-
గూగుల్ ‘బార్డ్’ మళ్లీ ఫెయిల్.. ఈ సారి ఏకంగా
ఆర్టీఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) విషయంలో తామేమీ తక్కువ కాదంటూ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ పేరిట గూగుల్ తీసుకొచ్చిన చాట్బాట్ వరుస షాకులిస్తుంది. ఇప్పటికే ప్రమోషనల్ వీడియోలో జరిగిన తప్పిదంతో గూగుల్ భారీగా నష్టపోయింది. తాజాగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక బార్డ్ మరోసారి ఫెయిల్ అయ్యింది. ‘బార్డ్’ పనితీరు మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో బార్డ్ను పరిచయం చేస్తూ గూగుల్ ఓ ప్రమోషనల్ వీడియోను విడుదల చేసింది. ఆ వీడియోలో అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఇవ్వడంలో బార్డ్ విఫలమైంది. దీంతో గూగుల్కు 100 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లింది. చదవండి👉 చాట్జీపీటీకీ భారీ షాక్.. బ్యాన్ దిశగా ప్రపంచ దేశాల అడుగులు? తాజాగా టెస్టింగ్ దశలో ఉన్న బార్డ్ శాట్ పరీక్షలకు సరిగ్గా సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. అమెరికాకు చెందిన కాలేజీల్లో అడ్మిషన్ పొందాలంటే శాట్ (sat) అనే ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్ధులకు సంబంధిత కాలేజీల్లో సీటు దొరుకుతుంది. ఫార్చ్యూన్ సంస్థ ఆ పరీక్షకు సంబంధించిన మ్యాథ్స్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని బార్డ్ను అడిగింది. అందుకు బార్డ్ స్పందించింది. 75 శాతం మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలను తప్పుగా ఇచ్చింది. కొన్నింటికి సమాధానాలు ఇచ్చినప్పటికీ.. మళ్లీ అదే ప్రశ్న వేసినప్పుడు గతంలో ఇచ్చిన సమాధానం కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చినట్లు తేలింది. రిటర్న్ లాంగ్వేజ్ ఎగ్జామ్లో 30 శాతం మాత్రమే కరెక్ట్ ఆన్సర్లు ఇచ్చింది. దీనిపై గూగుల్ ప్రతినిధి ఫార్చ్యూన్తో మాట్లాడుతూ..బార్డ్ టెస్టింగ్ దశలో ఉంది. కొన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదు. బార్డ్ పనితీరు మెరుగుపడుతోంది. వినియోగంలోకి తెచ్చేందుకు వేలాది మంది టెస్టర్లు దీనిపై పని చేస్తున్నారని అన్నారు. చదవండి👉 త్వరలో ‘చాట్జీపీటీ’తో ఊడనున్న ఉద్యోగాలు ఇవే! బార్డ్ పనితీరుపై అనుమానాలు మైక్రోసాఫ్ట్ ఏఐ చాట్బాట్ చాట్జీపీటీకి పోటీగా బార్డ్ను పరిచయం చేస్తూ ప్రమోషనల్ వీడియోలో జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ గురించి అడిగిన ప్రశ్నకు బార్డ్ తప్పుడు సమాధానం ఇచ్చింది. సౌర వ్యవస్థకు వెలుపల ఉన్న గ్రహాల చిత్రాలను తొలుత జేమ్స్ వెబ్ స్పేస్ తీసిందని పేర్కొంది. వాస్తవానికి 2004లోనే యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీకి చెందిన టెలీస్కోప్ సౌరవ్యవస్థకు వెలుపలి చిత్రాలను తీసింది. గూగుల్ విడుదల చేసిన జిఫ్ వీడియోలో ఈ పొరపాటును గుర్తించడంతో దీని సామర్థ్యంపై అనుమానాలు నెలకొన్నాయి. అప్ గ్రేడ్ చేస్తున్నాం ఈ తరుణంలో న్యూయార్క్ టైమ్స్ పాడ్కాస్ట్ లో బార్డ్ పనితీరుపై సుందర్ పిచాయ్ స్పందించారు. బార్డ్ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బార్డ్ను అప్గ్రేడ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎంపిక చేసిన టెస్టర్లతో ప్రయోగాలు నిర్వహించాక పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. చదవండి👉 వావ్..డాక్టర్లు చేయలేని పని చాట్జీపీటీ చేసింది..కుక్క ప్రాణాలు కాపాడి! -
గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్.. అసలేం జరిగిందంటే?
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఇకపై వారికి అందించే ఫ్రీ స్నాక్స్, లంచ్, మసాజ్, లాండ్రీతో పాటు ఇతర సౌకర్యాల్ని రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్రముఖ దిగ్గజ టెక్ కంపెనీ గూగుల్లో పనిచేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. ఆహ్లాదకర వాతావరణం, జీత భత్యాలు, ఉద్యోగులకు అందించే సౌకర్యాలు, ఇతర ప్రోత్సహాకాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పైగా గూగుల్ కంపెనీలో ఉద్యోగం చేసే వారికి సొసైటీలో ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. అందుకే గూగుల్ ఉద్యోగం అంటే ఎగిరి గంతేస్తుంటారు. అయితే ప్రపంచంలో అత్యంత విలువైన టెక్ కంపెనీల్లో ప్రథమ స్థానంలో ఉన్న గూగుల్ ఇప్పుడు పొదుపు మంత్రం జపిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక అనిశ్చితిని తట్టుకొని నిలబడాలంటే ఉన్న డబ్బును పొదుపుగా వాడుకొని..దూబారా ఖర్చుల్ని తగ్గించుకోవాలని చూస్తోంది. ఈ తరుణంలో ఇప్పటి వరకు ఉద్యోగులకు అందించిన అన్నీ ప్రోత్సాహకాల్ని రద్దు చేసింది. నియామకాల్ని తగ్గించి డబ్బుల్ని ఆదా చేస్తోంది. చదవండి👉 ‘ఇక చాలు.. దయ చేయండి’.. గూగుల్ ఉద్యోగులకు సీఈఓ ఈ మెయిల్ ఈ సందర్భంగా గూగుల్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ రూత్ పోరాట్ మాట్లాడుతూ..సంస్థ అధిక ప్రాధాన్యత కలిగిన పనులపై మాత్రమే డబ్బుల్ని సమర్థవంతంగా వినియోగించేందుకు సిద్ధంగా ఉందన్నారు. ప్రోత్సాహకాల నిలిపి వేతపై ఉద్యోగులకు గూగుల్ మెమో జారీ చేసింది. హైరింగ్ ప్రాసెస్ను నిలిపివేసి ఉద్యోగుల్ని అధిక ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్లపై పనిచేసేలా రీలొకేట్ చేయనున్నట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక తెలిపింది. ఉద్యోగులకు అందించే ల్యాప్ట్యాప్లను తిరిగి వెనక్కి తీసుకోవడంతో పాటు, ఆఫీస్ లొకేషన్ అవసరాలు, ప్రతి ఆఫీస్ స్పేస్లో కనిపించే ట్రెండ్ల ఆధారంగా ప్రొత్సహకాల్ని సర్ధుబాటు చేయాల్సి వస్తుందని పోరాట్ తెలిపినట్లు నివేదిక పేర్కొంది. మైక్రో కిచెన్ల అవసరం ఎంత వరకు ఉందనే విషయంపై స్పష్టత వచ్చిన వెంటనే వాటిని మూసివేయడం, వినియోగానికి తగ్గట్లు ఫిట్నెస్ క్లాసుల్ని షెడ్యూల్ చేయడం పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువుల వాడాకాన్ని తగ్గించి డబ్బును జాగ్రత్తగా ఖర్చుపెట్టేందుకు సిద్ధమైనట్లు బిజినెస్ ఇన్ సైడర్ నివేదిక హైలెట్ చేసింది. కొన్ని సర్ధుబాట్లు తప్పవ్ ఇక తాజా గూగుల్ నిర్ణయంపై ‘సంస్థ ఇచ్చే ప్రోత్సహాకాల్ని ఇష్టపడే ఉద్యోగులకు ఈ నిర్ణయం అసంతృప్తి కలిగించవచ్చు. కానీ కంపెనీకి నిధులను ఆదా చేయడం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో సహా అధిక ప్రాధాన్యత కలిగిన ఇతర రంగాలపై దృష్టిసారించడం తప్పనిసరి. ముఖ్యమైన ప్రోత్సాహకాలు, ప్రయోజనాలు, సౌకర్యాలను అందించడం కొనసాగిస్తుంది. అయితే కంపెనీ తన వనరుల విషయంలో బాధ్యతాయుతంగా ఉండేందుకు కొన్ని సర్ధుబాట్లు చేయబడతాయి అంటూ గూగుల్ ప్రతినిధి ర్యాన్ లామోన్ గిజ్మోడోకి చెప్పారు. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
