-
T20 World Cup 2024: పాకిస్తాన్ చచ్చీ చెడి...
లాడర్హిల్ (ఫ్లోరిడా): పేలవ ఆటతో ‘సూపర్–8’ అవకాశాలు కోల్పోయిన పాకిస్తాన్ చివరి లీగ్ మ్యాచ్లోనూ అతి కష్టమ్మీద నెగ్గి టి20 వరల్డ్ కప్ను ముగించింది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ చివరి లీగ్ మ్యాచ్లో పాక్ 3 వికెట్ల తేడాతో ఐర్లాండ్పై విజయం సాధించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (19 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్లు) టాప్ స్కోరర్ కాగా, జోష్ లిటిల్ (18 బంతుల్లో 22 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో ఇమాద్ వసీమ్, షాహిన్ అఫ్రిది చెరో 3 వికెట్లు పడగొట్టగా... ఆమిర్కు 2 వికెట్లు దక్కాయి. అనంతరం పాక్ 18.5 ఓవర్లలో 7 వికెట్లకు 111 పరుగులు చేసి గెలిచింది. ఒకవైపు జట్టు వరుసగా వికెట్లు కోల్పోయినా... కెప్టెన్ బాబర్ ఆజమ్ (34 బంతుల్లో 32 నాటౌట్; 2 ఫోర్లు) చివరి వరకు నిలవగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ షాహిన్ అఫ్రిది (5 బంతుల్లో 13 నాటౌట్; 2 సిక్స్లు) జట్టును గట్టెక్కించాడు. టి20 ప్రపంచకప్లో నేడుబంగ్లాదేశ్ X నేపాల్వేదిక: కింగ్స్టౌన్; ఉదయం గం. 5 నుంచినెదర్లాండ్స్ X శ్రీలంక వేదిక: గ్రాస్ ఐలెట్; ఉదయం గం. 6 నుంచిన్యూజిలాండ్ X పాపువా న్యూగినీవేదిక: ట్రినిడాడ్; రాత్రి గం. 8 నుంచిస్టార్ స్పోర్ట్స్, హాట్ స్టార్లో ప్రత్యక్ష ప్రసారం -
PAK Vs IRE: ఐర్లాండ్తో మ్యాచ్.. పరువు కోసం పాక్! తుది జట్లు ఇవే
టీ20 వరల్డ్కప్-2024 నుంచి ఇప్పటికే ఇంటిముఖం పట్టిన పాకిస్తాన్.. చివరగా తమ పరువు కాపాడుకునేందుకు సిద్దమైంది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్తో పాకిస్తాన్ తలపడుతోంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పాకిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తమ ఆఖరి పోరులో ఇరు జట్లు చెరో మార్పుతో బరిలోకి దిగాయి. పాక్ జట్టులోకి నసీం షా స్ధానంలో అబ్బాస్ అఫ్రిది రాగా...ఐరీష్ జట్టులోకి బెన్ వైట్ వచ్చాడు. ఇక ఈ మెగా ఈవెంట్లో ఇప్పటివరకు మూడు మ్యాచ్లు ఆడిన పాక్.. కేవలం ఒక్క మ్యాచ్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్ధానంలో ఉంది. ఐర్లాండ్ ఇప్పటివరకు ఒక్క మ్యాచ్లో కూడా గెలుపొందలేదు.తుది జట్లుఐర్లాండ్: పాల్ స్టిర్లింగ్(కెప్టెన్), ఆండ్రూ బల్బిర్నీ, లోర్కాన్ టక్కర్(వికెట్ కీపర్), హ్యారీ టెక్టర్, కర్టిస్ కాంఫర్, జార్జ్ డాక్రెల్, గారెత్ డెలానీ, మార్క్ అడైర్, బారీ మెక్కార్తీ, జాషువా లిటిల్, బెంజమిన్ వైట్పాకిస్థాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్ కీపర్), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, అబ్బాస్ అఫ్రిది, హరీస్ రవూఫ్, మహ్మద్ అమీర్ -
కోహ్లి కంటే మా తమ్ముడు ఎంతో బెటర్: పాక్ మాజీ క్రికెటర్
టీ20 వరల్డ్కప్-2024లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి పేలవ ప్రదర్శన కొనసాగుస్తున్న సంగతి తెలిసింది. ఐపీఎల్-2024 టాప్ రన్స్కోరర్గా నిలిచిన కింగ్ కోహ్లి.. ఈ పొట్టి ప్రపంచకప్లో మాత్రం తన మార్క్ను చూపించలేకపోతున్నాడు. ఈ మెగా టోర్నీలో ఇప్పటివరకు 3 మ్యాచ్లు ఆడిన విరాట్.. కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో కోహ్లిని ఉద్దేశించి పాకిస్తాన్ మాజీ వికెట్ కీపర్ కమ్రాన్ అక్మల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. విరాట్ కోహ్లీ కంటే తన తమ్ముడు ఉమర్ అక్మల్ ఎంతో బెటర్ అని కమ్రాన్ అక్మల్ అభిప్రాయపడ్డాడు."విరాట్ కోహ్లి సాధించిన రికార్డులకు మా తమ్ముడు ఉమర్ అక్మల్ దగ్గరకలేకపోవచ్చు. కానీ టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో మాత్రం ఉమర్ అక్మల్ రికార్డ్స్ కోహ్లీ కంటే మెరుగ్గా ఉన్నాయి. టీ20 వరల్డ్కప్లో కోహ్లి కంటే మెరుగైన స్ట్రైక్ రేట్, అత్యధిక వ్యక్తిగత స్కోరును ఉమర్ కలిగి ఉన్నాడు.కానీ కోహ్లిలా మాకు పీఆర్ ఎజెన్సీలు లేవు. అందకే మా గణాంకాలు, ప్రదర్శనలను సోషల్ మీడియాలో ప్రమోటు చేసుకోలేము. పొట్టి ప్రపంచకప్లో మా తమ్ముడు కలిగి ఉన్న గణాంకాలు ప్రస్తుత 15 మంది సభ్యుల గల భారత జట్టులో ఎవరికి లేవు. ప్రస్తుత టోర్నీల్లో కోహ్లి వరుసగా విఫలమవుతున్నాడు. మెనెజ్మెంట్ విరాట్ను విమర్శించిన ఆశ్చర్యపోనక్కర్లలేదని ఏఆర్వై న్యూస్ డిబీట్లో కమ్రాన్ అక్మల్ విషం చిమ్మాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వీడియో వైరలవుతోంది. ఇది చూసిన కోహ్లి ఫ్యాన్స్ అక్మల్కు కౌంటిరిస్తున్నారు. కోహ్లితో ఉమ్రాన్కు పోలికా, అందుకే మీ జట్టు లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిపోయిందని పోస్టులు పెడుతున్నారు. -
పాపం పాకిస్తాన్.. అస్సలు ఊహించలేదు! టీ20 వరల్డ్కప్ చరిత్రలోనే
టీ20 వరల్డ్కప్-2024లో పాకిస్తాన్ జట్టు కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో దారుణ ప్రదర్శన కనబరిచిన పాకిస్తాన్ తొలి రౌండ్లోనే ఇంటుముఖం పట్టింది. తొలి మ్యాచ్లో అమెరికా చేతిలో అనుహ్యంగా ఓటమి చవిచూసిన పాక్.. ఆ తర్వాత భారత్పై పోరాడి ఓటమి పాలైంది.అనంతరం కెనడాపై తిరిగి పుంజుకుని బాబర్ సేన అద్బుత విజయం సాధించింది. దీంతో తమ సూపర్-8 ఆశలను పాక్ సజీవంగా నిలుపునకుంది. అయితే పాక్ భవితవ్యం ఆతిథ్య అమెరికాపై ఆధారపడింది.ఐర్లాండ్ చేతిలో అమెరికా ఓడిపోతుందని, ఆ తర్వాత ఐర్లాండ్ను ఓడించి సూపర్-8కు వెళ్లాలని భావించిన పాక్ ఆశలపై వరుణుడు నీళ్లు జల్లాడు. అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వడంతో పాక్ టోర్నీ నుంచి గ్రూప్ దశలోనే నిష్క్రమించింది.ఇదే తొలిసారి..కాగా టీ20 వరల్డ్కప్లో పాకిస్తాన్ గ్రూపు స్టేజిలో ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి. ఇంతకుముందు టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో పాక్ ఒక్కసారి కూడా గ్రూపు స్టేజిలో నిష్క్రమించలేదు. 2007లో షోయబ్ మాలిక్ సారథ్యంలో రన్నరప్గా పాక్ నిలిచింది. అనంతరం 2009లో కూడా యూనిస్ ఖాన్ కెప్టెన్సీలో ఫైనల్కు చేరింది. ఆ తర్వాత షాహిద్ అఫ్రిది(2010), మహ్మద్ హాఫీజ్(2012) కెప్టెన్సీలో పాక్ సెమీఫైనల్స్కు చేరింది. అదే విధంగా బాబర్ ఆజం నాయకత్వంలో 2021 పొట్టి వరల్డ్కప్లో సెమీఫైనలిస్ట్గా, 2022 వరల్డ్కప్లో రన్నరప్గా నిలిచింది.కానీ ఈ సారి మాత్రం పాక్ గ్రూపు స్టేజిని దాటలేకపోయింది. దీంతో టీ20 ప్రపంచకప్లో గ్రూప్ స్టేజ్ నుంచి నిష్క్రమించిన తొలి పాక్ జట్టు కెప్టెన్గా బాబర్ ఆజం చెత్త రికార్డును నెలకొల్పాడు. దీంతో బాబర్పై ఆ దేశ మాజీ క్రికెటర్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. -
T20 WC: పాకిస్తాన్కు చావు దెబ్బ.. ప్రపంచకప్ టోర్నీ నుంచి అవుట్
టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ప్రయాణం ముగిసింది. పేలవ ప్రదర్శనతో వరుస పరాజయాలతో చతికిలపడ్డ బాబర్ ఆజం బృందాన్ని దురదృష్టం కూడా వెంటాడింది.అమెరికా- ఐర్లాండ్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో పాకిస్తాన్ సూపర్-8 రేసు నుంచి నిష్క్రమించింది. గతేడాది రన్నరప్గా నిలిచిన ఈ జట్టు ఈసారి కనీసం సెమీస్ కూడా చేరుకుండానే ఇంటిబాట పట్టింది.మరోవైపు.. గ్రూప్-ఏ టాపర్గా సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు అమెరికా కూడా తదుపరి దశకు అర్హత సాధించింది.బాబర్ ఆజంకు మరో చేదు అనుభవంగతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్కప్లోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన కనబరిచిన విషయం తెలిసిందే. సెమీ ఫైనల్ కూడా చేరుకుండానే ఐసీసీ టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ క్రమంలో అతడు జట్టు ఓటములకు బాధ్యత వహిస్తూ మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలిగాడు.ఆ తర్వాత బాబర్ ఆజం స్థానంలో టెస్టులకు షాన్ మసూద్, టీ20లకు షాహిన్ ఆఫ్రిది కెప్టెన్లుగా నియమితులయ్యారు. అయితే, వీరి సారథ్యంలో ఘోర పరాజయాలు.. అదే విధంగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో మార్పుల అనంతరం.. బాబర్ ఆజం మళ్లీ పరిమిత ఓవర్ల కెప్టెన్గా ఎంపికయ్యాడు.ఆ సిరీస్లో వైట్వాష్టీ20 ప్రపంచకప్-2024 టోర్నీకి ముందు పీసీబీ అతడి పునర్నియామకానికి సంబంధించి ప్రకటన విడుదల చేసింది. వన్డే, టీ20 జట్లకు సారథిగా ప్రకటించింది. అయితే, బాబర్ కెప్టెన్సీలో తొలుత ఇంగ్లండ్తో సిరీస్ ఆడిన పాకిస్తాన్ వైట్వాష్(2-0)కు గురికాగా.. వరల్డ్కప్ టోర్నీలో పరాజయాల పరంపర కొనసాగింది.అమెరికా చేతిలో చిత్తుగ్రూప్-ఏలో టీమిండియా, ఐర్లాండ్, కెనడా, అమెరికాలతో పాటు ఉన్న పాకిస్తాన్.. తొలుత అమెరికా(సూపర్ ఓవర్ ద్వారా ఫలితం), అనంతరం టీమిండియా చేతిలో ఓటమిపాలైంది. తద్వారా సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది.మరోవైపు.. ఆతిథ్య అమెరికా తొలుత కెనడా.. తర్వాత పాకిస్తాన్ను ఓడించి మెరుగైన స్థితిలో నిలిచింది. ఈ క్రమంలో కెనడాపై విజయం సాధించిన పాకిస్తాన్.. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ ఫలితంపై ఆశలు పెట్టుకోగా అది కాస్తా వర్షం వల్ల రద్దైంది.ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే అవుట్ఫలితంగా అమెరికా ఖాతాలో ఐదు పాయింట్లు చేరగా.. కేవలం రెండు పాయింట్లే కలిగి ఉన్న పాక్.. తమకు ఐర్లాండ్తో మిగిలిన మ్యాచ్లోనూ గెలిచినా లాభం లేకుండా పోయింది. ఐరిష్ జట్టుపై పాక్ గెలిచినా నాలుగు పాయింట్లే అవుతాయి కాబట్టి.. అమెరికాపై పైచేయి సాధించలేదు. దీంతో అమెరికా సూపర్-8కు చేరగా.. బాబర్ బృందం గ్రూప్ దశ కూడా దాటలేక నిష్క్రమించింది. చదవండి: T20 WC: అతడిని వదిలేశారు... కివీస్కు తగినశాస్తి: మాజీ క్రికెటర్ ఫైర్ -
అమెరికా ముందుకు... పాక్ ఇంటికి
లాడర్హిల్ (ఫ్లోరిడా): టి20 ప్రపంచ కప్లో అత్యంత కీలక ఫలితం! తొలిసారి ప్రపంచ కప్లో పాల్గొన్న ఆతిథ్య అమెరికా జట్టు సూపర్–8 దశకు అర్హత సాధించింది. గ్రూప్ ‘ఎ’లో శుక్రవారం అమెరికా, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన లీగ్ మ్యాచ్ భారీ వర్షం కారణంగా రద్దయింది. దాంతో ఈ గ్రూప్ నుంచి భారత్ (6 పాయింట్లు), అమెరికా (5 పాయింట్లు) ముందంజ వేశాయి. ఆడిన 3 మ్యాచ్లలో ఒకటే గెలిచిన 2009 చాంపియన్ పాకిస్తాన్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. గత రెండు టి20ల్లో వరల్డ్ కప్లలో వరుసగా సెమీఫైనల్, ఫైనల్ వరకు చేరిన పాక్ ఈసారి పేలవ ప్రదర్శనతో కుప్పకూలింది. భారత్తో పాటు అమెరికా చేతిలో ఓడిన ఆ జట్టు కెనడాపై మాత్రం గెలవగలిగింది. ఈ గ్రూప్లో బలహీన కెనడాపై నెగ్గిన అమెరికా... పాక్పై సంచలన విజయం సాధించి తమ అవకాశాలు మెరుగుపర్చుకుంది. తాజా ఫలితంతో ఆదివారం ఐర్లాండ్తో తమ చివరి మ్యాచ్ ఆడకుండానే వరల్డ్ కప్లో పాక్ ఆట ముగిసింది. లాడర్హిల్లో గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు శుక్రవారం కూడా తెరిపినివ్వలేదు. నిర్ణీత సమయం నుంచి దాదాపు మూడు గంటల సుదీర్ఘ సమయం పాటు వేచి చూసినా ఫలితం లేకపోయింది. వర్షం తగ్గినా మ్యాచ్ కోసం మైదానాన్ని సిద్ధం చేయడం సాధ్యం కాలేదు. పదే పదే తనిఖీల తర్వాత కనీసం 5 ఓవర్ల ఆట అయినా నిర్వహించాలని ఆశించినా... మళ్లీ చినుకులు మొదలయ్యాయి. దాంతో అంపైర్లు మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆతిథ్య జట్టు హోదాలో బరిలోకి దిగి సూపర్–8కు చేరడం ద్వారా అమెరికా 2026 టి20 వరల్డ్ కప్కు కూడా నేరుగా అర్హత సాధించింది. -
T20 World Cup 2024: పాకిస్తాన్కు బ్యాడ్ న్యూస్
టీ20 వరల్డ్కప్ 2024 సూపర్-8కు చేరాలన్న పాకిస్తాన్ ఆశలకు వరుణుడు ఆటంకం కలిగిస్తున్నాడు. గ్రూప్-ఏలో భాగంగా ఇవాళ (జూన్ 14) యూఎస్ఏ, ఐర్లాండ్ జట్లు పోటీపడాల్సి ఉండగా.. మ్యాచ్ ప్రారంభానికి వరుణుడు అడ్డు తగులుతున్నాడు. భారతకాలమానం ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. అర్ద గంట గడిచినా టాస్ కూడా పడలేదు. వర్షం కారణంగా మైదానం చిత్తడిగా ఉండటంతో అంపైర్లు టాస్ కూడా వేయలేదు. భారతకాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు అంపైర్లు మరో మారు మైదానాన్ని పరిశీలిస్తామని చెప్పారు. ఒకవేళ అప్పటికీ మైదానం తడిగా ఉంటే మ్యాచ్ మరో గంట ఆలస్యం కావచ్చు. ఇదే జరిగే ఓవర్లు కుదించి మ్యాచ్ జరపాల్సి ఉంటుంది. ఒకవేళ మరోసారి వరుణుడు ఆటంకం కలిగిస్తే మ్యాచ్ పూర్తిగా రద్దైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా జరిగితే యూఎస్ఏ, ఐర్లాండ్కు చెరో పాయింట్ లభిస్తుంది. ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్న యూఎస్ఏ.. మరో పాయింట్ ఖాతాలో పడితే ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది. అప్పుడు పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్లో గెలిచినా నాలుగు పాయింట్లు మాత్రమే వారి ఖాతాలో ఉంటాయి. ఈ లెక్కన పాక్ ఇంటికి.. యూఎస్ఏ సూపర్-8కి చేరుకుంటాయి.ఇదిలా ఉంటే, గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించింది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం యూఎస్ఏ, పాకిస్తాన్ పోటీ పడుతున్నాయి. ఈ గ్రూప్లో ఉన్న మరో రెండు జట్లు (కెనడా, ఐర్లాండ్) టోర్నీ నుంచి అధికారికంగా నిష్క్రమించలేదు.గ్రూప్-సి నుంచి ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్.. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా జట్లు సూపర్-8కు అర్హత సాధించగా.. గ్రూప్-బి నుంచి నమీబియా, ఒమన్.. గ్రూప్-సి నుంచి ఉగాండ, పపువా న్యూ గినియా, న్యూజిలాండ్.. గ్రూప్-డి నుంచి శ్రీలంక ఎలిమినేట్ అయ్యాయి. -
T20 World Cup 2024: పాపం న్యూజిలాండ్.. పదేళ్ల తర్వాత తొలిసారి..!
