-
Pawan Kalyan: పక్కలో బల్లెం
పదేళ్లుగా ఆయన వెంట ఉన్నా. జనసేన కోసం ఎంతో కష్టపడ్డా. కష్టకాలంలోనూ పార్టీని వీడకుండా పని చేశా. పవన్ కల్యాణ్పై నమ్మకం ఉంది. సీటు గ్యారెంటీగా నాకే వస్తుంది.. టికెట్ ఆశలు సన్నగిల్లుతున్న సమయంలో అప్పటికే రెండుసార్లు పవన్ను కలిసిన తర్వాత కూడా జనసేన నేత పోతిన వెంకట మహేష్ మీడియా ముఖంగా భావోద్వేగంగా మాటలివి. కానీ, చివరకు ఏం మిగిలింది?.. విజయవాడ వెస్ట్ సీటును ఆఖరిగా బీజేపీ ఎగరేసుకుపోయింది. గత రెండు నెలలుగా ఏపీ రాజకీయాల్లో విజయవాడ వెస్ట్ పరిణామాలు వాడీవేడిగా సాగాయి. అప్పటికే పొత్తు ప్రకటన చేసినా.. ఒకవైపు టీడీపీ, మరోవైపు జనసేనలు ఇక్కడి సీటు తమదేనంటూ ప్రకటించుకున్నాయి. టీడీపీ నేతలు జలీల్ఖాన్, బుద్దా వెంకన్నలు ఎవరికివారే ఆత్మీయ సమావేశాలు, ర్యాలీలతో తమ బలప్రదర్శనలు కొనసాగించుకుంటూ వచ్చారు. అయితే.. ఈలోపే విజయవాడ వెస్ట్ సీటు ఆలోచన వదులుకోవాలని, అది జనసేనకు కేటాయిస్తామని టీడీపీ నేతలకు చంద్రబాబు సూచించారనే ప్రచారం తెర మీదకు వచ్చింది. మొదటిసారి.. పొత్తులో భాగంగా జనసేనకు టికెట్ వెళ్లొచ్చనే చర్చా మొదలైంది. దీంతో జలీల్ఖాన్ ఒక అడుగు ముందుకేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ను కలిశారు. విజయవాడ వెస్ట్ సీటును తనకు వదిలేయాలని విజ్ఞప్తి చేశారు. ఆ టైంలో ‘చూద్దాం’ అని పవన్ జలీల్ఖాన్తో చెప్పారనే విషయం బయటకు పొక్కింది. దీంతో జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేష్ కాస్త ఆందోళనకు లోనయ్యారు. వెంటనే పవన్ కల్యాణ్ను కలిశారు. పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ టికెట్పై ఎంతో ఆశలు పెట్టుకున్నారు. పవన్ ఇచ్చిన భరోసాతో సీటు కచ్చితంగా తనకే వస్తుందని పాపం పోతిన మహేష్ భావించారు. రెండో జాబితాలో కచ్చితంగా తన పేరు ఉంటుందని బహిరంగంగా ప్రకటించుకున్నారు కూడా. కానీ, టీడీపీ బదులు బీజేపీ రూపంలో టికెట్ గండాన్ని.. చంద్రబాబు తెర వెనుక జరిపిన కుట్రల్ని ఆయన పసిగట్టలేకపోయారు. రెండోసారి.. కానీ ఇంతలో టీడీపీ-జనసేనతో బీజేపీ కూడా పొత్తు కూడాయి. పొత్తులో భాగంగా బీజేపీకి 10 అసెంబ్లీ స్థానాలు తీసుకుంది. ఆ సమయంలోనే విజయవాడ వెస్ట్పై బీజేపీ నేతలు కన్నేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వెస్ట్ సీటు తమకే కావాలని బీజేపీ పట్టింది. దీంతో పోటీ కోసం అంతా సిద్ధం చేసుకున్న మహేష్.. ఆగ్రహానికి లోనయ్యారు. మళ్లీ పవన్ కల్యాణ్ను కలిశారు. టికెట్పై ఇంకా ఏం నిర్ణయం తీసుకోలేదని.. కంగారు పడొద్దంటూ పవన్ మరోసారి అభయం ఇవ్వడంతో మహేష్ మెత్తబడ్డారు. కానీ, అప్పటికే వెస్ట్ సీటుపై నిర్ణయం జరిగిపోయింది!. బీజేపీ నేత వ్యాఖ్యలతో కన్ఫర్మ్ విజయవాడ వెస్ట్ సీటు తమదే అని ప్రకటిస్తూ.. గత గురువారం నాడు బీజేపీ విజయవాడ వెస్ట్లో ఆత్మీయ సమావేశం నిర్వహించింది. ఆ సమయంలోనే ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ.. వెస్ట్ సీటు ఎవరికి కేటాయించాలనే దానిపై ఇప్పటికే చర్చలు ముగిశాయని వెల్లడించారు. పార్టీ డిసైడ్ అయిపోయిందని.. అభ్యర్థి ఎవరనేదే తేలాల్సి ఉందని ప్రకటన చేశారు. దీంతో.. మహేష్ మళ్లీ ఆందోళనకు దిగారు. అయినా నమ్మకమే! ఈసారి ఏకంగా.. తన కార్యాలయంలోనే మహేష్ ఒక్కరోజు నిరాహార దీక్షకు దిగారు. ఆ సమయంలో.. ‘‘పార్టీకి విధేయుడిగా, పదేళ్లు నాకు నమ్మకస్తుడిగా ఉన్న నీకు.. విజయవాడ వెస్ట్ సీటు ఖాయం అని పవన్ కల్యాణ్ మాటిచ్చారు. తాజా సమావేశంలోనూ ఆయన అదే మాట అన్నారు. ఆయన తన మాట నిలబెట్టుకుంటారని నమ్ముతున్నా. జనసేన పార్టీ తప్ప ఎవరికీ సీటు ఇచ్చినా వైఎస్సార్సీపీతో పోటీ పడలేరు. ఒకవేళ ఇక్కడి సీటు బీజేపీకే వెళ్తే.. అది కచ్ఛితంగా వైఎస్సార్సీపీకి అనుకూలిస్తుంది’’ అని చెప్పుకొచ్చారు. ఒకవేళ పవన్ మాట నిలబెట్టుకోలేకపోతే? అనే ప్రశ్నకు.. ఒకవేళ బీజేపీ సుజనా చౌదరికే గనుక టికెట్ ఇస్తే రెబల్గా పోటీ చేస్తా.. అదీ పవన్ ఫొటోతోనే అని. తమ సత్తా చూపించుకునేందుకు కొత్త తరం నేతలకు కూడా అవకాశాలు దక్కాలి కదా అని వ్యాఖ్యానించారు. కానీ.. మూడోసారీ.. చివరకు విజయవాడ వెస్ట్లో జన సైనికుల ఆశలు అడియాశలయ్యాయి. బీజేపీ జాబితాలో టికెట్ సుజనా చౌదరికే వెళ్లింది. అయినా విజయవాడ వెస్ట్ సీటుపై పోతిన వెంకట మహేష్ పట్టువీడడం లేదు. జనసేనకు ఇవ్వాల్సిందేనంటూ ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించారు. మరోవైపు.. బీజేపీ అభ్యర్థుల ప్రకటనకు రెండ్రోజుల ముందు మూడోసారి మహేష్ను పిలిపించుకున్న పవన్.. బుజ్జగింపులకు దిగారు. అధికారంలోకి వస్తే కీలక పదవి ఇస్తామంటూ ఆశ పెడుతున్నారు. కానీ, మహేష్ ససేమీరా అంటున్నారు. ఇక.. ఈ విషయం తెలిసి పవన్ పై మండిపడుతున్న విజయవాడ వెస్ట్ జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి. పవన్ వల్ల నిజంగా కాలేదా? కూటమిలో భాగంగా నాకే సీటు కేటాయించడం న్యాయం అని చెబుతున్న మహేష్కు.. పవన్ మాత్రం అన్యాయం చేశారు. అయితే.. టీడీపీ-బీజేపీల బలవంతపు పొత్తు కోసం విశ్వప్రయత్నం చేసిన పవన్.. మధ్యలో పొత్తులు, సీట్ల పంపకాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొత్తుల కోసం మధ్యవర్తిత్వం వహించడం వల్ల చాలా కోల్పోవాల్సి వచ్చిందని, పొత్తుల కోసం చాలా త్యాగాలు చేశామని చెప్పుకొచ్చారు. మరి అంతగా బాధపడిపోయిన పవన్.. పార్టీకి విధేయులుగా ఉన్నవాళ్లకు కాకుండా జంప్జిలానీలకు ఒకట్రెండు సీట్లు ఇచ్చిన పవన్.. విజయవాడ వెస్ట్ సీటు విషయంలో బీజేపీని ఒప్పించలేకపోయారా?.. నమ్మకంగా ఉన్న మహేష్కు టికెట్ ఇప్పించలేకపోయారా? అనే ప్రశ్న లేవనెత్తుతున్నారు జనసైనికులిప్పుడు. సీటు మహేష్కేనంటూ నమ్మించి మోసం చేశారని.. పార్టీ కోసం కష్టపడిన వారికి అన్యాయం చేస్తూ వెన్నుపోటులో చంద్రబాబునే మించిపోయారంటూ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బాబు పాచికేనా? విజయవాడ వెస్ట్ టికెట్ విషయంలో పంతం నెగ్గించుకున్న బీజేపీ.. అభ్యర్థి విషయంలో మాత్రం ‘రాజీ’ పడిందా?. వక్కల గడ్డ భాస్కరరావు, జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బొబ్బురి శ్రీరాంలాంటి వాళ్లు పార్టీలో మొదటి నుంచి ఉన్నవాళ్లు.. నమ్మకస్తులు ఉన్నా.. సుజనా చౌదరికే టికెట్ ఎందుకు ఇచ్చారు? పేర్ల పరిశీలనలో ఏం జరిగింది?.. అని బీజేపీ సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఎంపీ సీట్ల విషయంలో చక్రం తిప్పిన చంద్రబాబే.. బీజేపీలో ఉన్న తన సన్నిహితుడు సుజనా చౌదరికే విజయవాడ వెస్ట్ నియోజక వర్గం టికెట్ దక్కేలా చేశారనే టాక్ బలంగా వినిపిస్తోందిప్పుడు. -
పవన్ కళ్యాణ్ గురించి పోతిన మహేష్
-
ఫ్యామిలీతో దీక్ష చేపట్టిన పోతిన మహేష్
-
పవన్ కు పోతిన మహేష్ ఫైనల్ వార్నింగ్
-
పవన్పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్గా పోటీ?
-
పవన్పై పోతిన మహేష్ తిరుగుబాటు.. రెబల్గా పోటీ?
