-
కళ్లలో కారం జల్లి, జేసీబీతో.. ఘట్కేసర్ కేసులో విస్తుపోయే విషయాలు
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్లో ఈ నెల 15న అదృశ్యమైన కాంగ్రెస్ నేత, ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్(45) హత్యకు గురయ్యాడు. ప్లాటు వివాదంలో జోక్యం చేసుకుంటూ తమ ఆస్తిని కాజేయాలని ప్రయతిస్తున్నాడని నిందితులు కక్ష పెంచుకొని మహేశ్ను దారుణంగా హత్య చేసి డంపింగ్ యార్డులో పూడ్చిపెట్టారు. ఈ ఘటన వివరాలను సీఐ సైదులు సోమవారం వెల్లడించారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ అంబేడ్కర్నగర్కు చెందిన గడ్డం మహేశ్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. కొంతకాలంగా అదే ప్రాంతానికి చెందిన శ్రీనివాస్,(36), కడుపొల్ల ప్రవీణ్(27)తో ప్లాటు విషయమై వివాదం నెలకొంది. ఈ క్రమంలో శ్రీనివాస్పై మహేశ్ క్రిమినల్ కేసు పెట్టాడు. దీంతో అతడిని చంపాలని ప్రవీణ్ను శ్రీనివాస్ సంప్రదించాడు. మహేశ్ తమ బంధువుతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని ప్రవీణ్ ఆగ్రహంగా ఉన్నాడు. దీంతో ఇరువురు కలిసి మహేశ్ను చంపాలని నిర్ణయించుకున్నారు. రాజీ చేసుకుందామని పిలిచి అంతమొందించారు.... ఘట్కేసర్ పట్టణంలోని బైపాస్ రోడ్డు వద్ద గల మహేశ్ రియల్ ఎస్టేట్ కార్యాలయంలో ఈ నెల 14 రాత్రి రాజీ చేసుకుందామని చెప్పి ఆఫీసుకు రావాలని కోరారు. అందుబాటులో లేనని మహేశ్ చెప్పడంతో తిరిగి 15న ఉదయం రావాలని కోరారు. మహేశ్ తన ఆఫీసుకు చేరుకోగానే కళ్లల్లో కారం పొడి చల్లి, కర్రలతో దాడి చేసి ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం ఆఫీస్ షెటర్ మూసి వెళ్లిపోయారు. రాత్రివేళ మహేశ్ కారులోనే అతడి శవాన్ని శ్రీరాములు, రాజు అనే వ్యక్తుల సాయంతో కొండాపూర్ డంపింగ్ యార్డుకు తరలించి జేసీబీతో పూడ్చిపెట్టారు. అందుకు జేసీబీ ఓనర్ నరేశ్, డ్రైవర్ సోహాన్ కూడా సహకరించారు. ఈ క్రమంలో నాలుగు రోజులుగా మహేశ్ కనిపించకపోవడంతో అతడి సోదరుడు విఠల్ ఈ నెల 21న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితులు శ్రీనివాస్, ప్రవీణ్, నరేశ్, సోహాన్ను ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. శవాన్ని పూడ్చడానికి సహకరించిన ఎన్ఎఫ్సీ నగర్కు చెందిన శ్రీరాములు, అంబేడ్కర్నగర్కు చెందిన రాజు పరారీలో ఉన్నారు. సోమవారం నాయబ్ తహసీల్దార్ సందీప్కుమార్రెడ్డి సమక్షంలో శవ పంచనామా, గాంధీ ఆస్పత్రి వైద్యాధికారి మహేందర్రెడ్డి బృందం పోస్ట్మార్టం నిర్వహించారు. అనంతరం శవాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అంతకుముందు మృతుడి బంధువులు నిందితుడు ప్రవీణ్ ఇంటిపై రాళ్లతో దాడి చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులను కస్టడీకి తీసుకొని మహేశ్కు సంబంధించిన కారు, ఇతర వివరాలు తెలుసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. -
మాజీ ఎంపీటీసీ మహేష్ హత్య కేసులో
-
ఘట్కేసర్ మాజీ ఎంపీటీసీ హత్య కేసులో సంచలనం
మేడ్చల్ జిల్లా: ఘట్కేసర్ లో దారుణం జరిగింది. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేశ్ను కొందరు దుండగులు హత్య చేశారు. 2024, జూన్ 17వ తేదీ నుంచి మహేశ్ కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసి రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా. గడ్డం మహేష్ను హత్య చేసినట్లు ఒప్పుకున్నారు. జేసీబీ సాయంతో ఘట్కేసర్ డంపింగ్ యార్డ్లో కారును పాతి పెట్టినట్లు పోలీసులకు వెల్లడించినట్లు తెలుస్తోంది.నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా మృతదేహం కోసం డంపింగ్ యార్డులో గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలుస్తోంది. ఈ కోణంలోనే దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కాగా ఈ హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రియుడి మోజులో భర్తను చంపించింది
నార్నూర్: ప్రియుడిపై మోజులో ఓ మహిళ భర్తను కిరాతకంగా హత్య చేయించింది. పథకం ప్రకారం ఆమె తన ప్రియుడు, మరో ఇద్దరితో కలిసి భర్తను దారుణంగా కొట్టి చంపించింది. తర్వాత తనకేమీ తెలియనట్టు భర్తను ఎవరో చంపారని నమ్మించే ప్రయత్నం చేసింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి ఆదిలాబాద్ జిల్లా గాదిగూడ మండలం అర్జునికొలాంగూడ గ్రామ శివారులో జరిగిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు గజేందర్ (40) హత్య కేసు మిస్టరీని 24 గంటల్లో ఛేదించారు. మృతుని భార్య విజయలక్ష్మి, ఆమె ప్రియుడు రాథోడ్ మహేశ్, మరో ఇద్దరు నిందితులను పోలీసులు శనివారం రిమాండ్కు తరలించారు. ఉట్నూర్ డీఎస్పీ నాగేందర్, నార్నూర్ సీఐ రహీంపాషా శనివారం డీఎస్పీ కార్యాలయంలో నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వివరాలు వెల్లడించారు. నార్నూర్ మండలం నాగల్కొండ గ్రామానికి చెందిన గజేందర్ జైనథ్ మండలం మేడిగూడ కే జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు పండిత్గా పని చేస్తున్నాడు. ఈయనకు గాదిగూడ మండలం ఖాండోరాంపూర్ గ్రామానికి చెందిన విజయలక్ష్మితో 2017లో వివాహమైంది. వీరికి ఓ కుమారుడు (7) ఉన్నాడు.విజయలక్ష్మి నిజామాబాద్లో డిగ్రీ చదువుతున్న రోజుల్లో నార్నూర్ మండలం తాడిహత్నూర్ గ్రామానికి చెందిన రాథోడ్ మహేశ్తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. గజేందర్ స్వల్పంగా దివ్యాంగుడు కావడంతో ఇష్టపడని ఆమె.. మహేశ్తో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈ విషయం తెలియడంతో పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి ఆమెకు నచ్చజెప్పారు. క్షమాపణ చెప్పి ఇక నుంచి ప్రియుడికి దూరంగా ఉంటానని నమ్మించింది. కానీ ఆమె మారకుండా ప్రియుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ వచ్చింది. ఆదిలాబాద్లో ఉంటూ విధులకు వెళుతున్న గజేందర్ సొంత మండలానికి బదిలీ చేయించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా డు. వేసవి సెలవులు కావడంతో భార్య, కుమారుడితో స్వగ్రామం నాగల్కొండలోనే ఉంటున్నారు. ఈ క్రమంలో ఇక్కడే ఉంటే సంబంధం కొనసాగించడం కష్టమని భావించి మహేశ్తో కలిసి గజేందర్ను చంపాలని విజయలక్ష్మి పథకం పన్నింది. సుపారీ ఇస్తామని.. బేల గ్రామానికి చెందిన బండే సుశీల్, ఉర్వేత కృష్ణలతో కలిసి చెరో రూ.3 లక్షలు సుపారీ ఇస్తామని గజేందర్ హత్యకు విజయలక్ష్మి, మహేశ్ ఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న విజయలక్ష్మి మ హేశ్కు ఫోన్ చేసి భర్త హత్యకు ప్రణాళిక రచించింది. 12న పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో స్వగ్రామం నుంచి గజేందర్ ఉదయం 7.30 గంటలకు స్కూల్కు బయల్దేరాడు. ఈ విషయాన్ని విజయలక్ష్మి మహేశ్కు ఫోన్ చేసి చెప్పింది. పథకం ప్రకారం అర్జునికొలాంగూడ గ్రామ శివారు వద్ద ముగ్గురూ కాపు కాశారు. గజేందర్ను మొదట వె నుక నుంచి బైక్తో ఢీకొట్టడంతో అతను కింద పడి పోయాడు. అతడిని కొద్ది దూరం లాక్కెళ్లి బండల తో తల, ఇతర శరీర భాగాలపై కొట్టి హత్య చేశా రు. ఈ విషయం ప్రియుడి ద్వారా తెలుసుకున్న విజయలక్ష్మి ఉదయం గజేందర్ బీపీ మందులు వేసుకోలేదని, ఫోన్ చేస్తే స్విచ్ఛాఫ్ వస్తుందని ఇంట్లో చెప్పి తన బావ కొడుకు అంకిత్ను వెంటబెట్టు కుని హుటాహుటిన ద్విచక్ర వాహనంపై హత్య జరిగిన స్థలానికి వెళ్లింది. మహేశ్, మిగతా ఇద్దరు నిందితులు అక్కడే ఉండడం చూసి వెళ్లిపోవాలని సైగ చేయడంతో వారు అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం తన మామకు ఫోన్ చేసి భర్తను ఎవరో చంపేశారని సమాచారం ఇచ్చింది. మృతుడి తండ్రి జాదవ్ భిక్కు ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు హత్య కేసును 24 గంటల్లో ఛేదించారు. విజయలక్ష్మి, మహేశ్, సుశీల్, కృష్ణలను అదుపులోకి తీసుకొని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. -
కేసీఆర్ లేఖలతో భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: తన తప్పులకు శిక్ష పడుతుందేమోనని భయపడ్డ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేజీలకు పేజీలు లేఖలు రాసి భయపెట్టే ప్రయ త్నం చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేశ్కుమార్గౌడ్ వ్యాఖ్యానించారు.విద్యుత్ ప్రాజెక్టులు, కొనుగోళ్ల విషయంలో విచా రణ జరుపుతున్న కమిషన్కు 12 పేజీల లేఖ రాసే బదులు కమిషన్ ముందుకు వెళ్లి తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవచ్చు కదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కేసీఆర్ చేసిన తప్పులు ఒప్పుకుని విచారణకు సహకరించాలని, విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన కుంభకోణం, అక్రమాలు ప్రజలకు తెలియాలని శనివారం విలేకరులతో మాట్లాడుతూ మహేశ్గౌడ్ అభిప్రాయపడ్డారు. -
ఇరు కుటుంబ సభ్యుల విమర్శలతో.. యువజంట విషాదం!