టీ20 వరల్డ్కప్ 2024లో న్యూజిలాండ్ మరో రెండు మ్యాచ్లు ఆడాల్సి ఉండగానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. వరల్డ్కప్ టోర్నీల్లో (వన్డే/టీ20) సెమీస్ లేదా ఫైనల్కు చేరకుండా నిష్క్రమించడం ఆ జట్టుకు పదేళ్లలో ఇది తొలిసారి. 2014 టీ20 వరల్డ్కప్లో చివరిసారి సెమీస్ లేదా ఫైనల్స్కు చేరకుండా (రౌండ్ 2) ప్రపంచకప్ టోర్నీల నుంచి నిష్క్రమించిన న్యూజిలాండ్.. 2015 నుంచి వరుసగా ఆరు సార్లు సెమీస్ లేదా ఫైనల్స్కు చేరుకుంటూ వచ్చింది.2015 వన్డే వరల్డ్కప్లో ఫైనల్స్కు చేరిన న్యూజిలాండ్.. ఆ తర్వాత 2016 టీ20 వరల్డ్కప్లో సెమీస్కు, 2019 వన్డే వరల్డ్కప్లో ఫైనల్స్కు, 2021 టీ20 వరల్డ్కప్లో ఫైనల్స్కు, 2022 టీ20 వరల్డ్కప్లో సెమీస్కు, 2023 వన్డే వరల్డ్కప్లో సెమీస్కు చేరింది.ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో ఆఫ్ఘనిస్తాన్, వెస్టిండీస్ చేతుల్లో అనూహ్య పరాజయాలు ఎదుర్కొన్న న్యూజిలాండ్ ఊహించని రీతిలో టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి వస్తుంది. ఈ టోర్నీ హాట్ ఫేవరెట్లలో ఒకటైన న్యూజిలాండ్ అవమానకర రీతిలో టోర్నీ నుంచి వైదొలగడంతో ఆ జట్టు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ టోర్నీలో న్యూజిలాండ్ తరహాలోనే శ్రీలంక కూడా సూపర్-8కు చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. మరో పెద్ద జట్టు పాకిస్తాన్ ఈ రెండు జట్ల సరసన చేరేందుకు సిద్దంగా ఉంది.టెస్ట్ ప్లేయింగ్ దేశాలైన న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్ కనీసం సూపర్-8కు కూడా చేరకుండానే నిష్క్రమిస్తుండటంతో ఆయా దేశాలకు చెందిన అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, యూఎస్ఏ, స్కాట్లాండ్ లాంటి చిన్న జట్లు ఈ టోర్నీలో సంచలనాలు నమోదు చేస్తున్నాయి. పై పేర్కొన్న జట్లలో అనుభవ పరంగా అన్నింటి కంటే చిన్న జట్టైన యూఎస్ఏ ఓసారి ప్రపంచ ఛాంపియన్ అయిన పాక్కు షాకిచ్చిప పెను సంచనలం సృష్టించింది. నేడు (జూన్ 14) ఐర్లాండ్తో యూఎస్ఏ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్లో ఆ జట్టు గెలిచినా లేక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా యూఎస్ఏ సూపర్-8కు, పాక్ ఇంటికి చేరతాయి. -
T20 World Cup 2024: పాక్ భవితవ్యం తేలేది నేడే (జూన్ 14)..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 14) అత్యంత కీలకమైన మ్యాచ్ జరుగనుంది. గ్రూప్-ఏ నుంచి సూపర్-8 రెండో బెర్త్ కోసం యూఎస్ఏ.. ఐర్లాండ్తో పోటీపడనుంది. యూఎస్ఏ ఈ మ్యాచ్లో గెలిచినా లేక వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దైనా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఈ గ్రూప్ నుంచి రెండో బెర్త్ కోసం పోటీపడుతున్న మరో జట్టు పాక్ భవితవ్యం నేటి మ్యాచ్తో తేలిపోనుంది.ఇవాల్టి మ్యాచ్లో యూఎస్ఏ గెలిచినా లేక మ్యాచ్ రద్దైనా పాక్ తదుపరి ఆడాల్సిన మ్యాచ్తో (ఐర్లాండ్) సంబంధం లేకుండా ఇంటిదారి పడుతుంది. గ్రూప్-ఏ నుంచి భారత్ ఇదివరకే సూపర్-8కు అర్హత సాధించగా.. యూఎస్ఏ, పాక్ల మధ్య రెండో బెర్త్ కోసం పోటీ నెలకొంది.టీమిండియా ఆడిన మూడు మ్యాచ్ల్లో మూడింట విజయాలు సాధించి గ్రూప్-ఏ టాపర్గా ఉండగా.. యూఎస్ఏ మూడింట రెండు గెలిచి నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. పాక్ విషయానికొస్తే.. దాయాది జట్టు ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి రెండింట ఓడి రెండు పాయింట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఒకవేళ ఐర్లాండ్తో మ్యాచ్లో యూఎస్ఏ ఓడి.. పాక్ తదుపరి ఐర్లాండ్తో ఆడబోయే మ్యాచ్లో భారీ తేడాతో గెలిస్తే పాక్కు సూపర్-8కు చేరే అవకాశాలు ఉంటాయి. అయితే ఇలా జరిగేందుకు ప్రకృతి సహకరించడం లేదు. యూఎస్ఏ-ఐర్లాండ్ల మధ్య ఇవాళ జరగాల్సిన మ్యాచ్కు వరుణ గండం పొంచి ఉంది. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఫ్లోరిడాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం నేటి మ్యాచ్ జరగడం దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి. ఒకవేళ ఈ మ్యాచ్ రద్దైతే యూఎస్ఏ ఐదు పాయింట్లతో సూపర్-8కు అర్హత సాధిస్తుంది.ఇదిలా ఉంటే, ఇవాళే మరో రెండు మ్యాచ్లు జరుగనున్నాయి. గ్రూప్-డి నుంచి సౌతాఫ్రికా-నేపాల్.. గ్రూప్-సి నుంచి న్యూజిలాండ్-ఉగాండ జట్లు పోటీపడనున్నాయి. యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరునున్న మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. సౌతాఫ్రికా-నేపాల్ మ్యాచ్ కింగ్స్టౌన్ వేదికగా రేపు తెల్లవారుజామున 5 గంటలకు మొదలవుతుంది. న్యూజిలాండ్-ఉగాండ మధ్య జరగాల్సిన మ్యాచ్ ట్రినిడాడ్ వేదికగా రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతుంది. -
అందరికీ పది నిమిషాలు.. అతడికి ఇరవై: పాక్ మాజీ కెప్టెన్ ఫైర్
పాకిస్తాన్ యువ క్రికెటర్ ఆజం ఖాన్ను ఉద్దేశించి మాజీ కెప్టెన్ మహ్మద్ హఫీజ్ సంచనల వ్యాఖ్యలు చేశాడు. అతడికి ఫిట్నెస్పై ఏమాత్రం ఆసక్తి లేదని.. ఆజం ఖాన్ను మార్చాలని తాము చేసిన ప్రయత్నం విఫలమైందని పేర్కొన్నాడు.లావుగా ఉండటం సమస్య కాదని.. కానీ ఫిట్నెస్పై శ్రద్ధ లేకపోవడమే అసలైన సమస్య అని ఆజం ఖాన్ను హఫీజ్ ఘాటుగా విమర్శించాడు. కాగా పాక్ మాజీ కెప్టెన్ మెయిన్ ఖాన్ కుమారుడైన ఆజం ఖాన్ 2021లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.పూర్తిగా విఫలంకుడిచేతి వాటం కలిగిన ఈ వికెట్ కీపర్ బ్యాటర్కు అడపాదడపా పాక్ జట్టులో అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ టీ20 ప్రపంచకప్-2024 సన్నాహకాల్లో భాగంగా.. ఇటీవల ఇంగ్లండ్తో టీ20 సిరీస్లో ఆడే ఛాన్స్ ఇచ్చినప్పటికీ పూర్తిగా విఫలమయ్యాడు.రెండు మ్యాచ్లు ఆడి కేవలం 11 పరుగులే చేయడంతో పాటు.. వికెట్ కీపర్గానూ కీలక సమయంలో క్యాచ్లు మిస్ చేసి పాక్ పరాజయాలకు పరోక్ష కారకుడయ్యాడు. ఫలితంగా ఆజం ఖాన్పై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి.గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి అయినప్పటికీ అతడిపై నమ్మకం ఉంచిన మేనేజ్మెంట్ టీ20 ప్రపంచకప్-2024లో పాకిస్తాన్ ఆరంభ మ్యాచ్లో తుదిజట్టులో చోటు కల్పించింది. అమెరికాతో జరిగిన ఈ మ్యాచ్లో ఆజం ఖాన్ గోల్డెన్ డకౌట్గా వెనుదిరిగి మరోసారి ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఆ తర్వాతి మ్యాచ్లలో అతడిని పక్కనపెట్టింది యాజమాన్యం. లావుగా ఉండటం సమస్య కాదుఈ నేపథ్యంలో మాజీ సెలక్టర్, పాక్ జట్టు మాజీ డైరెక్టర్ హఫీజ్ ఖాన్ ఆజం ఖాన్ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ‘‘పాకిస్తాన్ క్రికెట్ జట్టులోని ఆటగాళ్లంతా పది నిమిషాల్లో రెండు కిలోమీటర్లు నడిస్తే.. ఆజం ఖాన్ మాత్రం అందుకోసం 20 నిమిషాల సమయం తీసుకుంటాడు.