-
అమాత్య... అన్న పిలుపేదీ?
సాక్షి, గుంటూరు : జిల్లాలో గతంలో ఉన్న అసెంబ్లీ స్థానాల సంఖ్య పనర్విభజనతో 19 నుంచి 17కు తగ్గిపోయింది. అయితే ఇప్పటి వరకూ మూడు నియోజకవర్గాలకు మంత్రి పదవి దక్కలేదు. వాటిలో ఒకటి రద్దయిన దుగ్గిరాల నియోకవర్గంకాగా మిగిలిన రెండు నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని గురజాల, మాచర్ల. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలోని సత్తెనపల్లికి కేవలం నెలరోజులే మంత్రి పదవి దక్కింది. దుగ్గిరాల నియోజకవర్గం నుంచి గుదిబండి వెంకటరెడ్డి వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. మాజీ మంత్రి ఆలపాటి ధర్మారావు ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందినప్పటికీ మంత్రి పదవి దక్కలేదు. అనంతరం వేరే నియోజకవర్గం నుంచి పోటీ చేసి మంత్రి అయ్యారు. సత్తెనపల్లిది విచిత్ర పరిస్థితి. 1983లో ఇక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసిన నన్నపనేని రాజకుమారి ఎమ్మెల్యేగా గెలుపొంది నాదెండ్ల భాస్కరరావు మంత్రి వర్గంలో నెలపాటు మంత్రిగా కొనసాగారు. ఆ నెల మినహా సత్తెనపల్లి నియోజకవర్గానికి ఇప్పటి వరకు మంత్రి పదవి దక్కలేదు. సత్తెనపల్లి నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీచేసి వరుసగా నాలుగు సార్లు గెలుపొందిన స్వాతంత్య్ర సమరయోధుడు వావిలాల గోపాలకృష్ణయ్యకు సైతం మంత్రి పదవి దక్కలేదు. 2014 ఎన్నికల్లో మాజీ మంత్రి కోడెల శివప్రసాదరావు 924 స్వల్ప మెజార్టీతో గెలిచినా శాసన సభ స్పీకర్ పదవితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. చిలకలూరిపేట నియోజకవర్గంలో 2014 వరకు మంత్రి పదవి దక్కలేదు. 2014లో మాత్రం మొట్టమొదటిసారిగా ప్రత్తిపాటి పుల్లారావు అమాత్యుడిగా ప్రమాణం చేశారు. పల్నాడు ప్రాంతంలో ఉన్న గురజాల నియోజకవర్గం నుంచి ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవి పొందలేదు. అయితే గురజాల వాసి అయిన డొక్కా మాణిక్యవరప్రసాదరావు తాడికొండ నియోజకవర్గం నుంచి విజయం సాధించి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. అయితే ఈ నియోజకవర్గంలో ఏ నాయకుడూ రెండు సార్లుకంటే ఎక్కువ సార్లు గెలవకపోవడంతో మంత్రి పదవులు దక్కలేదని చెప్పుకోవచ్చు. మాచర్ల నియోజకవర్గం నుంచి కూడా ఇంత వరకు ఒక్కరు కూడా మంత్రి పదవిని పొందలేకపోయారు. ఈ నియోజకవర్గం నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాత్రం 2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచినా అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో అనర్హత వేటుకు గురై 2012 ఉప ఎన్నికల్లో రెండో సారి గెలిచి రికార్డు సృష్టించారు. 2014 ఎన్నికల్లో సైతం విజయం సాధించి పల్నాడు ప్రాంతంలో ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ రికార్డు సృష్టించారు. ఆయన మినహా మిగిలిన ఎవరూ రెండు సార్లు గెలవలేదు. -
వెంకటేశ్వర్లు హత్యకు కుట్ర.. ఇది వారి పనే!
సాక్షి, గుంటూరు : ప్రత్యర్థులపై హత్యానేరం మోపి రాజకీయంగా లాభం పొందాలని భావించిన టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు అనుచరుల పథకం బెడిసికొట్టింది. గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతనేని అనుచరుల వద్ద పోలీసులు నాటు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. ముప్పన వెంకటేశ్వర్లు అనే వ్యక్తిని హత్య చేసేందుకు కుట్ర పన్నారన్న కారణంగా యరపతినేని ముగ్గురు ప్రధాన అనుచరులను అరెస్టు చేశారు. నాటు తుపాకులతో పాటు వారి వద్ద నుంచి ఐదు సెల్ఫోన్లు, స్కోడా కారు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఓ మహిళ విషయంలో వివాదాలే ముప్పన మర్డర్ స్కెచ్కు కారణమన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నిన్న యరపతినేని నామినేషన్ కార్యక్రంలో కూడా ముప్పన పాల్గొనడం విశేషం. ఈ క్రమంలో తమలో తమకు తలెత్తిన అభిప్రాయ భేదాల కారణంగా ముప్పనను హతమార్చి ఆ నేరాన్ని ప్రత్యర్థులపై నెట్టి వేయాలని యరపతినేని అనుచరులు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయితే ప్లాన్ చివరి నిమిషంలో అరెస్టుతో పెద్ద ప్రమాదం తప్పింది. కాగా యరపతినేని శ్రీనివాసరావు తన ధనదాహాంతో ప్రజలనూ, ప్రత్యర్థులనే కాక సొంత పార్టీ నేతల్నే బలి తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. యరపతినేని కనుసన్నల్లో నడుస్తున్న మైనింగ్ మాఫియా.. క్వారీల యజమానులు, లీజుదారులను బెదిరించి దౌర్జన్యంగా క్వారీలను ఆక్రమించి గురజాలలో అక్రమ తవ్వకాలకు తెగబడుతున్నసంగతి తెలిసిందే. తన పర భేదం లేకుండా... వీరి బారిన పడిన అనేక మంది భూములు కోల్పోయి అప్పులపాలై ఊరు వదలి వెళ్లిపోయారు. (చదవండి : ఎమ్మెల్యే యరపతినేని దౌర్జన్యకాండ) -
గురజాల నుంచే విజయఢంకా మోగిస్తాం : కాసు
