క్రైమ్‌ కామెడీ  Natarathnalu Preparations for February Release | Sakshi
Sakshi News home page

క్రైమ్‌ కామెడీ 

Published Mon, Jan 22 2024 3:07 AM | Last Updated on Mon, Jan 22 2024 3:09 AM

Natarathnalu Preparations for February Release - Sakshi

ఇనయా సుల్తానా, సుదర్శన్‌ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్‌ కామెడీ ఫిల్మ్‌ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది.

ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్‌ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్‌ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్‌ చేసిన బడ్జెట్‌లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement