-
నిశి తొలిచాడు దీపమై...
‘అధర్మాన్ని అణచెయ్యగ యుగయుగాన జగములోన పరిపరి విధాల్లోన విభవించే విక్రమ విరాట్ రూపమితడే... స్వధర్మాన్ని పరిరక్షించగ సమస్తాన్ని ప్రక్షాళించగ సముద్భవించే అవతారమిదే...’ అంటూ మొదలవుతుంది ‘కల్కి’ థీమ్ సాంగ్. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కల్కి 2898ఏడీ’. ఈ చిత్రంలో దీపికా పదుకోన్, కమల్హాసన్, అమితాబ్ బచ్చన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రం రేపు (గురువారం) విడుదల కానుంది.ఈ సందర్భంగా ‘థీమ్ ఆఫ్ కల్కి’ పాటను మంగళవారం విడుదల చేశారు. ‘అధర్మాన్ని అణచేయగా..’ అంటూ మొదలై... ‘నిశి తొలిచాడు దీపమై... నిధనం తన ధ్యేయమై... వాయువే వేగమై...కలియుగ స్థితి లయలే కలబోసే కల్కి ఇతడే...’ అనే లిరిక్స్తో ‘థీమ్ ఆఫ్ కల్కి’ సాగుతుంది. కాలభైరవ, సంతోష్ నారాయణన్ స్వరపరచిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా కాలభైరవ పాడారు. -
చిన్న కథ కాదు!
నివేదా థామస్, ప్రియదర్శి, విశ్వదేవ్, గౌతమి, భాగ్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘35– చిన్న కథ కాదు’. ఈ చిత్రానికి నంద కిశోర్ ఈమాని దర్శకత్వం వహించారు. సురేష్ ప్రోడక్షన్స్ ఎస్. ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రోడక్షన్స్ పై రానా దగ్గుబాటి, సృజన్ యరబోలు, సిద్ధార్థ్ రాళ్లపల్లి నిర్మించిన ఈ చిత్రానికి ‘35– చిన్న కథ కాదు’ అనే టైటిల్ని ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ విడుదల చేశారు.ఆగస్ట్ 15న సినిమాని తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించారు. ‘‘క్లీన్ ఎంటర్టైనర్గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామా ‘35–చిన్న కథ కాదు’. స్కూల్ ఎపిసోడ్స్ స్పెషల్ ఎట్రాక్షన్గా చక్కని వినోదంతో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఈ సినిమా సిద్ధమైంది. తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: వివేక్ సాగర్, కెమెరా నికేత్ బొమ్మి. -
జాన్వీ గ్లామర్ ఫ్యూజులు ఔట్.. సన్నీ లియోన్ సొగసులు!
జాన్వీ కపూర్ జిగేలు.. హాట్నెస్ మామూలుగా లేదుగాటైట్ డ్రస్సులో తమన్నా వయ్యారాలు.. చూస్తే మెంటలేహాట్ బ్యూటీ సన్నీ లియోన్ సొగసులు చూడతరమాసంప్రదాయ చీరకట్టులో రష్మిక.. ఇలా ఎప్పుడూ చూసుండరు'పొలిమేర' బ్యూటీ అందాల జాతర.. ఇలా ఉందేంట్రా బాబుపూనమ్ పరువాల విందు.. చీరలో బొద్దుగుమ్మలాపూల్లో గ్లామర్ చూపించి మరీ రెచ్చిపోయిన బిగ్ బాస్ అరియానా View this post on Instagram A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks) View this post on Instagram A post shared by Pranavi Manukonda (@pranavi_manukonda) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Rakul Singh (@rakulpreet) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Madonna B Sebastian (@madonnasebastianofficial) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by kayadulohar (@kayadu_lohar_official) View this post on Instagram A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by kamakshi|Actor|Traveler|Fitness|🌈 (@saikamakshibhaskarla) View this post on Instagram A post shared by Bandaru Supritha (@_supritha_9) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) -
శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు..స్పెషల్ అట్రాక్షన్గా శ్రీలీల (ఫొటోలు)
-
Rashmi Gautam: క్లోజప్ స్టిల్స్.. రష్మి ఇలా ఉందేంటి? (ఫొటోలు)
-
'ఎమర్జెన్సీ'ని ప్రకటించిన కంగనా రనౌత్
బాలీవుడ్ టాప్ హీరోయిన్ కంగనా రనౌత్ నటించిన చిత్రం 'ఎమర్జెన్సీ'. కంగనా రనౌత్ రచన, దర్శకత్వం, నిర్మించిన ఈ చిత్రం విడుదల కానున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది. అయితే, దేశంలో ఎమర్జెన్సీ విధించి నేటితో 49 ఏళ్లు పూర్తి కానున్నాయి. 50వ ఏడాదిలోకి అడుగుపెడుతుంది. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ భారత్లో ఎమర్జెన్సీ విధించారు. 'ఎమర్జెన్సీ చీకటిరోజులు' అంటూ తాజాగా తను నిర్మిస్తున్న ఎమర్జెన్సీ సినిమా విడుదల తేదీని కంగనా రనౌత్ ప్రకటించారు.మాజీ ప్రధాని ఇందిరా గాంధీ బయోపిక్గా తెరకెక్కిన 'ఎమర్జెన్సీ' చిత్రం 2024 సెప్టెంబర్ 6న విడుదల కానుందని కంగనా రనౌత్ తెలిపారు. అందుకు సంబంధించిన కొత్త పోస్టర్ను ఆమె పంచుకున్నారు. వాస్తవంగా జూన్ 14న విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే కంగనా రాజకీయ రంగ ప్రవేశం చేయడంతో ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం ఏర్పడింది. బీజేపీ నుంచి బరిలోకి దిగిన ఆమె హిమాచల్లోని 'మండి' నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే.మణికర్ణిక ప్రొడక్షన్పై ఎమర్జెన్సీ చిత్రాన్ని కంగనా రనౌత్ నిర్మించారు. ఓ సందర్భంలో కంగనా ఈ సినిమా గురించి మాట్లాడుతూ.. తనకు సంబంధించిన ఆస్తులన్నింటినీ దీని కోసం తనఖా పెట్టినట్లు ఆమె చెప్పారు. భారీ బడ్జెట్లో ఈ చిత్రాన్ని కంగనా నిర్మించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జీవితం ఆధారంగా ఈ సినిమాని ఆమె తెరకెక్కించారు. కంగనా ఇందిరాగాంధీ పాత్రలో నటించగా.. జయప్రకాష్ నారాయణ్ పాత్రలో అనుపమ్ ఖేర్, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయీ పాత్రలో శ్రేయస్ తల్పడే కనిపించనున్నారు. View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) -
కర్మ ఎవరినీ వదిలిపెట్టదంటూ వారిపై 'రేణూ దేశాయ్' ఫైర్
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచి ప్రముఖ హీరో పవన్ కల్యాణ్ అభిమానులతో రేణూ దేశాయ్ పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇదే విషయాన్ని కొన్ని వందల సార్లు వారి చేష్టల గురించి ఆమె బహిరంగంగానే చెప్పారు. అయినా వారిలో ఎలాంటి మార్పులు రాలేదు. కొద్దిరోజుల క్రితం వచ్చిన ఎన్నికల ఫలితాల్లో పవన్ గెలుపొందటంతో ఆయన అభిమానులు రేణూ ఇన్స్టా కామెంట్ బాక్స్లో అనేక మెసేజ్లు చేశారు. తనని దురదృష్టవంతురాలని వారు కామెంట్ చేయడంతో ఆమె చాలా బాధ పడ్డారు. అలాంటి మెసేజ్లు తనకు చాలా బాధ కలిగిస్తున్నాయని, అలా పిలవొద్దని చెప్పి చెప్పి అలసిపోతున్నానంటూ రేణు దేశాయ్ అన్నారు. పవన్ కల్యాణ్ నుంచి విడాకులు తీసుకున్న దగ్గరి నుంచి ఆయన అభిమానులతో ఆమె పెద్ద యుద్ధమే చేస్తున్నారు. గతంలో ఓ దశలో ఈ వ్యవహారం తారస్థాయికి చేరడంతో ఆమె కామెంట్ సెక్షన్ కూడా హైడ్ చేశారు. వారి తాకిడికి తట్టుకోలేకనే ఇలాంటి పనిచేసినట్లు కూడా ఆమె తెలిపారు. ఇంత జరుగుతున్నా కూడా పవన్ కల్యాణ్ తన అభిమానులకు అడ్డుకట్ట వేసేందుకు ఒక సూచన అయినా ఇవ్వకపోవడం బాధాకరం. తాజాగా మరోసారి తన ఇన్స్టాగ్రామ్ కామెంట్ల సెక్షన్ను క్లోజ్ చేస్తున్నట్లు రేణూ దేశాయ్ తెలిపారు. ఈ క్రమంలో ఆమె ఇలా చెప్పుకొచ్చారు.కర్మ ఎవరినీ వదలదు.. కామెంట్ సెక్షన్కు గుడ్బై'ఇప్పటి నుంచి నా ఇన్స్టాగ్రామ్ కామెంట్ సెక్షన్ను ఆఫ్ చేస్తున్నాను. ఎందుకంటే నా ఇన్స్టాగ్రామ్ పోస్ట్లలో చెత్త కామెంట్లు పెట్టే మూర్ఖులు, వెధవలకు తిరిగి సమాధానం ఇచ్చే అంత ఓపిక నాకు లేదు. అంతేకాకుండా వాటిని ఎదుర్కొనే అంత భావోద్వేగం నాలో లేదు. అయితే, నేను బాధలో ఉన్నప్పుడు కొన్నేళ్లుగా నాకు తోడుగా ఉన్న వారందరికీ నా ధన్యవాదాలు. నన్ను ద్వేషించేవారు గుర్తుపెట్టుకోండి నేను మీకు ఒకటే చెబుతున్నా.. కర్మ అనేది ఒకటి ఉంది అనే విషయాన్ని మరిచిపోకండి. అది ఎప్పటికీ కామ్గా ఉండదు. ఖచ్చితంగా మీ కోసం తిరిగి వస్తుంది.' అని రేణూ దేశాయ్ ఎమోషనల్ పోస్ట్ చేశారు.రేణూ దేశాయ్ ఒక కొటేషన్ను కూడా పంచుకున్నారు. 'మీరు చూస్తున్నది అంతా సమస్య కాదని ఏదో ఒకరోజు తెలుసుకుంటారు. అవును, మీరు తప్పు చేస్తున్నారు. ఎందుకంటే మీరు కూడా మనుషులే కదా..! ఆ తప్పుల నుంచి ఎదుగుతాం కదా.. ప్రేమతో మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల మీ మనసుల్ని గాయపరిచే అవకాశం ఈ ప్రపంచానికి ఇవ్వకండి.' అంటూ రేణు తెలిపారు.ఆయన వేరే పెళ్లి చేసుకుంటే నన్ను ఎందుకు ప్రశ్నిస్తున్నారు..?పవన్ కల్యాణ్ కూటమి ద్వారా ఎన్నికల్లో గెలిచారు. ఆపై ఆయనకు డిప్యూటీ సీఎం పదవిని చంద్రబాబు కట్టబెట్టడం కూడా జరిగిపోయింది. దీంతో ఫుల్ జోష్లో ఉన్న పవన్ అభిమానులు రేణూ దేశాయ్ మీద మెసేజ్లతో ఇలా విరుచుకపడ్డారు. 'మీరు దురదృష్టవంతురాలు మేడమ్' అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశారు. దీనికి రేణూ దేశాయ్ స్పందిస్తూ 'నేను ఎలా దురదృష్టవంతురాలినో చెప్పండి అంటూనే.. నేను ఆయన్ను (పవన్) వదిలేయలేదు.. ఆయనే నన్ను వదిలేశారంటూ' కౌంటర్ ఇచ్చారు. కొన్నేళ్లుగా దురదృష్టవంతురాలు అనే మాట తనను ఎంతగానో బాధపెడుతుందని ఆమె ఇలా చెప్పుకొచ్చారు. 'నా భర్త నన్ను వదిలేసి, వేరే పెళ్లి చేసుకుంటే.. నా తప్పు ఎందుకు అవుతుంది..? కొన్నేళ్లుగా ఇలాంటి కామెంట్లతో యుద్ధమే చేస్తున్నాను. అలాంటి మాటలు విని నాకు విసిగొస్తుంది. నా అదృష్టాన్ని కేవలం ఒక వ్యక్తితో మీరందరూ ఎందుకు ముడిపెడుతున్నారు..? విడాకులు తీసుకున్న వారు ఎవరూ (స్త్రీ, పురుషులు) దురదృష్టవంతులు కాదని తెలుసుకుంటే చాలు.' అని రేణూ దేశాయ్ అన్నారు. ఆస్క్రీన్ షాట్లను కూడా ఆమె పంచుకున్నారు. View this post on Instagram A post shared by renu desai (@renuudesai) -
టైగర్తో జైలర్.. సెట్ చేస్తున్న టాప్ డైరెక్టర్
ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు క్రియేట్ చేసేందుకు కోలీవుడ్ టాప్ డైరెక్టర్ అట్లీ భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది షారుఖ్ ఖాన్తో జవాన్ తీసి హిట్ కొట్టిన ఆయనకు బాలీవుడ్లో కూడా క్రేజ్ పెరిగింది. అయితే, ఆ సినిమా తర్వాత ఇప్పటి వరకు ఎలాంటి ప్రాజెక్ట్ ప్రకటించలేదు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్తో ఒక సినిమా తీయబోతున్నట్లు వార్తలు వచ్చాయి కానీ, ప్రకటన మాత్రం రాలేదు. ఇప్పుడు సల్మాన్ ఖాన్తో అట్లీ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.జవాన్ సినిమా తర్వాత మళ్లీ బాలీవుడ్లోనే ఒక భారీ ప్రాజెక్ట్ చేయనున్నాడు అట్లీ. ఈమేరకు వార్తలు కూడా బలంగానే వినిపిస్తున్నాయి. సల్మాన్ ఖాన్తో ఓ మల్టీస్టారర్ చేసేందుకు కథను కూడా ఆయన ఫిక్స్ చేశారట. అయితే, ఈ సినిమాలో సౌత్ ఇండియా టాప్ హీరోను తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కథలో కీలకంగా ఉండే ఆ పాత్ర కోసం రజనీకాంత్ను ఎంపిక చేస్తే బాగుంటుందని అట్లీ కోరుతున్నాడట. ప్రస్తుతం ఈ విషయం గురించి రజనీతో కూడా ఆయన చర్చలు జరిపినట్లు తెలిసింది. సన్పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రంలో ఇద్దరు సూపర్స్టార్స్ను దృష్టిలో పెట్టుకొని అట్లీ కథను రెడీ చేశారట. ఇప్పటికే ఈ చిత్ర స్క్రిప్ట్ పనులు కూడా ముగింపు దశకు చేరుకున్నాయట. వచ్చే ఏడాదిలో సినిమాని పట్టాలెక్కించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సల్మాన్ఖాన్ ‘సికందర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. రజనీకాంత్ నటించిన 'వేట్టయాన్' విడుదలకు సిద్ధంగా ఉంటే.. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో రానున్న 'కూలీ' చిత్రీకరణ ప్రారంభించుకోవాల్సి ఉంది. ఈ ప్రాజెక్ట్ల తర్వాత అట్లీ సినిమా ప్రారంభం అవుతుందని సమాచారం. -
లీకైన ఫోటోలు.. దుమారం రేపుతున్న త్రిష, విజయ్ వ్యవహారం
కోలీవుడ్లో హిట్ పెయిర్గా విజయ్, త్రిష పేరు గడించారు. ఈ జంట ఇప్పటి వరకు నాలుగు చిత్రాలలో కలిసి నటించారు. వాటిలో గిల్లీ (ఒక్కడు రీమేక్) చిత్రం ఘన విజయం సాధించింది. రీసెంట్గా లియో ద్వారా భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే, రాజకీయాల్లోకి వచ్చిన విజయ్ త్వరలో సినిమాలకు గుడ్బై చెప్పనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో తన చివరి సినిమాలో కూడా త్రిషనే హీరోయిన్గా ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి. కానీ, అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.కొద్దిరోజుల క్రితం విజయ్ తన 50వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ క్రమంలో త్రిష ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ వారిద్దరూ లిఫ్ట్లో ఉన్న ఒక ఫోటోను పంచుకుంది. ఆపై 'నీ థాన్ ఎన్ కాదల్.. టిల్ డెత్ నీ థన్ ఎన్ కాదల్' అంటూ ఓ ఆంగ్ల పాటను కూడా పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది నెట్టింట వైరల్ అవుతుంది.ఈ ఫోటో వైరల్ అవుతున్న సమయంలో త్రిష, విజయ్ కలిసి ఉన్న ఫోటోలు అంటూ నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. చాలా సందర్భాల్లో వీరిద్దరూ కలిసే విదేశాలకు వెళ్లారంటూ వారు తెలుపుతున్నారు. అందుకు రుజువుగా ఒక పాత ఫోటోను వారు వైరల్ చేస్తున్నారు. అందులో విజయ్ ఒంటరిగా నడుస్తున్న ఫోటో ఒకటి ఉంది. మరో ఫోటోలో త్రిష పక్కన ఒక కాలుతో ఉన్న ఫోటో ఉంది. ఈ రెండూ కలిపి ఇప్పుడు కొందరు నెట్టింట వైరల్ చేస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్ ధరించిన షూ ఏదైతే ఉందో అదే త్రిష కూర్చున్న పక్కనే కనిపిస్తుంది. దీంతో విజయ్, త్రిష తరచూ విదేశాలకు వెళ్లారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వారిద్దరి మధ్య రహస్య స్నేహం నడుస్తుందా..? అంటూ కోలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. విజయ్ ఇదివరకే సంగీతను పెళ్లి చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమెరికాలో ఉన్నారు. అయితే, గత కొన్నేళ్లుగా వారిద్దరూ విడివిడిగా ఉంటున్నారు అని వార్తలు వచ్చాయి. వారు విడాకులు తీసుకోనున్నారు అనే రూమర్స్ కూడా వచ్చాయి. త్రిష విషయానికొస్తే 41 ఏళ్ల వయసులో కూడా తన గ్లామర్తో మళ్లీ సినిమాల్లో బిజీగా ఉంది. చాలా కాలం క్రితం వరుణ్మణియన్ అనే నిర్మాత, వ్యాపారవేత్తతో వివాహ నిశ్చితార్థం జరిగి పెళ్లి అంచులు వరకు వెళ్లి సడెన్గా బ్రేక్ పడింది. ఆ తరువాత నటిగానూ కొన్ని స్ట్రగుల్స్ ఎదుర్కొన్న త్రిష ఇటీవల వెండితెరపై తన సత్తా చాటుతుంది. సౌత్ ఇండియాలోనే ఎక్కువ రెమ్యునరేషన్ అందుకే హీరోయిన్గా ప్రస్తుతం రికార్డ్ క్రియేట్ చేసింది. త్రిష, విజయ్ ఫోటోలను కోలీవుడ్లో కొందరు వైరల్ చేస్తూ.. వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందంటూ అనుమానాలకు అవకాశం ఇచ్చేలా కొన్ని ఫోటోలు షేర్ చేస్తున్నారు. విజయ్ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చాడు కాబట్టి కొందరు కావాలనే ఇలాంటి పని చేస్తున్నారని ఆయన అభిమానులు తెలుపుతున్నారు. అలాంటి ఏదైనా విషయం ఉంటే ఆయన డైరెక్ట్గానే చెబుతారని వారు క్లారిటీ ఇస్తున్నారు. ఈ విషయం గురించి త్రిష, విజయ్ నుంచి ఎలాంటి రియాక్షన్ ఇవ్వలేదు. -
వైజయంతి... ఒక యుద్ధం!
పవర్ఫుల్ పోలీసాఫీసర్ వైజయంతిగా ‘కర్తవ్యం’ (1990)లో విజయశాంతి నటనను అంత సులువుగా మరచిపోలేం. లేడీ అమితాబ్ అనిపించుకున్న ఈ యాక్షన్ స్టార్ మళ్లీ పోలీసాఫీసర్ వైజయంతిగా కనిపించనున్నారు. కల్యాణ్రామ్ హీరోగా రూపొందుతున్న చిత్రంలోనే వైజయంతి పాత్రలో కనిపించనున్నారు విజయశాంతి. సోమవారం (జూన్ 24) విజయశాంతి పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె లుక్, క్యారెక్టర్ గురించి ఓ వీడియోను విడుదల చేశారు. చీరకట్టులో హుందాగా, ఖాకీ దుస్తుల్లో పవర్ఫుల్గా విజయశాంతి కనిపించగా, ‘వైజయంతి ఐపీఎస్... తను పట్టుకుంటే పోలీస్ తుపాకికే ధైర్యం వస్తుంది... వేసుకుంటే యూనిఫామ్కే పౌరుషం వస్తుంది... తానే ఒక యుద్ధం... నేనే తన సైన్యం...’ అంటూ ఆమె పాత్ర గురించి కల్యాణ్ రామ్ తన వాయిస్ ఓవర్తో ఆ వీడియోలో వివరించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. -
విశ్వంభరతో వినాయక్
చిరంజీవి టైటిల్ రోల్లో రూపొందుతున్న చిత్రం ‘విశ్వంభర’. వశిష్ఠ దర్శకత్వంలో విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్లో జరుగుతోంది. ఓ భారీ సెట్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సెట్కి వెళ్లారు దర్శకుడు వీవీ వినాయక్. దాదాపు 20 ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా వినాయక్ దర్శకత్వం వహించిన ‘ఠాగూర్’ (2003) చిత్రం గుర్తుండే ఉంటుంది. ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.అప్పట్నుంచీ చిరంజీవి–వినాయక్ మధ్య మంచి అనుబంధం ఉంది. సోమవారం ‘విశ్వంభర’ సెట్కి వెళ్లిన వినాయక్ చిత్రదర్శకుడు వశిష్ఠకి శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు చిరంజీవితో తనుకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఇక ఫ్యాంటసీ యాక్షన్ అడ్వెంచరస్గా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’లో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఎంఎం కీరవాణి, కెమెరా: ఛోటా కె. నాయుడు. -
కొంతకాలం గడిచింది... చివరికి..!
దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు మలయాళ బ్యూటీ నివేదా థామస్. నాని హీరోగా నటించిన ‘జెంటిల్మన్’ (2016) మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ‘నిన్ను కోరి, జై లవ కుశ, బ్రోచేవారెవరురా, వకీల్ సాబ్’ వంటి పలు సినిమాల్లో నటించారు. 2022లో విడుదలైన ‘డాకిని శాకిని’ మూవీ తర్వాత మరో తెలుగు చిత్రంలో నటించలేదు నివేద. అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ పోస్ట్ వైరల్గా మారింది.‘చాలా కాలమైంది.. బట్.. చివరికి.. ’ అంటూ లవ్ ఎమోజీని జత చేసి సోమవారం ఎక్స్లో పోస్ట్ చేశారు నివేద. లవ్ సింబల్ పెట్టారు కాబట్టి ఇది ప్రేమకు సంబంధించిన వార్త అని, నివేద ఎంగేజ్మెంట్ అయిందని, తన పెళ్లి కబురు గురించే ఆ పోస్టు పెట్టారని నెటిజన్లు, ఆమె అభిమానులు పోస్టులు పెడుతున్నారు. కొందరేమో తన కొత్త సినిమా ప్రకటన గురించి అయి ఉంటుందని ఊహిస్తున్నారు. అలాగే ప్రస్తుతం కొత్త సినిమాలేవీ లేకపోవడంతో నివేద పెళ్లి చేసుకునే ఆలోచనలో ఉన్నారనే వారూ లేకపోలేదు. మరి ఆమె పోస్ట్కి అర్థం ఏంటి? అనేది నివేదానే చెబితేనే తెలుస్తుంది. -
డిఫరెంట్ కాన్సెప్ట్తో వరుణ్ సందేశ్.. బాక్సాఫీస్ వద్ద జోరు!
వరుణ్ సందేశ్, అన్నీ, శ్రేయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన చిత్రం నింద. ఈ సినిమాను రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో తెరకెక్కించారు. వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ చిత్రానికి అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఈనెల 21న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది.ఈ చిత్రంలో వరుణ్ సందేశ్ తనలోని కొత్త కోణాన్ని చూపించి నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సినిమా వరుణ్కు మంచి కమ్బ్యాక్ అవుతుందని ఆడియెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్తో ప్రేక్షకుల ముందుకొచ్చిన వరుణ్ సందేశ్ మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ వారంలో రిలీజ్ అయిన అన్ని చిత్రాల్లోకెల్లా వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. వరుణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. ఈ వీకెండ్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవనుంది. కాగా.. ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ముఖ్య పాత్రలు పోషించారు. -
'నేను-కీర్తన' సినిమా సాంగ్కు భారీ రెస్పాన్స్
చిమటా రమేష్ బాబు హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నేను కీర్తన'. ఈ మూవీ నుంచి నుంచి విడుదలైన 'సీతాకోకై ఎగిరింది మనసే' లిరికల్ వీడియోకు అసాధారణ స్పందన లభిస్తోంది. ఈ లిరికల్ వీడియోను దర్శకుడు సాయి రాజేష్ విడుదల చేయడం తెలిసిందే. ఈ పాటను కులుమనాలిలో ఉన్న పలు లొకేషన్స్ లో చిత్రీకరించారు. దీంతో పాటలోని విజువల్స్ కూడా చాలా అందంగా వచ్చాయి.చిమటా ప్రొడక్షన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రిషిత - మేఘన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు నిర్మాత,డైరెక్షన్,హీరో చిమటా రమేష్ బాబునే కావడం విశేషం.'బేబి' దర్శకుడు సాయి రాజేష్ గారు రిలీజ్ చేసిన సీతా కోకై" లిరికల్ వీడియోకు అనూహ్యమైన స్పందన వస్తుండడం ఈ చిత్ర విజయంపై తాము పెట్టుకున్న నమ్మకాన్ని రెట్టింపు చేసింది అంటూ.. ఈ పాటను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ చిత్ర దర్శకుడు కమ్ కథానాయకుడు చిమటా రమేష్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. 'నేను - కీర్తన' చిత్రాన్ని అతి త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని ఆయన అన్నారు. చిమటా జ్యోతిర్మయి సమర్పణలో చిమటా లక్ష్మికుమారి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఓటీటీలో కార్తికేయ హిట్ సినిమా.. అధికారిక ప్రకటన
కార్తికేయ గుమ్మకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘భజే వాయు వేగం’. ఎలాంటి అంచనాలు లేకుండా మే 31న ఈ చిత్రం రిలీజ్ అయింది. అయితే, మొదటి ఆట నుంచి సినిమా బాగుందంటూ విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు అందాయి. తాజాగా ఈ సినిమా ఓటీటీలో విడుదల కానున్నట్లు నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది.ప్రశాంత్ రెడ్డి తొలిసారి దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 28న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందని నెట్ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. బెట్టింగ్ మాఫియా చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. చిన్న సినిమా అయినా ప్రేక్షకులను మెప్పించడంలో డైరెక్టర్ విజయం సాధించాడు. ఇందులో ఐశ్వర్యా మీనన్ హీరోయిన్గా నటించగా తనికెళ్ల భరణి, రవిశంకర్, సుదర్శన్, కీరోల్స్ చేశారు. ఈ మూవీలో ‘హ్యాపీ డేస్’ ఫేమ్ రాహుల్ టైసన్ కూడా ముఖ్య పాత్ర పోషించారు. యువీ క్రియేషన్స్ సమర్పణలో యువీ కాన్సెప్ట్స్ బ్యానర్పై ‘భజే వాయు వేగం’ చిత్రాన్ని తెరకెక్కించారు. సినీ అభిమానులకు ఈ వారం మంచి ఎంటర్టైన్మెంట్ అని చెప్పవచ్చు. You showered us with love in theaters 🫶🏻 here we are sending back the love straight to your home on June 28th @NetflixIndia 🤩#BhajeVaayuVegam pic.twitter.com/ghGf79KdNj— Kartikeya (@ActorKartikeya) June 24, 2024 -
ఛాన్సుల కోసం అడుక్కోవడం నాకు రాదు: చిరంజీవి హీరోయిన్
బాలీవుడ్తో పాటు తెలుగు చిత్రాలతో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ రిమీ సేన్. అభిషేక్ బచ్చన్ సరసన సూపర్ డూపర్ హిట్ అయిన 'ధూమ్' సినిమాతో ప్రేక్షకుల ఆదరణ దక్కించుకుంది. ఆ తర్వాత తెలుగులో మెగాస్టార్ చిరంజీవి డబుల్ రోల్ చేసిన 'అందరివాడు' చిత్రంలోనూ మెరిసింది. ఈ సినిమాలో చిరంజీవి తండ్రి, కొడుకుల పాత్రలో అలరించిన సంగతి తెలిసిందే. 2003లో హంగామా సినిమాతో హిందీలో అరంగేట్రం చేసిన రిమీ సేన్.. ఆ తర్వాత గరం మసాలా, ఫిర్ హేరా ఫేరీ, క్యూన్ కి, గోల్మాల్, బాగ్బాన్ సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది ముద్దుగుమ్మ. అవేంటో తెలుసుకుందాం.రిమిసేన్ మాట్లాడుతూ.. "ఇక్కడ నా పాత్రకు పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. కేవలం నాది ఫర్నీచర్ రోల్. హంగామా, జానీ గద్దర్ లాంటి చిత్రాల్లో మాత్రమే మంచి పాత్రలు చేశా. ఆ తర్వాత అలాంటి పాత్రలే వస్తే బాగుంటుందని కోరుకున్నా. కానీ వర్కవుట్ కాలేదు. అక్షయ్ కుమార్, అజయ్ దేవగన్లతో కలిసి పనిచేసినప్పటికీ ఇండస్ట్రీలో ఎవరితోనూ కనెక్ట్ కాలేదు. సహాయం కోసం ఎవరినీ చేయి చాచి అడగలేదు' అని రిమీ సేన్ పేర్కొంది. అంతే కాదు.. కేవలం కామెడీ సినిమాలతో విసిగిపోయి నటనకు దూరంగా ఉన్నట్లు ఆమె వెల్లడించింది.ఎవరైనా మీ ఫర్మామెన్స్ సరిగ్గా చేయలేదని మీప్లేస్లో ఎవరినైనా భర్తీ చేశారా? అని రిమి సేన్ను ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. "ఇండస్ట్రీలో టాలెంట్ అనేది నెక్ట్స్. ముందు మీరు వ్యక్తులను ఎలా మేనేజ్ చేయాలో తెలుసుకోవాలి. లేకపోతే ఏ పని జరగదు. లేదంటే మీ టాలెంట్ స్టోర్ రూమ్కు పరిమితం కావాల్సిందే. ఛాన్సుల కోసం అలా అందరినీ అడుక్కోవడం, పీఆర్ చేయడం నాకు రాదు' అని చెప్పుకొచ్చింది. కాగా.. తన సన్నిహితుడు రౌనక్ జతిన్ వ్యాస్ ద్వారా రూ.4 కోట్లు మోసపోయానని రిమీ సేన్ ఇటీవలే వెల్లడించింది. ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన రెండేళ్ల తర్వాత తాజాగా బాంబే హైకోర్టులో కేసు విచారణ జరుగుతోందని ఆమె తెలిపారు. -
టాలీవుడ్ నిర్మాతలతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భేటీ (ఫోటోలు)
-
జైలులో 'పవిత్ర గౌడ' గొంతెమ్మ కోరికలు.. తీర్చాలంటూ గొడవ
ఆటో డ్రైవర్ రేణుకస్వామి హత్య కేసులో నిందితులుగా బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో హీరో దర్శన్ (A2), నటి పవిత్ర (A1) ఉన్నారు. రేణుకస్వామి సోషల్ మీడియా ద్వారా తనను వేధిస్తున్నట్లు దర్శన్తో పవిత్ర చెప్పింది. దీంతో కోపగించిన దర్శన్ తన అనుచరులతో రేణుకాస్వామిని హతమార్చినట్లు పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో 17 మంది జైలులో ఉన్నారు.జైల్లో పవిత్ర గౌడ మహిళా సిబ్బందితో గొడవకు దిగింది. పవిత్రకు రాత్రి నిద్రించేందుకు ఒక దుప్పటిని జైలు సిబ్బంది ఇచ్చారు. ఈ దుప్పటి వద్దని, ఇంటి నుంచి తెప్పించి ఇవ్వాలంటూ ఆమె గొడవ చేసినట్లు తెలిసింది. జైలులో ఉండి కూడా అది కావాలి, ఇది కావాలంటూ అక్కడ ఉన్న మహిళా సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నట్లు సమాచారం. జైలు భోజనం తినేందుకు కూడా ఆమె నిరాకరించారట. దీంతో పోలీసులు కూడా ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారట. ఇది మీ ఇల్లు కాదు, మౌనంగా ఉండటం నేర్చుకోవాలని సిబ్బంది గట్టిగా హెచ్చరించారట.దర్శన్కు ఇతర ఖైదీల నుంచి ఏమైనా ప్రమాదం రావచ్చిని ఆయన్ను ప్రత్యేకమైన బ్యారక్లో ఉంచారు. రాత్రి భోజనంగా రాగి ముద్ద, చపాతి, అన్నం, సాంబార్, మజ్జిగ ఇచ్చారు. కానీ, భోజనం చేయని దర్శన్ ఆలస్యంగా నిద్రపోయి ఉదయం 6.30 గంటలకు లేచి కొంతసేపు వాకింగ్ చేశారు. జైలు సిబ్బందిని వేడినీరు అడిగి తాగారు. ఉదయం టిఫిన్ పలావ్ ఆరగించారు. భద్రత కోసం దర్శన్ను తుమకూరు జిల్లా జైలుకు బదిలీ చేయాలని పోలీసులు కోర్టుకు విన్నవించారు. -
'న్యూడ్' స్కిన్కేర్ బ్రాండ్ అంబాసిడర్గా శ్రీలీల
పాల ద్వారా చర్మ సంరక్షణ ఉత్పత్తులను తయారు చేసే న్యూడ్, తన హై-గ్లేజర్ లైన్కు బ్రాండ్ అంబాసిడర్గా హీరోయిన్ శ్రీలీలను నియమించుకుంది. ఆమెకు ఉన్న పాపులారిటీతో దక్షిణ భారత మార్కెట్లో బ్రాండ్ అమ్మకాలను పెంచుకోవచ్చని ఆశిస్తోంది. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ.. "'నా చర్మ సంరక్షణ కోసం పాలను ఉపయోగిస్తూనే పెరిగాను. వీటితో న్యూడ్ ఆవిష్కరణలు తీసుకురావడం సంతోషంగా ఉంది. నేటి చర్మ సంరక్షణ అవసరాలకు సరిగ్గా సరిపోయేలా న్యూడ్ అధిక-పనితీరు గల ఉత్పత్తులను తయారు చేయడం బాగుంది" అని అన్నారు. పెరుగు, కోజిక్ యాసిడ్తో కూడిన ఫేస్టైమ్ ఇన్స్టంట్ గ్లో మాస్క్, సన్స్టాపబుల్ ఎస్పీఎఫ్ 45.. 3-ఇన్-1 సన్స్క్రీన్, స్లీప్ ఆన్ ఇట్ ఓవర్నైట్ గోట్ మిల్క్ సికా మాస్క్ లాక్టిక్ యాసిడ్, బకుచియోల్ స్కిన్హెరిటెన్స్ బాడీ సీరమ్ శ్రీలీలకు ఇష్టమైన న్యూడ్ ఉత్పత్తులు.సౌత్బే టాలెంట్ సీఈఓ ప్రశాంత్ పొట్లూరి మాట్లాడుతూ.. "న్యూడ్ స్కిన్ ప్రొడక్టుల ప్రచారం కోసం సౌత్బే టాలెంట్తో శ్రీలీల చేతులు కలపడం మాకు చాలా ఆనందంగా ఉంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా ద్వారా ఇందులో వ్యూహాత్మక పెట్టుబడి పెట్టారు. వీరిద్దరి కాంబినేషన్ న్యూడ్ ప్రయాణంలో ఒక ఉత్తేజకరమైన కొత్త అధ్యాయాన్ని సృష్టిస్తుంది" అని అన్నారు. -
ఆహా.. అనిపించేలా నేహా లుక్స్ (ఫొటోలు)
-
34 ఏళ్ల తర్వాత మళ్లీ అదే పాత్రలో విజయశాంతి
లేడీ సూపర్ స్టార్ విజయశాంతి పేరు చెప్పగానే ఒకప్పుడు ఆమె చేసిన పోలీస్ పాత్రలే గుర్తొస్తాయి. 1990లో 'కర్తవ్యం' సినిమాలో వైజయంతీ ఐపీఎస్ పాత్రలో అదరగొట్టేసింది. దీని తర్వాత పలు సినిమాల్లో ఇదే తరహా రోల్స్ చేసినప్పటికీ అవేవి అంత పేరు తీసుకురాలేకపోయాయి. కానీ ఇన్నేళ్ల తర్వాత మళ్లీ వైజయంతీ ఐపీఎస్ రోల్లో విజయశాంతి కనిపించబోతున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?)'సరిలేరు నీకెవ్వరు' సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి.. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా గ్యాప్ తీసుకుని కల్యాణ్ రామ్ కొత్త మూవీలో చేస్తున్నారు. ఇందులోనూ వైజయంతీ ఐపీఎస్ అనే పాత్ర చేస్తున్నారు. పోలీస్ బ్యాక్ డ్రాప్తో తీస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా విజయశాంతి పుట్టినరోజు కానుకగా గ్లింప్స్ రిలీజ్ చేశారు.విజయశాంతి వయసు పెరిగినట్లు కాస్త కనిపిస్తున్నప్పటికీ.. డైనమిక్ లుక్ మాత్రం బాగుంది. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే చాలావరకు పూర్తయింది. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. మరి విజయశాంతికి రీఎంట్రీలో ఈ పోలీస్ పాత్ర సక్సెస్ ఇస్తుందో లేదో చూడాలి?(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 21 సినిమాలు రిలీజ్.. అవి ఏంటంటే?) -
అసలైన లేడీ సూపర్స్టార్.. విజయశాంతి బర్త్డే స్పెషల్ (ఫొటోలు)
-
ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పిన అమితాబ్.. ఎందుకంటే?
ప్రభాస్ 'కల్కి' మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది. ఇప్పటికే వచ్చిన ట్రైలర్స్ అంచనాల్ని భారీగా పెంచేశాయి. తాజాగా టికెట్ బుకింగ్స్ ఓపెన్ కాగా, అవి హాట్ కేకుల్లా అమ్ముడవుతుండటమే దీనికి నిదర్శనం. మరోవైపు రిలీజ్ దగ్గర పడే కొద్ది మూవీ టీమ్ ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెడుతోంది. తాజాగా టీమ్ అంతా కలిసి ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అంతా బాగానే ఉంది కానీ అమితాబ్ మాత్రం ప్రభాస్ అభిమానులకు క్షమాపణలు చెప్పాడు. ఇప్పుడీ విషయం వైరల్ అవుతోంది.'కల్కి'లో భైరవగా ప్రభాస్, అశ్వద్థామగా అమితాబ్ బచ్చన్ కనిపించబోతున్నారు. వీళ్లిద్దరి మధ్య ఫైట్ సీన్స్ కూడా ఉన్నాయి. ట్రైలర్ చూస్తే ఈ విషయం మీకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఈ సీన్స్ గురించే అమితాబ్ మాట్లాడుతూ.. ప్రభాస్ ఫ్యాన్స్కి సారీ చెప్పాడు. మూవీ చూసిన తర్వాత తనని తిట్టుకోవద్దని, ట్రోల్ చేయొద్దని చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి'.. ఎవరెవరికీ ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు?)'నాగి.. ఈ ప్రాజెక్ట్ గురించి మాట్లాడటానికి నా దగ్గరికి వచ్చినప్పుడు నా పాత్ర ఎలా ఉండబోతుంది, ప్రభాస్ పాత్ర ఏంటనేది చూపించేందుకు కొన్ని ఫొటోలు చూపించాడు. 'కల్కి'లో నాది ప్రభాస్ని కొట్ట క్యారెక్టర్ అని చెప్పాడు. ముందే చెబుతున్నా ప్రభాస్ అభిమానులందరూ దయచేసి నన్ను క్షమించండి. సినిమాలో నేను చేసే పనులు చూసిన తర్వాత నన్ను తిట్టుకోకండి, ట్రోల్ చేయకండి' అని అమితాబ్ అన్నాడు. దీనికి ప్రభాస్ నవ్వుతూ.. 'అయ్యో సర్, వాళ్లంతా మీ ఫ్యాన్స్ కూడా!' అని చెప్పాడు.ఇకపోతే తెలంగాణలో బుకింగ్స్ ఇప్పటికే మొదలైపోయాయి. 8 రోజుల పాటు ఐదు షోలకు అనుమతిచ్చారు. అలానే సింగిల్ స్క్రీన్లో రూ.75, మల్టీప్లెక్స్లో రూ.100 వరకు ధర పెంచుకునేందుకు అనుమతిచ్చారు. ఉదయం 5 గంటలకే బెన్ఫిట్ షోలు వేసుకోవచ్చని పేర్కొన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో ఇంకా టికెట్ ధరల గురించి తేలాల్సి ఉంది. నేడో రేపో టికెట్ ధరల పెంపుపై జీవో వచ్చే అవకాశముంది.(ఇదీ చదవండి: 'కల్కి' ఓటీటీ డీటైల్స్.. అప్పటివరకు వెయిటింగ్ తప్పదా?) -
‘రేవు’ పార్టీలో హేమాహేమీలు..ఆర్జీవి మురళీమోహన్ (ఫొటోలు)
-
పవన్తో భేటీ కానున్న టాలీవుడ్ నిర్మాతలు.. అది అసలు విషయం
తెలుగు ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖ నిర్మాతలు.. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్తో కలవనున్నారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం భేటీ కానున్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వాన్ని అభినందించి, తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించే విధంగా సహకరించాలని పవన్ని కోరబోతున్నారు.(ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన హీరో నాగార్జున.. ఏమైందంటే?)కొత్త రిలీజయ్యే సినిమా టికెట్ రేట్ల విషయంలో వెసులుబాటు, థియేటర్ల సమస్యలు లాంటి విషయాలని సదరు నిర్మాతలు పవన్ కల్యాణ్తో చర్చించనున్నారు. ఈ భేటీకి వెళ్లేవారిలో అశ్వనీ దత్, చినబాబు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, నాగవంశీ, విశ్వప్రసాద్, వివేక్, దిల్ రాజు, దామోదర్ ప్రసాద్, భోగవల్లి ప్రసాద్, డి.వి.వి.దానయ్య తదితరులు ఉన్నారు.(ఇదీ చదవండి: అలాంటివాటిని పట్టించుకోరు కానీ.. మాపై పడి ఏడుస్తారు: అనసూయ కౌంటర్)