సాక్షి, పిడుగురాళ్ల: గురజాల నియోజకవర్గం నుంచే వైఎస్సార్ సీపీ విజయఢంకా మోగిస్తామని పార్టీ గురజాల నియోజకవర్గ సమన్వయకర్త కాసు మహేష్రెడ్డి అన్నారు. పట్టణ సమీపంలోని ఆక్స్ఫర్డ్ కళాశాలలో పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఈ నెల 16వ తేదీన హెలికాప్టర్ ద్వారా ల్యాండ్ అయ్యే ప్రాంగణాన్ని గురువారం కాసు, పార్టీ గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు లేళ్ల అప్పిరెడ్డి, ప్రోగ్రామ్ కన్వీనర్, పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురామ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కాసు మహేష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ గెలుపు శంఖారావం గురజాల నియోజకవర్గం నుంచే ప్రారంభమవుతుందన్నారు. పల్నాడు ప్రాంత ప్రజలపై జగన్మోహన్రెడ్డికి ఉన్న అభిమానంతో పల్నాడు ప్రాంతంలోని పిడుగురాళ్ల నుంచే ప్రచార సభ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆయన రాక పల్నాడు ప్రజల అదృష్టమని భావిస్తున్నామన్నారు. గురజాల నియోజకవర్గానికి ప్రత్యేకమైన మేనిఫెస్టోను జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా విడుదల చేస్తామన్నారు. గురజాల నియోజకవర్గంలో మెడికల్ కళాశాల నిర్మించి అందులోనే హాస్పిటల్ను ఏర్పాటు చేస్తామని, అదే విధంగా ఇంజినీరింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు. కృష్ణానది పక్కనే ఉన్నప్పటికీ టీడీపీ నాయకులు ప్రజలకు తాగునీరు అందించలేకపోయారని విమర్శించారు. కేవలం పేకాట క్లబ్లు, మట్టి మాఫియా, క్వారీలను దోచుకోవడం, వ్యాపారులను ఇబ్బంది పెట్టడం, ఇక్కడ జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై జగన్మోహన్రెడ్డి మాట్లాడతారని వివరించారు. లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ పౌరుషాల పురిటిగడ్డ అయిన పల్నాడు ప్రాంతం నుంచి సమర శంఖారావం పూరించబోతున్నారన్నారు. పల్నాడు ప్రాంతం నుంచి ఏ కార్యక్రమం మొదలు పెట్టినా అది జయప్రదం కావడం శుభపరిణామం అన్నారు. రాష్ట్రంలో టీడీపీని కూకటి వేళ్లతో పెకిలించడానికి వైఎస్సార్ సీపీ నడుం బిగించిందని, అందుకు ప్రతి ఒక్కరూ మద్దతు ఇచ్చి సభను విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రేపాల శ్రీనివాసరావు, కుందుర్తి గురవాచా రి, జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ అధ్యక్షుడు చింతా వెంకట రామారావు తదితరులు పాల్గొన్నారు. -
రణజ్వాల.. గురజాల
సాక్షి, గురజాల : చాపకూటి సిద్ధాంతంలాంటి సమానత్వాన్ని చాటుకున్న చోటే.. ఫ్యాక్షన్ రక్తపు మరకల్లో తడిచి ముద్దయిన ప్రాంతం పల్నాడు. నాయకురాలు నాగమ్మ పౌరుషాలను పుణికిపుచ్చుకుని.. బ్రహ్మనాయుడు వంటి సౌమ్య గుణాన్ని కలిగిన ఈ ప్రాంతంలో గురజాల నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నాగార్జున సాగర్ జలాలతో సిరుల పంటలిచ్చిన భూములు.. ఐదేళ్లలో కాలంలో మళ్లీ బీడువారాయి. ఫ్యాక్షన్ హత్యలను పక్కన పెట్టి విద్యా, వ్యాపారాల్లో ముద్ర వేస్తున్న ఈ ప్రాంత ప్రజలు రాజకీయ చైతన్యం చూపిస్తున్నారు.పల్నాడు ప్రాంతానికి ఘనమైన చరిత్ర ఉంది. బాలచంద్రుడు, కన్నమదాసు, నాయకురాలు నాగమ్మ, బ్రహ్మనాయుడు ఆ రోజుల్లోనే చాపకూటి సిద్ధాంతాన్ని అమలు చేసి సమానత్వాన్ని చాటారు. తరువాత కాలనుగుణంగా పల్నాడు ప్రాంతం కక్ష్యలు, కార్పణ్యాలతో రగిలిపోయింది. అనంతరం గ్రామాల్లో అక్షరాస్యత శాతం పెరగడంతో ప్రశాంత వాతావరణం నెలకొని శాంతి కపోతాలు ఎగురుతున్నాయి. గురజాల విశిష్టత గురజాల మండలం పులిపాడు, దైద, తేలుకుట్ల గ్రామాల్లో ఫ్యాక్షన్ ఎక్కువగా ఉండేది. ప్రస్తుతం ఈ గ్రామాలు ఫ్యాక్షన్ విడిచిపెట్టి వ్యాపారాలపై మక్కువ చూపుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం వ్యవసాయంపై ఆధారపడి ఉంది. వరి, పత్తి, మిరప పంటలు సాగవుతున్నాయి. నాగార్జున సాగర్ నుంచి కాలువలకు నీరు రాకపోవడంతో వరి సాగు తగ్గి పత్తి, మిరప వైపు రైతాంగం మళ్లింది. ప్రస్తుతం బోర్లు, చెరువులు కింద మాత్రమే వరి సాగవుతోంది. నాగార్జున సాగర్ రాకముందు ఈ ప్రాంతం బీడుగా మారింది. 1967లో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్మించారు. అప్పటి నుంచి పలనాట సిరుల పంటలు పండుతున్నాయి. ఎన్నికల విజేతలు 1952లో కాసు బ్రహ్మానందరెడ్డి (కాంగ్రెస్)పై కోలా సుబ్బారెడ్డి(సీపీఐ) 11,673 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1955లో కోలా సుబ్బారెడ్డి (సీపీఐ)పై మండవ బాపయ్య చౌదరి (కేఎల్పీ) 6,907 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1962లో కోలా సుబ్బారెడ్డి(సీపీఐ)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 4,624 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1967లో గడిపూడి మల్లికార్జునరావు(ఇండిపెండెంట్)పై కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్) 7,167 ఓట్ల మెజార్టీ తెచ్చుకున్నారు. 1972లో కొత్త వెంకటేశ్వర్లు(కాంగ్రెస్)పై మందపాటి నాగిరెడ్డి (సీపీఐ) 8,377 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1978లో మందపాటి నాగిరెడ్డి(సీపీఐ)పై గడిపూడి మల్లికార్జునరావు(కాంగ్రెస్) 23,248 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1983లో కాసు వెంకట కృష్ణారెడ్డి(కాంగ్రెస్)పై జూలకంటి నాగిరెడ్డి (ఇండిపెండెంట్) 12,722 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. 