నిజానికి అతడు అంతర్జాతీయ క్రికెట్ను సీరియస్గా తీసుకోకపోవడం విషాదకరం. సన్నగా.. లేదంటే లావుగా ఉండటం అనేది నా దృష్టిలో అసలు సమస్యే కాదు.అయితే, ఆటకు తగ్గట్లుగా మన శరీరాన్ని మలచుకోవడం ముఖ్యం. నిర్దేశిత ఫిట్నెస్ లెవల్స్ సాధించాల్సి ఉంటుంది. గతంలో మేము అతడికి ఫిట్నెస్ ప్లాన్ ఇచ్చాం.టాలెంట్ ఉంటే సరిపోదుకానీ ఆజం ఖాన్ ఏమాత్రం మెరుగుపడలేదు. టాలెంట్ ఉంది కాబట్టి జట్టులో అవకాశాలు రావచ్చు. అలాంటపుడు ఫిట్నెస్ కాపాడుకుంటే మంచిది కదా.జట్టులో అతడు తప్ప ఎవరూ ఫిట్నెస్ విషయంలో కాంప్రమైజ్ కారు’’ అంటూ ఆజం ఖాన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు మహ్మద్ హఫీజ్. ఇదిలా ఉంటే ప్రపంచకప్-2024 టోర్నీలో పాకిస్తాన్ గ్రూప్ దశలోనే ఎలిమినేట్ కావడం దాదాపుగా ఖరారైపోయింది. కాగా.. ఇప్పటిదాకా పాక్ తరఫున 13 మ్యాచ్లు ఆడిన ఆజం ఖాన్.. 135.38 స్ట్రైక్రేటుతో 88 పరుగులు మాత్రమే చేశాడు.చదవండి: T20 WC AFG Vs PNG: అదరగొట్టిన ఆఫ్గనిస్తాన్.. న్యూజిలాండ్ ఎలిమినేట్ -
T20 World Cup 2024: టీమిండియా తదుపరి మ్యాచ్ వర్షార్పణం..?
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా భారత్ ఆడబోయే తదుపరి మ్యాచ్ భారీ వర్షాల కారణంగా రద్దయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూన్ 15న భారత్.. కెనడాతో తలపడనుంది. ఈ మ్యాచ్కు వేదిక అయిన ఫ్లోరిడాలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. మరో నాలుగైదు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగనుందని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.ఫ్లోరిడాలో భారత్-కెనడా మ్యాచ్తో పాటు మరో రెండు కీలక మ్యాచ్లు జరుగనున్నాయి. జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్.. జూన్ 16న ఐర్లాండ్-పాకిస్తాన్ జట్లు పోటీపడనున్నాయి. గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు చేరే క్రమంలో యూఎస్ఏ, పాకిస్తాన్లకు ఈ మ్యాచ్లు చాలా కీలకం.The conditions in Florida is reallyBad right now.- India vs Canada.- Pakistan vs Ireland.- USA vs Ireland.- All 3 games will be played in Florida in this T20 World Cup 2024.pic.twitter.com/0g1zhWOzEZ— Tanuj Singh (@ImTanujSingh) June 13, 2024ఇలా జరిగినా పాక్ ఇంటికే..జూన్ 14న యూఎస్ఏ-ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి. ఐర్లాండ్తో మ్యాచ్ రద్దైతే ఆ జట్టు ఖాతాలో మరో పాయింట్ చేరి మొత్తంగా ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. పాక్ తదుపరి ఆడబోయే మ్యాచ్లో ఐర్లాండ్ను ఓడించినా ఫలితం ఉండదు. ఆ జట్టు ఖాతాలో నాలుగు పాయింట్లు మాత్రమే ఉంటాయి. అప్పుడు యూఎస్ఏ.. భారత్తో పాటు గ్రూప్-ఏ నుంచి సూపర్-8కు అర్హత సాధిస్తుంది. భారత్ ఇప్పటికే ఆడిన మూడు మ్యాచ్ల్లో గెలిచి సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. -
T20 WC 2024: పాకిస్తాన్కు ఊహించని షాక్!
టీ20 ప్రపంచకప్-2024 టోర్నీలో ముందుకు సాగాలన్న పాకిస్తాన్ ఆశలు ఆవిరయ్యేలా ఉన్నాయి. వర్షం దెబ్బకు కనీసం ఈసారి గ్రూప్ దశ దాటడం కూడా గగనమే కానుంది. కాగా టీమిండియాతో పాటు గ్రూప్-ఏలో భాగమైన బాబర్ ఆజం బృందం.. ఇప్పటి వరకు మూడు మ్యాచ్లు ఆడి కేవలం ఒక్కటే గెలిచింది.తొలుత అమెరికా చేతిలో ఓడిన పాక్.. తర్వాత టీమిండియాతో ఉత్కంఠ మ్యాచ్లోనూ అపజయం పాలైంది. ఈ క్రమంలో కెనడాపై గెలుపొందిన పాకిస్తాన్.. సూపర్-8 చేరాలంటే అమెరికాతో పోటీ పడాల్సి ఉంది.అమెరికా ఓడిపోతేనేఈ నేపథ్యంలో ఐర్లాండ్తో జరగాల్సిన మ్యాచ్లో అమెరికా గనుక ఓడితే పాక్కు అవకాశాలు ఉంటాయి. అయితే, జూన్ 14న జరిగే ఈ మ్యాచ్ రద్దయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.లాడర్హిల్లోని సెంట్రల్ బొవార్డ్ రీజినల్ పార్క్ స్టేడియం టర్ఫ్ గ్రౌండ్లో ఐర్లాండ్- అమెరికా మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, ఫ్లోరిడాలో ఇప్పుడు భారీ వర్షాలు కురుస్తున్నాయి.భారీ వర్షాలు.. ఎమర్జెన్సీ ప్రకటనఈ క్రమంలో ఫోర్ట్ లాడర్డేల్లో ఎమర్జెన్సీ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. వాన, వరద ఉధృతమయ్యే సూచనలు ఉన్నాయని.. కాబట్టి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు హెచ్చరికలు జారీ చేసింది.శ్రీలంక పయనం వాయిదాఈ నేపథ్యంలో సౌత్ ఫ్లోరిడా నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన విమానాలు రద్దయ్యాయి. దీంతో శ్రీలంక జట్టు వెస్టిండీస్ పయనం వాయిదా పడింది. గ్రూప్-డిలో ఉన్న లంక జట్టు ఇప్పటికే లాడర్హిల్లో ఆడాల్సిన మ్యాచ్ రద్దైన కారణంగా సూపర్-8 నుంచి అనధికారికంగా నిష్క్రమించింది.ఈ క్రమంలో తదుపరి నెదర్లాండ్స్తో మ్యాచ్ కోసం విండీస్ వెళ్లాల్సి ఉండగా.. వర్షాల కారణంగా ప్రస్తుతానికి ఇక్కడే నిలిచిపోయింది లంక జట్టు. The "Qudrat Ka Nizam" is working to eliminate Pakistan from the tournament 😂🤣pic.twitter.com/kJlt46UcNQ— CrickSachin (@Sachin_Gandhi7) June 13, 2024పాక్కు ఊహించని షాక్ఇదిలా ఉంటే.. శుక్రవారం ఫ్లోరిడాలో జరగాల్సిన అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ గనుక వర్షం వల్ల రద్దైతే పాకిస్తాన్ అధికారికంగా గ్రూప్ దశలోనే నిష్క్రమిస్తుంది. ఎందుకంటే.. అమెరికా ఖాతాలో ఇప్పటికే నాలుగు పాయింట్లు ఉన్నాయి.ఐర్లాండ్తో మ్యాచ్ రద్దైతే ఒక పాయింట్ ఖాతాలో చేరితే.. మొత్తం ఐదు పాయింట్లు అవుతాయి. మరోవైపు.. పాక్ రెండు పాయింట్లతో ఉంది. అమెరికా- ఐర్లాండ్ మ్యాచ్ రద్దైతే.. తదుపరి ఫ్లోరిడాలోనే జరగాల్సిన మ్యాచ్లో ఐర్లాండ్ను పాక్ ఓడించినా ఫలితం ఉండదు. ఎందుకంటే.. అందులో గెలిచినా పాక్ ఖాతాలో ఉండేవి నాలుగు పాయింట్లే. కాబట్టి ఇప్పటికే సూపర్-8లో అడుగుపెట్టిన టీమిండియాతో పాటు సెకండ్ టాపర్గా అమెరికా బెర్తు ఖరారు చేసుకుంటుంది. చదవండి: T20 WC: కోహ్లి, రోహిత్ వికెట్లు తీసిన భారత టెకీ.. దిమ్మతిరిగే బ్యాక్గ్రౌండ్! -
డిఫెన్స్ బడ్జెట్ను పెంచిన పాకిస్థాన్!