ఉద్యోగుల తొలగింపు వేళ .. గూగుల్ మరో కీలక నిర్ణయం!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ముంచుకొస్తున్న ఆర్ధిక మాంద్యం భయాల కారణంగా ఎంత వీలైతే అంత ఖర్చుల్ని తగ్గించుకునేందుకు ఇంకా ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటికే కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగుల్ని తొలగించిన గూగుల్.. తాజాగా క్లౌడ్ ఉద్యోగులు వారి సహచర ఉద్యోగులు డెస్క్లు వినియోగించుకోవాలని కోరింది. తద్వారా నిర్వహణ ఖర్చు తగ్గించుకోవాలని భావిస్తోంది. ‘రియల్ ఎస్టేట్ ఎఫిషెన్సీ’ (హాల్ తరహాలో డెస్క్లు) పేరుతో గూగుల్ ఆఫీస్లో డెస్క్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేందుకు శ్రీకారం చుట్టుంది. ప్రస్తుతం ఉద్యోగులు హైబ్రిడ్ వర్కింగ్ విధానంలో వారంలో 2 రోజులు ఇంటిలో, 3 రోజులు ఆఫీసులో పనిచేస్తున్నారు. వారంతంలో శని, ఆదివారాలు సెలవులే. ఇప్పుడు ఈ విధానంలో గూగుల్ మార్పులు చేస్తుంది. ఉద్యోగులు పరస్పర అంగీకారంతో ఒకరు ఇంట్లో ఉంటే మరొకరు ఆఫీస్లో వర్క్ చేసేలా ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. తదనుగుణంగా కార్యాలయాల్లో డెస్క్లను సిద్ధం చేస్తున్నట్లు ఇంటర్నల్ మీటింగ్లో పేర్కొంది. ఇప్పుడు ఉద్యోగులకు విడివిడిగా డెస్క్లు లేవని, ఒకరి డెస్క్లు మరొకరు వాడుకోవాలని సూచించింది. అయితే, డెస్క్ అందుబాటులో లేనప్పుడు ఉద్యోగులు ఆఫీస్కు రావొచ్చని .. ఆఫీస్లో ఎక్కడ ఖాళీ దొరికితే అక్కడ కూర్చొని పనిచేసుకోవాలని స్పష్టం చేసింది. చదవండి👉 గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తొందరపాటు.. ఏకిపారేస్తున్న సొంత ఉద్యోగులు! -
మరికొన్ని గంటలు అదనంగా పనిచేయండి.. ఉద్యోగులకు సుందర్ పిచాయ్ రిక్వెస్ట్!
గూగుల్ రూపొందించిన బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను సరిచేసేందుకు ఆ సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా సరికొత్త ప్రణాళికను రచించింది. ఇందుకోసం వారంలో కొన్ని గంటలు అదనంగా పనిచేయాలని గూగుల్ ఉద్యోగులను సీఈవో సుందర్ పిచాయ్ కోరారు. ఈ మేరకు ఉద్యోగులకు అంతర్గత సందేశాలు పంపినట్లు తెలిసింది. బార్డ్ ఏఐ చాట్బాట్లో లోపాలను గుర్తించి సరిచేయడానికి వారానికి రెండు నుంచి నాలుగు గంటలు కేటాయించాలని కోరారు. బిజినెస్ ఇన్సైడర్ కథనం ప్రకారం.. వేలాది మంది గూగుల్ ఉద్యోగులు ఇప్పటికే బార్డ్ ఏఐ చాట్బాట్ను వినియోగిస్తూ పరీక్షిస్తున్నారని, ఇందులో సమస్యలన్నంటినీ పరిష్కరించడానికి ఒక కొత్త ప్లాన్ను రూపొందించినట్లు సుందర్ పిచాయ్ పేర్కొన్నారు. ఇందు కోసం వేలాదిమంది ఉద్యోగులు అదనపు గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంది. వినియోగదారులకు అందుబాటులోకి వచ్చాక ఎటాంటి లోపాలు ఉండకూడదన్నది గూగుల్ ఉద్దేశం. అయితే సుందర్ పిచాయ్ ప్రపంచవ్యాప్తంగా మొత్తం గూగుల్ ఉద్యోగులందరికీ ఈ సందేశాలను పంపించారా.. లేదా అన్నది స్పష్టత లేదు. గత వారంలో డెమో సమయంలో బార్డ్ బాట్ తప్పుడు సమాచారం ఇవ్వడంతో నెగిటివ్ ప్రచారం బాగా జరిగింది. గూగుల్ ఇటీవల తన గ్లోబల్ వర్క్ఫోర్స్లో 12 వేల ఉద్యోగాల కోత ప్రకటించిన విషయం తెలిసిందే. మాతృ సంస్థ ఆల్ఫాబెట్తో సంబంధం లేకుండా గూగుల్కు ప్రస్తుతానికి ప్రపంచవ్యాప్తంగా 1.70 లక్షల మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. సుందర్ పిచాయ్ పంపించిన సందేశాల్లో.. ఉద్యోగులందరూ బార్డ్ కోసం వారానికి రెండు నుంచి నాలుగు గంటలు అదనంగా, మరింత లోతుగా పనిచేసి లోపాలు సరిచేసేందుకు కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బార్డ్ని పరీక్షించడానికి ఈ వారంలో గణనీయమైన సమయాన్ని కేటాయించాలని ఈ-మెయిల్స్లో పిచాయ్ అభ్యర్థించారు. (ఇదీ చదవండి: రిషి సునాక్, బిల్గేట్స్ను ఇంటర్వ్యూ చేసిన చాట్బాట్.. ఏయే ప్రశ్నలు అడిగిందో తెలుసా?) -
Pravasi Bharatiya Divas: రవి అస్తమించని ప్రవాస భారతీయం
ప్రపంచ నలుమూలలా భారతీయులు నివసిస్తున్నారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ లెక్కల ప్రకారం 210 దేశాలలో భారతీయ మూలాలున్న వారు, ఎన్నారైలు కలిపి 3.2 కోట్లకు పైగానే ఉన్నారు. ప్రవాస భారతీయ జనాభా కంటే తక్కువ జనాభా కలిగిన దేశాలు 150 పైనే ఉన్నాయి. నేడు అనేక దేశాల్లో రాజకీయంగా కూడా భారతీయులు కీలక పదవుల్లో ఉన్నారు. అమెరికా ఉపాధ్యక్ష పదవిని కమలా హారిస్ అలంకరించిన సంగతి తెలిసిందే. అలాగే హైదరాబాద్లో జన్మించిన తెలుగింటి బిడ్డ అరుణ మిల్లర్ (కాట్రగడ్డ అరుణ) మేరీలాండ్ రాష్ట్రానికి గత నవంబర్లో లెఫ్టినెంట్ గవర్నర్గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం వివిధ దేశాల్లో భారతీయ మూలాలున్న వ్యక్తులు వివిధ దేశాలకు అధినేతలుగా వ్యవహరిస్తున్నారు. రిషి సునాక్ (బ్రిటన్ ప్రధాని), అంటో నియ కోస్టా (పోర్చుగల్ ప్రధాని), మహ్మద్ ఇర్ఫాన్ అలీ (గయానా ప్రెసిడెంట్), పృథ్వీరాజ్ రూపన్ (మారిషస్ అధ్యక్షులు), చంద్రిక పెర్సద్ శాన్ టోఖి (సురినామ్ ప్రెసిడెంట్) లతోపాటు 200 మందికి పైగా భారతీయులు 15 దేశాల్లో వివిధ హోదాల్లో ప్రజాసేవలో ఉన్నారు. వీరంతా అమెరికా, యూకే, కెనడా, గయానా, సురినామ్, ఫిజీ, ట్రినిడాడ్ అండ్ టుబాగో, సింగపూర్, మారిషస్, పోర్చుగల్, దక్షిణాఫ్రికా, మలేసియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో పనిచేస్తున్నారు. వీరు కాకుండా వివిధ దేశాల్లో, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో సభ్యులుగా ఉన్నవారు చాలామందే ఉన్నారు. గతంలో సింగపూర్ ప్రెసిడెంట్గా ఉన్నఎస్.ఆర్.నాథన్ (1999–2011), దేవన్ నాయర్ (1981 –1985)లు, ఫిజీ ప్రధానిగా పనిచేసిన మహేంద్ర చౌదరి, మలేసియా ప్రధానిగా పని చేసిన మహతీర్ బిన్ మహ్మద్ వంటి వారు భారతీయ మూలాలున్నవారే. ప్రపంచంలోని అగ్రస్థానాల్లో ఉన్న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ళ, ఈ మధ్య వరకు ట్విట్టర్ సీఈఓగా కొనసాగిన పరాగ్ అగర్వాల్, పెప్సికోలా ఒకప్పటి సీఈఓ ఇంద్రనూయి వంటి వారెందరో భారతీయ మూలలున్నవారే. నేడు ప్రపంచంలో వివిధ దేశాల్లో ప్రముఖపాత్ర వహిస్తున్న ప్రవాస భారతీయులు బ్రిటిష్ రాజ్ కాలంలో, తదనంతరం విదేశాలకు వెళ్ళినవారే. ముఖ్యంగా వ్యవసాయం పనుల కోసం వెళ్ళిన భారతీయులు అక్కడ స్థిరపడ్డారు. మారిషస్, గయానా, ట్రినిడాడ్ అండ్ టుబాగో, కెనడా, దక్షిణాఫ్రికా మలేసియా, ఫిజీ వంటి కామన్వెల్త్ దేశాల్లో ముఖ్య భూమిక పోషిస్తున్నవారు వీరే! స్వాతంత్య్రానంతరం ప్రపంచ కలల దేశమైన అమెరికాకు భారతీయ వలసలు ప్రారంభమై, నేడు సుమారు 45 లక్షల మంది ఆ గడ్డపై తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు. 10 దేశాల్లో భారతీయుల జనాభా 10 లక్షలు దాటితే మరో 22 దేశాల్లో లక్షకు పైగా వున్నారు. డర్బన్ నగరాన్ని మినీ ఇండియాగా అభివర్ణిస్తారంటే ఆ నగరంలో భారతీయుల హవాని అర్థం చేసుకోవచ్చు. ప్రతీ ఏడు 25 లక్షల భారతీయులు విదేశాలకు వలస వెళ్తున్నారు. భారతీయ వలసల్లో ఇదే పంథా కొనసాగితే ఈ శతాబ్దం అంతానికి భారతీయ పరిమళాలు ధరణి అంతా మరింత వ్యాపించి రవి అస్తమించని ‘భారతీయం’ సాక్షాత్కరిస్తుంది. (క్లిక్ చేయండి: నా జీవితంలో మర్చిపోలేని భయానక ఘటన అది..! - కోరాడ శ్రీనివాసరావు ప్రభుత్వాధికారి, ఏపీ (జనవరి 8–10 ప్రవాసీ భారతీయ దివస్ ఉత్సవాల సందర్భంగా) -
మహిళా స్టార్టప్లపై గూగుల్ ఫోకస్
న్యూఢిల్లీ: దేశీయంగా మహిళల సారథ్యంలో నడిచే స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టడంపై టెక్ దిగ్గజం గూగుల్ మరింతగా దృష్టి పెట్టనుంది. 75 మిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది. అలాగే, 100 పైచిలుకు భారతీయ భాషల్లో వాయిస్, టెక్ట్స్ సెర్చ్ను సపోర్ట్ చేసే వ్యవస్థపై కసరత్తు చేస్తోంది. భారత పర్యటనకు వచ్చిన గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఈ విషయాలు వెల్లడించారు. భారతీయ స్టార్టప్స్లో 300 మిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు, ఇందులో నాలుగో వంతు భాగం (సుమారు 75 మిలియన్ డాలర్లు) మహిళల సారథ్యంలోని ప్రారంభ దశ అంకుర సంస్థల్లో ఇన్వెస్ట్ చేయనున్నట్లు గూగుల్ ఫర్ ఇండియా 2022 కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన వివరించారు. భారీ స్థాయిలో విస్తరించిన టెక్నాలజీ .. ప్రపంచవ్యాప్తంగా అందరి జీవితాలను స్పృశిస్తున్న నేపథ్యంలో నియంత్రణలనేవి బాధ్యతాయుతమైనవిగా, సమతూకం పాటించేవిగా ఉండాలని పిచాయ్ పేర్కొన్నారు. ఎగుమతుల విషయంలో భారత్ అతి పెద్ద దేశంగా ఎదగగలదని ఆయన తెలిపారు. ఇంటర్నెట్ను చౌకగా అందుబాటులోకి తెచ్చేందుకు 2020లో గూగుల్ 10 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 75,000 కోట్లు)తో ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ద్వారా ఇప్పటికే 4.5 బిలియన్ డాలర్లతో జియోలో 7.73 శాతం, భారతి ఎయిర్టెల్లో 700 మిలియన్ డాలర్లతో 1.2 శాతం వాటాలను గూగుల్ కొనుగోలు చేసింది. ప్రధాని, రాష్ట్రపతితో భేటీ .. పర్యటన సందర్భంగా పిచాయ్ కేంద్ర టెలికం, ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్, ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును కలిశారు. ‘మీ సారథ్యంలో భారత్ సాంకేతిక రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతుండటం స్ఫూర్తిదాయకమైన విషయం‘ అని మోదీతో భేటీ అనంతరం పిచాయ్ ట్వీట్ చేశారు. సమావేశంలో ఏయే అంశాలు చర్చించారనేది వెల్లడించలేదు. అయితే, ‘గూగుల్ చిన్న వ్యాపారాలు .. స్టార్టప్లకు మద్దతుగా నిలవడం, సైబర్ సెక్యూరిటీలో ఇన్వెస్ట్ చేయడం, విద్య..నైపుణ్యాల్లో శిక్షణ కలి్పంచడం, వ్యవసాయం.. ఆరోగ్య సంరక్షణ వంటి రంగాల్లో కృత్రిమ మేథను వినియోగిస్తుండటం వంటి అంశాల‘ పై ప్రధానితో చర్చించనున్నట్లు పిచాయ్ తన బ్లాగ్లో పేర్కొన్నారు. అలాగే, స్పీచ్ టెక్నాలజీ, వాయిస్, వీడియో సెర్చ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత పలు ప్రాజెక్టులను బ్లాగ్లో ప్రస్తావించారు. తాను భారత్లో పర్యటించిన ప్రతిసారి భారత స్టార్టప్ వ్యవస్థ గణనీయంగా మెరుగుపడుతుండటాన్ని గమనిస్తున్నానని ఆయన తెలిపారు. గూగుల్ ఫర్ ఇండియా కార్యక్రమం సందర్భంగా తమ అనువాదం, సెర్చ్ టెక్నాలజీ సేవలను మెరుగుపర్చుకునేందుకు దేశవ్యాప్తంగా 773 జిల్లాల నుంచి స్పీచ్ డేటాను సేకరించేందుకు బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్తో జట్టు కట్టినట్లు గూగుల్ తెలిపింది. అలాగే ఐఐటీ మద్రాస్లో ఏఐ సెంటర్ ఏర్పాటు కోసం 1 మిలియన్ డాలర్ల గ్రాంటును అందించనున్నట్లుపేర్కొంది.వ్యవసాయ రంగానికి సంబంధించి అధునాత టెక్నాలజీలపై పని చేసేందుకు గూగుల్డాట్ఆర్గ్ ద్వారా వాధ్వానీ ఏఐకి 1 మిలియన్ గ్రాంటు అందిస్తున్నట్లు గూగుల్ వివరించింది. ‘మీతో నవకల్పనలు, టెక్నాలజీ వంటి ఎన్నో విషయాలను చర్చించడం సంతోషం కలిగించింది. మానవజాతి పురోగతికి, సుస్థిర అభివృద్ధికి టెక్నాలజీని వినియోగించడంలో ప్రపంచ దేశాలు కలిసి పని చేయడం చాలా ముఖ్యం’. – ప్రధాని మోదీ ట్వీట్ చదవండి: ఇది మరో కేజీఎఫ్.. రియల్ ఎస్టేట్ సంపాదన, భవనం మొత్తం బంగారమే! -
అలర్ట్, ‘గూగుల్ పే’ లో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ఏంటో తెలుసా!