1985లో కాయితి వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్)పై అంకిరెడ్డి ముత్యం (టీడీపీ) 3,603 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1989లో రాచమడుగు సాంబశివరావు (టీడీపీ)పై కాయితీ వెంకట నర్సిరెడ్డి(కాంగ్రెస్) 8,145 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 1994లో కనకం రమేష్ చంద్రదత్తుపై యరపతినేని శ్రీనివాసరావు 23,967 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 1999లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 131 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2004లో యరపతినేని శ్రీనివాసరావుపై జంగా కృష్ణమూర్తి 7,126 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2009లో ఆలా వెంకటేశ్వర్లుపై యరపతినేని శ్రీనివాసరావు 10,565 ఓట్ల మెజార్టీతో గెలిచారు. 2014లో జంగా కృష్ణమూర్తిపై యరపతినేని శ్రీనివాసరావు 7,896 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. మార్పు– కూర్పు పునర్విభజన కాక ముందు గురజాల నియోజకవర్గంలో 5 మండలాలు ఉండేవి (గురజాల, రెంటచింతల, మాచవరం, దాచేపల్లి, పిడుగురాళ్ల) మండలాలు కలిసి ఉండేవి. రెంటచింతల మండలాన్ని మాచర్ల నియోజకవర్గంలో కలిపారు. విద్యా రంగం గురజాల మండల పరిధిలోని జంగమహేశ్వరపురం వద్ద ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల ఉంది. ఇంటర్మీడియెట్ కళాశాలతోపాటు ప్రైవేట్ కళాశాలలు–2, డిగ్రీ కళాశాల ఒకటి కలవు. బీఎడ్, బీఈడీ ప్రైవేట్ ళాశాలలు ఉన్నాయి. దాచేపల్లి మండలంలో ఇంటర్మీడియెట్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వైఎస్ హయాంలో.. గురజాల మండలం మాడుగుల–శ్యామరాజుపురం గ్రామాల మధ్య బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి పలు గ్రామాలకు మంచినీటిని అందించాలనే లక్ష్యంతో పైపు లైన్ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. ఈ పథకం కింద వేల ఎకరాల వరి పంటలు సాగవుతున్నాయి. దాచేపల్లిలోని దండివాగు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించారు. శ్రీనగర్లో రూ.1.50 కోట్ల వ్యయంతో సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు. శ్రీనగర్ నుంచి దాచేపల్లికి మంచినీటి ఇరిగేషన్ ఏర్పాటు చేసి అనేక గ్రామాల దాహార్తి తీర్చారు. పొందుగుల–దాచేపల్లికి వాటర్ పైప్లైన్ నిర్మించి ప్రతి ఇంటికి కృష్ణా జలాలను అందించారు. మాచవరం మండలంలోని మోర్జంపాడు లిప్టు ఇరిగేషన్ ఏర్పాటు చేసి సుమారుగా 5 వేల ఎకరాలను సస్యశ్యామంలం చేశారు. పిడుగురాళ్ల పట్టణ ప్రజలకు గోవిందాపురం జలాలను అందించేందుకు రూ.37 కోట్ల నిధులతో పైపు లైన్లు నిర్మించారు. పిడుగురాళ్లలో ట్రాఫిక్ సమస్యలు అధిగమించేందుకు అద్దంకి–నార్కెట్పల్లి రహదారిని పట్టణం గుండా వెళ్లేలా చేశారు. -
టీడీపీకి దెబ్బ మీద దెబ్బ
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. టీడీపీ నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరికలు వెల్లువలా కొనసాగుతున్నాయి. జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసేందుకు పలు పార్టీల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. (మంత్రి ఆదికి ఊహించని షాక్) గుంటూరు జిల్లా గుజరాల నియోజకవర్గానికి చెందిన పలువురు టీడీపీ నేతలు బుధవారం వైఎస్సార్ సీపీలో చేరారు. డాక్టర్ ఉన్నం నాగ మల్లిఖార్జున రావు, వర్ల రామయ్య సోదరుడు వర్ల రత్నం తదితర నేతలు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీ కండువా కప్పుకున్నారు. వీరందరినీ వైఎస్ జగన్ సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. గుంటూరు జిల్లాలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయడానికి కృషి చేస్తామని పార్టీలో చేరిన నాయకులు చెప్పారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మహేష్రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్ సీపీలో చేరారు. వీరితో పాటు దాదాపు 100 కుటుంబాలు వైఎస్సార్సీపీలోకి వచ్చాయి. విశాఖలోనూ... అరకు సమన్వయకర్త చెట్టి ఫాల్గుణ ఆధ్వర్యంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి సమక్షంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు వైఎస్సార్ సీపీలో చేరారు. డీసీసీ కార్యదర్శి కింజేటి అప్పారావు, టీడీపీ నాయకుడు పి. అప్పారావు, పోర్ట్ మాజీ సెక్రటరీ దామోదర్ తదితరులు వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. తూర్పుగోదావరి జిల్లాలోనూ.. ముమ్మిడివరం నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకుడు కడలి రాంపండు తన అనుచరులతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ముమ్మిడివరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పొన్నాడ సతీష్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కర్నూలు జిల్లాలో.. పత్తికొండ వైఎస్సార్ సీపీ ఇన్చార్జి చెరుకులపాడు శ్రీదేవి, పార్టీ నేతలు బివై రామయ్య, ప్రదీప్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి రామచంద్రతో పాటు 200 మంది కార్యకర్తలు బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. -
‘జై జగన్.. పొలిటికల్ సూపర్స్టార్’
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘనంగా జరుపుకుంటున్నారు. రాజన్న తనయుడి జన్మదినం సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. బంజారాహిల్స్లోని వైఎస్సార్ సర్కిల్ వద్ద గురజాల వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో గురువారం అర్ధరాత్రి వేడుకలు నిర్వహించారు. కేక్ కట్ చేసి యువత సంబరాలు చేసుకున్నారు. వందలాదిగా తరలివచ్చిన యువకులు జై జగన్.. పొలిటికల్ సూపర్స్టార్ అంటూ నినాదాలు చేశారు. చిత్తూరులో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఐరాల మండల కన్వీనర్ బుజ్జిరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బుజ్జిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా చిత్తూరులోని అమ్మఒడి ఆశ్రమంలో వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి అల్పాహార వితరణ చేశారు. మైనారిటీ నాయకుడు అను అల్తాఫ్, రాకేష్ ఆధ్వర్యంలో కార్యకర్తలు వేడుకలు చేసుకున్నారు. వారాహి యాగం.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా శ్రీకాకుళంలోని దుర్గా మహాలక్ష్మి దేవాలయంలో వారాహి యాగం నిర్వహించారు. ఈ కార్యక్రంమలో సి.ఇ.సి. మెంబర్ అందవరపు సూరిబాబు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎం.వి.పద్మావతి మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. పశ్చిమగోదావరి జిల్లా జిల్లాలోని కాళ్ల ఆస్పత్రిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సంధర్భంగా రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. ఉండి నియోజకవర్గం సమన్వయకర్త పీవీఎల్ నరసింహరాజు కేక్ కట్ చేశారు. కార్యక్రంమలో పాతపాటి సర్రాజు, జిల్లా యూత్ అధ్యక్షుడు యోగేంద్ర బాబు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్ జన్మదినం సందర్భంగా గణపవరం కన్యకాపరమేశ్వరి వర్తకసంఘ భవనంలో ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ఉచిత వైద్యశిబిరం, రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేశారు. తణుకులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో అర్ధరాత్రి 12 గంటల నుంచే జననేత జగన్ పుట్టినరోజు వేడుకలు ప్రారంభమయ్యాయి. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో కలిసి తణుకు కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరావు కేక్ కట్ చేశారు. వైఎస్ జగన్ తుదపరి పుట్టినరోజు ముఖ్యమంత్రి హోదాలో జరుపుకొంటారని విశ్వాసం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ సీఎం కావాలన్నదే ఆంధ్రా ప్రజల అభిలాష అని వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ జన్మదినం నరసాపురం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్ చేసి స్వీట్లు పంచిపెట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు, రొట్టెలు, పండ్లు పంపిణీ చేశారు. నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్రాజు, నియోజకవర్గ యూత్ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పాలకొల్లులోని గాంధీ బొమ్మల సెంటర్లో వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త గుణ్ణం నాగబాబు ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. పేదలకు, వృద్ధులకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. పాలకొల్లు, పోడూరు, యలమంచిలి మండలాల్లో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశారు. ఇండస్ట్రీయల్ ఎస్టేట్ పార్కులో వైఎస్ జగన్ జన్మదిన వేడుకలు జరిగాయి. విశాఖ ఉత్తర సమన్వయకర్త కేకే రాజు ఆధ్వర్యంలో వాకర్లకు బూట్లు పంపిణీ చేశారు. పార్టీ నాయకులు ఎంవీవీ సత్యనారాయణ, చల్లా ఈశ్వర రావు, రత్నాకర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు సంధర్భంగా భీమవరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పాలు,రొట్టెలు, పండ్లు మరియు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేసి,కేక్ కట్ చేసిన భీమవరం నియోజకవర్గం సమన్వయకర్త గ్రంధి. శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు కొయ్యే. మోసేనురాజు, పేరు చర్ల నరసింహబాబు, మేడిద జాన్సన్,కోడే యుగంధర్, గూడూరి. ఉమాబాల, పలువురు కార్యకర్తలు. జంగారెడ్డిగూడెం వైఎస్సార్సీపీ కార్యాలయంలో కేక్ కట్టింగ్. వికలాంగులుకు పాలు, పండ్లు, పంపిణీ. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండవల్లి సోంబాబు,పొల్నాటి బాబ్జి,సాయిబాల పద్మ, చంద్ర రావు, హరిబాబు, బీవీఆర్ చౌదరి, కార్యకర్తలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లాలో.. ఎస్.కోటలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ కోఆర్డినేటర్ కడుబండి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అభిమానులు వైఎస్ జగన్ పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్.