పాకిస్థాన్ గతేడాదితో పోలిస్తే రక్షణరంగానికి 15 శాతం బడ్జెట్ కేటాయింపులు పెంచుతున్నట్లు ప్రకటించింది. పాక్ ఇటీవల విడుదల చేసిన 2024-25 బడ్జెట్లో డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పింది.పాక్ బుధవారం రూ.18లక్షలకోట్ల బడ్జెట్ను ప్రవేశపెట్టింది. దాయాదిదేశం గతేడాది రక్షణ రంగానికి రూ.1.8లక్షల కోట్లమేర నిధులు ఇచ్చింది. అంతకుముందు 2022-23 ఏడాదికిగాను రూ.1.5లక్షలకోట్లు ఖర్చుచేసింది. క్రమంగా ఆయా నిధులు పెంచుకుంటూ 2024-25 ఏడాదికిగాను డిఫెన్స్ రంగానికి రూ.2.1లక్షల కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఇది గతేడాది కేటాయింపుల కంటే 15 శాతం ఎక్కువ. కాగా, రానున్న బడ్జెట్ సెషన్లో భారత్కూడా ఆమేరకు కేటాయింపులు పెంచుతుందనే ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: సిమ్ కార్డు, వై-ఫై కనెక్షన్ లేకపోయినా మెసేజ్లు పంపాలా..?అంతర్జాతీయ భౌగోళిక అనిశ్చితులు పెరుగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్ మొత్తం తన బడ్జెట్లో దాదాపు 12 శాతం రక్షణ రంగానికే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దాంతో భారత్ కూడా ఆ శాఖకు నిధులు గుమ్మురిస్తుందనే వాదనలున్నాయి. ఒకవేళ రానున్న బడ్జెట్ సమావేశాల్లో భారత్ డిఫెన్స్ రంగానికి కేటాయింపులు పెంచితే ఆ రంగంలోని లిస్టెడ్ కంపెనీల స్టాక్లు మరింత పెరుగుతాయని మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
గెలిచి నిలిచిన పాక్
న్యూయార్క్: హమ్మయ్య... పాకిస్తాన్ ఊపిరి పీల్చుకుంది. టి20 ప్రపంచకప్లో ‘సూపర్–8’ దశకు చేరుకునే అవకాశాన్ని సజీవంగా నిలబెట్టుకుంది. గ్రూప్ ‘ఎ’లో మంగళవారం జరిగిన లీగ్ మ్యాచ్లో పాకిస్తాన్ 7 వికెట్ల తేడాతో కెనడాపై విజయం సాధించింది. టాస్ నెగ్గిన పాక్ ఫీల్డింగ్ ఎంచుకోగా... మొదట బ్యాటింగ్కు దిగిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్స్లు) ఒంటరి పోరాటం చేశాడు. తర్వాత బ్యాటింగ్ వరుసలో నవ్నీత్ (4), పర్గత్ (2), నికోలస్ (1), మొవ్వ శ్రేయస్ (2), రవీందర్పాల్ (0) పాక్ బౌలర్లకు దాసోహమయ్యారు. జాన్సన్ 39 బంతుల్లో అర్ధసెంచరీ చేసుకున్నాడు. 14వ ఓవర్లో జట్టు స్కోరు 73 పరుగుల వద్ద ఆరో వికెట్గా నిష్క్రమించిన ఆరోన్ ఒక్కడి స్కోరే 52 పరుగులుండటం విశేషం! కెప్టెన్ సాద్ బిన్ జాఫర్ (10), కలీమ్ (13 నాటౌట్) డబుల్ డిజిట్ స్కోరు చేశారు. ప్రత్యర్థి బౌలర్లలో హారిస్ రవూఫ్, మొహమ్మద్ ఆమిర్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన పాకిస్తాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లలో సయిమ్ అయూబ్ (6) విఫలమవగా.... ఇన్నింగ్స్ను నడిపించే బాధ్యతను మొహమ్మద్ రిజ్వాన్ (53 బంతుల్లో 53 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ఆఖరి దాకా మోశాడు. కెప్టెన్ బాబర్ ఆజమ్ (33 బంతుల్లో 33; 1 ఫోర్, 1 సిక్స్)తో కలిసి రెండో వికెట్కు 63 పరుగులు జోడించాడు. ఫఖర్ జమన్ (4)తో జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు. 52 బంతుల్లో రిజ్వాన్ ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. గెలుపు వాకిట ఫఖర్ నిష్క్రమించగా, ఉస్మాన్ ఖాన్ (2 నాటౌట్)తో కలిసి మిగతా లాంఛనాన్ని పూర్తి చేశాడు. ప్రస్తుతం ఈ గ్రూప్లో భారత్, అమెరికా చెరో 4 పాయింట్లతో తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. పాక్ (2), కెనడా (2) మూడు, నాలుగో స్థానంలో ఉన్నాయి. -
T20 World Cup 2024: కెనడాతో మ్యాచ్.. పాక్ లక్ష్యం 107
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో ఇవాళ (జూన్ 11) జరుగుతున్న మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా స్వల్ప స్కోర్కే పరిమితమైంది. పాక్ బౌలర్లందరూ తలో చేయి వేయడంతో కెనడా నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ (44 బంతుల్లో 52; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపు అర్ద సెంచరీతో రాణించి కెనడాను ఆదుకున్నాడు. ఆరోన్ మినహా కెనడా ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. నవ్నీత్ ధలీవాల్ 4, పర్గత్ సింగ్ 2, నికోలస్ కిర్టన్ 1, శ్రేయస్ మొవ్వ 2, రవీందర్ పాల్ సింగ్ 0, బిన్ జాఫర్ 10, కలీమ్ సలా 13 నాటౌట్, దిల్లన్ హెలీగర్ 9 నాటౌట్ పరుగులు చేశారు. కెనడా స్కోర్కు ఎక్స్ట్రాల రూపంలో 13 పరుగులు వచ్చాయి. పాక్ బౌలర్లలో మొహమ్మద్ ఆమిర్ (4-0-13-2), హరీస్ రౌఫ్ (4-0-26-2), షాహిన్ అఫ్రిది (4-0-21-1), నసీం షా (4-0-24-1), ఇమాద్ వసీం (4-0-19-0) కలిసికట్టుగా రాణించి కెనడాను కట్టడి చేశారు. -
T20 World Cup 2024: కెనడాతో కీలక సమరం.. టాస్ గెలిచిన పాకిస్తాన్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా కెనడా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (జూన్ 11) కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. మరోవైపు కెనడాకు సైతం ఈ మ్యాచ్ అంతే కీలకంగా మారింది. కెనడా కూడా సూపర్-8 రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది.తుది జట్లు..కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్కీపర్), రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్కీపర్), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహ్మద్ అమీర్ -
T20 World Cup 2024: పాక్ భవితవ్యం తేలేది నేడే (జూన్ 11)..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా ఇవాళ (జూన్ 11) మూడు మ్యాచ్లు జరుగనున్నాయి. మొదటి మ్యాచ్ పాకిస్తాన్, కెనడా (న్యూయార్క్) మధ్య భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుండగా.. రెండో మ్యాచ్ శ్రీలంక-నేపాల్ (ఫ్లోరిడా) మధ్య రేపు తెల్లవారు జామున 5 గంటలకు (భారతకాలమానం ప్రకారం).. మూడో మ్యాచ్ ఆస్ట్రేలియా-నమీబియా (ఆంటిగ్వా) జట్ల మధ్య రేపు ఉదయం 6 గంటలకు (భారతకాలమానం ప్రకారం) ప్రారంభం కానున్నాయి.పాక్ భవితవ్యం తేలేది నేడే..!గ్రూప్-ఏలో మొదటి రెండు మ్యాచ్ల్లో ఓడి సూపర్-8 అవకాశాలను సంక్లిష్టం చేసుకున్న పాకిస్తాన్ ఇవాళ పసికూన కెనడాతో తలపడనుంది. సూపర్-8కు చేరాలంటే పాక్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. ఈ మ్యాచ్తో పాటు జూన్ 16న ఐర్లాండ్తో జరుగబోయే మ్యాచ్లోనూ పాక్ భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఇలా జరిగితేనే పాక్ గ్రూప్-ఏ నుంచి సూపర్-8 బెర్త్ రేసులో ఉంటుంది. పాక్ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిచినా సెమీస్కు చేరుకుంటుందన్న గ్యారెంటీ లేదు. ఎందుకంటే.. ఇదివరకే రెండు మ్యాచ్ల్లో (కెనడా, పాక్) గెలిచిన యూఎస్ఏ తదుపరి ఆడబోయే రెండు మ్యాచ్ల్లో (భారత్, ఐర్లాండ్) ఏదో ఒక మ్యాచ్లో గెలిచినా ఆ జట్టే సూపర్-8కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఆడిన రెండు మ్యాచ్ల్లో గెలిచిన భారత్ (1.455), యూఎస్ఏ (0.626) గ్రూప్-ఏ నుంచి తొలి రెండు స్థానాల్లో ఉండగా.. రెండిట ఒక మ్యాచ్ గెలిచిన కెనడా (-0.274) మూడో స్థానంలో.. ఆడిన రెండు మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ (-0.150), ఐర్లాండ్ (-1.712) నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఏదైన అద్భుతం జరిగి యూఎస్ఏ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఓడి.. పాక్ తదుపరి ఆడే రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో గెలిస్తే తప్ప పాక్ సూపర్-8కు చేరలేదు. పాక్ సూపర్-8కు చేరకుండా ప్రపంచకప్ నుంచి నిష్క్రమిస్తే ఆ జట్టుకు మరో పరాభవం కూడా ఎదురవుతుంది. ఇలా జరిగితే పాక్ తదుపరి టీ20 ప్రపంచకప్కు (2026) క్వాలిఫయర్స్ ద్వారా అర్హత సాధించాల్సి ఉంటుంది. ఐసీసీ కొత్త నిబంధనల ప్రకారం ఈ సారి ప్రపంచకప్లో సూపర్-8కు అర్హత సాధించే దేశాలే నేరుగా తదుపరి వరల్డ్కప్కు అర్హత సాధిస్తాయి. -
T20 World Cup 2024: పాక్పై విక్టరీ.. చరిత్ర సృష్టించిన టీమిండియా
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో నిన్న (జూన్ 9) జరిగిన మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్.. పాక్పై తమ గెలుపు రికార్డును (టీ20 ప్రపంచకప్ టోర్నీల్లో) మరింత మెరుగుపర్చుకుంది. టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో భారత్-పాక్లు ఇప్పటివరకు 8 మ్యాచ్ల్లో ఎదురెదురుపడగా.. భారత్ 7 సార్లు విజయం సాధించి పొట్టి ప్రపంచకప్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది.టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఏ జట్టు ఓ ప్రత్యర్ధిపై ఇన్ని విజయాలు (7) సాధించలేదు. పాక్పై గెలుపుకు ముందు ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉండిది. శ్రీలంక పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో వెస్టిండీస్పై 6 సార్లు విజయం సాధించింది. తాజాగా భారత్.. శ్రీలంక రికార్డును తిరగరాసి పాకిస్తాన్పై 7 మ్యాచ్ల్లో విజయబావుటా ఎగురవేసింది.ఇరు ఫార్మాట్ల ప్రపంచకప్ టోర్నీల్లో చూస్తే పాక్పై భారత్ విజయాల రికార్డు మరింత మెరుగ్గా ఉంది. ప్రపంచకప్ టోర్నీల్లో ఇరు ఫార్మాట్లలో (వన్డే, టీ20) భారత్-పాక్లు ఇప్పటివరకు 16 మ్యాచ్ల్లో తలపడగా.. పాక్ ఒకే ఒక మ్యాచ్లో గెలిచింది. 2021 టీ20 వరల్డ్కప్ గ్రూప్ దశ మ్యాచ్లో పాక్.. భారత్పై 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ ఒక్క మ్యాచ్ మినహా ప్రపంచకప్ టోర్నీల్లో భారత్పై పాక్ ఎప్పుడూ గెలవలేదు.వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో అయితే పాక్పై భారత్ గెలుపు రికార్డు వంద శాతంగా ఉంది. ఈ ఫార్మాట్ వరల్డ్కప్ టోర్నీల్లో ఇరు జట్లు 8 సార్లు ఎదురెదురుపడగా.. భారత్ అన్ని మ్యాచ్ల్లో విజయఢంకా మోగించింది. వన్డే వరల్డ్కప్ చరిత్రలో ఓ జట్టుపై అత్యధిక వరుస విజయాల విభాగంలో ఇదే రికార్డు. ఓవరాల్గా చూస్తే ఫార్మాట్ ఏదైనా ప్రపంచకప్ టోర్నీల్లో పాకిస్తాన్పై భారత్ డామినేషన్ ఓ రేంజ్లో కొనసాగుతుంది.కాగా, న్యూయార్క్ వేదికగా నిన్న (జూన్ 9) జరిగిన హైఓల్టేజీ మ్యాచ్లో టీమిండియా 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్ 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.తొలుత పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు మరింత చాకచక్యంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ చేతుల్లో నుంచి గెలుపును లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. -
మరోసారి భారత్, పాకిస్తాన్ మ్యాచ్..!
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య నిన్న (జూన్ 9) హైఓల్టేజీ మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. హోరాహోరీగా సాగిన ఈ సమరంలో భారత్.. పాక్పై 6 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇరు జట్ల పేసర్లు ఆకాశమే హద్దుగా చెలరేగినప్పటికీ అంతిమంగా టీమిండియానే విజయం వరించింది.ఈ ఓటమి అనంతరం పాక్ సూపర్-8 అవకాశాలను (వరల్డ్కప్లో తదుపరి దశ) సంక్లిష్టం చేసుకుంది. ఒకవేళ పాక్ సూపర్-8కు అర్హత సాధించకపోతే ఈ టోర్నీలో మరోసారి భారత్-పాక్ జరిగే అవకాశం ఉండదు.క్రికెట్ అభిమానులు తిరిగి దాయాదుల సమరాన్ని చూడాలంటే మరో ఎనిమిది నెలల పాటు వేచి చూడాలి. అది కూడా పాక్లో ఆడేందుకు భారత్ సమ్మతిస్తేనే ఈ మ్యాచ్ జరుగుతుంది.వివరాల్లోకి వెళితే.. పాకిస్తాన్ వేదికగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ జరగాల్సి ఉంది. షెడ్యూల్ ప్రకారం ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తలపడాల్సి ఉంది. ఈ మ్యాచ్ కోసం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు లాహోర్ మైదానాన్ని పరిశీలిస్తుంది. ఎనిమిది జట్లు పాల్గొనే ఈ ఐసీసీ టోర్నీ వచ్చే ఏడాది ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 మధ్యలో జరుగనుంది. అయితే దీనికి ముందు ఓ ముఖ్య విషయం తేలాల్సి ఉంది. పాక్లో అడుగుపెట్టేందుకు భారత ప్రభుత్వం అనుమతిస్తేనే ఈ మ్యాచ్ సాధ్యపడుతుంది. పీసీబీ ప్రతిపాదనకు భారత్ ఒప్పుకోకపోతే హైబ్రిడ్ పద్దతిలో (తటస్థ వేదికలపై) ఈ టోర్నీ జరిగే అవకాశం ఉంది. ఒకవేళ అన్నీ పాక్ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మార్చిలో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, చివరిసారిగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో (2017) పాకిస్తాన్ విజేతగా నిలిచింది. ఆ టోర్నీలో ఫైనల్లో పాక్.. భారత్ను ఓడించి టైటిల్ను సాధించింది. వన్డే ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీలో భారత్, పాక్ సహా ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్ జట్లు పోటీ పడతాయి. -
మరిన్ని చిక్కుల్లో సీమా హైదర్.. భారత్ వచ్చిన పాక్ భర్త?