మహబూబ్నగర్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువ దంపతులు ఇరు కుటుంబాలకు చెందిన వారి విమర్శలను తట్టుకోలేక మనస్తాపానికి గురై బలవన్మరణానికి పాల్పడ్డారు. ఈ విషాదకర సంఘటన నాగర్కర్నూల్ జిల్లా బల్మూర్ మండలంలోని జిన్కుంటలో చోటుచేసుకుంది.అచ్చంపేట సీఐ రవీందర్, గ్రామస్తుల కథనం ప్రకారం.. జిన్కుంట గ్రామానికి చెందిన మహేష్(21), భానుమతి(19) కొంతకాలంగా ప్రేమించుకొని పెళ్లికి సిద్ధపడగా ఇరు కుటుంబాలకు చెందిన పెద్దలు నిరాకరించారు. దీంతో వారు పెద్దలను ఎదిరించి ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే అప్పట్లో భానుమతి మైనర్ కావడంతో ఆమె తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు మహేష్పై కేసు నమోదు చేసి జైలుకు పంపించారు.భానుమతి మేజర్ అయిన తర్వాత మహేష్ జైలు నుంచి తిరిగి వచ్చి.. ఇద్దరు భార్యాభర్తలుగా గ్రామంలోనే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి మహేష్, భానుమతి గ్రామ సమీపంలోని మహేష్కు చెందిన వ్యవసాయ పొలం వద్ద వేప చెట్టుకు చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. గమనించిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.దీంతో సీఐ రవీందర్, ఏఎస్ఐ రేణయ్య ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. భానుమతి తల్లి పోలే ఎల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. మృతదేహాలను అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి సాయంత్రం స్వగ్రామానికి తెచ్చారు.ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ప్రేమికులను నిత్యం ఇరు కుటుంబాలకు చెందిన వారు వివక్ష పూరితంగా దూషించడం, విమర్శలు చేయడంతోనే వారు మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు గ్రామస్తుల ద్వారా తెలిసింది. ఆత్మహత్యకు పాల్పడిన ప్రేమజంట మృతదేహాలను గ్రామానికి తరలించి అంత్యక్రియలు జరుపుతుంటడంతో ముందు జాగ్రత్త చర్యగా గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. -
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు
-
అలాంటి ‘పుష్ప’పైనే విషమా?.. స్నేక్బాబుపై సెటైర్లు
ఎన్టీఆర్, సాక్షి: నటుడు, జనసేన రాష్ట్ర కార్యదర్శి కొణిదెల నాగబాబుపై సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. నంద్యాల వైఎస్సార్సీపీ అభ్యర్థి శిల్పతో ఉన్న స్నేహం కారణంగా అల్లు అర్జున్ మద్దతు ప్రకటించడం, దానిపై నాగబాబు నెగటివ్గా ట్వీట్ చేయడంతో అభిమానుల నుంచి విమర్శలు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ క్రమంలోనే ట్విటర్ నుంచి మాయం అయ్యి.. మళ్లీ ప్రత్యక్షం అయ్యారు నాగబాబు. ఇదిలా ఉంటే.. నాగబాబు వ్యవహార శైలిపై వైఎస్సార్సీపీ నేత పోతిన మహేష్ ట్విటర్ వేదికగా సెటైర్లు వేశారు. ‘‘స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?’’.. ‘‘మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, ‘‘నా పేరు సూర్య’’ సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి.. సినిమా పూర్తికాకముందే రూ.3 కోట్ల రూపాయిలు ఇప్పించి.. మరో 2 సినిమాల్లో పాత్రలు ఇప్పించి.. ఆర్థికంగా ఆదుకున్న"పుష్పా"2019 లో జనసేనపార్టీకి 2కోట్ల రూపాయల ఫండ్ ఇచ్చినా స్నేక్ బాబు విషం చిమ్ముతున్నారు. స్నేక్(బాబు)కు పాలు పోసిన అది కాటు వేస్తుంది.వాడుకొని వదిలేసే వారికి స్నేహం, నమ్మకంగా ఉండే వారి విలువ తెలుస్తుందా,కృతజ్ఞత లేని కుటుంబం మెగా కుటుంబమా?మామయ్య ఆర్థిక పరిస్థితి బాగోలేదని స్నేక్ బాబుకు, "నా పేరు సూర్య" సినిమాకి కో ప్రొడ్యూసర్ గా పెట్టించి సినిమా పూర్తికాకముందే— Pothina venkata mahesh (@pvmaheshbza) May 18, 20242009,2019,2024 అండగా నిలిచిన వారిపై & గీత ఆర్ట్స్ కుటుంబం పైనే అక్కసు వెళ్ళగకుతున్న మెగా ఫ్యామిలీ ని దగాఫ్యామిలీ అనాలా? అంటూ మండిపడ్డారు. మళ్లీ Xలోకి నాగబాబుజనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు.. మళ్లీ ఎక్స్ లో ప్రత్యక్షం అయ్యారు. నా ట్వీట్ ను తొలగించాను అని నాగబాబు పోస్ట్ చేశారు. ‘‘మా పక్కన ఉంటూ మమ్మల్ని బలహీన పరచేవాడు మాకు శత్రువే.. మమ్మల్ని బలపరిచేవాడు మా వ్యతిరేక వర్గంలో ఉన్నా వాడు మా వాడే’’ అంటూ అల్లు అర్జున్ను ఉద్దేశించి ట్వీట్ చేశారు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నాగబాబుపై దండెత్తారు. ఈ పరిణామంతో.. ట్విట్టర్ నుంచి తాత్కాలికంగా వైదొలిగారాయన. -
పవన్ కు పోతిన మహేష్ లేక "ప్రశ్నలు - పంచులు "
-
Sagubadi: 'గో ఆధారిత సజీవ సేద్యం'! అద్భుతం!!
నేలలో నుంచి 606 పురుగుమందులు, రసాయనాలను తొలి ఏడాదే నిర్మూలించవచ్చు. తొలి ఏడాదిలోనే పంట దిగుబడులు తగ్గకపోగా పెరుగుతాయి.. ఏ కల్మషమూ లేని పోషకాల సాంద్రతతో కూడిన సేంద్రియ ఆహారోత్పత్తుల దిగుబడి సుసాధ్యమే! జీవ ఇంధనం ఉత్పత్తి, కార్బన్ క్రెడిట్స్ పొందటానికీ అవకాశం ఉంది. మహేశ్ మహేశ్వరి ‘మిరకిల్’ కృషిపై ‘సాక్షి సాగుబడి’ ప్రత్యేక కథనం..మట్టిలో సత్తువను లేదా ఉత్పాదక శక్తిని కొలిచేందుకు ఒక సాధనం సేంద్రియ కర్బనం (సాయిల్ ఆర్గానిక్ కార్బన్– ఎస్.ఓ.సి.). సేంద్రియ కర్బనం మన భూముల్లో 0.2 నుంచి 0.5 మధ్యలో ఉందని అనేక అధ్యయనాల్లో తేలింది. ఈ భూముల్లో పండించిన ఆహారంలో పోషకాల సాంద్రత లోపించి, ఆ ఆహారం తిన్నవారికి పౌష్టికాహార లోపం వస్తోందని కూడా మనకు తెలుసు.సేందియ కర్బనం 1% కన్నా ఎక్కువ ఉంటే పంటలు బాగా పండటంతో పాటు చీడపీడల బెడద కూడా తగ్గుతుందని చెబుతారు. దీన్ని 2%కి పెంచుకోగలిగితే ఆ భూములు నిజంగా బంగారు భూములే అంటారు. పదేళ్లుగా శ్రద్ధాసక్తులతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న అతికొద్ది మంది రైతులు తమ భూముల్లో సేంద్రియ కర్బనాన్ని 2% వరకు పెంచుకోగలగటం మనకు తెలిసిందే.అయితే, ఒక్క ఏడాదిలోనే సేంద్రియ కర్బనాన్ని ఏకంగా 6 శాతానికి పెంచుకునే ‘అద్భుత సజీవ సేద్య పద్ధతుల’ను కనిపెట్టామని అహ్మదాబాద్ (గుజరాత్) కు చెందిన మహేశ్ మహేశ్వరి అనే ఆవిష్కర్త ఘంటాపథంగా చెబుతున్నారు. రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయానికి మారే రైతులు తొలి ఏడాదిలోనే దిగుబడి పెంచుకునేందుకు ఈ పద్ధతులు తోడ్పడుతున్నాయని ఇప్పటికే 130 మంది రైతుల ద్వారా ఆచరణలో రుజువైందన్నారు.సజీవ సేద్యం వివరాలు చెబుతున్న సెజెల్ మహేశ్వరిఅనేక ఏళ్ల క్రితం నుంచి తాము జరిపిన పరిశోధనల ఫలితంగా ఈ అద్భుత ఫలితాలు సాధిస్తున్నామని మిరకిల్స్ అగ్రి గ్రీన్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకులు మహేశ్ మహేశ్వరి, ఆయన సోదరి సెజెల్ మహేశ్వరి తెలిపారు.