కోటలో ఉచిత మంచినీటి సరఫరా ట్రాక్టర్ను ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి నాయుడు బాబు, రఘురాజు, చిన్న రాము నాయుడు, రాజేశ్వరరావు, వరలక్ష్మి, నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గజపతినగరం నియోజకవర్గంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు, అభిమానులు మధ్య గార తవుడు కేకు కట్ చేశారు. అనంతరం ఆస్పత్రిలోని రోగులకు పండ్లు, రోట్టెలు పంచారు. బూడి వెంకటరావు, వర్రి నర్శింహమూర్తి, బెల్లాన త్రినాదరావు, కరణం ఆదినారాయణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్వతీపురం మండలం కోరీ గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు సందర్భంగా నియోజకవర్గ సమన్వయ కర్త జోగారావు మెగా వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఆబాద్ వీధి ఊర్దూ పాఠశాలలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి అవనపు విజయ్ ఆధ్వర్యంలో మెగా వైద్య శిబిరం నిర్వహించారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురష్కరించుకొని విజయనగరంలో వైఎస్సార్సీపీ ఉత్తరాంద్ర కన్వీనర్, ఎమ్మెల్సీ కోలగట్ల వీరభద్ర స్వామి కేక్ కట్ చేశారు. అనంతరం మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. కృష్ణా జిల్లాలో.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా విజయవాడలో వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పునూరు గౌతమ్ రెడ్డి ఆధ్వర్యంలో పేదలకు చీరలు పంపిణీ విజయవాడ వైఎస్సార్సీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు ఆధ్వర్యంలో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రిలో రక్తదాన శిబిరం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం 58 వ డివిజన్ లో వైఎస్సార్సీపీ కృష్ణా జిల్లా యువజన విభాగం కార్యదర్శి పెద్దిరెడ్డి శివారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు వంటసామాగ్రి పంపిణీ అనంతపురం జిల్లాలో.. వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేసిన వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ రెహ్మాన్ వైఎస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా పెనుకొండ దర్గా లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన వైఎస్సార్ సీపీ హిందూపురం పార్లమెంట్ సమన్వయకర్త నదీం అహ్మద్ -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ హౌస్ అరెస్ట్
-
గురజాలలో ఉద్రిక్తత
గుంటూరు : నరసరావుపేటలోని గురజాలలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గురజాల వైఎస్సార్సీపీ సమన్వయకర్త కాసు మహేష్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ ప్రభుత్వం ఇటీవల పెంచిన ఇంటి పన్నులకు నిరసగా నేడు పిడుగురాళ్ల మున్సిపాలిటీ ముట్టడికి వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేష్ ఇంటి చూట్టు భారీగా చుట్టుముట్టిన పోలీసులు అతన్ని బయటకు రాకుండా గృహ నిర్భంధం చేశారు. మహేష్ అరెస్ట్పై వైఎస్సార్సీపీ శ్రేణుల భగ్గుమన్నారు. పొద్దునలేస్తే ప్రజాస్వామ్యం పేరుతో గొప్పలు చేప్పుకునే సీఎం చంద్రబాబు.. ప్రశ్నించే వారిని అక్రమంగా అరెస్ట్ చేపిస్తున్నారని మండిపడ్డారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఇంటి పన్నులు, గతంలో వేసిన రోడ్లకు మళ్లీ టెండర్లు పిలవడంపై వైఎస్సార్సీపీ నేడు ధర్నాకు పిలుపునిచ్చింది. -
అక్రమ మైనింగ్పై సుప్రీం కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అక్రమ మైనింగ్పై సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అక్రమ మైనింగ్ పట్ల ప్రభుత్వ నిస్సహాయత సరికాదని ప్రభుత్వంపై సుప్రీం ధర్మాసనం మండిపడింది. నిబంధనలకు విరుద్ధంగా అక్రమ మైనింగ్ జరుగుతోందని రిటైర్డ్ ఐఎఎస్ అధికారి శర్మ వేసిన పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం శుక్రవారం విచారించింది. అక్రమ మైనింగ్ జరుగుతున్నా ప్రభుత్వమే చోద్యం చూస్తే ఎలా అని మొట్టికాయలేసింది. సుప్రీంకోర్టులో కేసు ఉందనగానే ప్రభుత్వం భయపడుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. మేమేమి మనుషులను తినే పులులం కాదంటూ ఏపీ ప్రభుత్వ తీరుపై మండిపడింది. ఎవరో ఏదో చేస్తారని ప్రభుత్వమే భయపడితే ఎలా అని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. కాగా గుంటూరు జిల్లాలోని గురజాల వంటి ప్రాంతాల్లో టీడీపీ అక్రమంగా మైనింగ్ చేస్తోందంటూ ప్రతిపక్షం వైఎస్సార్ సీపీతో సహా పలు ప్రజా సంఘాలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. -
వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ నియామకం
సాక్షి, అమరావతి : గురజాల అక్రమ గనుల తవ్వకాలపై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీని నియమించింది. కమిటీ కన్వీనర్గా కాసు మహేశ్ రెడ్డి, సభ్యులుగా బొత్స సత్యనారాయణ, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, మహ్మద్ ఇక్బాల్తో పాటు నరసరావు పేట పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, సమన్వయ కర్తలను నియమిస్తున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. -
గనుల దోపీడీలో సీబీఐ విచారణకు సిద్ధమా ?