పాక్ నుంచి పారిపోయివచ్చి, తన ప్రియుడు సచిన్తో పాటు యూపీలోని నోయిడాలో ఉంటున్న సీమా హైదర్ ఇప్పుడు మరిన్ని చిక్కుల్లో పడ్డారు. ఆమె పాకిస్తాన్ భర్త గులాం హైదర్ భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ముందుగా ఆయనే స్వయంగా తన యూట్యూబ్ చానల్లో తెలిపారు. గులాం హైదర్ ఆ వీడియోలో..‘పిల్లలూ మీ నాన్న ఇండియా వస్తున్నారు. అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి’ అని పేర్కొన్నారు. గ్రేటర్ నోయిడా కోర్టు సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ను జూన్ 10న కోర్టుకు హాజరు కావాలని సమన్లు జారీ చేసింది. ఈ నేపధ్యంలోనే ఆయన ఈరోజు (సోమవారం) నోయిడా కోర్టుకు హాజరు కావాల్సివుంది. సీమా హైదర్ పాక్ నుంచి భారత్ వచ్చినది మొదలు ముఖ్యాంశాలలో కనిపిస్తున్నారు. సీమా-సచిన్ ల ప్రేమకథ దేశవ్యాప్తంగా హల్చల్ చేసింది. సీమా తనతో పాటు తన నలుగురు పిల్లలను కూడా పాకిస్తాన్ నుంచి భారత్కు తీసుకువచ్చారు. ఈ పిల్లలు సీమా, ఆమె పాక్ భర్త గులాం హైదర్లకు జన్మించారు.తన పిల్లలను తనకు అప్పగించాలంటూ సీమా హైదర్ పాకిస్తాన్ భర్త గులాం హైదర్ కోర్టును ఆశ్రయించారు. కరాచీలో నివసిస్తున్న ఆయన.. సచిన్ మీనాతో సీమా పెళ్లి చెల్లుబాటు కాదంటూ భారతీయ న్యాయవాది ద్వారా నోయిడాలోని కుటుంబ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఇంతలోనే సీమా తాను హిందూ మతంలోకి మారానని, పాకిస్తాన్కు తిరిగి వెళ్లబోనని, తన పిల్లలు కూడా హిందూ మతాన్ని స్వీకరించారని పేర్కొంది.ఈ ఉదంతం గురించి మానవ హక్కుల కార్యకర్త అన్సార్ బర్నీ మాట్లాడుతూ గులాం హైదర్ వాదన న్యాయబద్ధంగా ఉందని, అంతర్జాతీయ చట్టాల ప్రకారం చిన్న పిల్లలను మత మార్పిడి చేయడంపై నిషేధం ఉన్నదన్నారు. సీమా ప్రస్తుతం భారత్లో స్థిరపడినప్పటికీ, ఆమె పిల్లలు పాకిస్తాన్ పౌరులని అన్నారు. గులాం హైదర్ తన భార్య సీమా నుంచి ఏమీ కోరుకోవడం లేదని, తన పిల్లలను పాకిస్తాన్కు తీసుకు వెళ్లాలని మాత్రమే అనుకుంటున్నారని అన్సార్ తెలిపారు. మరి ఈ కేసులో కోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వనున్నదో వేచి చూడాల్సిందే. -
మ్యాచ్ రూపురేఖల్ని మార్చేసిన బుమ్రా
-
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా పాకిస్తాన్తో నిన్న (జూన్ 9) జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. పేసర్లు రాజ్యమేలిన ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ కాగా.. స్వల్ప లక్ష్య ఛేదనలో ఒత్తిడికిలోనైన పాక్ 20 ఓవర్లలో 113 పరుగులకే పరిమితమై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది.తొలుత పాక్ పేసర్లు భారత బ్యాటింగ్ లైనప్కు కకావికలం చేయగా.. ఆతర్వాత భారత పేసర్లు చాకచక్యంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లు స్వల్ప లక్ష్యాన్ని చేరకుండా కట్టడి చేశారు. పాక్ బౌలర్లలో నసీం షా, హరీస్ రౌఫ్ తలో 3 వికెట్లు, మొహమ్మద్ ఆమిర్ 2, షాహిన్ అఫ్రిది ఓ వికెట్ పడగొట్టగా.. భారత బౌలర్లు బుమ్రా (4-0-13-3), హార్దిక్ (4-0-24-2), సిరాజ్ (4-0-19-0), అర్ష్దీప్ (4-0-31-1), అక్షర్ (2-0-11-1) అద్భుతంగా బౌలింగ్ చేసి పాక్ చేతుల్లో నుంచి మ్యాచ్ను లాగేసుకున్నారు. భారత ఇన్నింగ్స్లో రిషబ్ పంత్ అత్యధికంగా 42 పరుగులు చేయగా.. పాక్ ఇన్నింగ్స్లో మొహమ్మద్ రిజ్వాన్ (31) టాప్ స్కోరర్గా నిలిచాడు. పాక్ గెలుపుకు చివరి ఓవర్లో 18 పరుగులు అవసరం కాగా.. అర్ష్దీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 11 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్ నాలుగు, ఐదు బంతులకు నసీం షా బౌండరీలు బాదినప్పటికీ పాక్ ఓటమి అప్పటికే ఖరారైపోయింది.గెలవాల్సిన మ్యాచ్లో ఓడటంతో పాక్ ఆటగాళ్లు, అభిమానుల బాధ వర్ణణాతీతంగా ఉండింది. యువ పేసర్ నసీం షా పాక్ ఓటమిని జీర్ణించుకోలేక వెక్కివెక్కి ఏడ్చాడు. మ్యాచ్ పూర్తయిన అనంతరం పెవిలియన్కు వెళ్లే దారిలో షా కన్నీటి పర్యంతమయ్యాడు. అతన్ని షాహిన్ అఫ్రిది ఓదార్చే ప్రయత్నం చేశాడు. నసీం కంటితడి పెట్టిన దృశ్యాలు నెట్టింట వైరలవుతున్నాయి. Even Naseem Shah, our young bowler, played better than our highly paid batsmen. The time has come, if you’re not performing well, please resign gracefully and let others join. It’s time to take strict decisions, or they’ll never understand. #PakvsIndpic.twitter.com/kkV9LZntFX— Saad Kaiser 🇵🇰 (@TheSaadKaiser) June 9, 2024నసీం గతంలోనూ పలు సందర్భాల్లో పాక్ ఓడినప్పుడు ఇలానే కంటతడి పెట్టాడు. ఈ మ్యాచ్లో నసీం బంతితో (4-0-21-3), బ్యాట్తో (4 బంతుల్లో 10 నాటౌట్; 2 ఫోర్లు) అద్భుతంగా రాణించాడు. చివరి ఓవర్లో బ్యాటింగ్కు దిగిన నసీం పాక్ను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. -
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన భారత్
-
పాకిస్తాన్లో పోలియో కేసుల కలకలం
పోలియోమైలిటీస్ వ్యాధిని వాడుక భాషలో పోలియో అని పిలుస్తుంటారు. ఇది ఒక రకమైన అంటు వ్యాధి. వైరస్ కారణంగా వ్యాప్తిచెంది, మానవ నాడీ వ్యవస్థను దెబ్బతీస్తుంది. ముఖ్యంగా ఐదేళ్లలోపు వయసుగల చిన్నారులు ఈ వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఈ వ్యాధి ఇప్పుడు పాకిస్తాన్ను వణికిస్తోంది.పాకిస్తాన్లోని బలూచిస్థాన్లోగల క్వెట్టాలో పోలియో కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. తాజాగా ఐదో కేసు వెలుగు చూసింది. ఇది ఏప్రిల్ 29న వెలుగు చూడగా, జూన్ 8న నిర్ధారణ అయ్యింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) నివేదిక ప్రకారం బాధిత చిన్నారి తొలుత అతిసారం, వాంతులు తదితర అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఆ తర్వాత కుటుంబ సభ్యులు ఆ చిన్నారిని చికిత్స కోసం క్వెట్టాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతున్న తరుణంలో 10 రోజుల తర్వాత ఆ చిన్నారి శరీరంలోని దిగువ భాగం బలహీనంగా మారింది. తరువాత పోలియో వ్యాధి ఆ చిన్నారి శరీరానికంతటికీ వ్యాపించింది. దీంతో బాధిత చిన్నారిని కరాచీలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్ (ఎన్ఐసీహెచ్)కు తరలించారు. అక్కడ ఆ చిన్నారికి అక్యూట్ ఫ్లాసిడ్ పక్షవాతం (ఏఎఫ్పీ) ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వైద్య చికిత్స అందించినప్పటికీ వ్యాధి సోకిన చిన్నారి మే 22న మృతి చెందింది. దీనిపై వైద్యారోగ్యశాఖ విచారణ చేపట్టింది.బాధిత చిన్నారి రక్త నమూనాలను సేకరించారు. ఆ చిన్నారి తోబుట్టువులలో ఒకరికి వైల్డ్ పోలియోవైరస్ టైప్ వన్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కాగా ఆ చిన్నారికి పోలియో వ్యాక్సిన్ వేయించని కారణంగానే మృతి చెందిందా? అనే కోణంలో వైద్యశాఖ విచారణ చేస్తోంది. -
న్యూయార్క్లో నమో భారత్