అహ్మదాబాద్లోని స్వామి నారాయణ్ విద్యా సంస్థాన్ ఆవరణలోని వీరి పరిశోధనా వ్యవసాయ క్షేత్రాన్ని ఇటీవల సందర్శించిన ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధితో వారు తమ ‘సజీవ సేద్యం’ గురించి ఎన్నెన్నో ఆసక్తికరమైన, ఆశ్చర్యకరమైన, ఆచరణాత్మకమైన, పరీక్షల్లో నిర్థారిత అనుభవాలను పంచుకున్నారు.వెన్ను కేన్సర్ను జయించి..58 ఏళ్ల మహేశ్ మహేశ్వరి మెకానికల్ ఇంజనీర్, చార్టర్డ్ ఎకౌంటెంట్. ఐఐఎం ఆహ్మదాబాద్లో ఎంబీఏ పూర్తి చేశారు. 2011లో వెన్నుపూస కేన్సర్ బారిన పడిన ఆయన ఐదారేళ్లు మంచానికే పరిమితమయ్యారు. ఆ క్రమంలో జరిపిన అధ్యయనంలో వ్యవసాయ రసాయనాలతో కూడిన ఆహారం వల్ల కడుపులోని సూక్ష్మజీవరాశి (గట్ మైక్రోబ్స్) నశించటమే కేన్సర్ రావటానికి ఒక మూల కారణమని 2013–14లో గుర్తించారు.ఆ క్రమంలో కొన్నేళ్లపాటు జరిపిన పరిశోధనల ఫలితంగా కేన్సర్ను జయించి పునరుజ్జీవం పొందారు! అంతేకాకుండా.. మట్టిలో పేరుకుపోయిన వ్యవసాయక రసాయనాల అవశేషాలను వేగవంతంగా ఒకే సంవత్సరంలో నిర్మూలించటంతో పాటు, పోషకాల సాంద్రతతో కూడిన స్వచ్ఛమైన సేంద్రియ ఆహారోత్పత్తులను పండించుకునేందుకు వీలుకల్పించే అద్భుత ద్రవ, ఘన ఎరువులను.. బయో పెస్టిసైడ్స్ను ఆవిష్కరించారు.తాగు/సాగు నీటిలో.. తినే ఆహారంలో పోషకాల సాంద్రత, సమగ్రతతో పాటు రసాయనిక అవశేషాలను పూర్తిగా నిర్మూలించటం ద్వారా ప్రజలకు పౌష్టికాహార, ఆరోగ్య భద్రత చేకూరుతుంది. రైతులకు ఆదాయ భద్రత లభిస్తుందని, గోశాలలకు ఆర్థిక స్వావలంబన చేకూరుతుందని అంటారు మహేశ్.పురుగుమందుల అవశేషాలు ఏడాదిలోనే విచ్ఛిన్నం!రసాయనిక వ్యవసాయం నుంచి సేంద్రియ వ్యవసాయం వైపు మారే రైతులకు గో ఆధారిత సజీవ సేద్య పద్ధతి చాలా సౌలభ్యంగా ఉంటుంది. ఈ పద్ధతిలో దేశీ ఆవును డీటాక్స్ చేసిన తర్వాత సూక్ష్మజీవరాశి పెరిగిన శుద్ధమైన పేడ, మూత్రం వాడుతాం. వీటితో తయారు చేసే సేంద్రియ ఎరువులో పంటల వేర్లు ఉపయోగించుకోవడానికి అనువైన రూపంలో ఉండే కర్బనం 30–40% అధికంగా ఉంది.ట్యూబ్ నుంచి బయటికి వస్తున్న జీవామృతంమట్టిలో సేంద్రియ కర్బనాన్ని వెనువెంటనే 2%కి పెంచే సామర్థ్యం దీనికి ఉంది. హెచ్డిపిఇ ట్యూబ్ ద్వారా యాక్టివేటెడ్ కార్బన్ అడ్వాన్స్డ్ ద్రవ జీవామృతం క్రమం తప్పకుండా వాడుతూ ఉంటే సేంద్రియ కర్బనం ఏడాదిలో 6% వరకు పెరుగుతుంది. ట్యూబ్లో ఆవు పేడ, మూత్రంతో పాటు కూరగాయలు, పండ్ల వ్యర్థాలను కూడా వేస్తాం.అవి 30 రోజుల్లో పూర్తిగా కుళ్లిపోతాయి. నలకలు కూడా లేని శుద్ధమైన ద్రవజీవామృతం లభిస్తుంది. ఇందులో మొక్కలకు లభ్య రూపంలోని కర్బనం 15% వరకు ఉంటుంది. సాధారణ జీవామృతంలో 2–3% మాత్రమే ఉంటుంది.ఎకరానికి రూ. 10 లక్షలు..లైవ్ వాటర్ బయో చిప్ ద్వారా టీడీఎస్ తగ్గించి, పిహెచ్ న్యూట్రల్ చేసి జీవవంతంగా మార్చిన నీటిని పంటలకు, పశువులకు అందిస్తున్నాం. జొన్న+సజ్జ కలిపి తయారు చేసిన నేపియర్ గడ్డి దిగుబడి సాధారణంగా ఎకరానికి ఏడాదికి 100–150 క్వింటాళ్లు వస్తున్నది. రైతుకు రూ. 2–4 లక్షల ఆదాయం వస్తోంది.మా పద్ధతి పాటిస్తే ఎకరానికి ఏడాదిలో 500–1,000 టన్నుల సేంద్రియ గడ్డి ఉత్పత్తి అవుతుంది. 20 అడుగుల ఎత్తు పెరుగుతుంది. ఇందులో 16% ్రపొటీన్, 7% కొవ్వు, 10% సుగర్ ఉంటుంది. ఆదాయం కనీసం ఎకరానికి ఏటా రూ.10 లక్షలు వస్తుంది. ఈ గడ్డిని కనీసం పదెకరాలు ఒకచోట సాగు చేస్తే.. పెలెట్లు తయారు చేయొచ్చు. పశువులకు, కోళ్లకు, చేపలకు దాణాగా వేయొచ్చు. ఈ పెల్లెట్లను బాయిలర్లలో బొగ్గుకు బదులు బయో ఇంధనంగా వాడొచ్చు.నీటిని శుద్ధి చేసే చిప్ఈ సేంద్రియ గడ్డి వల్ల, 12 రకాల హైడ్రోపోనిక్ మొలక గడ్డి మేపు వల్ల ఆవుల ఆరోగ్యం, పాల నాణ్యత, కొవ్వు శాతం గణనీయంగా పెరుగుతాయి. ఆవు నిర్వహణ ఖర్చు 70–80% తగ్గిపోతుంది. పాలివ్వని ఆవుల ద్వారా కూడా రైతులకు, గోశాలలకు ఆదాయం పెరుగుతుంది. సజీవ సేద్యం వల్ల రైతులకు ఎరువులు, పురుగుమందుల ఖర్చు మూడేళ్లలో దశలవారీగా 50% తగ్గుతుంది. మొదటి ఏడాది కూడా దిగుబడి తగ్గదు.దిగుబడి 3 ఏళ్లలో 50–75% పెరుగుతుంది. మట్టిలోని 606 రకాల రసాయనిక పురుగుమందుల అవశేషాలు మొదటి ఏడాదే విచ్ఛిన్నమైపోతాయి. నేల, పంట దిగుబడులు కూడా మొదటి ఏడాదిలోనే పూర్తి ఆర్గానిక్గా మారిపోతాయి. పౌష్టిక విలువలు మాత్రం మూడేళ్లలో దశలవారీగా ఏడాదికి 25% పెరుగుతుంది.– మహేశ్ మహేశ్వరి -సజీవ సేద్యం ఆవిష్కర్త, ఆహ్మదాబాద్, గుజరాత్,(సెజెల్ మహేశ్వరి –97256 38432 హిందీ/ ఇంగ్లిష్)miraclemoringa14@gmail.comప్రక్షాళన దేశీ ఆవుతోనేప్రారంభం!వ్యవసాయానికి, మన ఆహారానికి, మన నేలల ఆరోగ్యానికి దేశీ ఆవే కేంద్ర బిందువని మహేశ్ భావించారు. ఆవు పేడ, మూత్రం, పాలను జీవశక్తిమంతంగా, పోషకవంతంగా, రసాయన రహితంగా మార్చుకోవాలంటే.. ప్రక్షాళన ప్రక్రియను ఆవుతోనేప్రారంభించాలి. ఆవు దేహంలో పేరుకుపోయిన పురుగుమందుల ఆవశేషాలను నిర్మూలించాలి. అందుకోసం ఆవు దేహాన్ని శుద్ధి చేయటం, ముఖ్య వనరైన నీటిని శుద్ధి చేసుకోవటంతో ‘సజీవ సేద్యం’ప్రారంభమవుతుంది.ఆవు డీటాక్స్ ప్రక్రియకు 90 రోజులు పడుతుంది. ఆ తర్వాత పేడ, మూత్రం నుంచి దుర్వాసన రాదు. శుద్ధమైన దేశీ ఆవు పేడ, మూత్రంతో ప్రత్యేక పద్ధతిలో తయారు చేసుకునే అధిక కర్బనంతో కూడిన ద్రవ– ఘన ఎరువుల్లో జీవశక్తి, పోషకాలు, లభ్యస్థితిలోని కర్బనం అధిక పాళ్లలో ఉంటుంది.40 రకాల ఔషధ మొక్కల రసాలతో తయారు చేసే బయో పెస్టిసైడ్స్ వాడకంతో అతి తక్కువ కాలంలోనే మట్టిని పూర్తిగా శుద్ధి చేసి జీవశక్తి నింపి పునరుజ్జీవింప చేసుకోవటంతో వ్యవసాయ–ఆహార వ్యవస్ధను ఆసాంతం ప్రక్షాళన చేసే ఈ ప్రక్రియ పూర్తవుతుందని మహేశ్ విశదీకరించారు. ఇటువంటి స్వచ్ఛమైన ఆహారమే మనుషులకు, పశువులకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వగలదని ఆయన అంటున్నారు.ఎకోసెర్ట్ సర్టిఫికేషన్..మహేశ్ మహేశ్వరి తన ఆవిష్కరణలపై పేటెంట్కు దరఖాస్తు చేశారు. వీరు ఆవిష్కరించిన ద్రవ రూప, ఘనరూప ఎరువులకు, జీవన పురుగుమందులు ఫర్టిలైజర్ కంట్రోల్ ఆర్డర్ (ఎఫ్సిఓ) ప్రమాణాలకు తగినట్లుగా ఉన్నాయని భారత ప్రభుత్వం సర్టిఫై చేసింది. ఈ ఉత్పత్తులతో కూడిన సజీవ సేద్య పద్ధతికి అంతర్జాతీయ ‘ఎకోసెర్ట్’ సర్టిఫికేషన్ సైతం లభించటం విశేషం. ఈ సర్టిఫికేషన్కు 130 దేశాల్లో గుర్తింపు ఉంది. - నిర్వహణ: పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్ -
ఒకరి గురించి ఒకరు భజన ఈ భజన బ్యాచ్ మనకు అవసరమా
-
చిన్నమ్మ!! ‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’?