-
సీబీఐ విచారణ చేయాల్సిందే: అంబటి
గుంటూరు: గురజాల నియోజకవర్గ పరిధిలో జరిగిన అక్రమ మైనింగ్పై సీబీఐ విచారణ చేపట్టాల్సిందేనని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. విలేకరులతో మాట్లాడుతూ..అక్రమ మైనింగ్లో గురజాల టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావుతో పాటు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్ల హస్తం ఉందని ఆరోపించారు. అధికారులు అక్రమార్కులకు సహకరిస్తే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సీఐడీ విచారణతో నిజాలు బయటికి రావు..సీబీఐ విచారణ చేయాల్సిందేనని చెప్పారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నడికుడి, కొనంకి, కేసానుపల్లి గ్రామాల్లో ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొట్టి యరపతినేని టన్నుల కొద్దీ ముడి ఖనిజాన్ని తవ్వి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హైకోర్టులో పిల్ వేసిన గురువాచారిని అక్రమ కేసులో ఇరికించి టీడీపీలో చేర్చుకోవాలని చూశారని అన్నారు. అక్రమ మైనింగ్ విషయంలో ఎమ్మెల్యే యరపతినేనికి కూడా హైకోర్టు నోటీసులు ఇచ్చిందని గుర్తు చేశారు. అక్రమ మైనింగ్పై కోర్టు మెట్లెక్కిన వారిపై యరపతినేని అక్రమ కేసులతో వేధిస్తున్నారని, మాజీ ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణా రెడ్డిపై 6 అక్రమ కేసులు బనాయించారని వెల్లడించారు. కోడెల కుటుంబానికి సహకరిస్తూ అక్రమాలకు పాల్పడుతోన్న సత్తెనపల్లి రెవెన్యూ అధికారులు తగిన మూల్యం చెల్లించాల్సిందేనని చెప్పారు. -
గుంటూరులో మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీ విచారణ
-
ప్రజాప్రతినిధుల నిర్బంధం అప్రజాస్వామికం
-
బాబూ.. పోలీసుబలంతో ఎంతకాలం కవర్ చేసుకుంటావు!
సాక్షి, గుంటూరు: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి నియంతృత్వ ధోరణిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. గురజాలలో సాగుతున్న మైనింగ్ కుంభకోణాన్ని పరిశీలించడానికి వెళ్లిన తమ పార్టీ నిజనిర్దారణ కమిటీ సభ్యులను అక్రమంగా అరెస్టు చేయడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమ అరెస్టులు, గురజాలలో సెక్షన్ 144 విధింపు వంటివి.. మైనింగ్ కుంభకోణంలో నిందితులు ఎవరో చెప్పకనే చెప్తున్నాయని ట్విటర్లో పేర్కొన్నారు. మీ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికి, అక్రమాలపై నినదిస్తున్న గొంతుకలను అణచివేయడానికి ఎంతకాలం ఇలా క్రూరంగా పోలీసుబలాన్ని ప్రయోగిస్తారని సీఎం చంద్రబాబును వైఎస్ జగన్ నిలదీశారు. గుంటూరులో ప్రభుత్వ దాష్టీకం! గుంటూరులోని అక్రమ క్వారీలపై వైఎస్సార్సీపీ నిజనిర్థారణ కమిటీ పర్యటనకు ప్రభుత్వం అడుగడుగునా అడ్డుతగిలింది. ఎక్కడికక్కడ పార్టీ నేతలను అడ్డుకుంది. అక్రమ మైనింగ్ క్వారీలను పరిశీలించేందుకు వెళ్తున్న వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణతోపాటు లేళ్ల అప్పిరెడ్డి, ముస్తఫాలను మంగళగిరి కాజ టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. వారిని అరెస్టు చేసి దుగ్గిరాల పోలీసు స్టేషన్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున దుగ్గిరాల పోలీసుస్టేషన్కు తరలివచ్చారు. అక్రమ అరెస్టులకు వ్యతిరేకంగా ధర్నాకు దిగారు. చంద్రబాబు సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోవైపు, నిజనిర్దారణలో భాగంగా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. నడికుడి రైల్వేస్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్టు చేశారు. జిల్లావ్యాప్తంగా హంగామా సృష్టిస్తున్న పోలీసులు అడుగడుగునా వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నారని, ఎన్ని అరెస్టులు చేసినా వెనకడుగు వేసే ప్రసక్తే లేదని వైఎస్సార్సీపీ నేతలు అంటున్నారు. The unlawful arrests of YSRCP leaders, who were part of the Fact-Finding Committee for Gurajala mining scam; and proclaiming Section 144 is enough to prove who is culpable. @ncbn for how long will you use the brutal police force to suppress voices and cover up your scams? — YS Jagan Mohan Reddy (@ysjagan) 13 August 2018 -
మైనింగ్ కుంభకోణాలను కప్పిపుచ్చుకోవడానికే..