సాక్షి, విజయవాడ: విజయవాడ వెస్ట్ సీటు పంచాయితీ పవన్ కల్యాణ్ వద్దకు చేరింది. వెస్ట్ సీటు జనసేనకే ఇవ్వాలని పోతిన మహేష్ కోరగా, టిక్కెట్ ఇచ్చేది లేదంటూ పవన్ తేల్చేశారు. పొత్తులో భాగంగా త్యాగం చేయాల్సిందేనన్నారు. పార్టీ కోసం కష్టపడిన తనకు న్యాయం చేయాలంటూ మహేష్ పట్టుబట్టారు. పవన్ కుదరదని చెప్పడంతో రెబల్గా బరిలోకి దిగాలని పోతిన నిర్ణయించారు.ఇండిపెండెంట్గా పోటీచేస్తానని పవన్కు పోతిన స్పష్టం చేశారు. పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదీ చదవండి: దారి తప్పిన మేధావి.. ఎందుకీ మార్పు? -
విజయవాడ వెస్ట్: దేవుడా పవన్ మనసు మార్చు.. జనసైనికుల నిరసన
సాక్షి, విజయవాడ: పశ్చిమలో పోతిన మహేష్ నిరసనలు కొనసాగుతున్నాయి. పశ్చిమ టికెట్ మహేష్కి ఇవ్వాలని, పవన్ మనస్సు మార్చాలని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవుడికి జనసేన కార్యకర్తలు 108 కొబ్బరి కాయలు కొట్టి మరి వేడుకొంటున్నారు. 7 రోజులుగా జనసేన కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు, ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నారు మరోవైపు, పశ్చిమ నియోజకవర్గం సీటు కోసం బీజేపీలో కుమ్ములాట మొదలైంది. పొత్తుల్లో పశ్చిమ సీటు బీజేపీకి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఆశావాహులు ఒక్కొక్కరుగా తెరపైకి వస్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట బల ప్రదర్శనలు చేపట్టారు. వెస్ట్ టిక్కెట్ తనదే అంటున్న వక్కలగడ్డ భాస్కర్.. ఇటీవల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. తాజాగా తెరపైకి వచ్చిన ఎన్టీఆర్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్.. తన మద్దతు దారులతో ఆత్మీయ సమావేశం పెట్టుకున్నారు. ‘‘వెస్ట్ సీటు బీజేపీకి కేటాయించాలని నిర్ణయించారని, ఏడుగురు ఆశావాహుల పేర్లను అధిష్టానానికి పంపించాం. ముగ్గురు పేర్లను అధినాయకత్వం పరిశీలిస్తోంది. టిక్కెట్ తనకు వస్తుందని ఆశిస్తున్నానని శ్రీరామ్ అన్నారు. -
చంద్రబాబు పై జనసేన పోతిన మహేష్ సంచలన కామెంట్స్
-
చంపడానికొచ్చి.. హతమయ్యాడు
మల్యాల(చొప్పదండి): ప్రేమ పేరుతో మూడేళ్లుగా వేధిస్తున్న యువకుడు.. నేరుగా ఆ యువతి ఇంటికే వెళ్లి కుటుంబ సభ్యులపై కత్తితో దాడికి తెగబడ్డాడు. యువతి కుటుంబ సభ్యులు ఆత్మరక్షణ కోసం ఆ యువకుడిపై దాడి చేయగా.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాల మండలం తక్కళ్లపల్లిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బోగ మహేశ్ తన దూరపు బంధువైన తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నానంటూ మూడేళ్లుగా ఫోన్లో వేధిస్తున్నాడు. భరించలేని ఆ యువతి ఈనెల 2న మల్యాల పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కక్ష పెంచుకున్న మహేశ్ ఆ యువతిని చంపేందుకు కత్తితో సోమవారం మధ్యాహ్నం 2.20 గంటలకు తక్కళ్లపల్లిలోని యువతి ఇంటికి చేరుకున్నాడు. ఆ సమయానికి మొదట యువతి తల్లి కనపడగా. ఆమెపై కత్తితో దాడికి యత్నించాడు. తప్పించుకునే క్రమంలో కత్తి ఆమె కాలికి తగిలింది. అనంతరం అక్కడే మంచంలో పడుకున్న యువతి తాతపైనా దాడి చేసి కత్తితో పొడవగా ఆయనకూ గాయాలయ్యాయి. ఈ క్రమంలో యువతి తల్లి అక్కడే ఉన్న తన తమ్ముడు నర్సయ్యతో కలిసి మహేశ్ని ఆపే ప్రయత్నం చేస్తుండగానే మరోసారి దాడికి యత్నించాడు. ఈ క్రమంలో ముగ్గురి మధ్య జరిగిన ఘర్షణలో మహేశ్ కింద పడిపోయాడు. అక్కడే ఉన్న బండరాయితో మహేశ్పై యువతి తల్లి దాడి చేయగా.. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దాడిలో గాయపడిన నర్సయ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్కు తరలించారు. పంచాయితీ పెట్టించినా మారని తీరు యువతికి దూరపు బంధువు కావటంతో పరిచయం పెంచుకున్న మహేశ్.. ఆమె ఫోన్ నంబర్ తీసుకున్నాడు. ప్రేమించాలంటూ మూడేళ్లుగా వెంటపడి వేధిస్తున్నాడు. విషయాన్ని యువతి తన తల్లిదండ్రులకు చెప్పడంతో రెండేళ్ల క్రితమే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి కొంతకాలం యువతికి ఫోన్ చేయకుండా దూరంగా ఉన్న మ హేశ్.. ఇటీవల కొద్దిరోజులుగా ఫోన్లో వేధిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పంచాయితీ పెట్టించారు. పెద్దలతో నూ హెచ్చరించారు. అయినా అతడిలో మాత్రం మార్పు రాలేదు. యువతి జన్మదినాన్ని డెత్ డేగా మారుస్తానంటూ పోస్టులు యువతి జన్మదినం ఈనెల 6న ఉండగా.. డెత్డేగా మా రుస్తానంటూ మహేశ్ పోస్టులు పెడుతున్నాడు. దీంతో ఈనెల 2న పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశా మని సదరు యువతి తెలిపింది. కాగా, మహేశ్ కుటుంబసభ్యుల ఫిర్యాదుతో యువతితోపాటు తల్లి, అన్న, వది న, అమ్మమ్మ, తాతయ్యపై కేసు నమోదు చేసినట్లు మల్యా ల ఎస్సై అబ్దుల్ రహీం తెలిపారు. సంఘటన స్థలాన్ని డీ ఎస్పీ రఘుచందర్ స్థానిక పోలీసులతో కలిసి పరిశీలించా రు. యువతి ఇంటి వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశా రు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
నిర్మాత మహేశ్ కన్నుమూత
ప్రముఖ సినీ, టీవీ నిర్మాత, రచయిత వి.మహేశ్ (85) శనివారం రాత్రి చెన్నైలో గుండెపోటుతో కన్నుమూశారు. స్వగృహంలో బాత్ రూమ్ నుంచి బయటికి వస్తూ కాలుజారి పడిన మహేశ్ని సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నెల్లూరు జిల్లా కొరుటూరు వి.మహేశ్ స్వస్థలం. ‘మాతృమూర్తి’ సినిమాతో సినిమా నిర్మాణంలోకి ప్రవేశించారు మహేశ్. ఎన్టీ రామారావు హీరోగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో ‘మనుషులంతా ఒక్కటే’, లక్ష్మి దీపక్ దర్శకత్వంలో ‘మహాపురుషుడు’, చిరంజీవి హీరోగా కోడి రామకృష్ణ దర్వకత్వంలో ‘సింహపురి సింహం’, బోయిన సుబ్బారావు దర్శకత్వంలో సుమన్, భానుప్రియ జంటగా ‘ముసుగు దొంగ’ వంటి పలు సినిమాలు నిర్మించారాయన. ‘మనుషులంతా ఒక్కటే’ చిత్రానికి ఉత్తమ కథా రచయితగా నంది అవార్డును అందుకున్నారు వి.మహేశ్. శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్లో ప్రసారమైన ‘హరి భక్తుల కథలు’ సీరియల్కి ఆయన నిర్మాతగా, రచయితగా వ్యవహరించారు. అలాగే ‘విప్రనారాయణ’కు 2009లో ఉత్తమ టెలీ ఫిలింగా బంగారు నందితో పాటు, మరో మూడు విభాగాల్లో నంది పురస్కారాలు అందుకున్నారాయన. తన అన్నయ్య, ప్రముఖ కళా దర్శకుడు వి. వి. రాజేంద్ర కుమార్తో కలసి సినిమాలకు ప్రచార సామగ్రిని తయారు చేసేందుకు ‘స్టూడియో రూప్ కళ’ అనే సంస్థను, ‘ఆదిత్య చిత్ర ’ నిర్మాణ సంస్థను నెలకొల్పారు వి. మహేశ్. అయితే ఆయన వివాహం చేసుకోలేదు. వి.మహేశ్ మృతికి సినిమా, టెలివిజన్ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. -
బాత్రూమ్లో కాలుజారి టాలీవుడ్ ప్రముఖ నిర్మాత మృతి
తెలుగు చిత్రసీమలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత వి.మహేశ్ (85) గుండెపోటుతో చనిపోయారు. శనివారం రాత్రి చెన్నైలోని తన ఇంట్లోని బాత్రూమ్ నుంచి బయటకు వస్తూ కాలుజారి పడ్డారు. దీంతో దగ్గరలోని ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు మహేశ్ కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నారు. (ఇదీ చదవండి: డైరెక్ట్గా ఓటీటీలోకి ఆ యాక్షన్ సినిమా.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) 1975లో 'మాతృమూర్తి' సినిమాతో వి.మహేష్ నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ 'మనుష్యులంతా ఒక్కటే', 'మహాపురుషుడు', చిరంజీవి 'సింహపురి సింహం', సుమన్ 'ముసుగు దొంగ' చిత్రాల్ని నిర్మించారు. మనుష్యులంతా ఒక్కటే సినిమాకు ఉత్తమ కథా రచయితగా నంది అవార్డు అందుకున్నారు. శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానెల్లో ప్రసారమైన 'హరి భక్తుల కథలు' సీరియల్కి ప్రొడ్యూసర్, రైటర్గా పనిచేశారు. నెల్లూరు జిల్లాలోని కొరుటూరు నిర్మాత మహేశ్ సొంతూరు. పెళ్లి చేసుకోకుండానే చివరివరకు ఉండిపోయారు. ఈయన అంత్యక్రియలు చెన్నైలో సోమవారం మధ్యాహ్నం జరుగుతాయని ఆయన మేనల్లుడు టెలివిజన్ నిర్మాత, దర్శకుడు వల్లభనేని మహీధర్ చెప్పారు. (ఇదీ చదవండి: అనారోగ్య సమస్యలతో ప్రముఖ దర్శకుడు కన్నుమూత) -
'షాపింగ్ మాల్' హీరో ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?