పాకిస్తాన్తో ప్రపంచకప్ పోరు... భారత్ చేసింది 119 పరుగులే... బ్యాటింగ్కు అనుకూలించని పిచ్ అయినా సరే ఈ మాత్రం స్కోరును కాపాడుకోవడం కష్టంగానే అనిపించింది... లక్ష్యం ఎదురుగా కనిపిస్తుండగా... పాక్ నెమ్మదిగా అడుగులు వేసింది. 12 ఓవర్లు ముగిసేసరికి బంతికో పరుగు చొప్పున 72 పరుగులు వచ్చేశాయి.మిగిలిన 48 బంతుల్లో చేయాల్సింది 48 పరుగులే... చేతిలో 8 వికెట్లున్నాయి. కానీ అప్పుడు ఒక్కసారిగా మ్యాచ్ మలుపు తిరిగింది. పాండ్యా, బుమ్రా బౌలింగ్ దెబ్బకు పాక్ పరుగు తీయడమే గగనంగా మారిపోయింది. ఒక్కో పరుగు కోసం శ్రమించి ఆ జట్టు వరుసగా వికెట్లూ కోల్పోయింది. అద్భుతమైన ఆటతో ఒత్తిడి పెంచిన భారత్ చివరి వరకు దానిని కొనసాగించింది. ఫలితంగా వరల్డ్ కప్లో మరో విజయం మన ఖాతాలో చేరింది. పాక్పై మనదే పైచేయి అని నిరూపితమైంది. బ్యాటింగ్లో కఠిన పరిస్థితుల్లో కీలక పరుగులు చేసిన పంత్, కీపింగ్లో చక్కటి క్యాచ్లతో గెలిపించాడు. మ్యాచ్ ఏకపక్షంగా సాగకపోయినా... ఉత్కంఠకు లోటు లేకపోయింది. వరల్డ్ కప్ మెల్బోర్న్ నుంచి న్యూయార్క్కు చేరినా... అక్కడా మన గెలుపు పిలుపు వినిపించింది. న్యూయార్క్: టి20 ప్రపంచకప్లో ఆసక్తి రేపిన మ్యాచ్లో భారత్ 6 పరుగుల తేడాతో పాకిస్తాన్ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్కు దిగిన భారత్ 19 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. రిషభ్ పంత్ (31 బంతుల్లో 42; 6 ఫోర్లు) కీలక పరుగులు సాధించాడు. అనంతరం పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 113 పరుగులే చేయగలిగింది. రిజ్వాన్ (44 బంతుల్లో 31; 1 ఫోర్, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ బుమ్రా (3/14), హార్దిక్ పాండ్యా (2/24) ప్రత్యర్థిని పడగొట్టారు. పంత్ మినహా... అనూహ్యంగా దూసుకొస్తున్న బంతులు, బ్యాటింగ్కు ఏమాత్రం అనుకూలంగా లేని పిచ్, నెమ్మదైన అవుట్ఫీల్డ్... అన్నీ వెరసి భారత ఆటగాళ్లు ప్రతీ పరుగు కోసం ఇబ్బంది పడ్డారు. పాక్ బౌలర్లంతా కట్టుదిట్టమైన బంతులతో బ్యాటర్లపై ఒత్తిడి పెంచారు. ఓపెనర్లు కోహ్లి (4), రోహిత్ శర్మ (13) ఏడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... నాలుగో స్థానంలో వచ్చిన అక్షర్ (18 బంతుల్లో 20; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువ సేపు నిలవలేకపోయాడు. ఈ దశలో పంత్ బాధ్యత తీసుకున్నాడు. సాధారణ షాట్లకు పరుగులు రాలేని స్థితిలో తనదైన శైలిలో భిన్నమైన షాట్లతో స్కోరును నడిపించాడు. ఈ క్రమంలో అతనికి అదృష్టం కూడా కలిసొచ్చింది. తన తొలి 14 బంతుల్లో 4 సార్లు పంత్ అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. పాక్ వదిలిన క్యాచ్లు సుయాయాసమైనవి కాకపోయినా అసాధ్యమైనవి కూడా కాదు! రవూఫ్ ఓవర్లో అతను వరుసగా 3 ఫోర్లతో ధాటిని ప్రదర్శించగా, 89/3 వద్ద భారత్ కాస్త మెరుగైన స్థితిలో కనిపించింది. అయితే ఇక్కడి నుంచి జట్టు ఒక్కసారిగా కుప్పకూలింది. సూర్యకుమార్ (7) ప్రభావం చూపలేకపోగా, దూబే (3) విఫలమయ్యాడు. పంత్, జడేజా (0) వరుస బంతుల్లో వెనుదిరగ్గా... పాండ్యా (7), బుమ్రా (0) కూడా వరుస బంతుల్లో అవుటయ్యారు. అర్‡్షదీప్ (9) రనౌట్తో మరో ఓవర్ మిగిలి ఉండగానే జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్తాన్ కూడా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయలేకపోయింది. తడబడుతూనే ఆడిన బాబర్ ఆజమ్ (13) ఆరంభంలోనే వెనుదిరగ్గా... ఉస్మాన్ ఖాన్ (13), ఫఖర్ జమాన్ (13) కూడా విఫలమయ్యారు. కొన్ని చక్కటి షాట్లు ఆడిన రిజ్వాన్ను కీలక సమయంలో బుమ్రా బౌల్డ్ చేయడంలో మ్యాచ్ భారత్ వైపు మొగ్గింది. షాదాబ్ (4), ఇఫ్తికార్ (5) ప్రభావం చూపలేకపోగా, ఇమాద్ వసీమ్ (23 బంతుల్లో 15; 1 ఫోర్) బంతులు వృథా చేసి జట్టు ఓటమిని ఆహ్వానించాడు. వర్షంతో అంతరాయం మ్యాచ్కు అనూహ్యంగా వర్షం దెబ్బ పడింది. చిరు జల్లులు కురవడంతో టాస్ ఆలస్యం కాగా, నిర్ణీత సమయంకంటే 50 నిమిషాలు ఆలస్యంగా మ్యాచ్ మొదలైంది. అయితే భారత్ ఇన్నింగ్స్లో ఒక్క ఓవర్ పూర్తి కాగానే మళ్లీ వాన రావడంతో ఆటను నిలిపివేశారు. మరో 35 నిమిషాల తర్వాత ఇన్నింగ్స్ కొనసాగింది. విరామం తర్వాత నసీమ్ వేసిన తొలి ఓవర్లోనే కోహ్లి వెనుదిరగడంతో భారత్కు నిరాశాజనక ఆరంభం లభించింది. 12 భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్కు ఆతిథ్యమిచ్చిన 12వ దేశంగా అమెరికా గుర్తింపు పొందింది. 1952లో భారత్లో తొలిసారి పాక్ జట్టు ఆడగా... 1955లో పాకిస్తాన్లో భారత జట్టు ఆడింది. ఆ తర్వాత ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్లకు యూఏఈ (1984లో), ఆ్రస్టేలియా (1985లో), బంగ్లాదేశ్ (1988లో), సింగపూర్ (1996లో), కెనడా (1996లో), శ్రీలంక (1997లో), ఇంగ్లండ్ (1999లో), దక్షిణాఫ్రికా (2003లో), నెదర్లాండ్స్ (2004లో), అమెరికా (2024లో) ఆతిథ్యమిచ్చాయి.1 విరాట్ కోహ్లి అంతర్జాతీయ టి20ల్లో అరంగేట్రం చేశాక భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో టాప్ స్కోరర్గా నిలవకపోవడం ఇదే తొలిసారి. గతంలో భారత్, పాక్ జట్ల మధ్య జరిగిన టి20 ప్రపంచకప్ మ్యాచ్ల్లో కోహ్లి (2012లో; 78 నాటౌట్), (2014లో 36 నాటౌట్), (2016లో 55 నాటౌట్), (2021లో 57), (2022లో 82 నాటౌట్) టాప్ స్కోరర్గా నిలిచాడు. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్లో భారత ఇన్నింగ్స్లో ఇద్దరు ప్లేయర్లు ‘గోల్డెన్ డక్’ (ఆడిన తొలి బంతికే అవుటవ్వడం) కావడం ఇదే తొలిసారి. 1 టి20 ప్రపంచకప్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్కు దిగాక ఆలౌట్ కావడం భారత జట్టుకిదే తొలిసారి. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి) రవూఫ్ (బి) అఫ్రిది 13; కోహ్లి (సి) ఉస్మాన్ (బి) నసీమ్ 4; పంత్ (సి) బాబర్ (బి) ఆమిర్ 42; అక్షర్ (బి) నసీమ్ 20; సూర్యకుమార్ (సి) ఆమిర్ (బి) రవూఫ్ 7; దూబే (సి అండ్ బి) నసీమ్ 3; పాండ్యా (సి) ఇఫ్తికార్ (బి) రవూఫ్ 7; జడేజా (సి) ఇమాద్ (బి) ఆమిర్ 0; అర్ష్ దీప్ (రనౌట్) 9; బుమ్రా (సి) ఇమాద్ (బి) రవూఫ్ 0; సిరాజ్ (నాటౌట్) 7; ఎక్స్ట్రాలు 7; మొత్తం (19 ఓవర్లలో ఆలౌట్) 119. వికెట్ల పతనం: 1–12, 2–19, 3–58, 4–89, 5–95, 6–96, 7–96, 8–112, 9–112, 10–119. బౌలింగ్: షాహిన్ అఫ్రిది 4–0–29–1, నసీమ్ షా 4–0–21–3, ఆమిర్ 4–0–23–2, ఇఫ్తికార్ 1–0–7–0, ఇమాద్ 3–0–17–0, రవూఫ్ 3–0–21–3. పాకిస్తాన్ ఇన్నింగ్స్: రిజ్వాన్ (బి) బుమ్రా 31; బాబర్ (సి) సూర్యకుమార్ (బి) బుమ్రా 13; ఉస్మాన్ (ఎల్బీ) (బి) అక్షర్ 13; ఫఖర్ (సి) పంత్ (బి) పాండ్యా 13; ఇమాద్ (సి) పంత్ (బి) అర్ష్ దీప్ 15; షాదాబ్ (సి) పంత్ (బి) పాండ్యా 4; ఇఫ్తికార్ (సి) అర్ష్ దీప్ (బి) బుమ్రా 5; అఫ్రిది (నాటౌట్) 0; నసీమ్ షా (నాటౌట్) 10; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 113. వికెట్ల పతనం: 1–26, 2–57, 3–73, 4–80, 5–88, 6–102, 7–102. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–31–1, సిరాజ్ 4–0–19–0, బుమ్రా 4–0–14–3, పాండ్యా 4–0–24–2 జడేజా 2–0–10–0, అక్షర్ పటేల్ 2–0–11–1.