారు. సాధారణంగా ప్రతి రెండు నెలలకోసారి హెయిర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు. అందంతో పాటు ఆరోగ్యం కూడా కాపాడుకోవాలి కాబట్టి తక్కువ రసాయనాలు వాడటం శ్రేయస్కరం. బోటోసూ్మత్ ట్రీట్మెంట్ అందంతో పాటు ఆరోగ్యకరమైన జుట్టును అందిస్తాయి. –వివియన్ బెనెడెట్టో, అంతర్జాతీయ హెయిర్ మాస్ట్రో, బ్రెజిల్. (ఫార్మాల్డిహైడ్–రహిత హెయిర్స్టైలిస్ట్) -
విశ్వ..నట...నగరంగా హైదరాబాద్
-ప్రొఫెషన్తో పనిలేదు.. యాక్టింగ్యే ప్యాషన్-సిటిజనుల్లో పెరిగిన నటనాభిరుచి-ఓటీటీలు, యూట్యూబ్ల రాకతో ఓవర్టైమ్ యాక్టింగ్కు సై..ఒకే ఒక్క ఛాన్స్... ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్లుందే..అనుకుంటున్నారా...! అవును రవితేజ హీరోగా నటించిన ఖడ్గం సినిమాలోనిది.. అయితే ఇది ఈ ఒక్క సినిమాకో.. హీరోకో పరిమితం కాదు...దాదాపు ఇండస్ట్రీలో అవకాశం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరి నోటి వెంట వచ్చేది ఈ డైలాగే..అంటే అతిశయోక్తి కాదేమో..నాటి ఎన్టిఆర్ దగ్గర నుంచి నేటి విశ్వక్సేన్ వరకూ అలా వచి్చన వారే.. ఇప్పుడు ఇదంతా మాకెందుకు చెప్తున్నారు..? ఇవన్నీ తెలిసిన విషయాలే అనుకుంటున్నారా..? అవును..! అందులో నిజం లేకపోలేదు..కాకపోతే గతంతో పోలిస్తే నటనవైపు వెళ్లాలని అనుకునే వారి సంఖ్య భారీగా పెరిగిందనే విషయాన్ని చెప్పడానికి వచ్చెనదే ఈ తిప్పలంతా..నగరవాసుల్లో నటనవైపు పెరిగిన ఆసక్తి...గతంతో పోలిస్తే పెరిగిన అవకాశాలు.. వివిధ వేదికలు గుర్తించి తెలుసుకునే ప్రయత్నమే ఇది...సాక్షి హైదరాబాద్: ఆయనో ప్రముఖ వైద్యుడు.. నగరంలోని ఓ ప్రభుత్వాస్పత్రిలో కీలక పదవిలో కొనసాగుతున్నారు. డయాబెటిక్ కన్సల్టేషన్ కోసం ఆయన్ని కలిసేందుకు సికింద్రాబాద్కు చెందిన గిరి ఆ ఆస్పత్రికి వెళ్లారు. డాక్టర్ను చూడగానే ఎక్కడో చూసినట్లు.. బాగా తెలిసినట్లు చాలా యూనీక్గా అనిపించింది. కాసేపు తన బుర్ర బద్దలకొట్టుకుని ‘‘ఫలానా వెబ్సిరీస్లో మీరు నటించారు కదా డాక్టర్?’’ అని ఠక్కున అనేశాడు.. డాక్టర్ కూడా చాలా ఫ్రెండ్లీగా మొహమాటాన్ని పక్కనబెట్టి అడిగిన ప్రశ్నకు అవునంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చారు. గిరికి ఎదురైన అనుభవమే మనలో చాలామందికీ కలిగే ఉండొచ్చు.. ఆస్పత్రులు, బొటిక్లు, పార్లర్లు, కాలేజీలు.. ఎక్కడ పడితే అక్కడ అనేక మంది నగరవాసులు డాక్టర్ తరహాలోనే తమ ప్రతిభను వివిధ మాధ్యమాల్లో చాటుతున్నారు..వెల్లువెత్తుతున్న అవకాశాలు.. టీవీలు, షార్ట్ ఫిలింస్...వరకూ దశలవారీగా యాక్టింగ్ హాబీ విస్తృతమవుతూ ఉంది. గత ఐదేళ్ల కాలంలో ఆన్లైన్ వినియోగంతో పాటుగా ఈ హాబీ కూడా ఒక్కసారిగా ఊపందుకుంది. ముఖ్యంగా ఓటీటీ వేదికలు విస్తృతమవడంతో నటీనటులకు అవకాశాలు కూడా వెల్లువెత్తుతున్నాయి. తక్కువ బడ్జెట్లో సినిమాలు, సిరీస్ రూపొందించే నిర్మాతలు, టెక్నీషియన్లుతో పాటు నటీనటులను కూడా తమ బడ్జెట్కు అందుబాటులో ఉండేలా జాగ్రత్త పడుతున్నారు.. పాత్రోచితంగా కనిపించే వ్యక్తులకు కాస్తంత శిక్షణ అందిస్తే చాలు పని జరిగిపోతున్న పరిస్థితుల్లో వయసుతో సంబంధం లేకుండా.. అనేకమందికి అవకాశాలు గుమ్మం ముందుకు వచ్చి మరీ తలుపు