ఇండస్ట్రీలోకి చాలామంది హీరోలు వస్తుంటారు. కానీ వీళ్లలో హిట్ కొట్టి నిలబడేది చాలా తక్కువమంది. ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉండే పర్లేదు కానీ ఒకవేళ సినీ నేపథ్యం ప్లస్ హిట్లు లేకపోతే మాత్రం ఎంత త్వరగా ఫేమ్ తెచ్చుకున్నారో అంతే ఫాస్ట్గా కనుమరుగైపోతారు. 'షాపింగ్ మాల్' సినిమా హీరోది కూడా సరిగ్గా అలాంటి పరిస్థితే. అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. మరి ఇప్పుడేం చేస్తున్నాడు? అసలెలా ఉన్నాడనేది చూద్దాం. తమిళనాడులోని దిండిగల్ పుట్టి పెరిగిన మహేశ్.. స్వతహాగా వాలీబాల్ ప్లేయర్. ఓ రోజు గేమ్ ఆడుతున్నప్పుడు ఇతడిని చూసిన డైరెక్టర్ వసంతబాలన్.. తన తీయబోయే సినిమాలో నటించమని కోరాడు. కానీ తనకు యాక్టింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదని మహేశ్ చెప్పాడు. కానీ ఆ తర్వాత కొన్నాళ్లకు మనసు మారడంతో అదే వసంతబాలన్ తీసిన 'అంగడి తెరు' మూవీలో హీరోగా నటించాడు. దీన్నే తెలుగులో 'షాపింగ్ మాల్' పేరుతో రిలీజ్ చేయగా సూపర్ హిట్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన అవార్డు విన్నింగ్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?) 'షాపింగ్ మాల్' సినిమాతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మహేశ్.. ఆ తర్వాత మాత్రం కెరీర్ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయాడు. ఎందుకంటే తమిళంలో వరసగా మూవీస్ చేస్తూ వచ్చాడు. అలానే మలయాళ, ఫ్రెండ్, తెలుగులోనూ తలో చిత్రం చేశాడు. కానీ ఏం లాభం... ఒక్కటంటే ఒక్క మూవీ కూడా 'షాపింగ్ మాల్' మాదిరి హిట్ అవ్వలేదు. మనోడికి పేరు రాలేదు. ఇక తన ఫ్రెండ్స్ అందరూ జీవితంలో సెటిలైపోయారు కానీ హీరోగా పలు సినిమాలు చేసిన మహేశ్ మాత్రం హిట్లు లేకపోవడంతో పూర్తిగా డీలా పడిపోయాడు. సినిమాల వల్లనో ఏమో గానీ ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోయాడు. ప్రస్తుతం ఇతడికి సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తొలుత ఇతడిని గుర్తుపట్టలేకపోయారు. కానీ ఆ తర్వాత 'షాపింగ్ మాల్' హీరో అని తెలిసి తెలుగు నెటిజన్స్ అవాక్కయ్యారు. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) -
విచారణకు వెళ్లిబాలికతో అసభ్య ప్రవర్తన
ఖలీల్వాడి (నిజామాబాద్ అర్బన్): నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహేశ్పై పోక్సో కేసు నమోదైంది. కానిస్టేబుల్ మహేశ్ ఓ కేసు విషయమై నిందితుడికి సమన్లు అందించడానికి ఆదివారం నిజామాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలోని గుండారం గ్రామానికి వెళ్లాడు. ఇంట్లో నిందితుడు లేకపోవడంతో పక్కింట్లో ఉన్న బాలికతో మాట్లాడి నిందితుడి వివరాలను తెలుసుకున్నాడు. ఈ క్రమంలో బాలికతో మహేశ్ అసభ్యంగా ప్రవర్తించాడు. తల్లిదండ్రులు రాత్రి ఇంటికి వచ్చాక బాలిక వారికి విషయం చెప్పింది. దీంతో వారు సోమవారం ఉదయం రూరల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్ వ్యవహారాన్ని ఎస్సై మహేశ్ నిజామాబాద్ సౌత్ సీఐ వెంకటనారాయణకు వివరించారు. ఆయన సీపీ కల్మేశ్వర్ దృష్టికి తీసుకెళ్లారు. సీపీ ఆదేశాల మేరకు పోలీసులు శుక్రవారం మహేశ్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మహేశ్ గతంలో ఓ కేసు విషయంలో సస్పెండ్ అయ్యారు. సస్పెన్షన్ ఎత్తేశాక మళ్లీ అదే స్టేషన్లో విధుల్లో కొనసాగుతున్నారు. పోక్సో కింద కేసు నమోదు కావడంతో సదరు కానిస్టేబుల్ పరారీలో ఉన్నాడు. -
చిన్న పిల్లలకు మాటలు సరిగ్గా రాకపోతే... పేరెంట్స్ ఇలా చెయ్యండి
-
క్రైమ్ కామెడీ
ఇనయా సుల్తానా, సుదర్శన్ రెడ్డి, ‘రంగస్థలం’ మహేశ్, ‘తాగుబోతు’ రమేశ్, అర్చన ప్రధాన పాత్రల్లో నటించిన క్రైమ్ కామెడీ ఫిల్మ్ ‘నటరత్నాలు’. శివ నాగు దర్శకత్వంలో చంటి యలమాటి, డా. దివ్య నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరిలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా యూనిట్ నిర్వహించిన విలేకర్ల సమావేశంలో శివనాగు మాట్లాడుతూ– ‘‘సినిమా ఇండస్ట్రీకి వచ్చి, సినిమా తీయాలనుకునేవాళ్లు ఎలా సఫలమవుతున్నారు? ఎలా విఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు? అనే అంశాలతో ఈ సినిమా తీశాం’’ అన్నారు. ‘‘2002లో ఓ సినిమా తీయాలని ఇండస్ట్రీకి వచ్చి, లాస్ అయ్యాను. ‘నటరత్నాలు’ కథ సినిమాలో సినిమాలాంటిది. ప్లాన్ చేసిన బడ్జెట్లోనే సినిమాను పూర్తి చేశాం’’ అన్నారు చంటి యలమాటి. -
'నటరత్నలు’.. ‘జాతి రత్నాలు’ అంత హిట్ అవ్వాలి