పాత ముతక చీర కట్టిన పండు ముసలమ్మలా ఉందా పాక. అటూ ఇటూ నల్లరంగేసిన రెండరుగులు, మధ్యలో గడప. ఓ అరుగు మీద కూర్చున్న ఆడవాళ్ళు ఆల్చిప్పతో కలెక్టరుకాయలు తొక్కతీసి, మాగాయ, తొక్కుపచ్చడికి సిద్ధం చేస్తున్నారు. రెండో అరుగు మీద చంటి ఒక్కడే పేకాడుకుంటున్నాడు.‘ఏరా ఎప్పుడూ ఆ దస్తాలేనా, పుస్తకాలు తియ్యవా’ అడిగిందొకావిడ ఓ పండుముక్క నోట్లో వేసుకుంటూ. ఓ సారి అటువైపు చూసి మళ్ళీ ఆటలో పడిపోయాడు చంటి. ‘పాచి పళ్ళు, తలంతా ఈళ్ళు, పుల్లల్లాంటి కాళ్ళు, ఎక్కడో బంగారు పూల పూజ చేస్తోంది వీడి గురించి’ సాగదీస్తూ వెక్కిరించింది మరొకావిడ. అంతలో ఎదురింటి ముందు సామాన్లతో వేన్ ఆగింది. తండ్రి వేను దిగి చేతులు అందించాడు. అతని చేతుల్ని పక్కకి నెట్టి, చెంగుమని దూకింది చిన్న. ‘జాగ్రత్తే చిన్నా’ అంటోంది వెనక రిక్షాలో వచ్చిన తల్లి. ఆ చప్పుడుకి చేతిలో పేక మూసి పాకలోంచి పైకి చూశాడు చంటి. కృష్ణుడి రంగు, ముందుకేసుకున్న రెండు జడలు, కోడి కత్తిలాంటి చిన్న ముక్కు, ముఖ్యంగా ఆ కళ్ళు, ఒక్క క్షణం ఓ చోట నిలవకుండా చుట్టూ పరిశీలిస్తూ గుండ్రంగా తిప్పుతూ, చంటి మీద ఓ రెండు సెకన్లు ఎక్కువసేపు నిలిపి, కళ్ళతోనే ఓ నవ్వు చిలికి, మిగిలినవాళ్ళు సామాన్లు సర్దుతూ ఉండగానే వీధి మొత్తం ఓ రౌండ్ కొట్టి వచ్చింది చిన్న.‘ఏవండీ,’ అంటూ వాకిట్లోకి వచ్చింది సరస్వతి. ‘రండి, కూర్చోండి’ అంటూ పేడలో ఎండుగడ్డి కలిపి బెందడి గోడకి పిడకలు వేస్తున్న పనాపి, చెయ్యి కడుక్కుని, పక్కనే ఉన్న చెక్క స్టూల్ లాగింది లక్ష్మి కూర్చోమని. ‘నమస్తే. నిన్ననే మీ ఎదురింట్లో దిగాము. పాలు వాడకం పెట్టుకుందామని’ అంది సరస్వతి కూర్చుని ఆ పాకంతా పరికిస్తూ. ‘అలాగే, వీధంతా మా చుట్టాలే. నేనే పోస్తాను పాలు. మీరు నలుగురులా ఉంది. సేరు పాలు సరిపోతాయేమో. పూటకి తవ్విడు చొప్పున పొయ్యమంటారా లేక సేరూ ఒకేపూట కావాలా?’‘ఉదయాన్నే సేరు పోసేయ్యండి. రేటు ఎక్కువైనా పరవాలేదు, పొదుగు దగ్గర పాలు కావాలి, మేము రావాలా?’ అడిగింది సరస్వతి ముక్కుకి చీర చెంగు అడ్డుపెట్టుకుంటూ. ‘ఈ వీధిలో అందరూ మా చుట్టాలే. అందుకని కాదు కానీ, మీరు అడిగినా నీళ్ళు కలపం. మా పాలతో బొట్టు పెట్టుకోవచ్చు. ఓ వారం చూస్తే మీకే తెలుస్తుంది. పాలు మా చంటి తెస్తాడు. గిన్నె వెంటనే ఇచ్చెయ్యాలి. ఉండండి కొంచెం కాఫీ పెడతాను’ అంది లక్ష్మి ఆప్యాయంగా. ‘వద్దండీ, అలవాటు లేదు’ అంది సరస్వతి వాకిట్లో ఉన్న జాంచెట్టుని చూస్తూ. ‘అన్నయ్యగారు ఏం చేస్తారు. పిల్లలు చదువుతున్నారా?’ అడిగింది లక్ష్మి అప్పుడే లోపలికొచ్చిన చంటిని జాంకాయలు కొయ్యమని సైగ చేస్తూ. ‘ఆయన ట్రెజరీలో చేస్తారు. అబ్బాయి పాలిటెక్నిక్ చదువుతున్నాడు. పిల్ల ఎయిత్’ అని, ‘అన్నయ్యగారు ఊళ్ళో లేరా?’ అడిగింది సరస్వతి చుట్టూ పరికిస్తూ.‘లేరు, వీడి ఆరో ఏటే పోయారు. అప్పటినించి నాలుగు గేదెల్ని సాకుతూ పాలవ్యాపారం చేసుకుంటూ వాణ్ణి పెంచుతున్నా. మా అమ్మ వాళ్ళదీ ఇదే వీధి చివరిల్లు’ అంది లక్ష్మి చంటి కోసిచ్చిన కాయల్లో ఓ నాలుగు దోరకాయల్ని సరస్వతి చేతిలో పెడుతూ. అవి మొహమాటంగా అందుకుని, ‘సరే వస్తానండి, పాలు రేపటినించి పొయ్యండి’ అని వెళ్ళిపోయింది సరస్వతి.గొళ్ళెంతో తలుపు మీద మెత్తగా కొట్టాడు చంటి. చటుక్కున తలుపు తీసి అతని వేళ్ళు తగిలేలా పాల గిన్నె అందుకుంటూ నవ్వి కన్ను గీటింది చిన్న. కంగారుగా అటూ ఇటూ చూసి, గిన్నె ఖాళీ చేసి ఇచ్చేవరకూ ఆగకుండా ఇంటికి పరిగెత్తాడు చంటి. ‘గిన్నేదిరా’ అడిగింది లక్ష్మి. ‘తర్వాత ఇస్తామన్నారమ్మా’ అనేసి అరుగు మీద కూర్చుని పేక ముక్కలు పేర్చుకోవటం మొదలు పెట్టాడు. కాసేపట్లో ఖాళీ గిన్నెతో వచ్చింది చిన్న. అటూ ఇటూ చూసి ఓ చీటీ చంటి మీదకి విసిరి లోపలికి వెళ్ళింది. ‘పాలు’ అన్నాడు చంటి బెరుగ్గా. ‘తెలుసు’ అందామె కొంటెగా. ‘అమ్మ గిన్నె తెమ్మంది’. ‘తినెయ్యంలే నీ గిన్నె. లోపలికి రావొచ్చుగా!’ చంటి భయంగా అటూ ఇటూ చూసి, ‘మీ అన్నయ్య లేడా?’ అడిగాడు. ‘ఉంటే నిన్నేమీ కట్టెయ్యడులే!’ ‘ఆంటీ?’ అడిగాడు సిగ్గుపడుతూ.‘అమ్మ పెరట్లో ఉంది’ అంది అదే సొట్ట బుగ్గల నవ్వుతో. వెళ్లి రేక్కుర్చీలో ముందుకు కూర్చున్నాడు భయంగా. ‘మొహమంతా మొటిమలు, చింపిరి జుట్టు, వాడు నీకెలా నచ్చాడే’ అంటోంది మా ఫ్రెండ్ ఇందిర’ అంది వస్తున్న నవ్వు ఆపుకుంటూ.‘నేనేం నీ వెంట పడలేదు. నచ్చకపోతే మానెయ్’అన్నాడు ఉక్రోషంగా. ‘సరదాగా తను అన్నది చెప్పాను తప్ప నేననలేదు కదా, నాకు నీ కళ్ళంటే ఇష్టమని చెప్పాను’ అంది అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ. ‘కళ్ళు నచ్చటమేంటి?’ అడిగాడు చంటి ఉత్సాహంగా. ‘నువ్వు చిన్నపిల్లాడివి నీకు తెలీదులే. అది సరే, టె¯Œ ్త ఎగ్జామ్స్ దగ్గరకొస్తున్నాయి. కాసేపు ఆ పేకముక్కలు పక్కన పెట్టి చదువుకోవచ్చుగా. కావాలంటే నేనూ వస్తా కంబైండ్ స్టడీస్కి’ అంది.‘అక్కర్లేదు. నువ్వు మాత్రం ఏం చదువుతున్నావు? ఎంతసేపూ వీధంతా తిరుగుతావు అందరిళ్ళకీ!’ ‘బాబి వాళ్ళ ఇంటికి వెళ్ళాననే కదా నీ కోపం. ఫిజిక్స్లో ఏదో డౌట్ ఉంటే అన్నయ్య తీసుకెళ్ళాడు.’‘నాకెందుకు కోపం. వాడు మంచోడు కాదు, సిగరెట్లు కాలుస్తాడు. అవునూ, ఫిజిక్స్ అంటే జీవశాస్త్రమేనా?’ అడిగాడు అనుమానంగా. ‘ఆహా మరి పేకాడే వాళ్ళు మంచోళ్ళా?’ అని, ‘మా అన్నయ్యకి చెప్పి ఈసారి డౌట్లు నిన్నే అడుగుతాలే తెలుగు మీడియం అబ్బాయి’ అంది అల్లరిగా నవ్వుతూ. ‘చిత్రలహరికి వాణ్ణి లోపల కుర్చీ వేసి కూర్చోబెడతారు. నేనేమో బయట కిటికీ ఊసలు పట్టుకుని వేళ్ళాడుతూ చూడాలి’ అన్నాడు చంటి ఉక్రోషంగా. ‘బావుంది అతను మా అన్నయ్య ఫ్రెండ్. నిన్ను రమ్మంటే రావు దానికి నేనేం చేయను’ అంది జాలిగా. ‘బాబి వాళ్ళింట్లో ఉసిరి చెట్టున్నట్టుంది, కాయలు కోసావా’ అడిగాడు మాట మారుస్తూ ఊరేసిన ఉసిరికాయలు ఇస్తుందేమో అని ఆశగా. ‘నాకు ఉసిరికాయలు నచ్చవు. జాంకాయలంటేనే ఇష్టం’ అంది కొంటెగా. అందులో శ్లేష అతనికి అర్థంకాలేదని తెలిసి కాస్త కోపంగా ‘రేప్పొద్దున్న పెళ్ళయ్యాక పేక ముక్కలు ముట్టుకున్నావో చేతులు విరక్కొడతా?’అంది.‘ష్! మీ అమ్మగారు వింటారు..’‘మన సంగతి మా అమ్మకి ఎప్పుడో చెప్పేశా. ఇంకో విషయం తెలుసా, మొన్న మీ అమ్మగారే అడిగారు నన్ను ‘మా చంటిని చేసుకోవే, ఈ పాడి నువ్వైతేనే బాగా చూసుకుంటావు’ అన్నారు తెలుసా?’ ఆ మాటకి చంటి తెగ సిగ్గుపడిపోయాడు. అతని సిగ్గు చూసి ముద్దేసి అతని రెండు బుగ్గలూ గట్టిగా పట్టుకుని లాగింది చిన్న. ‘అమ్మా..’ అన్నాడు కందిపోయిన బుగ్గల్ని రాసుకుంటూ.‘చిన్నా ఎవరే?’ పెరట్లోంచి సరస్వతి కేకేసింది. ‘పిల్లి.. తరుముతున్నాను’ అంది చిన్నా చంటిని వెళ్ళిపొమ్మని సైగ చేస్తూ.‘అమ్మా బాబిని నేను చేసుకోను. నీకు ఎప్పుడో చెప్పాను చంటిని తప్ప ఎవర్నీ చేసుకోనని, దానికి నువ్వు కూడా ఒప్పుకున్నావు’ అంది చిన్న విసురుగా. అప్పటికి రెండు గంటల్నించి నడుస్తోంది యుద్ధం. అమ్మ, నాన్న, అన్నయ్య ఒక వైపు చిన్న ఒక్కర్తీ ఒకవైపు. ‘ఏంటే నువ్వొప్పుకునేది? అసలు నీకు ఎనిమిదో తరగతినించీ ఈ ప్రేమలేంటి. అప్పుడే ఓ నాలుగు తగిలిస్తే ఇంతవరకూ వచ్చేది కాదు. వాడింకా బి.ఏ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. పైగా ఆ పేకాట పిచ్చొకటి. ఎప్పుడు సెటిల్ అవుతాడో, ఏ ఉద్యోగం వస్తుందో తెలీదు. బాబికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది. మనం తొందరపడాలి’ కోపంగా అన్నాడు ఆమె అన్నయ్య. ఆమె తండ్రి ఎవరు మాట్లాడితే వాళ్ళకేసి చూడ్డం తప్ప ఇంకేం చెయ్యట్లేదు. ‘గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే సరిపోతుందా? నాకు నచ్చక్కర్లేదా? నీ చెల్లిని ప్రేమించాడు కాబట్టి నీకు నచ్చటం లేదు తప్ప, చంటి తెలివైన వాడురా! పదమూడు ముక్కలూ పేర్చకుండా ఆడతాడు, కళ్ళతో ఓసారి చూసి కౌంట్ చెప్పేస్తాడు. వాడికీ మంచి ఉద్యోగమే వస్తుంది. మీరు ఒప్పుకుంటే సరే లేదంటే....’ అంతే విసురుగా సమాధానం చెప్పింది చిన్న.అన్నయ్య కొంచెం తగ్గి, ‘ఏముందే వాళ్ళింట్లో? పేడ కంపు కొట్టే ఆ పాక, నాలుగు గేదెలు, వర్షమొస్తే కారకుండా ఇల్లంతా పేర్చిన సత్తు గిన్నెలు, ఓ రోజు గేదె తంతే నాలుగు రోజులు కూరలేకుండా గడుపుకోవాలి. నా మాట విను’ అన్నాడు. సరస్వతి కల్పించుకుని, ‘దానికి నేను నచ్చచెబుతా లేరా?’ అంటూ చిన్నని గదిలోకి తీసుకెళ్ళింది. ‘చిన్నమ్మా, నీకు తెలుసుకదా నాన్నగారికి ఏం తెలీదు. మనింట్లో నిర్ణయాలన్నీ మగపిల్లాడు, అన్నయ్యే చూసుకుంటాడు. వాడు కూడా ఏం చేసినా నీ మేలు కోరే చేస్తాడు. ఊడ్చిన చేను కంటే ఉడికిన అన్నం నయం కదా. వాడి మాట విను’ అంది సరస్వతి చిన్నని ఓదారుస్తూ. ‘అమ్మా, అయిదేళ్ళ నించి చూస్తున్నావు, నీకు తెలీదా చంటి మంచోడని? ఆ విషయం గ్యారంటీ కార్డు లాంటి వాడి కళ్ళు చూసి చెప్పొచ్చు ఎవరైనా. వాడితో ఉంటే అభయాంజనేయుడు తోడున్నట్టే. ఇక ఉద్యోగం అంటావా, ఉసిరి చెట్టు తొందరగా కాపు కొస్తుంది, జాంచెట్టు కాస్త ఆలస్యమౌతుంది’ అని చిన్నమ్మ ఇంకా చెప్పేలోపు మధ్యలో అడ్డుపడి ‘చంటి మంచోడంటే బాబి చెడ్డోడని కాదు కదమ్మా’ అంది సరస్వతి.‘నిజమేనమ్మా, కానీ ఇక్కడ సమస్య స్వేఛ్చ గురించి. నేనో పిల్లని చూసి అన్నయ్యని చేసుకోమంటే చేసుకుంటాడా. మంచో, చెడ్డో నా జీవితానికి సంబంధించిన నిర్ణయంలో నన్ను కూడా భాగం చెయ్యండి అంటున్నా అంతే’ అని, ‘అమ్మా.. నాకింకా పద్దెనిమిదే కదా. ఒక్క రెండేళ్ళు చూడండి. ఈలోగా నా డిగ్రీ కూడా పూర్తవుతుంది. అప్పటికీ చంటి సెటిల్ కాకపోతే మీ ఇష్టం. ఇప్పుడు మాత్రం మీరు ఎంత చెప్పినా ఏం చేసినా నేను ఈ పెళ్ళి చేసుకోను’ అంది చిన్న ఏడుస్తూ.అదే సమయంలో.. ఎదురింటి పాకలో లక్ష్మి, చంటి దిగులుగా కూర్చున్నారు. నాలుగింటికిలేచి, పాలుపితికి, వీధంతా పొయ్యటం, పేడకళ్ళెత్తడం, పిడకలు చెయ్యటం, మిల్లుకెళ్ళి చిట్టు, తౌడు, సంతకెళ్లి పచ్చగడ్డి, కొనుక్కురావటం, రాత్రిళ్ళు గేదె తప్పిపోతే హరికెన్ లాంతరు, చేపాటి కర్ర.. పట్టుకుని ఇంటి వెనకున్న తమలపాకు తోటంతా వెతికి పట్టుకోవటం, ఇలా అన్ని పనులూ పంచుకునే ఆ తల్లీ, కొడుకులు ఆ క్షణం దుఃఖాన్ని కూడా పంచుకుంటున్నారు.‘ఊరుకోరా.. ఏం చేస్తాం! నువ్వు మంచోడివని నీకూ, నాకూ తెలిస్తే చాలదు. లోకానికి తెలియాలి. ఆ పేక ముక్కలు వదలరా అంటే విన్నావు కావు. మీ నాన్న కూడా ఇలాగే పేకాట పిచ్చితో ఇంటికే వచ్చేవాడు కాడు. ఓ రోజు మీ తాత తిట్టాడని ఉరేసుకున్నాడు. నువ్వు కూడా ఎక్కడ అలాంటి పని చేస్తావో అని భరిస్తున్నాను. అయినా నిన్నని ఏం లాభం. వీధి వీధంతా ఏ అరుగుమీద చూసినా, ఐదేళ్ళ పిల్లాడి నించి ఎనభై ఏళ్ల ముసలాళ్ళ వరకూ, ఆడ మగ తేడా లేకుండా ఇదేం అలవాటో. ఇక్కడినించి పోదాం అంటే సొంతిల్లు, పాడి వదులుకుని ఎక్కడకని పోతాం. ఇప్పుడు చూడు. పాపం వెర్రిది. నువ్వంటే పిచ్చి దానికి. ఇరవై ఏళ్లకి ఉద్యోగం లేదని ఎందుకూ పనికిరావని నిర్ణయించేశారు. చిన్నమ్మ ఎంతో చురుకైనది, నువ్వా నెమ్మది. దాన్ని నీకు కట్టబెడితే నీ బతుకు బావుంటుందని ఆశపడ్డాను’ అంది చంటి తల్లి భారంగా.‘అమ్మా, జీవితంలో మళ్ళీ పేక ముట్టుకోనమ్మా. నువ్వు ఎలాగైనా వాళ్ళకి చెప్పమ్మా. ఒక్క రెండేళ్ళు టైము ఇమ్మనమ్మా. టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటున్నా, మంచి ఉద్యోగం సంపాదిస్తాను. నాకు చిన్న కావాలమ్మా’ అతనికి దుఖం ఆగటం లేదు. ‘ఊరుకోరా. రేపు వాళ్ళమ్మగారితో ఓసారి మాట్లాడి చూస్తా. నువ్వు బెంగెట్టుకోకు’ అంది లక్ష్మి చంటిని దగ్గరకి తీసుకుని తల నిమురుతూ! ‘ఆ చెప్పు చిన్నమ్మా’ అతని మాట ముద్దగా వస్తోంది ఫోన్లో. క్లబ్బులా ఉంది పక్కనే అంతా గోలగోలగా ఉంది.‘చిన్నాడికి వొంట్లో బాగోలేదు. ఇంటికెప్పుడొస్తావు’ విసుగ్గా అడిగింది చిన్న. ‘వచ్చేస్తా బంగారం. ఈ ఒక్క రౌండ్ అయిపోగానే వచ్చేస్తా అంటూ ఫోన్ ఆఫ్ చెయ్యకుండానే పక్కన పెట్టేశాడతను.ఉసూరుమంటూ ఫోన్ పెట్టేసి పిల్లాడికి పాలు, బ్రెడ్డు పెట్టి టాబ్లెట్ వేసి పడుకోమని చెప్పి పక్కనే ఉన్న రైతు బజారుకి బయల్దేరింది చిన్న. ‘నువ్వు చిన్నవి కదూ’ అంది కూరలు ఏరుతూ ఉంటే పక్కనున్నామె.‘అవును. నువ్వు .. ఇందిర కదూ, నువ్వుండేది హైదరాబాద్ కదా!’ అడిగింది చిన్న. ‘అవునే. మా అక్కయ్య గృహప్రవేశం ఉంటే వచ్చాను. పూల దండల కోసం ఇలా వచ్చా. బావున్నావా చిన్నా’ అడిగింది ఇందిర చిన్నమ్మ చేతిని అందుకుంటూ. ‘హా, బావున్నాం. మా ఇల్లు ఇక్కడే శివాజీ పాలెం. రా ఇంటికి వెళదాం’ అంటూ కూరలు కొనుక్కోవటం అయిపోయాక ఇద్దరూ చిన్నమ్మ ఇంటికి వెళ్ళారు.ఇందిర కేసి చూసింది చిన్న. చిన్నప్పుడు కళ్ళపుసులతో, పుల్లలా ఉండేది. ఇప్పుడు దబ్బపండులా, ఎండమొహం ఎరుగనట్టు నిగ నిగ లాడుతూ, ఒతై ్తన జడ, మితంగా బంగారం, చక్కటి డ్రెస్సు, హుందాగా ఉంది. ‘నువ్వేమిటే ఇలా అయిపోయావు చిన్నప్పుడు చిలకలా ఉండేదానివి’ అడిగింది ఇందిర. నవ్వి ఊరుకుంది చిన్న.