ప్రముఖ సెర్చింజిన్ గూగుల్ సంచలనం నిర్ణయం తీసుకుంది. భారత్లో యూపీఐ ఆధారిత గూగుల్ పే సేవల్లో వాయిస్ ద్వారా ‘ట్రాన్సాక్షన్ సెర్చ్’ ఫీచర్ తీసుకొస్తున్నట్లు ఆ సంస్థ సీఈవో సుందర్ పిచ్చాయ్ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రగతి మైదాన్లో జరిగిన గూగుల్ 8వ ఎడిషన్లో సంస్థ సీఈవో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గూగుల్ అందుబాటులోకి తేనున్న ఫీచర్లను పరిచయం చేశారు. ముఖ్యంగా డాక్టర్ల ప్రిస్కప్షన్తో పాటు స్థానిక భాషల్లో సమాచారం,మల్టీ సెర్చ్ ఇలా రకరకాల ఫీచర్లను గురించి పిచ్చాయ్ వివరించారు. దీంతో పాటు గూగుల్ పేలో ఈ సరికొత్త ఫీచర్ను ఎనేబుల్ చేయనున్నట్లు తెలిపారు. ఇదే ఈవెంట్లో కేంద్ర టెలీ కమ్యూనికేషన్స్ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల పలు రంగాల్లో గణనీయ మార్పులు రానున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు. -
‘మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా’..పిచాయ్ వార్నింగ్..ఆందోళనలో గూగుల్ ఉద్యోగులు!
అనిశ్చిత స్థూల ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో గూగుల్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మెటా, అమెజాన్, ట్విటర్ తరహాలో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు రానున్న రోజుల్లో భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించేలా నిర్ణయం తీసుకున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఆ నివేదికల్ని ఊటంకిస్తూ గత వారం గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ రాబోయే వారాల్లో దాదాపు 10వేలు, అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగుల్ని తొలగించనుందనే వార్తలు వచ్చాయి. దీనికి తోడు ఆల్ హ్యాండ్ మీటింగ్ తరువాత గూగుల్ సంస్థలోని పరిణామాలు ఉద్యోగులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నట్లు సమాచారం. చదవండి👉 ‘నాతో గేమ్స్ ఆడొద్దు’..! మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా ఈ తరుణంలో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ త్వరలో ఉద్యోగుల తొలగింపులపై సంకేతాలు ఇచ్చారని, పర్ఫార్మెన్స్ సరిగ్గా లేని ఉద్యోగుల లేఆఫ్స్పై పరోక్షంగా స్పందించారని ఆ సంస్థ ఉద్యోగులు చెబుతున్నారు. ఇక, ఉద్యోగులకు పింక్ స్లిప్లు జారీ చేసే విషయంలో భవిష్యత్తు ఎలా ఉంటుందో అంచనా వేయడం కష్టమని చెప్పినట్లు బిజినెస్ ఇన్సైడర్ సైతం తన కథనంలో పేర్కొంది. ఉద్యోగులపై గ్రాడ్ అస్త్రం అంతేకాదు ఈ ఏడాది చివరి నాటికి ఉద్యోగులు మరింత సమర్థవంతంగా పనిచేయాలని పిచాయ్ ఉద్యోగుల్ని కోరారు. కీలకమైన విభాగాలు తప్ప మిగిలిన అన్నీ వాటిల్లో హైరింగ్ నిలిపివేశారు. ఉద్యోగులు వారు చేసే పనిని డబ్బుతో పోల్చుకూడదని సూచించారు.ఉద్యోగులపై వేటు వేసే విషయంలో గూగుల్ రివ్యూస్ అండ్ డెవెలప్మెంట్ (grad) ఉపయోగించాలని యోచిస్తోంది. తద్వారా వర్క్ విషయంలో ఉద్యోగుల పనితీరు ఎలా ఉందో ఫీడ్ బ్యాక్ తీసుకోవచ్చు. ఈ ఫీడ్ బ్యాక్ ఆధారంగా గూగుల్ ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపనుంది. ఇప్పుడేనా.. గతంలో లేఆఫ్స్ గురించి పిచాయ్ ఈ తరహా వ్యాఖ్యల్ని గతంలో చేశారు. ఈ ఏడాది క్యూ2 ఫలితాల విడుదల అనంతరం పిచాయ్ మాట్లాడుతూ.. సంస్థ పనితీరు అంచనాల కంటే బలహీనంగా ఉందని అన్నారు. ఉద్యోగుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. ఉద్యోగులు ఎక్కువ మందే ఉన్నారు. కానీ పనిచేసేది కొద్ది మంది మాత్రమే. ప్రతి ఒక్కరూ వర్క్ ప్రొడక్టివిటీని పెంచాలని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పుడు పిచాయ్ మరోసారి ఈ తరహా హెచ్చరికలు జారీ చేయడంతో గూగుల్ ఉద్యోగుల్లో కలవరం మొదలైనట్లు నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. చదవండి👉 భారతీయులేనా పనిమంతులు.. మేం పనికి రామా? టీసీఎస్పై అమెరికన్ల ఆగ్రహం! -
పాక్ అభిమాని గూబ గుయ్మనేలా..సుందర్ పిచాయ్ రిప్లయ్ అదిరింది
ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ‘మొదటి 3 ఓవర్లు’ చూడమని సలహా ఇచ్చిన పాక్ అభిమానికి గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ అద్భుతంగా స్పందించారు. టీ 20 ప్రపంచకప్లో పాకిస్తాన్పై భారత్ అద్భుత విజయం సాధించింది. మెల్బోర్న్లో జరిగిన భారత్- పాక్ మ్యాచ్లో కోహ్లీ తన విశ్వరూపం చూపించాడు. కళ్లముందే టీమ్ఇండియా టాప్ ఆర్డర్ పేకమేడలా కూలుతున్నా..ప్రశాంతంగా ఉన్నాడు. ఓడిపోతామనుకున్న మ్యాచ్ను చివరి వరకూ క్రీజ్లో నిలబడి గెలిపించాడు. చిరస్మరణీయ ఇన్నింగ్స్తో 53 బంతులు ఎదుర్కొన్న కోహ్లి 6 ఫోర్లు, 4 సిక్స్లతో 82 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును విరాట్ అందుకున్నాడు. Happy Diwali! Hope everyone celebrating has a great time with your friends and family. 🪔 I celebrated by watching the last three overs again today, what a game and performance #Diwali #TeamIndia #T20WC2022 — Sundar Pichai (@sundarpichai) October 24, 2022 నరాలు తెగే ఉత్కంఠలో దాయాది దేశంపై గెలిచిన భారత్పై క్రికెట్ లవర్స్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కానీ దురభిమానులు మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. పాక్ ఓటమిని తట్టుకోలేక టీవీలు పగలగొడుతున్నారు.మరికొందరు పాక్ బౌలింగ్ వేసిన మొదటి 3 ఓవర్లు చూడమని ట్వీట్లు చేస్తున్నారు. అయితే దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కోహ్లీ ఆటతీరును ప్రశంసిస్తూ పిచాయ్ ఇలా ట్విట్ చేశారు. ‘దీపావళి శుభాకాంక్షలు! ఈ ఆనంద క్షణాల్నిస్నేహితులు, కుటుంబ సభ్యులతో గడపండి. నేను ఈరోజు చివరి మూడు ఓవర్లను మళ్లీ చూసి సంబరాలు చేసుకున్నాను. వాట్ ఏ గేమ్.. వాట్ ఏ పర్ఫార్మెన్స్ అంటూ ఆ ట్వీట్లో పేర్కొన్నారు. After many requests received from neighbours I have decided to frame this picture @sundarpichai #PakvsIndia pic.twitter.com/LC3ZCe8i3t — Muhammad Shahzaib (@Muhamma91436212) October 24, 2022 ఆ ట్వీట్పై ఓ పాక్ అభిమాని స్పందించాడు. ‘మీరు మొదటి మూడు ఓవర్లు చూడాలి’ అని వెటకారంగా అన్నాడు. దానికి పాక్ అభిమానికి గూబ గుయ్మనేలా సుందర్ పిచాయ్ రిప్లయి ఇచ్చారు. ‘‘ఓ అది కూడా చూశాను. భువీ - అర్ష్దీప్ బౌలింగ్ అద్భుతంగా చేశారని ప్రశంసల వర్షం కురిపించారు. కాగా, ప్రస్తుతం సుందర్ పిచాయి పాక్ అభిమానికి ఇచ్చిన ఎపిక్ రిప్లయి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. చదవండి👉 సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ భారీ షాక్! ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
గూగుల్ ఉద్యోగులకు సీఈవో సుందర్ పిచాయ్ భారీ షాక్!
ఆర్థిక మాంద్యం ప్రపంచ దేశాల్ని ఆందోళనకు గురి చేస్తుంది. దీంతో అన్నీ రంగాలకు చెందిన జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఖర్చుల్ని తగ్గించుకుంటున్నాయి. నియామకాల్ని నిలిపివేస్తున్నాయి. ఈ నేపథ్యంలోప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సైతం భారీ ఎత్తున ఉద్యోగుల్ని తొలగించనుందా? అంటే అవుననే అంటున్నాయి తాజాగా పరిణామాలు. గూగుల్ ఇటీవల క్యూ2 వార్షిక ఫలితాల్ని విడుదల చేసింది. ఆదాయాలు, రాబడుల పరంగా 'అంచనాల కంటే బలహీనంగా ఉండడంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉద్యోగుల పనితీరును ప్రశ్నించారు. ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్నా..వారిలో పనిచేసేది కొంతమందేనంటూ టాప్ ఎగ్జిక్యూటివ్లతో జరిగిన ఇంటర్నల్ మీటింగ్లో పిచాయ్ అన్నట్లు తెలుస్తోంది. పిచాయ్ వ్యాఖ్యలతో..గూగుల్ త్వరలో ఉద్యోగుల్ని తొలగించనుంది' అంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ తరణంలో ఉద్యోగుల్ని తొలగించేందుకు గూగుల్ సిద్ధమైంది. వచ్చే వార్షిక ఫలితాల విడుదల సమాయానికి ఉద్యోగుల సేల్స్, ప్రొడక్టివిటీ విభాగాల్లో పర్ఫార్మెన్స్ బాగుంటే సరేసరి. లేదంటే వేటు తప్పదని గూగుల్ క్లౌడ్ సేల్స్ విభాగానికి చెందిన ఉద్యోగులతో తెలిపారు. ది న్యూయార్క్ పోస్ట్ సైతం గూగుల్ ఉద్యోగాల నియామకాల్ని నిలిపి వేయడం, అదే సమయంలో తొలగింపుపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపింది. ఉద్యోగుల తొలగింపు ఖాయమంటూ తన కథనంలో హైలెట్ చేసింది. చదవండి👉'మీ పర్ఫార్మెన్స్ బాగలేదయ్యా'..ఉద్యోగులకు సుందర్ పిచాయ్ వార్నింగ్! -
లార్డ్స్లో కలిసి మ్యాచ్ చూసిన రవిశాస్త్రి, సుందర్ పిచాయ్, ముఖేష్ అంబానీ ..!
టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రస్తుతం ఇంగ్లండ్ క్రికెట్ టోర్నీ ది హండ్రెడ్ లీగ్లో కామెంటేటర్ వ్యవహారిస్తున్నాడు. ఈ లీగ్లో భాగంగా సోమవారం లార్డ్స్ వేదికగా లండన్ స్పిరిట్, మాంచెస్టర్ ఒరిజినల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ను రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్తో కలిసి రవిశాస్త్రి వీక్షించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోను రవిశాస్త్రి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేశాడు. "క్రికెట్ను ఎక్కువగా ఇష్టపడే ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్తో క్రికెట్ పుట్టినిల్లు లార్డ్స్లో మ్యాచ్ చూడడం చాలా సంతోషంగా ఉంది" అంటూ ఈ పోస్ట్కు రవిశాస్త్రి క్యాప్షన్గా పెట్టాడు. కాగా వ్యక్తిగత కారణాలతో ముఖేష్ అంబానీ, సుందర్ పిచాయ్ ఇంగ్లండ్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మ్యాచ్ విషయానికొస్తే లండన్ స్పిరిట్ ది హండ్రెడ్ 2022లో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మాంచెస్టర్పై 52 పరగుల తేడాతో లండన్ స్పిరిట్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లండన్ నిర్ణీత 100బంతుల్లో 6వికెట్లు కోల్పోయి 160పరుగులు చేసింది. లండన్ బ్యాటర్లలో జాక్ క్రాలే(41), మోర్గాన్(37) కిరాన్ పొలార్ట్( 34) పరుగులతో రాణించారు. అనంతరం 161 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మాంచెస్టర్ ఒరిజినల్స్ 108 పరుగులకే కుప్పకూలింది. మాంచెస్టర్ బ్యాటర్లలో సాల్ట్ 36 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. లండన్ బౌలర్లలో జోర్డాన్ థాంప్సన్ నాలుగు వికెట్లతో చేలరేగగా.. మాసన్ క్రేన్,లియామ్ డాసన్ తలా రెండు వికెట్లు సాధించారు. In the august company of two people who love their cricket @HomeOfCricket - Mr Mukesh Ambani and Mr @sundarpichai at @thehundred @SkyCricket pic.twitter.com/JYnkGlMd8W — Ravi Shastri (@RaviShastriOfc) August 9, 2022 చదవండి: CWG 2022: కామన్వెల్త్ గేమ్స్లో ఓటమి.. ఇంగ్లండ్ హెడ్ కోచ్ సంచలన నిర్ణయం! -
డబ్బులెవరికి ఊరికే రావు సార్, సుందర్ పిచాయ్పై పోలీసులకు ఫిర్యాదు!
ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్కు చెందిన టాప్ ఎగ్జిక్యూటివ్లతో పాటు, సీఈవో సుందర్ పిచాయ్ వ్యవహారం పోలీస్టేషన్ వరకు చేరింది. యాప్ బిల్లింగ్ సిస్టమ్లో డొమొస్టిక్ యాప్ డెవలపర్ల నుంచి భారీ ఎత్తున కమిషన్లను వసూలు చేస్తున్నారని ఆరోపిస్తూ వినియోగదారుల సంఘం సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొరియా టైమ్స్ కథనం ప్రకారం..సిటిజన్ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ (సీయూసీఎస్) సభ్యులు సుందర్ పిచాయ్, గూగుల్ కొరియా సీఈవో నాన్సీ మాబెల్ వాకర్, గూగుల్ ఏసియా పసిపిక్ ప్రెసిడెంట్ స్కాట్ బ్యూమాంట్లపై సౌత్ కొరియా సియో నగరంలోని గంగ్నమ్ జిల్లా పోలిసుల్ని ఆశ్రయించారు. గూగుల్ టాప్ ఎగ్జిక్యూటీవ్లు దేశ టెలికమ్యూనికేషన్ బిజినెస్ యాక్ట్ నిబంధనల్ని ఉల్లంఘించారంటూ పోలీసులకు సీయూసీఎస్ సభ్యులు చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. గూగుల్ యాప్ పేమెంట్ పాలసీ పెంచుతున్న కమిషన్ల కారణంగా వినియోగదారులకు భారంగా, క్రియేటర్లకు నష్టం వాటిల్లేలా ఉందంటూ కన్జ్యూమర్ గ్రూప్ అధికార ప్రతినిధి తెలిపారు. "యాప్ డెవలపర్లకు ప్రత్యామ్నాయం లేదు. తప్పని సరిగా గూగుల్ సంస్థ చెప్పినట్లే వినాలి. ఎందుకంటే యాప్స్టోర్ మార్కెట్ షేర్ గూగుల్కు 74.6 శాతంగా ఉందని" అన్నారు. వివాదం ఏంటంటే సంస్థకు సంబంధించిన డిజిటల్ ప్రొడక్ట్లు సేల్ చేయాలన్నా,సంబంధిత యాప్స్ సర్వీస్లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి అందించాలన్నా గూగుల్కు 15శాతం నుంచి 30 వరకు కమిషన్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఆ కమిషన్ ఎక్కువగా ఉండడంతో యాప్ డెవలపర్లు 15 శాతం నుంచి 20శాతం మాత్రమే కమిషన్ చెల్లించి థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల ద్వారా గూగుల్కు పేమెంట్ చేసేవారు. దీంతో యజమానులకు గూగుల్కు పెద్దమొత్తంలో చెల్లించే కమిషన్ల భారం తగ్గిపోయింది. యాప్స్ను బ్లాక్ చేస్తాం అదే సమయంలో యాప్ డెవలపర్ల నుంచి వచ్చే కమిషన్ పడిపోవడంతో గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై యాప్ డెవలపర్లు థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్ సంస్థల నుంచి చెల్లింపులు జరపకూడదని హెచ్చరించింది. అలా చేస్తే సదరు యాప్స్ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి బ్లాక్ చేస్తామని తెలిపింది. పనిలో పనిగా గూగుల్కు లింకైన థర్డ్ పార్టీ పేమెంట్ సర్వీస్లను నిలిపివేసింది. దీంతో వినియోగదారుల సంఘం సభ్యులు గూగుల్పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ తీరు మారలేదు! ఈ ఏడాది మార్చి నెలలో గూగుల్ తీరుతో సౌత్ కొరియా కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. యాప్ డెవలపర్లు వారి ఇష్ట ప్రకారమే చెల్లింపులు చేసుకోవచ్చని, ఆ విషయంలో గూగుల్ ఒత్తిడి చేయకూడదని సవరించిన బిల్లుపై కేబినెట్ ఆమోదం తెలిపింది.అయినా సౌత్ కొరియా కేబినెట్ తెచ్చిన ప్రతిపాదనల్ని తిరస్కరించింది. ఏప్రిల్ 1 నుంచి డెవలపర్లను తమ బిల్లింగ్ పేమెంట్ సిస్టమ్ను ఉపయోగించాలని సూచించింది. లేని పక్షంలో యాప్స్లను ప్లేస్టోర్ నుంచి తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చింది. గూగుల్ తాజా నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ యునైటెడ్ ఫర్ కన్జ్యూమర్ సోవర్జినిటీ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ భారీ షాక్! -
ఉక్రెయిన్ కోసం గూగుల్.. సుందర్ పిచాయ్ డేరింగ్ స్టెప్..