ఇనయ సుల్తానా, సుదర్శన్ రెడ్డి, రంగస్థలం మహేష్ మరియు తాగుబోతు రమేశ్ పాత్రల్లో నటించిన చిత్రం నటరత్నాలు. ఎన్నో హిట్లు ఇచ్చిన డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో యాక్టర్లుగా యాక్ట్ చేయడం జరిగింది. చందనా ప్రొడక్షన్ సమర్పణలో ఎవరెస్ట్ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మించిన “నటరత్నాలు” క్రైం కామెడీ థ్రిల్లింగ్ నేపథ్యంలో దర్శకుడు శివనాగు తెరకెక్కించిన చిత్రం. ఈ సినిమా కి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో లో ముఖ్య అతిథులుగా తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ప్రెసిడెంట్ దామోదర్ ప్రసాద్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ టి. ప్రసన్నకుమార్ గారు, దర్శకుడు కె ఎస్ రవికుమార్ చౌదరి, దర్శకుడు సముద్ర, డీ. ఎస్. రావు మరియు రామ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నిర్మాత దామోదర్ ప్రసాద్ గారు మాట్లాడుతూ.. ప్రతి ఇండస్ట్రీలో కష్టసుఖాలు ఉంటాయి, ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి మన కష్టాలు ఎక్కువ కనబడతాయి అవన్నీ అధిగమించి నిలబడ్డమే కళ, ఇక్కడ ఉన్న వాళ్ళే దానికి నిదర్శనం. 'నటరత్నలు' జాతి రత్నాలు లా ఉంది పేరు అంతే సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ట్రైలర్ చాలా బాగుంది. ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి ఈ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అన్నారు. తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్నకుమార్ గారు మాట్లాడుతూ.. సినిమా అనేది ఒక మెడిసిన్ లాంటిది అది ఎంత తీసుకుంటే అంత మంచిది. నటరత్నాలు టైటిల్ చాలా బాగుంది. నటరత్న అంటే నందమూరి తారక రామారావు గారు ఆయన ఆశీస్సులతో నటరత్నాలు అనే టైటిల్ చాలా బాగా పెట్టారు.డైరెక్టర్ శివ నాగు ది కష్టపడే వ్యక్తిత్వం, 24 గ్రాఫ్స్ ని హ్యాండిల్ చేయగలిగిన వ్యక్తి. ఈ సినిమా ప్రొడ్యూసర్స్ కి డైరెక్టర్ శివ నాగు కి మంచి సినిమా అవ్వాలి మంచి సక్సెస్ తీసుకురావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. దర్శకుడు శివనాగు మాట్లాడుతూ .. సినిమా అంటే నాకు ప్రాణం సినిమానే నా జీవితం. సినిమా కోసం పుట్టాను సినిమాతోనే ప్రాణం వదులుతాను. సినిమా ఇండస్ట్రీకి వచ్చి సినిమా తీయాలి అనే వాళ్ళు ఎలా విఫలమవుతున్నారు? ఎలా సఫలమవుతున్నారు? ఏం చేస్తున్నారు అనే కథగా ఈ సినిమాని మీ ముందుకు తీసుకొస్తున్నాను’ అన్నారు. నిర్మాత చంటి యలమాటి మాట్లాడుతూ.. ‘ఈ కథ సినిమాలో సినిమా లాంటిది. ఇండస్ట్రీకి వచ్చి ఏదో సాధించాలని హీరో డైరెక్టర్ ప్రొడ్యూసర్ అవ్వాలని కలగని యువత చాలామంది ఉన్నారు. డైరెక్టర్ శివ నాగు గారు డైనమిక్, డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్. ఇచ్చిన కమిట్మెంట్ ప్రకారం ఎంత బడ్జెట్ చెప్పారు అంతే బడ్జెట్లో సినిమా తీయగల దర్శకుడు శివ నాగు గారు. అతి త్వరలో సినిమా మీ ముందుకు తీసుకురాబోతున్నాం. ఈ సినిమా ని చూసి మంచి సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను అన్నారు. -
సుపారీ ఇచ్చి.. భర్తను హత్య చేయించి
జోగిపేట (అందోల్): వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని సుపారీ ఇచ్చి భర్తను భార్య హత్య చేయించి మృతదేహాన్ని తగలబెట్టించిన ఘటన సంగారెడ్డి జిల్లా జోగిపేటలో శనివారం వెలుగుచూసింది. సంగారెడ్డి డీఎస్పీ రమేశ్కుమార్ కథనం ప్రకారం.. జోగిపేటకు చెందిన పాపన్నపేట మల్లేశం(30)కు అందోల్ మండలం మన్ సాన్పల్లికి చెందిన కల్పనతో 2015లో వివా హం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. జోగిపేట పట్టణం అందోల్లోని డబుల్ బెడ్రూం కాలనీల వద్ద వీరు నివాసం ఉంటున్నారు. కల్పనకు మన్సాన్పల్లికి చెందిన మస్కూరి మహేశ్తో పెళ్లికి మందు నుంచీ సంబంధం ఉంది. వివాహం తర్వాత కూడా ఈ బంధాన్ని కొనసాగిస్తోంది. ఈ విషయమై మల్లేశం కుటుంబంలో తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈక్రమంలో భర్తను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని భావించి విషయం ప్రియుడు మస్కూరి మహేశ్కి వివరించింది. దీంతో మహేశ్.. రంగంపేటకు చెందిన తన మేనబావ ఉసికే అంబాజీకి చెప్పగా, అదే గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తలారి మహేశ్తో పరిచయం చేయించి, రూ.50 వేలకు హత్య చేసేలా సుపారీ మాట్లాడుకున్నారు. అడ్వాన్సుగా రూ.5 వేలు ఇవ్వగా, పలుమార్లు మరో రూ.30 వేలను అందజేశారు. ఈ విషయంలో తన స్నేహితుడు, గంగారం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ వజ్జరి మహేశ్ సహకారం తీసుకున్నారు. హత్య జరిగిందిలా.. వజ్జరి మహేశ్, మస్కూరి మహేశ్, తలారి మహేశ్.. ఈ ముగ్గురూ ఓ కారు అద్దెకు తీసుకుని శుక్రవారం తెల్లవారుజామున కల్పన ఇంటి వద్దకు వెళ్లి కాపుకాశారు. 5:30 గంటల ప్రాంతంలో మల్లేశం బయటకు రాగానే అతని తలపై బండరాయితో మస్కూరి మహేశ్ బలంగా కొట్టడంతో స్పృహకోల్పోయాడు. వెంటనే అతడిని కారులో వేసుకుని సంగుపేట వైపు వెళ్లారు. మల్లేశం చేతులను కట్టేసి, గొంతు నొక్కడంతో అతను కారులోనే మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం కోనాపూర్ చెరువు వద్ద మృతదేహంపై పెట్రోల్ పోసి నిప్పంటించి నిందితులు పారిపోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. మల్లేశం భార్య కల్పనను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించగా.. అసలు విషయాలు వెలుగుచూశాయి. నిందితులు మస్కూరి మహేశ్, కల్పన, తలారి మహేశ్, వజ్జరి మహేశ్, ఉసికే అంబాజీలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ తెలిపారు. కాగా కేసును కేవలం 22గంటల వ్యవధిలో ఛేదించిన జోగిపేట పోలీసులను ఎస్పీ రూపేశ్ అభినందించారు. -