‘మీ ఆయనా పిల్లలు బావున్నారా?’ అడిగింది మాట మారుస్తూ. ‘హా’ అంటూ నంబర్ తీసుకుని ఫ్యామిలీ ఫొటో వాట్సాప్లో షేర్ చేసింది ఇందిర. ఆ ఫొటో కేసి చూస్తూ, ‘నిన్ను బాగా చూసుకుంటాడా?’ అడిగింది చిన్న.‘రాత్రి పొడవాటి కురులని పొగిడి, పొద్దున్నే పచ్చట్లో అదే వెంట్రుక కనబడితే విసుక్కునే రకం కాదే. అమ్మలా అభిమానంగా, బిడ్డలా గారంగా చూసుకుంటాడు. ఏ లోటూ రానివ్వడు. ఇంటి పనిలో సాయం చేస్తాడు, సాయంత్రం ఆరుకల్లా ఇంటికొచ్చి పిల్లల్ని చూసుకుంటాడు. పెళ్ళయ్యాక ఇంతవరకూ మేము ఓ మాట అనుకున్నది లేదు. మనకి అంతకన్నా ఇంకేం కావాలే, ఓ సారి మా ఇంటికి రా నీకే తెలుస్తుంది’ అంది ఇందిర మురిసిపోతూ. మనస్పూర్తిగా సంతోషించడానికి ప్రయత్నించింది చిన్న. కాసేపు మాట్లాడాక, జాకెట్ ముక్క, ఓ యాపిల్ చేతిలో పెట్టింది చిన్న. తెలిసిన ఆటో మాట్లాడి ఎక్కించి, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ ఉండిపోయింది. ఇంతలో సరస్వతి ఫోను ‘చిన్నమ్మా కార్తీకమాసం కదా, యమ ద్వితీయ నాడు భగినీ హస్త భోజనం చేస్తే అన్నయ్యకి ఆయుష్షు వృద్ధి, నీ కాపురం బావుంటుందట ఈ శనివారం అన్నయ్యని ఇంటికి పిలు’ అంది.అంతే అప్పటివరకూ అణచిపెట్టిన దుఖం ఎగజిమ్మింది. ‘అమ్మా, వాడు నాకేం చేశాడని? నేను చంటిని అందగాడనో, వయసు వ్యామోహం వల్లో ప్రేమించలేదు. ఫలానా వాడితో నా జీవితం భద్రంగా ఉంటుందని ప్రతీ అమ్మాయికీ ఓ నమ్మకం ఉంటుంది. నాకు వాడి కళ్ళు చూస్తే అదే అనిపించి వాణ్ణి ఇష్టపడ్డాను. మీరు పడనివ్వలేదు. ఏదో చిన్నప్పుడు సరిగ్గా చదవలేదని వాడు ప్రయోజకుడు కాడని నిర్ణయించేశారు. ఆడపిల్లకి జీవితంలో అతి పెద్ద బెట్టింగ్ పెళ్ళి.మా ఆయనెప్పుడూ ఏం చెబుతాడో తెలుసా, కౌంటు ఇచ్చినా పర్లేదు కానీ ఎవడి పేక వాడే ఆడాలట. నా బాధల్లా అదే. ధర్మరాజు జూదమాడితే ద్రౌపది అడవుల పాలైనట్టు అన్నయ్య నిర్ణయానికి నేను బలైపోయాను. ఉంటాను, మళ్ళీ మీరు ఏరి కోరి మరీ చేసిన బాబి తాగి, ఇంటికొచ్చేటప్పటికి నేను ఫోన్ మాట్లాడుతూ కనబడితే గొడవ చేస్తాడు’ అందామనుకుని, గ్రీష్మాన్ని గుండెల్లోనే దాచి, పెదవులపై వసంతం పూయిస్తూ, ‘సర్లే, ఆరోజు అన్నయ్యకి కుదిరితే రమ్మను’ అంటూ ఫోన్ పెట్టేసి ఎందుకో ఇందిర షేర్ చేసిన ఫొటోలో ఆమె భర్తని తదేకంగా చూసింది.అభయాంజనేయుడిలా భద్రత నిస్తూ గ్యారంటీ కార్డు లాంటి కళ్ళు, అవి కనబడకుండా చిన్నమ్మ కళ్ళ నిండా నీళ్ళు. — ఉమా మహేష్ ఆచాళ్ళ -
మహేష్బాబుతో సన్రైజర్స్ ఆటగాళ్లు.. (ఫోటోలు)
-
పవన్ బాక్ మనీ దందా.. ఐటీకి దిల్ రాజు ఫిర్యాదు
-
అల్లు అర్జున్ తెలుసు కదా.. బ్రాండ్ అంటే అతను..నువ్వు కాదు..!
-
బాబును జైల్లో కలిసిన తరువాత పవన్ కొన్న ఆస్తులు "ఆధారాలతో"
-
జనసేనలో మహిళలకు జరిగేది ఇదే..!
-
YSRCPలో చేరిన జనసేన నేత పోతిన మహేష్
-
పవన్ కళ్యాణ్ పై పోతుల మహేష్ ఫైర్
-
రాజకీయాల్లోనూ పవన్ది నటనే
వన్టౌన్ (విజయవాడ పశ్చిమ): జనసేన అధినేత, సినీనటుడు పవన్కళ్యాణ్ రాజకీయాల్లోనూ అద్వితీయంగా నటించి జనసేన నాయకులను నట్టేట ముంచుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ తీవ్రస్థాయిలో విమర్శించారు. జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపినట్లు ఆయన చెప్పారు. విజయవాడలోని తన కార్యాలయంలో సోమవారం పోతిన మహేష్ మీడియాతో మాట్లాడారు. ప్రజలకు, కార్యకర్తలకు భరోసాను, నమ్మకాన్ని కలిగించే వారే నాయకులవుతారని, రాజకీయాల్లో నటించే వారు నాయకుడు కాలేరని పవన్పై ఆయన విరుచుకుపడ్డారు. పవన్ను నమ్మి అతనితో అడుగులు వేశామని.. కానీ, ఆయనతో ప్రయాణం చేసినందుకు ఇప్పుడు తమపై తమకే అసహ్యం వేస్తోందన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 2014లో పోటీచేయకపోయినా 2019లో ఒక్క సీటు గెలిచినా, 2024పై ఆశలు పెట్టుకున్నాం. కానీ, పారీ్టలో జరుగుతున్నది, జరిగిన పరిణామాలను చూస్తే ఏమీ అర్థంకాక పిచ్చెక్కుతోంది. ఇంత జరుగుతున్నా పవన్కళ్యాణ్ నుంచి ఎలాంటి స్పందనలేదు. జనసేన నాయకులను దారుణంగా మోసం చేసిన పవన్ రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు, నాలాంటి కొత్తతరం నాయకులకు సమాధానం చెప్పాలి. గడిచిన ఐదేళ్లలో పార్టీ నిర్మాణంపై ఎక్కడా దృష్టిపెట్టలేదు. పవన్కళ్యాణ్ స్వార్థం కోసమే పార్టీని పెట్టినట్లు స్పష్టమవుతోంది. నిజానికి.. ఆయన సిద్ధాంతాలు ప్రజలకు అర్ధంకావట్లేదని అనుకున్నాం.. కానీ, స్వార్థంతో ఉన్న పవన్ను ప్రజలు గ్రహించారు. అందుకే జనసేనపట్ల వారికి నమ్మకం కుదరలేదు. అసలు 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకు పవన్ ఏం భవిష్యత్తు ఇవ్వగలరు? అందులో సగానికి పైగా టీడీపీకి చెందిన వారికి సీట్లు కేటాయించారు.. ఒకవేళ గెలిచిన నాయకులు పార్టీ కోసం నిలబడతారా? లోపాయికారి ఒప్పందాలతో, త్యాగం పేరుతో నాలాంటి కొత్త నాయకులను పవన్ నట్టేట ముంచారు. నిజానికి.. రాజధాని ప్రాంతమైన విజయవాడ పరిసర ప్రాంతాల్లో జనసేన పార్టీని నేను ఎంతో కష్టపడి నిలబెట్టా. కానీ, జనసేన నన్ను రాజకీయంగా చంపేసింది. జనసేనకు తగిన బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. గెలిచే భీమవరం వదిలి పిఠాపురం ఎందుకెళ్లారు పార్టీ బలంగా ఉన భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్లారో పవన్ స్పష్టంచేయాలి. అక్కడ మీకు అండగా నిలిచిన వ్యక్తికి సీటు ఇవ్వకుండా టీడీపీకి ఆ సీటు వదిలేయటం ఏమిటి? దీనిలో ఏ ప్రయోజనం ఆశించి బయటకొచ్చారో చెప్పాలి. అలాగే, అనకాపల్లి సీటు నాగబాబుకు అని చెప్పి తరువాత దానిని వదులుకున్నారు. అక్కడకు నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల నుంచి భారీగా ఫండ్స్ వసూలుచేశారు. వారంతా ఫిర్యాదు చేసేందుకు ముందుకు రాగానే అక్కడి నుంచి బయటకొచ్చారు. జనసేనను మనోహర్ పూర్తిగా నాశనం చేశారు జనసేన అనే బస్సు స్టీరింగ్ను పవన్కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ చేతికిచ్చారు. కానీ, ఆ బస్సును మనోహర్ కొండకు ఢీకొట్టి పార్టీని నాశనం చేశారు. పవన్, మనోహర్ ఇద్దరూ కలిసి జనసైనికులను జెండా కూలీలుగా, టీడీపీకి బానిసలుగా చేశారు. ఇప్పుడు చంద్రబాబును, ఆ తర్వాత ఆయన కొడుకును, ఆపైన దేవాన్షును ముఖ్యమంత్రులను చేసేందుకు జనసేనని జనసైనికులను బలిచేస్తున్నారు. అసలు నాదెండ్ల మనోహర్ బాగోతమంతా తెనాలిలో ప్రెస్మీట్ పెట్టి చెబుతా. ఇక చివరిగా నాదో కోరిక.. దానిని పవన్కళ్యాణ్ తీర్చాలి. పిఠాపురంలో మీ ఇంటి గృహ ప్రవేశానికి అన్నా లెజినోవాతోనే రావాలి. మున్ముందు ఇంకా చాలా విషయాలను ఆధారాలతో బయటపెడతా. కాపు–బీసీల మధ్య గొడవకు పవన్ కుట్ర రాష్ట్రంలో కాపు, బీసీల మధ్య గొడవ పెట్టి తద్వారా తాను రాజకీయ లబ్ధి పొందాలనే భారీ కుట్రకు పవన్ ప్రయత్నిస్తున్నారు. 