Google Ukraine Support Fund: గూగుల్ కంపెనీ గ్లోబల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇచ్చిన మాటకు కట్టుబడ్డాడు. సంక్షోభ సమయంలో ఆపన్నులకు అండగా నిలిచేందుకు గూగుల్ సిద్ధంగా ఉందంటూ ప్రపంచానికి సందేశం పంపాడు. యుద్ధం కారణంగా తీవ్రంగా దెబ్బ తిన్న ఉక్రెయిన్ సంస్థలకు భారీ ఆర్థిక సాయం ప్రకటించారు. నాటో విషయంలో తలెత్తిన బేదాభిప్రాయలు చినికిచినికి గాలివానగా మారి ఉక్రెయిన్పై యుద్ధం ప్రకటించింది రష్యా. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వారంలో మొదలైన యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే యుద్ధం కారణంగా నష్టపోతున్న ఎంట్రప్యూనర్లకు గూగుల్ అండగా ఉంటుందంటూ ఈ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ 2022 మార్చిలో ప్రకటించారు. మార్చిలో చేసిన ప్రకటనకు తగ్గట్టుగానే యుద్ధంలో నష్టపోయిన స్టార్టప్లు ఎంట్రప్యూనర్లకు సపోర్ట్గా నిలిచేందుకు సుందర్ పిచాయ్ నడుం బిగించారు. ఈ మేరకు సాయం పొందేందుకు అర్హులైన ఉక్రెయిన్ ఎంట్రప్యూనర్ల వడపోత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ విషయాన్ని సుందర్ పిచాయ్ స్వయంగా వెల్లడించారు. మొదటి రౌండ్ 17 ఉక్రెయిన్ కంపెనీలు గూగుల్ నుంచి సాయం పొందేందుకు అర్హత సాధించాయి. While in Warsaw, Poland in March, I announced our Ukraine Support Fund to help Ukrainian entrepreneurs maintain and grow their businesses in a time of war. Today we're welcoming the 1st recipients who will receive financing + mentoring from @GoogleStartups https://t.co/NQQELKCjHN — Sundar Pichai (@sundarpichai) May 31, 2022 ఉక్రెయిన్ రష్యా యుద్ధం మొదలైన తర్వాత అనేక కారొ్పరేట్ కంపెనీలు రష్యా విషయంలో కఠినంగా వ్యవహరించాయి. అక్కడ తమ వ్యాపార కలాపాలను నిలిపేశాయి. ఇదే సమయంలో యుద్ధం వల్ల నష్టపోయిన ఉక్రెయిన్కు సాయం చేసే విషయంలో స్పష్టమైన కార్యాచరణ పెద్దగా ప్రకటించలేదు. కానీ గూగుల్ ఇందుకు భిన్నంగా ఉక్రెయిన్లో నష్టపోయిన స్టార్టప్లకు సాయం చేయడం ప్రారంభించింది. చదవండి: Anand Mahindra: అబ్దుల్ కలామ్ మాటల స్ఫూర్తితో -
సస్పెన్స్తో చంపేశారు, ఆ సీక్రెట్ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్!
తమకు నచ్చిన హీరో, లేదంటే ఆటగాళ్ల వ్యక్తిగత విషయాల గురించి ఫ్యాన్స్ తెలుసుకునేందుకు ఆరాట పడుతుంటారు. వాళ్ల బ్యాగ్రౌండ్ ఏంటీ? స్కూలింగ్, కాలేజ్ ఎడ్యుకేషన్ ఎక్కడ కంప్లీట్ చేశారనే విషయాల గురించి ఆరాలు తీస్తుంటారు. ఈ ఇంట్రస్ట్.. సినిమా హీరోలు, స్పోర్ట్స్ పర్సన్ల గురించే కాదండోయ్..టెక్ సంస్థల సీఈఓల గురించి తెలుసుకునేందుకు మక్కువ చూపుతుంటారు. భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన టెక్నాలజీ లెజెండ్ సుందర్ పిచాయ్. శ్రమ, చిత్తశుద్ధితో ప్రపంచానికి తానేంటో నిరూపించి చూపిన వ్యక్తి. దక్షిణ భారతదేశం నుంచి మొదలైన సుందర్ ప్రయాణం.. అమెరికా వరకు దిగ్విజయంగా సాగుతోంది. అయితే ఈ నేపథ్యంలో సుందర్ పిచాయ్ సంవత్సరాలుగా తన స్కూలింగ్ ఎక్కడ కంప్లీట్ అయ్యిందనే విషయాల్ని ఎక్కడ రివిల్ చేయకుండా టెక్ లవర్స్ను సస్పెన్స్కు గురి చేశారు. తాజాగా స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో జరిగిన ఇంటర్వ్యూలో పిచాయ్ తన స్కూల్ విద్యాభ్యాసంపై ఆసక్తిర విషయాల్ని పంచుకున్నారు. ఇంటర్వ్యూయర్ వికీపీడియా పేజీలో కనిపించిన స్కూల్ జాబితాను చూపించాడు. దానికి పిచాయ్ వికీపీడియాలో కనిపించిన పేర్లలో రెండు సరైనవేనని, అతను చెన్నైలోని వాణ వాణిలో తన పాఠశాల విద్యను పూర్తి చేసినట్లు చెప్పారు. తన ఎడ్యుకేషన్పై అనేక రూమర్లు వచ్చాయని, వాటిల్లో ఎలాంటి వాస్తవం లేదని పిచాయ్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. పిచాయ్ ఉన్నత విద్య విషయానికొస్తే ఐఐటీ ఖరగ్పూర్లో మెటలర్జికల్ ఇంజనీరింగ్లో తన బీటెక్ను, ఆ తర్వాత ఇంజినీరింగ్లో మెటీరియల్ సైన్స్ విభాగంలో ఎంఎస్ చేయడానికి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి వెళ్లారు. పెన్సిల్వేనియా యూనివర్సిటీలో వార్టన్ స్కూల్ నుండి ఎంబీఏ చదివారు. ఆ తర్వాత 2004లో పిచాయ్ గూగుల్లో ప్రొడక్ట్ మేనేజ్మెంట్ విభాగంలో లీడ్గా తన కెరియర్ను ప్రారంభించి అనతి కాలంలో గూగుల్ సీఈఓగా సుందార్ పిచాయ్ అవతరించారు. చదవండి👉సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ భారీ షాక్! -
సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ భారీ షాక్!