ఎమ్మెల్సీలుగా బల్మూరి వెంకట్, మహేశ్ గౌడ్ నామినేషన్లు
సాక్షి, హైదరాబాద్: శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా బల్మూరి వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 11న వెలువడింది. నామినేషన్ల స్వీకరణకు గురువారం చివరి రోజు కాగా కాంగ్రెస్ అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను అసెంబ్లీ రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. నామినేషన్ దాఖలు కార్యక్రమానికి డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాజర య్యారు. వీరితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడు గిడుగు రుద్రరాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్యతో పాటు పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఎన్నిక ఏకగ్రీవమే రెండు స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు మాత్రమే నామినేషన్ వేయడంతో ఎన్నిక ఏకగ్రీవం కానుంది. అయితే ఈ నెల 19న నామినేషన్ల పరిశీలన, 22న ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన తర్వాత ఫలితాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు. 119 ఎమ్మెల్యేలు కలిగిన తెలంగాణ అసెంబ్లీలో సీపీఐతో కలుపుకుని కాంగ్రెస్కు 65 మంది సభ్యుల సంఖ్యాబలం ఉంది. మరోవైపు 39 మంది ఎమ్మెల్యేలు కలిగిన బీఆర్ఎస్ పార్టీ ఈ ఎన్నిక పక్రియకు దూరంగా ఉంది. దీంతో కాంగ్రెస్ తరపున ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎమ్మెల్సీలుగా బల్మూరు వెంకట్, మహేశ్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశముంది. నామినేషన్ల అనంతరం మంత్రి ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. పార్టీలో కష్టపడిన వారికి గుర్తింపు లభిస్తుందనేందుకు ఈ ఇద్దరు నాయకులను శాసన మండలికి పంపడమే ఉదాహరణ అని ఆయన పేర్కొన్నారు. -
సార్వత్రిక ఎన్నికలపైనే ప్రధాన పార్టీల ఫోకస్
-
మెగాస్టార్ సినిమాతో ఎంట్రీ.. సలార్ వంటి భారీ చిత్రాల్లో ఛాన్స్
పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తున్న ప్రస్తుత తరుణంలో తెలుగు చిత్రాలకు, నటులకు పరభాషా అభిమానుల ఆదరణ పెరిగిందని సినీనటుడు వడ్డి నాగ మహేష్ అన్నారు. ఖైదీ నంబర్ 150 సినిమాతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టిన ఆయన వరుసగా రంగస్థలం, గద్దలకొండ గణేష్, ఉప్పెన, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. రచయితగా ప్రయాణం మొదలు పెట్టి నటుడిగా స్థిరపడిన నాగ మహేష్ హనుమాన్జంక్షన్లో ఓ ప్రైవేట్ కార్యక్రమానికి హాజరు అయ్యేందుకు వచ్చిన సందర్భంగా ‘సాక్షి’తో కొద్దిసేపు ముచ్చటించారు. రచయిత నుంచి నటుడిగా.. చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న ఆసక్తితో 1990లో చైన్నె వెళ్లి ప్రయత్నాలు ప్రారంభించినప్పటికీ ఫలితం దక్కలేదని నాగ మహేష్ చెప్పారు. దీంతో ప్రత్యామ్నాయంగా 1996లో ‘కొత్తపుంతలు’ కథతో రచయితగా ప్రయాణం మొదలు పెట్టానని, ‘శ్రీవల్లి’ చిత్రానికి ప్రముఖ సినీ రచయిత విజయేంద్రప్రసాద్ వద్ద సహాయకుడిగా పని చేశానని తెలిపారు. ఎస్కే మిశ్రో శిష్యరికంలో రంగస్థల నటుడిగా పలు సాంఘిక నాటకాలలో నటించటంతో పాటు సినిమా రంగంపై ఆసక్తితో మళ్లీ ప్రయత్నాలు ప్రారంభించిన్నట్లు తెలిపారు. దీంతో 2016లో మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఖైదీ నంబర్ 150 సినిమాలో నటించే చాన్స్ దక్కిందని వివరించారు. ఆ సినిమాలో ఇన్స్పెక్టర్ పాత్ర, రంగస్థలంలో హీరోయిన్కి తాగుబోతు తండ్రిగా, ఉప్పెనలో విలన్ విజయ్ సేతుపతితో పాటు నటించిన గోవింద్ పాత్రలు ప్రేక్షకులకు దగ్గర చేశాయన్నారు. ఆ తర్వాత గద్దలకొండ గణేష్, అఖండ, సార్, స్కంథ చిత్రాలతో ప్రేక్షకులలో మంచి గుర్తింపు లభించిందని తెలిపారు. ఇప్పటికీ సుమారు 50కిపై తెలుగు చిత్రాలలో నటించగా, త్వరలో విడుదల కానున్న సలార్, ఉస్తాద్ భగత్ సింగ్, గేమ్ ఛేంజర్, యురేకా కసామిసా, శ్రీకాకుళం షేర్లాక్ హోమ్స్, రజకార్ చిత్రాలలోనూ మంచి పాత్రలలో నటించానని పేర్కొన్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోందని, దీని వల్ల తెలుగు నటులకు ఇతర భాషల్లోనూ అవకాశాలు దక్కుతున్నాయని చెప్పారు. పాన్ ఇండియా మార్కెటింగ్ కోసం దర్శక, నిర్మాతలు వేర్వేరు భాషలకు చెందిన నటీనటులను ఎంపిక చేసుకుంటున్నారని తెలిపారు. -
నాలుగు కథలతో...