21 సీట్లలో పారీ్టకి తీవ్ర నష్టం జరుగుతుందని కాపులు హెచ్చరించి పారీ్టకి దూరంగా వెళ్లిపోయారు. అయితే, వారిని దగ్గర చేసుకోవడం కోసం బీసీలకు సీట్లు ఎగ్గొట్టి కాపులకు బీసీలకు మధ్య గొడవ పెట్టాలని కుట్ర పన్నారు. బీసీలు సీట్ల కోసం ప్రశ్నిస్తే కాపులు తనకు మద్దతుగా నిలిచి బీసీలపై దాడిచేస్తారన్నది ఆయన ఉద్దేశం. పవన్.. దయచేసి కాపులను బలిచెయ్యొద్దు. మేం ఆస్తులు అమ్ముకుంటే మీరు కొనుక్కున్నారు నేను, నాలాంటి నాయకులు పార్టీలో చేరి మా ఆస్తులు అమ్ముకుంటే మీరు మాత్రం ఆస్తులు కూడబెట్టుకున్నారు. పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసమని స్పష్టంగా తెలుస్తోంది. ఈ విషయాలన్నింటినీ త్వరలో అన్ని ఆధారాలతో బయటపెడతా. నిజానికి.. మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు. సుజనాచౌదరి గతంలో తన బినామీ ఛానల్లో తన తల్లిని దూషించారని పవన్కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్లో పోస్టు పెట్టారు. అలాంటి సుజనాకు పవన్ టికెట్ ఎలా ఇప్పించారు? సుజనా గెలుపు కోసం మీరు ఎలా భాగస్వాములు కావాలనుకుంటున్నారు? కన్నతల్లిని విమర్శించి, పచ్చనోటు పడేస్తే అన్నీ మర్చిపోయారా? -
జనసేనకు మూకుమ్మడి రాజీనామా..!
-
పెద్ద మాయగాడు..అంతా నటనే.. అందుకే 2019లో ఆ గతి పట్టింది..!
-
విజయవాడ వెస్ట్ జనసేన ఇన్ఛార్జ్ పోతిన మహేష్ రాజీనామా
-
పవన్తో పని చేసినందుకు అసహ్యం వేస్తోంది: పోతిన మహేష్
ఎన్టీఆర్, సాక్షి: విజయవాడలో కూటమికి భారీ షాక్ తగిలింది. జనసేనకు షాక్ ఇస్తూ పశ్చిమ నియోజకవర్గ జనసేన ఇంఛార్జి పదవికి పోతిన వెంకట మహేష్ ఆ పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. రాజీనామా అనంతరం మీడియాతో మాట్లాడుతూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే పవన్ మీద సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఆవేశంలోనో.. సీటు రాలేదోనో తాను జనసేన పార్టీకి రాజీనామా చేయలేదన్న.. భవిష్యత్తు ఇచ్చేవాడు నాయకుడని, పవన్ను నమ్మి అడుగులేసి తామంతా మోసపోయామని పోతిన మహేష్ ఆ లేఖలో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పై జనసేనలోని నా బాధ్యతలకు, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేశాను నేను అవేశంతోనో, సీటు రాలేదనే అసంతృప్తితోనో మాట్లాడట్లేదు భవిష్యత్తుకు ఇచ్చేవాడే నాయకుడు.. నటించేవారు నాయకుడు కాలేదు రాజకీయాల్లో నటించేవారు నాయకుడు కాలేదు పవన్ కల్యాణ్ను నమ్మి అడుగులు వేశాను కొత్తతరం నాయకత్వం కోసం గుడ్డిగా అడుగులు వేశాం పవన్ కల్యాణ్ మార్పు తీసుకొస్తాడని నమ్మాం 2014లో పోటీ చేయకపోయినా, 2019లో ఒక్క సీటు గెలిచిన 2024పై ఆశలు పెట్టుకున్నాం జరుగుతున్నది, జరిగింది అర్థం కాక పిచ్చెక్కింది అయినా పవన్ కల్యాణ్లో స్పందన లేదు రాష్ట్ర ప్రజలకు, కాపు యువతకు , నాలాంటి కొత్తతరం నాయకులకు పవన్ సమాధానం చెప్పాలి పవన్ కల్యాణ్ నిజ స్వరూపం అందరూ తెలుసుకోవాలి మేడిపండు చూడ మేలిమి ఉండు.. పొట్ట విప్పి చూడు పురుగులుండు.. లాంటి వ్యక్తి పవన్ కల్యాణ్ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ఇన్నేళ్ళు ప్రయాణం చేసినందుకు మామీద మాకు అసహ్యం వేస్తుంది పార్టీ నిర్మాణం, క్యాడర్ పై పవన్ దృష్టి సారించలేదు అన్నీ తాత్కాలికం.. అంతా నటన.. నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసైనికులకంటే తెలివైనవారు పవన్ కల్యాణ్ సిద్ధాంతాలు ప్రజలకు అర్థం కావట్లేదు అనుకున్నాం ఎంత చెప్పినా ప్రజలకు జనసేన పట్ల నమ్మకం రాలేదు 25 కేజీల బియ్యం కాదు.. 25 ఏళ్ల భవిష్యత్తు కావాలనే పవన్ కళ్యాణ్ కనీసం 25 సీట్లలో పోటీ చేయలేకపోయారు 25రోజుల తర్వాత పార్టీ భవిషత్తు చెప్పగలరా? 21 సీట్లతో రాష్ట్ర ప్రజలకు, జనసేనకి ఏం భవిషత్తు ఇవ్వగలరు పవన్ స్వార్ధానికి మా కుటుంబాలు బలైపోతున్నాయి పార్టీలో మీకు తెలియకుండా అన్నీ జరుగుతున్నాయని భ్రమ పడ్డాం కానీ అన్నీ మీకు తెలిసే అన్నీ జరుగుతున్నాయి పవన్ కల్యాణ్ చూపులో ద్వంద అర్థాలు ఉన్నాయి సీట్లన్నీ తెలుగుదేశం నాయకులకే కేటాయించారు గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు మీకోసం నిలబడతారా? జనసేన ఎందుకు పెట్టారు.. ఏం ఆశించి పెట్టారు.. అసలు జనసేన ఎవరికోసం పెట్టారు? పార్టీ పెట్టింది రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు.. వ్యక్తిగత ప్రయోజనాల కోసం పెట్టారని తెలుస్తోంది అన్నీ ఆధారాలను బయటపెడతాను కాపు యువతను బలి చేయొద్దని కన్నీటితో అభ్యర్ధిస్తున్నా మీరు మా గొంతు కోస్తున్న నొప్పి తెలుస్తుంది మేము రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు అమ్ముకుంటే, మీరు ఆస్తులు కొనుక్కున్నారు మా రక్తమాంసాలపై మీరు భవంతులు కట్టుకున్నారు కాకినాడ మేయర్ సరోజ, శేష కుమార్, విశాఖలో మహిళా నాయకురాలికి మాత్రమే పదవులు పొడిగించారు మీ గురించి, పార్టీలో బ్రోకర్ పనులు బయట పెడుతున్నారనే భయంతోనే వాళ్ల పదవులు పొడిగించారు సుజనా చౌదరి(విజయవాడ వెస్ట్ కూటమి అభ్యర్థి) గతంలో బినామీ ఛానల్ లో మీ తల్లిని దూషించారు అలాంటి సుజనాకు మీరు టికెట్ ఎలా ఇప్పిస్తారు? సుజనా గెలుపులో మీరు ఎలా భాగస్వామ్యం అవ్వాలనుకుంటున్నారు కన్నతల్లిని విమర్శించి, పచ్చనోట్లు పడేస్తే అన్నీ మర్చిపోయారా? విజయవాడలో జనసేన జెండా లేదు.. గాజు గ్లాసు గుర్తు లేదు మేము బతికించిన పార్టీని మీరు చంపేశారు టీడీపీ వేసే కుక్క బిస్కెట్లు మనకి వద్దు అన్నారు.. ఇప్పుడు ఆ బిస్కెట్లు ఎందుకు తీసుకున్నారు జనసేనను సీట్లు అడగకుండా బీజేపీ ఎందుకు త్యాగం చేశారో చెప్పాలి బీజేపీ, టీడీపీని సీట్లు అడిగితే మీరు ఎందుకు ఇచ్చారు? పొత్తు ధర్మం బిజెపి, టీడీపీలకు లేదా, కేవలం జనసేనకు మాత్రమే ఉందా పొత్తు కుదిర్చితే ఎక్కువ స్థానాలు కోరుకోవాలి కదా.. ఎక్కువ సీట్లు సాధించాలి కదా! మీరెందుకు ప్రకృతికి విరుద్ధంగా