-
‘అక్రమ మైనింగ్లో వారి ప్రమేయముంది’
దుగ్గిరాల : అక్రమ మైనింగ్ వెనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేశ్ ప్రమేయం ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో తెలుగుదేశం ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. టీడీపీ నేతల అక్రమాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని, పంచ భూతాలను సైతం ఆక్రమిస్తున్నారని బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు లక్షల టన్నుల అక్రమ మైనింగ్కు పాల్పడ్డారన్న ఆయన... ఈ విషయంలో టీడీపీ నేతలు అతి తెలివి ప్రదర్శిస్తూ కోర్టును సైతం తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోరాటం ఉధృతం చేస్తాం.. తమ నేతలను కాపాడుకునేందుకు టీడీపీ ప్రభుత్వం అనామకులపై కేసులు పెడుతూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని బొత్స విమర్శించారు. యరపతినేని అక్రమ మైనింగ్ను సందర్శించేందుకు అనుమతినివ్వకపోవడం ద్వారా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ నాయకులను అక్రమంగా నిర్బంధిస్తునారన్న బొత్స.. ఇలాంటి చర్యలకు భయడేది లేదని భవిష్యత్తులో తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసుల తీరుపై బొత్స ఆగ్రహం.. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా.. గుంటూరు వెళ్లనంటూ హామీనివ్వాలని, స్టేషనుకు వచ్చి సంతకం పెట్టాలని పోలీసులు ఆయనను కోరారు. ఈ నేపథ్యంలో తానూ చదువుకున్నానని, తనకు చట్టం గురించి తెలుసునని బొత్స అన్నారు. తానేమీ భయపడి పోలీసు స్టేషనుకు రాలేదని, పోలీసుల మీద ఉన్న గౌరవంతోనే వచ్చానని పేర్కొన్నారు. ఏం తప్పు చేశానని సంతకం పెట్టమంటున్నారంటూ పోలీసులను ప్రశ్నించారు. తప్పు చేస్తే కోర్టుకు తీసుకెళ్లాలి గానీ ఈ విధంగా ప్రవర్తించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
‘అక్రమ మైనింగ్లో బాబు, లోకేశ్ ప్రమేయం ఉంది’
-
టోల్గేటు వద్ద బొత్సను అడ్డుకున్న పోలీసులు
-
గురజాల వెళ్తుంటే భయమెందుకు?
సాక్షి, గుంటూరు : అక్రమ మైనింగ్ వ్యవహారంలో నిజానిజాలు తేల్చేందుకు గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణను కాజా టోల్గేట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దుగ్గిరాల పోలీస్ స్టేషన్ను తరలించేందుకు యత్నిస్తున్న పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. గురజాల వెళ్లెందుకు అనుమతి లేదని ఆయనను నిరాకరించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. గుంటూరు జిల్లా అంతా పోలీస్ నిర్భందంలో ఉందని, గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని అన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, టీడీపీ ప్రభుత్వంలో కోర్టు, చట్టం, రాజ్యాంగమంటూ లేవంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి నిర్భంద పరిస్థితిని ఎన్నడూ చూడలేదని అన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో వాస్తవాలను తెలుసుకునేందుకు గురజాల వెళ్తుంటే ప్రభుత్వానికి ఇంత భయమెందుకని ఆయన ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డి అరెస్ట్ వైఎస్సార్సీపీ నిజనిర్ధారణలో భాగంగా గుంటూరు జిల్లా గురజాల వెళ్తున్న మాజీ ఎమ్మెల్సీ కృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. నడికుడి రైల్వే స్టేషన్ వద్ద కృష్ణారెడ్డిని బలవంతంగా రైల్లోంచి దించి అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు హంగామ సృష్టిస్తున్నారు. వైఎస్సార్సీపీ నేతను గురజాల వెళ్లకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నారు. -
మైనింగ్లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే వారికి భయం
-
పల్నాడ్లో తీవ్ర ఉద్రిక్తత..144 సెక్షన్ అమలు
-
‘మైనింగ్లో చంద్రబాబు, లోకేశ్కు వాటాలు’
సాక్షి, గుంటూరు : గురజాలలో పోలీసులు భయందోళనలు సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి విమర్శించారు. అర్ధరాత్రి 12 గంటల వరకు హౌస్ అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. అక్రమ మైనింగ్పై వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ కమిటీ దాచేపల్లి, పిడుగురాళ్ల పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో సోమవారం వారిని హౌస్ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురజాలలో నాలుగేళ్లుగా టీడీపీ నేతలు అక్రమ మైనింగ్ పాల్పడుతున్నారని ఆరోపించారు. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరిగుతోందని, అన్యాయాలు బయటకు వస్తాయని శ్రీనివాసరావు బయపడుతున్నారని పేర్కొన్నారు. మూడు రోజుల క్రితమే టీడీపీ ర్యాలీకి అనుమతిని ఇచ్చిన పోలీసులు, వైఎస్సార్సీపీ పర్యటనను ఎందుకు అడ్డుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. చట్టబద్ధంగా అనుమతి కోరితే తిరస్కరించారని, పోలీసులు అక్రమ అరెస్ట్లకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. 2009లో చనిపోయిన రైతుపై అక్రమ మైనింగ్ కేసు పెట్టారని, అమాయక ప్రజలపై కేసులు పెట్టి టీడీపీ నేతలు తప్పించుకుంటున్నారని మహేష్ రెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోక్శ్కు వాటా అక్రమ మైనింగ్లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్కి వాటా ఉందని, నిజాలను ఎవరు అణచివేయలేరని నరసరావు పేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి ఆరోపించారు. గురజాలలో నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, మైనింగ్లో చంద్రబాబుకు వాటా ఉన్నందునే ఆయన బయపడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నేతలు పర్యటిస్తే వారి బండారం బయటడుతుందని తమ పర్యటనకు అనుమతి ఇవ్వడం లేదని పేర్కొన్నారు. రైతులపై అక్రమ కేసులు పెడుతున్నారని, ఒక కూలీ 40 కోట్ల దోచుకున్నారంటే ఎవరు నమ్మలేరని అన్నారు. గతంలో కోడెల కుమారుడు నడిరోడ్డుపై సభ పెడితే అనుమతించారని, చంద్రబాబు తప్పుచేశారు కాబట్టే తమకు అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఆసుపత్రిపై ఆంక్షలు ఎమ్మెల్యే గోపిరెడ్డికి చెందిన ఆసుపత్రిని కూడా పోలీసులు నిర్భందించారు. పోలీసుల ఆంక్షలతో ఆసుపత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నారు.. యరపతినేని శ్రీనివాసరావు కనుసన్నల్లోనే అక్రమ మైనింగ్ జరుగుతోందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పిన్నెళ్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. నాలుగేళ్లుగా అక్రమ మైనింగ్ జరగుతోందని, టీడీపీ నేతలు ప్రభుత్వ ఖజనాకు గండికొడుతున్నారని ఆయన విమర్శించారు. దీనిపై పలుమార్లు ధర్నా కూడా నిర్వహించినట్లు ఆయన గుర్తుచేశారు. నిజనిర్ధారణ కమిటీ పరిశీలిస్తే ఇలా అక్రమాలు బయటకు వస్తాయని తెలిపారు. -
గురజాలలో పోలీసుల రాజ్యం
సాక్షి, గుంటూరు : గురజాల నియోజకవర్గంలో పోలీసులు అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్సీపీ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నారు. నేడు పిడుగురాళ్ల, దాచేపల్లిలోని అక్రమ మైనింగ్ క్యారింగ్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజనిర్ధారణ కమిటీ పర్యటించనున్న నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి, పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి, పార్టీనేత కాసు మహేష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గురజాల నియోజకవర్గాన్ని పూర్తిగా అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఇళ్లనుంచి బయటకు వచ్చిన అనేక మంది కార్యకర్తలను, పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేసి కేసులు పెడుతున్నారు. వైఎస్సార్సీపీ నిజ నిర్ధారణ కమిటీని అడ్డుకునేందుకు పోలీసులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. నేతలేవరు బయటకు రాకుండా దాచేపల్లి, పిడుగురాళ్ల ప్రాంతాల్లో 144 సెక్షన్ను అమలు చేస్తున్నారు. కమిటీ పర్యటిస్తే అక్రమ మైనింగ్పై నిజాలు బయటకొస్తాయనే ఉద్దేశంతోనే ప్రభుత్వం భయపడుతోందని, అందుకే తమ నేతలను అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా నియోజవర్గంలో పోలీసులు అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావుకు తొత్తులుగా మారారు. మూడు రోజుల క్రితం టీడీపీ ర్యాలీకి అనుమతించిన పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పర్యటనను మాత్రం అడ్డుకుంటున్నారు. పర్యటన రద్దు చేసుకోకపోతే కేసులు పెడతామని హెచ్చరించిన పోలీసులు ముందుగానే వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులు పంపించారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో హైకోర్టును తప్పుదారి పట్టించేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతున్నట్టు కనబడుతోంది. పల్నాడులో 28 లక్షల టన్నుల తెల్లరాయిని దోచుకున్నట్లు ఇటీవల నిర్ధారణ కమిటీ తేల్చిన విషయం తెలిసిందే. తనపై కేసులు రాకుండా టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని పన్నాగం కుట్రలు చేస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టీడీపీ నేతలు అక్రమంగా కోట్లు దోచుకుంటున్నారని అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. అధికార పార్టీ నాయకులకు దోపిడీలకు కళ్లెం వేయాలని ప్రజలు కోరుతున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కాసు మహేష్ రెడ్డి హౌస్ అరెస్ట్