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉద్యోగాలు కోల్పోయారు. సంస్థలు ఉద్యోగుల జీతాల్లో కోత విధించాయి. మరి సాధారణ సంస్థల్లో పరిస్థితిలు ఇలా ఉంటే..దిగ్గజ టెక్ కంపెనీలు అందుకు విభిన్నంగా వ్యవహరించాయి. ప్రపంచ దేశాలకు చెందిన టాప్-10 టెక్ కంపెనీలు ఆ సంస్థల్లో పనిచేస్తున్న సీఈఓలకు 2020-2021 మధ్య కాలంలో భారీగా బోనస్లు అందించినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. అనూహ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ షాకిచ్చింది. కోవిడ్ సమయంలో టెక్ కంపెనీలు అద్భుతమైన పనితీరును ప్రదర్శించాయి. దీంతో టెక్ కంపెనీలు వారి సంస్థల్లో సీఈఓలుగా పనిచేస్తున్న వారికి ఊహించని విధంగా బోనస్లు పెంచాయి. కానీ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు గూగుల్ సంస్థ 14శాతం బోనస్ను తగ్గించిందని ఫైన్బోల్డ్ సంస్థ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. ఇదే అంశాన్ని జాతీయ మీడియా సంస్థ న్యూస్-18 ఓ కథనాన్ని ప్రధానంగా ప్రచురించింది. టాప్-5 సీఈఓల బోనస్లు భారీగా బోనస్లు పెరిగిన సీఈఓల జాబితాలో అమెరికాకు చెందిన ప్రముఖ సెమీకండక్టర్ మ్యానిఫ్యాక్చరింగ్ సంస్థ బ్రాడ్కామ్ సీఈఓ తాన్ హాక్ ఎంగ్ ఉన్నారు. ఆయన అత్యధికంగా ఏకంగా 1586శాతం బోనస్ పొందాడు. ఇది 3.6 అమెరికన్ మిలియన్ డాలర్ల నుంచి 60.7మిలియన్ డాలర్లుగా ఉంది. తాన్ హాక్ ఎంగ్ తర్వాత ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ (Safra Ada Catz), ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్, యాపిల్ సీఈఓ టీమ్ కుక్, అమెజాన్ సీఈఓ ఆండీ జెస్పీ ఉన్నారు. ఒరాకిల్ సీఈఓ సాఫ్రా అడా క్యాట్జ్ అత్యధికంగా బోనస్లు పొందిన సీఈఓల జాబితాలో 2వ స్థానంలో నిలిచారు. 999శాతంతో భారీగా బోనస్ పొందారు. ప్యాండమిక్లో టెక్ దిగ్గజాలు భారీ ఎత్తున లాభాల్లో గడించాయి. దీంతో సంస్థలు సైతం అందుకు కారణమైన సీఈఓలకు కళ్లు చెదిరేలా బోనస్లు అందించినట్లు ఫైన్బోల్డ్ తన నివేదికలో హైలెట్ చేసింది. ఇంటెల్ సీఈఓ పాట గ్లెసింగెర్ 713.64శాతంతో 22 మిలియన్ల నుంచి 179 మిలియన్ డారల్లను పొందారు. అదే సమయంలో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సైతం 571.63శాతం బోనస్తో 35.8 మిలియన్ల నుంచి 211.9మిలియన్లు, అమెజాన్ సీఈఓ అండీ జాస్సీ 491.9 శాతంతో 35.8 మిలియన్ల నుంచి 211.9 మిలియన్లను సొంతం చేసుకొని.. అత్యధికంగా బోనస్లు పొందిన టాప్-5 టెక్ కంపెనీల సీఈఓల జాబితాలో ఒకరిగా నిలిచారు. సుందర్ పిచాయ్కు భారీ షాక్! మరో సాఫ్ట్వేర్ దిగ్గజం ఎన్విడియా సీఈఓ జెన్సన్ హువాంగ్ 52.17 శాతం బోనస్ను, సిస్కో సీఈఓ చుక్ రాబిన్సన్ 9.48శాతం బోనస్, మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ 5.93 శాతం పొందగా..నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హ్యాస్టింగ్స్ 19.68 శాతంతో 43.2 మిలియన్ డాలర్ల నుంచి 34.7 మిలియన్ డాలర్లు, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్కు 14శాతం బోనస్ కట్ చేసి భారీ షాక్ ఇచ్చింది. అయితే సుందర్ పిచాయ్ బోనస్ కోల్పోయినా స్టాక్ ప్యాకేజీ భారీగా దక్కించుకున్నారు. 2020 నుంచి సుందర్ పిచాయ్ వార్షిక వేతనం (సంవత్సరం) రూ.14కోట్లు ఉండగా..అదనంగా 2020, 2021ఈ రెండేళ్ల కాలంలో స్టాక్ ప్యాకేజీ కింద గూగుల్ సంస్థ రూ.1707కోట్లు అందించినట్లు ఫైన్బోల్డ్ నివేదిక తెలిపింది. చదవండి: ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు -
ఉద్యోగులకు ఫ్రీడమ్ ఇద్దాం.. సుందర్ పిచాయ్ సంచలన వ్యాఖ్యలు
ప్రపంచ దేశాలతో పాటూ మనదేశంలో పలు దిగ్గజ ఐటీ కంపెనీలు మార్చి నెలాఖరులోగా ఉద్యోగులు ఆఫీస్కు రావాలంటూ మెయిల్స్ పంపించాయి. పనిలో పనిగా ఆఫీస్ వాతావరణాన్ని ఉద్యోగులకు అనుకూలంగా మార్చేస్తున్నాయి. అయితే ఈ తరుణంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్తో జరిగిన ఓ సుందర్ పిచాయ్ మాట్లాడుతూ..కరోనా ప్రభావం దాదాపు తగ్గిపోవడం, మార్కెట్లోని అన్ని రంగాలూ సాధారణ స్థితికి చేరడంతో.. ఐటీ కంపెనీలు ఉద్యోగుల్ని ఆఫీస్లకు రావాలని పిలుపు నివ్వడంపై స్పందించారు. గూగుల్ సంస్థ వర్క్ ఫ్రమ్ హోమ్ను కొనసాగిస్తున్నట్లు చెప్పారు. కొంత మంది ఉద్యోగులు మాత్రం వారానికి మూడు రోజులు ఆఫీస్కు వస్తామంటూ మెయిల్స్ పంపిస్తున్నారు. ఉద్యోగులు వర్క్, వ్యక్తిగత జీవితాన్ని మరింత సంతృప్తికరంగా మార్చేలా కోరుకుంటున్నారని అన్నారు. గత రెండేళ్లుగా ఉద్యోగులు పనిఒత్తిడి కారణంగా అసంతృప్తితో ఉన్నారని, వారికి నచ్చినట్లు వర్క్ కల్చర్ను మార్చేస్తే ప్రొడక్టివిటీతో పనిచేస్తారని తెలిపారు. అంతేకాదు వారికి ఫ్రీడం ఇవ్వడం వల్ల ఇన్నోవేటీవ్గా పనిచేస్తారని వాల్ స్ట్రీట్ జర్నల్కి చెప్పారు. కాగా, ఈ వ్యాఖ్యలపై దిగ్గజ ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని ఉద్యోగులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: వర్క్ ఫ్రమ్ హోమ్ !! రండి.. రండి.. దయచేయండి.. ఉద్యోగులకు టెక్ కంపెనీల పిలుపు!! -
భారత ప్రజలారా.. మీకు కృతజ్ఞతలు.. ఎమోషనలైన సత్య నాదెళ్ల
మాతృదేశాన్ని, ఇక్కడి ప్రజలను తలుచుకుని మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల భావోద్వేగానికి లోనయ్యారు. గణతంత్రదినోత్సవ వేడుకల వేళ భారత ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లకు పద్మభూషన్ అవార్డును ప్రకటించింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆయన ఎమెషనల్ అయ్యారు. భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రిలతో ఇక్కడి ప్రజలకు కృతజ్ఞనతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఎంతో మంది గొప్ప వ్యక్తులతో పాటు ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. టెక్నాలజీని ఉపయోగిస్తూ భారత్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తానంటూ చెప్పారు. It’s an honor to receive a Padma Bhushan Award and to be recognized with so many extraordinary people. I’m thankful to the President, Prime Minister, and people of India, and look forward to continuing to work with people across India to help them use technology to achieve more. — Satya Nadella (@satyanadella) January 27, 2022 సత్యనాదెళ్లతో పాటు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్కి సైతం కేంద్రం పద్మభూషన్ అవార్డును ప్రకటించింది.. దీనిపై ఆయన స్పందిస్తూ వివిధ రంగాల్లో గొప్ప ప్రతిభ చూపిన వ్యక్తులతో కలిసి ఈ అవార్డు అందుకోవడం తనకు గర్వకారణమన్నారు. -