తడుతున్నాయి. సొంత వేదికలు.. ఇన్స్టా, స్నాప్చాట్, ఫేస్బుక్, యూట్యూబ్ రీల్స్, టిక్టాక్ వంటి మాధ్యమాల రాకతో సరదాగా మొదలుపెట్టి రీల్స్, షార్ట్ వీడియోలు వగైరా వంటి సోషల్ మీడియా వేదికల్లో తమ ప్రతిభను కనబరుస్తున్నారు. అంతేకాదు సినీ తారలను మించిన ఫాలోయింగ్ను, గుర్తింపును, ఫాలోవర్స్ను పోగేసుకుంటున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయా ప్రాంతాల్లో సెలబ్రిటీలుగా.. చిన్నపాటి స్టార్లుగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాదు ఆ వేదికల ద్వారానే సినీ అవకాశాలనూ అందిపుచ్చుకుంటున్నారు. యూట్యూబ్ ద్వారా పాపులరైన గంగవ్వే దీనికో ఉదాహరణ... ఏ రంగంలో, ఏ వేదిక, ఏ మాధ్యమం ద్వారా సక్సెస్ సాధించినా, తెరపై రాణించడం, తద్వారా వచ్చే పాపులారిటీకి సాటిరావు అనేది వాస్తవం.స్టోరీ టెల్లింగ్, ఫ్యాషన్ కాదేదీ నటనకు అనర్హం.. నగరానికి చెందిన ఫ్యాషన్ డిజైనర్ రామ్... గత కొంత కాలంగా సెలబ్రిటీలకు డిజైన్లు అందించడంలో పేరొందారు. లుక్స్లో టాలీవుడ్ హీరోలకు తీసిపోని రామ్... లాక్ డౌన్ టైమ్లో దొరికిన ఖాళీ సమయాన్ని నటనాభిరుచితో భర్తీ చేసుకున్నారు. ఆయన పచ్చీస్ పేరుతో రూపొందించిన ఓ సినిమాలో హీరోగా నటించారు. ఆ సినిమా ఆ మధ్య ఓటీటీలో విడుదలైంది.. అదే విధంగా నగరంలో స్టోరీ టెల్లింగ్కు కేరాఫ్గా పేరొందిన దీపా కిరణ్ కూడా ఇటీవల యాంగర్ టేల్స్ అనే ఓటీటీ చిత్రంలో నటించారు. అందులోని నాలుగు పొట్టి కథల్లో ఒకటైన యాన్ ఆఫ్టర్ నూన్ న్యాప్లో ఆమె కనిపిస్తారు. ఈ ఎక్స్పీరియన్స్ తనకు కొత్త అనుభూతిని పంచిందని ఆమె అంటున్నారు. నటనే హాబీగా... కేరెక్టర్కు ఓకె...కెరీర్గా నాట్ ఓకె...అంటున్నారు ఈ హాబీ యాక్టర్లు. నటనావకాశాలు వస్తున్నా వరుస పెట్టి సినిమాలు చేసేయాలనే ఆత్రం చూపడం లేదు. తమ కెరీర్కు ప్రాధాన్యత ఇస్తూనే అడపాదడపా వచ్చిన ఛాన్సుల్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. సినిమా అనేది తమకు అభిరుచి మాత్రమే నని అనేక మంది స్పష్టం చేస్తున్నారు. ‘‘నాట్యం అనేది నా అభిరుచికి, నా ఆలోచనలకు దగ్గరగా ఉన్న సినిమా కాబట్టి నటించాను. అంతే తప్ప సినిమాల్ని కెరీర్గా తీసుకునే ఆలోచన లేదు’’ అంటున్నారు సంధ్యారాజు. ప్రముఖ పారిశ్రామిక వేత్త సత్యం రామలింగ రాజు కుటుంబ సభ్యురాలైన సంప్రదాయ నృత్య కారిణి... ఆ మధ్య నాట్యం అనే సినిమాలో కథానాయికగా నటించారు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారానికి కూడా నోచుకుంది. అయినప్పటికీ ఆమె మరో చిత్రంలో నటించలేదు. అదే విధంగా నగరానికి చెందిన ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు ఆకెళ్ల రాఘవేంద్ర కూడా ఒకటి రెండు చిత్రాల్లో కనిపించారు. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు.. కోలీవుడ్, మాలీవుడ్ చిత్రాల నిర్మాణానికీ కేరాఫ్ అడ్రస్గా మారిన భాగ్యనగరంలో ఓటీటీలు, యూ ట్యూబ్ చిత్రాల వెల్లువతో నటించే సరదా ఉన్న వారికి అవకాశాలు పుష్కలంగా లభిస్తున్నాయి. అయితే నటనను జస్ట్ ఫర్ ఛేంజ్ అన్నట్టు çహాబీగా ఎంచుకోవడం వల్ల పెద్ద నష్టం లేకపోయినా, సరైన శిక్షణా నేపధ్యం లేకుండానే పూర్తి స్థాయి కెరీర్గా మార్చుకోవాలనే తొందరపాటు మాత్రం సరైంది కాదని అనుభవజ్ఞులు సూచిస్తున్నారు. ప్రేక్షకాభిరుచిలో మార్పు...నటనలో పేరున్నవారు, బాగా తెలిసిన ముఖాలను మాత్రమే కాకుండా కొత్త వారిని కూడా ఆదరించే దిశగా ప్రేక్షకుల అభిరుచుల్లో స్పష్టమైన మార్పు వచి్చంది. దీంతో నిర్మాతలు కొత్త నటీనటులతో ప్రయోగాలు చేయడానికి గతంలోలా భయపడడం లేదు. అంతేకాకుండా ఏ రంగంలో ఉన్నవారు ఆ రంగానికి సంబంధించిన పాత్రల్లో కాస్త సులభంగా మమేకమయ్యే వీలుంటుంది. కాబట్టి సినిమాలో వైద్యుడి పాత్ర ఉంటే వైద్యుడిని, లాయర్ పాత్రకు లాయర్ని ఎంచుకుంటూన్నారు. దీంతో రంగాలేమైనా తెరంగేట్రం సాధారణ విషయంగా మారిపోయింది. మరిన్ని సిటీ ప్లస్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
న్యూయార్క్ తరహాలో హైదరాబాద్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరాన్ని అమెరికాలోని న్యూయార్క్ను పోలిన రీతిలో తీర్చిదిద్దాల్సి ఉందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్రెడ్డి అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ను ప్రపంచంలోని పేరొందిన నగరాల సరసన నిలబెట్టాలన్నది తమ ప్రభుత్వ సంకల్పమన్నారు. సీఎం రేవంత్రెడ్డితో ‘కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్’సంస్థ ఆసియా పసిఫిక్ సీఈవో మ్యాథ్యూ భౌ ప్రతినిధి బృందం భేటీ అయింది. సచివాలయంలో మంగళవారం జరిగిన ఈ భేటీలో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబుతో పాటు పలువురు అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.తాము దేశంలోని ఇతర నగరాలతో పోటీ పడటం లేదని, ప్రపంచ నగరాల స్థాయిలో హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్నదే తమ లక్ష్యంగా ïసీఎం రేవంత్ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు, రీజనల్ రింగ్ రోడ్డు, మెట్రో రైలు మార్గం విస్తరణతో హైదరాబాద్ మరింత అద్భుతంగా తయారవుతుందన్నారు. దేశంలో వేగంగా హైదరాబాద్ వృద్ధిగ్లోబల్ సిటీగా హైదరాబాద్ వృద్ది చెందుతున్న తీరు, వివిధ రంగాల్లో విస్తరిస్తున్న తీరుపై ఈ భేటీలో చర్చించారు. దేశంలోనే హైదరాబాద్ శరవేగంగా వృద్ది చెందుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని కుష్మన్ అండ్ వేక్ ఫీల్డ్ కంపెనీ ప్రతినిధి బృందం ఈ భేటీ సందర్భంగా వెల్లడించింది. గత ఆరు నెలల్లో రియలీ్ట, లీజింగ్, ఆఫీస్ స్పేస్, నిర్మాణ రంగం, రెసిడెన్షియల్ స్పేస్లో హైదరాబాద్ నగరం గణనీయమైన వృద్ధి నమోదు చేసినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు సంబంధించి ప్రతి ఆరు నెలలకోమారు వెల్లడయ్యే తమ నివేదిక తాజా నివేదిక జూలై నెలాఖరులో వెలువడుతుందని ప్రతినిధి బృందం వెల్లడించింది. లాక్హీడ్ మారి్టన్ డైరెక్టర్ భేటీ ఏరోస్పేస్ సాంకేతికత దిగ్గజ సంస్థ ‘లాక్హీడ్ మార్టిన్’ఇండియా డైరెక్టర్ (ఏరోనాటిక్స్) మైఖేల్ ఫెర్నాండెజ్ సీఎం రేవంత్రెడ్డితో మంగళవారం సచివాల యంలో భేటీ అయ్యారు. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు శ్రీధర్బాబు, ఉత్తమ్కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
నిరాశపరచనున్న నైరుతి రుతు పవనాలు.. సాధారణ వర్షపాతం