ప్రవర్తించారు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో జనసేన నుండి పోటీకి ఒక్క కాపు నాయకుడు దొరకలేదా.. అన్ని పార్టీలు విధేయతకు పట్టం కట్టాయి కసాయివాడికి కనికరం ఉంటుంది.. మీపట్ల విధేయతతో ఉన్నందుకు కనీసం కనికరం లేదా? మీమనసు ఇంత పాషాణ హృదయం అని ఊహించలేదు 21 అసెంబ్లీ, 2ఎంపీల్లో ఏడు అసెంబ్లీ, ఒక ఎంపీ మాత్రమే జనసేన కోసం పనిచేసినవాళ్లకు ఇచ్చారు టీడీపీ నుండి వచ్చిన నేతలు జనసేనను టీడీపీలో విలీనం చేస్తే మీరు అడ్డుకోగలరా? రాబోయే 12 నెలలో జనసేన అడ్రస్ గల్లంతు అవుతుంది జనసేన పార్టీ ప్రజారాజ్యం-2 అయి తీరుతుంది త్యాగాలకు బీసీలే కావాలా? కమ్మవారి త్యాగాలకు పనికి రారా? మంగళగిరి, విజయవాడ పశ్చిమ బీసీల నుండి తీసుకుని కమ్మలకు ఇవ్వలేదా? పశ్చిమ సీటు బలహీన వర్గాలలో ముస్లింలకో, సోము వీర్రాజు లాంటి వారికి ఇవ్వచ్చుగా? పెట్టుబడిదారుడైన సుజనా చౌదరికి ఎందుకు ఇచ్చారు? పద్మశాలిలకు ఒక్కసీటు ఎందుకు కేటాయించలేదు? సుజనా స్థానంలో ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ దొరకలేదా? ఇదెక్కడి సామాజిక న్యాయం ? పవన్ కల్యాణ్ కులాల మధ్య గొడవలు పెట్టాలని చూస్తున్నారు రాజకీయ కుట్రలో భాగంగా కులాలకు కొమ్ము కాస్తున్నారు 21 సీట్లలో ఒక్క చోట కూడా కాపులు హర్షించలేదు పార్టీ భవిషత్తు ఇబ్బందుల్లోకి నెట్టివేయబడుతుంది కాపులు జనసెనకు దూరమయ్యారు.. పవన్ కి కాపులు మద్దతు ఇవ్వట్లేదు కులాల మధ్య కుట్రలకు తెరలేపారు గెలిచే భీమవరం స్థానాన్ని వదిలి పిఠాపురం ఎందుకు వెళ్ళారు భీమవరంలో టీడీపీ నాయకుడిని ఎందుకు తీసుకొచ్చి టికెట్ ఇచ్చావు సొంతఇల్లు కట్టుకోవడానికి భీమవరం ఎమ్మెల్యే ఇబ్బందులు పెడుతున్నారని చెప్పిన మాట అవాస్తవం ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడివి అయ్యుండి వేరే పార్టీ నేత కాళ్లు ఎందుకు పట్టుకున్నావ్? అనకాపల్లి సీటు ఎందుకు వదులుకున్నారు? అనకాపల్లిలో నాగబాబు వచ్చాక పారిశ్రామికవేత్తల దగ్గర ఫండ్స్ వసూలు చేశారు వాళ్ళు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నారు.. అందుకే అక్కడినుండి వచ్చేశారు నాదెండ్ల మనోహర్ కు జనసేన అనే బస్సు ఇస్తే ఆయన పెద్ద కొండకు గుద్ది ముక్కలుముక్కలు చేసారు నష్టపోయింది మాత్రం మేము మేము చెప్పేది వినే ఓపిక లేనపుడు పార్టీ ఎందుకు పెట్టారు పొత్తు మరో పదేళ్లు కావాలా? ఇప్పుడు చంద్రబాబు ఆ తర్వాత, ఆ తర్వాత కూడా ఎవరు ముఖ్యమంత్రిని చేయాలో చెప్తే బానిసల్లా జెండాలు మొస్తాం నాదెండ్లా(నాదెండ్ల మనోహర్ను ఉద్దేశించి)... తెనాలి వస్తా, అక్కడే ప్రేస్మీట్ పెడతా నేను చెప్పేవన్నీ నిజాలే.. నాకు దేనికీ భయం లేదు చివరిగా నాకు ఓకే ఒక కోరిక.. పిఠాపురంలో మీ ఇల్లు గృహ ప్రవేశానికి అన్నా లేజినోవాతోనే రావాలి మీ నెల రోజులు పర్యటన షెడ్యూల్ కి ఏర్పాట్లు చేయండి జనసేన పార్టీ మొత్తం వాట్సాప్ లోనే నడుస్తుంది ‘‘కొత్తతరం నేతల్ని పవన్ తయారు చేస్తారని గుడ్డిగా అడుగులు వేశాం. 2019లో జనసేనకు ఒక్క సీటు వచ్చినా.. పవన్తో నడిచి భంగపడ్డాం. నటించేవాళ్లు ఎన్నటికీ నాయకులు కాలేరు. స్వార్థరాజకీయ ప్రయోజనాలు కలిగిన వ్యక్తి పవన్. అందుకే పార్టీ నిర్మాణంపైగానీ, కేడర్పైగానీ ఆయన ఏనాడూ దృష్టి పెట్టలేదు. ’’ అని పవన్కు పోతిన మహేష్ చురకలు అంటించారు. ఇదిలా ఉంటే.. జనసేనలో పోతిన తొలి నుంచి ఉన్నారు. పవన్ను నమ్ముకునే పార్టీలో కొనసాగుతున్నారు. గత ఐదేళ్లుగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గ పరిధిలో జనసేన బలోపేతం కోసం ఎంతో కృష్టి చేశారాయన. ఈ క్రమంలోనే వెస్ట్ సీటుపై మహేష్ ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. చివరకు టికెట్ కోసం పెత్తందారులతో పోరాడినా ప్రయోజనం లేకుండా పోయింది. విజయవాడ వెస్ట్ సీటు కోసం మొదటి నుంచి ఆసక్తికర రాజకీయం నడిచింది. టీడీపీ నుంచి ఇద్దరు నేతలు సీటు కోసం యత్నించగా.. పొత్తులో భాగంగా జనసేనకు వెళ్లొచ్చనే ప్రచారం తొలి నుంచి నడిచింది. దీంతో మహేష్ పవన్ నుంచి ఆ సీటు తనకేనని మాట తీసుకున్నారు. ఈ లోపు సీన్లోకి అనూహ్యంగా ఎంట్రీ ఇచ్చిన ఏపీ బీజేపీ.. పొత్తులో భాగంగా ఆ సీటును తన్నుకుపోయింది. పవన్ ద్వారా చంద్రబాబు తన అనుచరుడు సుజనా చౌదరి(బీజేపీ)కి ఇప్పించుకున్నారు. అయినా కూడా మహేష్ సీటు కోసం ప్రయత్నించారు. పవన్పై చివరి నిమిషం వరకు నమ్మకం ప్రదర్శించారు. అయినప్పటికీ చివరకు.. వేల కోట్లున్న అగ్రవర్ణ నేత కోసం బీసీ నేత అయిన మహేష్ను పవన్ దగా చేశారు. పవన్ను నమ్మి తాను మోసపోయినట్లు మహేష్ ఇప్పుడు తన అనుచరుల వద్ద వాపోయారు. అధికారంలోకి వస్తే.. ఏదైనా పదవి ఇస్తామని పవన్ ఆఫర్ చేసినప్పటికీ మహేష్ అందుకు లొంగలేదని తెలుస్తోంది. పోతిన మహేష్ తదుపరి రాజకీయ అడుగులు ఎటు అనేది తెలియాల్సి ఉంది. -
'మనవడి' పై తాత హత్యాయత్నం!
కరీంనగర్: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నందిమేడారం గ్రామానికి చెందిన సామంతుల మహేశ్ (28)పై తాత సామంతుల కొమురయ్య హత్యాయత్నం చేశాడు. ఎస్సై సత్యనారాయణ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురయ్యకు కుమారుడు మల్లేశం, కూతురు కనుకవ్వ సంతానం. మల్లేశంకు వివాహమై ఇద్దరు కుమారులు జన్మించిన తరువాత దాదాపు 20ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో అతడి కుమారులిద్దరు అశోక్, మహేశ్ను కొమురయ్య పెంచి పెద్దచేశాడు. ఇద్దరికీ పెళ్లిళ్లు చేసి వారికి తన వ్యవసాయ భూమిని పంపకం చేశాడు. కాగా మహేశ్ తరచూ తాగి వచ్చి తాతతో గొడవపడేవాడు. తన అన్న అశోక్కు ఎనిమిది గుంటల భూమి ఎక్కువ ఇచ్చావని దూషిస్తూ బెదిరించేవాడు. ఈ క్రమంలో మహేశ్తో ఎప్పటికైనా తనకు ఇబ్బందులు తప్పవని కొమురయ్య భావించాడు. ఇంటి ముందు పడుకున్న మహేశ్పై శనివారం వేకువజామున గొడ్డలితో దాడి చేశాడు. ఇంట్లో నిద్రిస్తున్న అతడి తల్లి, భార్యకు మెలకువ వచ్చి బయటకు రావడంతో కొమురయ్య గొడ్డలిని అక్కడే వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటనపై మహేశ్ మేనమామ కట్ట కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కాగా మహేశ్ను చికిత్స నిమిత్తం కరీంనగర్ తీసుకెళ్లగా, పరిస్థితి విషమించడంతో వరంగల్ ఆసుపత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇవి చదవండి: ఉసురు తీసిన నకిలీ జ్యోతిష్యుడు