యడ్లపల్లి మహేశ్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని, సుదర్శన్ ముఖ్య తారలుగా నటించిన చిత్రం ‘కరెన్సీ నగర్’. వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకత్వంలో ముక్కాముల అప్పారావు, డా. కోడూరు గోపాలకృష్ణ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 29న విడుదల కానుంది. ‘‘ఈ చిత్రంలో డబ్బుకీ, మనిషికీ ఉన్న సంబంధాన్ని వెన్నెల కుమార్ చక్కగా చూపించారు. నాలుగు కథలతో ఈ చిత్రం సాగుతుంది’’ అని యూనిట్ పేర్కొంది. -
Mahesh Babu: మాస్ లుక్ అయిన క్లాస్ లుక్ అయిన మహేష్ బాబే..
-
ఆప్యాయనురాగాలతో..
పులివెందుల మహేశ్, ప్రియా పాల్ జంటగా శివరామ్ తేజ దర్శకత్వం వహించిన చిత్రం ‘మా ఊరి సిన్మా’. జి. మంజునాథ్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా నవంబరులో విడుదల కానుంది. ఈ చిత్రం ప్రెస్మీట్లో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ప్రోడ్యూసర్ కాసుల రామకష్ణ (శ్రీధర్), నటులు నాగమహేశ్, ‘బలగం’ సంజయ్ అతిథులుగా పాల్గొన్నారు. ‘‘ఇంత మంచి సినిమాను నిర్మించడానికి సహకరించినవారికి థ్యాంక్స్’’ అన్నారు జి. మంజునాథ రెడ్డి. ‘‘యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది’’ అన్నారు శివరామ్ తేజ. ‘‘తండ్రీకొడుకుల అనురాగం, బావా–మరదళ్ల ఆప్యాయతతో ఈ సినిమా ఉంటుంది’’ అన్నారు పులివెందుల మహేశ్. -
‘మా ఊరి సిన్మా’వచ్చేస్తుంది
పులివెందుల మహేష్, ప్రియ పాల్ జంటగా శివరాం తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మా ఊరి సిన్మా’. శ్రీ మంజునాథ సినిమాస్ పతాంపై మంజునాధ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం నవంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సదర్భంగా చిత్ర నిర్మాత జి. మంజునాథ రెడ్డి మాట్లాడుతూ..‘మా ఊరి సిన్మా’ కొంతమంది చూపించాం. వారంతా బాగుందని అభినందిస్తూ ఉంటే ఆనందంగా ఉంది. మేము చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులు కూడా మెచ్చు కుంటారని ఆశిస్తున్నాను’ అన్నారు . చిత్ర దర్శకులు శివరాం తేజ మాట్లాడుతూ ‘మా సినిమా కోసం మా టీమ్ చాలా కష్ట పడ్డారు. వాళ్ళు పడ్డ కష్టం ఈ రోజు స్క్రీన్ మీద కనిపిస్తుంది. అలాగే నన్ను నమ్మి ఈ సినిమా నిర్మించిన మంజునాథ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను’ అన్నారు. హీరో పులివెందుల మహేష్ మాట్లాడుతూ ‘ మా సినిమాలో తండ్రి కొడుకుల అనురాగం ఉంది. బావ మరదళ్ల ఆప్యాయత ఉంది. అన్ని ఎమోషన్స్ మా చిత్రం లో ఉన్నాయి. ఈ చిత్రం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ఆశిస్తున్నాను ’అని అన్నారు. ఈ కార్యక్రమంలో పీపుల్ మీడియా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కాసుల రామ కృష్ణ (శ్రీధర్), ప్రముఖ నటులు నాగ మహేష్, బలగం సంజయ్ తదితరులు పాల్గొన్నారు. -
'చనిపోకముందే.. చనిపోయిందని చప్పడంతో'.. ప్రేమికులిద్దరూ తీవ్ర నిర్ణయం..!
మహబూబ్నగర్: మండలంలోని మిరాసిపల్లికి చెందిన స్వాతి(15) ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. ఎస్ఐ మంజునాథ్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మకూర్ మండలం మోట్లంపల్లికి చెందిన మహేష్(19), స్వాతి ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో స్వాతి కుటుంబ సభ్యులు మహేష్కు ఫోన్ చేసి స్వాతి చనిపోకముందే చనిపోయిందని, మా అమ్మాయి చావుకు నీవే కారణం నిన్ను, నీ కుటుంబ సభ్యులను చంపుతామని చెదిరించారు. దీంతో మహేష్ తన తండ్రికి విషయాన్ని చెప్పడంతో మాట్లాడుదాము నీవేమి బెంగపెట్టుకోవద్దని సర్దిచెప్పాడు. తీవ్ర మనస్తాపానికి గురైన మహేష్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరేసుకున్నాడు. మహేష్ ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని తెలుసుకున్న స్వాతి ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుంది. స్వాతి తండ్రి కుర్మయ్య పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. కాగా స్వాతి స్థానిక జెడ్పీహెచ్లో 10వ తరగతి చదువుతున్నట్లు గ్రామస్తులు తెలిపారు.