సుందర్ పిచాయ్పై పోలీస్ కేసు
Police Complaint Against Sundar Pichai: గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్పై బుధవారం పోలీస్ కేసు నమోదు అయ్యింది. కోర్టు ఆదేశాల మేరకు ముంబై పోలీసులు పిచాయ్తో పాటు ఐదుగరు కంపెనీ ప్రతినిధులపైనా కేసు బుక్ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాపీరైట్ యాక్ట్ వయొలేషన్ కింద ఈ కేసు నమోదు అయినట్లు తెలుస్తోంది. ‘ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా’ అనే సినిమాను తన అనుమతి లేకుండా యూట్యూబ్లో అప్లోడ్ చేశారంటూ ఆ సినిమా డైరెక్టర్, నిర్మాత అయిన సునీల్ దర్శన్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాల మేరకు యూట్యూబ్ ఓనర్ కంపెనీ అయిన ‘గూగుల్’ ప్రతినిధుల పేర్లతో(సుందర్ పిచాయ్ ఇతరులు) ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. తన సినిమా హక్కుల్ని ఎవరికీ అమ్మలేదని, అలాంటిది యూట్యూబ్లో అప్లోడ్ చేయడం ద్వారా తనకు నష్టం వాటిల్లిందంటూ ఫిర్యాదుధారి సునీల్ చెప్తున్నారు. ఇల్లీగల్ అప్లోడింగ్ విషయంలో యూట్యూబ్కు ఎన్ని ఫిర్యాదు చేసినా స్పందన లేదని, అందుకే తాను ఈ చర్యకు దిగానని అంటున్నారు. ఇదిలా ఉంటే ఏక్ హసీనా థీ ఏక్ దివానా థా 2017లో రిలీజ్ అయ్యింది. రొమాంటిక్ మ్యూజికల్ డ్రామాగా ప్రమోట్ చేసుకున్న ఈ సినిమా.. డిజాస్టర్గా నిలిచింది. అయితే అదొక బీ గ్రేడ్ సినిమా అని, దీని మీద కూడా ఆ దర్శకుడు కోర్టుకెక్కడం విడ్డూరంగా ఉందంటూ కొందరు సరదా కామెంట్లు చేస్తున్నారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్కు తాజాగా పద్మ భూషణ్ పురస్కారం గౌరవం దక్కిన విషయం తెలిసిందే. -
టెక్ దిగ్గజాలకు పద్మభూషణ్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 128 మందికి పద్మ అవార్డులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర లభించింది. సీడీఎస్ బిపిన్ రావత్కు పద్మ విభూషణ్ కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. టాటా గ్రూప్ చైర్ పర్సన్ నటరాజన్ చంద్రశేఖర్, మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, ఆల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్, సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎండి సైరస్ పూనావాలాలకు పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అలాగే, కొవాగ్జిన్ టీకా తయారీ సంస్థ భారత్ బయోటెక్ చైర్మన్ కృష్ణ ఎల్లా, సహ వ్యవస్థాపకులు సుచిత్ర ఎల్లాకు పద్మభూషణ్ పురస్కారం అనౌన్స్ చేసింది. ట్రేడ్ & ఇండస్ట్రీ రంగానికి చెందిన ఐదుగురికి పద్మభూషణ్ అవార్డ్స్ లభించడంతో పాటు ఇద్దరికీ పద్మశ్రీ పురస్కారం లభించింది. దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ అవార్డులను పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ప్రదానం చేస్తున్నారు. కళలు, సామాజిక సేవ, ప్రజావ్యవహారాలు, సైన్స్ అండ్ ఇంజినీరింగ్, వర్తకం, వాణిజ్యం, వైద్యం, సాహిత్యం, విద్య, క్రీడలు, సివిల్ సర్వీసెస్ వంటి రంగాల్లో అత్యుత్తమ సేవని కనబరిచిన వారికి పద్మ అవార్డులు ప్రదానం చేస్తారు. The President of India has approved conferment of 128 Padma Awards this year.#PadmaAwards#RepublicDay2022 The list is as below - pic.twitter.com/4xf9UHOZ2H — DD News (@DDNewslive) January 25, 2022 (చదవండి: Padma Awards 2022: బిపిన్ రావత్కు పద్మ విభూషణ్!) -
ట్విటర్ ఒక్కటే కాదు.. ఈ దిగ్గజ కంపెనీలకు కూడా భారతీయులే సీఈఓలు..!
Here’s a Look at 10 Indian-Origin CEOs: నవంబర్ 29న సీఈఓగా పరాగ్ అగ్రవాల్(45)ను ట్విటర్ కంపెనీ నియమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అరడజనుకు పైగా గ్లోబల్ టెక్ కంపెనీలు భారతీయ-అమెరికన్ల నేతృత్వంలో ఉన్నాయి. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం లాంటి సంస్థలను భారతీయులు అద్భుతంగా నడుపుతున్నారు. ఇప్పుడు ఆ జాబితాలో ట్విట్టర్కు కొత్త సీఈఓగా నియమితులైన పరాగ్ అగర్వాల్ చేరారు. ఇప్పుడు ఎక్కడ చూసిన భారత మేధోసంపత్తి గురించి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఈ విషయంపై ఎలన్ మస్క్ స్పందించారు. భారతీయుల టాలెంట్ను గొప్పగా వాడుకుంటూ అమెరికా విపరీతంగా లాభపడుతోందంటూ తనదైన శైలిలో ఐర్లాండ్ బిలియనీర్, స్ట్రయిప్ కంపెనీ సీఈవో ప్యాట్రిక్ కొల్లైసన్ చేసిన ఆసక్తికరమైన ట్వీట్కు రీట్వీట్ చేశాడు. పరాగ్ నియామకంతో అంతర్జాతీయంగా పేరొందిన దిగ్గజ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం ఇతర ప్రసిద్ధ సంస్థలకు సీఈఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న భారతీయుల వివరాలు చూద్దాం. సుందర్ పిచాయ్: తమిళ నాడులో జన్మించిన సుందర్ పిచాయ్ ఆగస్టు 2015లో గూగుల్ సీఈఓగా ఎంపికయ్యారు. మాజీ సీఈఓ ఎరిక్ ష్మిత్, సహ వ్యవస్థాపకుడు లారీ పేజ్ తర్వాత సంస్థ మూడవ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా సుందర్ పిచాయ్ ఎన్నికయ్యారు. అలాగే, 2019 డిసెంబరులో పిచాయ్ గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్కు కూడా సీఈఓ అయ్యారు. సత్య నాదెళ్ల: హైదరాబాద్లో జన్మించిన సత్య నాదెళ్ల 2014 ఫిబ్రవరిలో మైక్రోసాఫ్ట్ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అదే ఏడాది ఆయన ఆ కంపెనీ చైర్మన్గానూ ఎదిగారు. ప్రస్తుతం ఆయన మైక్రోసాప్ట్ సంస్థకు ఛైర్మన్, సీఈఓగా కొనసాగుతున్నారు. తెలుగు వ్యక్తి అయిన సత్య నాదెళ్ల 1967 ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించారు. కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి 1988లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా పట్టభద్రుడయ్యారు. అరవింద్ కృష్ణ: భారతీయ సంతతికి చెందిన టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్ అరవింద్ కృష్ణ అమెరికన్ ఐటీ దిగ్గజం ఐబిఎమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా 2020 జనవరిలో జనవరి ఎంపికయ్యారు. కాన్పూర్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఆయన చదువు పూర్తి చేశారు. 1990లలో కంప్యూటర్ హార్డ్వేర్ కంపెనీ ఐబీఎంలో చేరారు. గిన్ని రోమెట్టి ఐబీఎం సీఈఓ పదవి నుంచి తప్పుకోవడంతో జనవరి 2020లో ఐబీఎం సీఈఓగా అరవింద్ కృష్ట నియమితులయ్యారు. శంతను నారాయణ్: భారతీయ అమెరికన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ శంతను నారాయణ్ డిసెంబర్ 2007 నుంచి అడోబ్ ఇంక్ చైర్మన్, అధ్యక్షుడు & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కొనసాగుతున్నారు. అంతక ముందు 2005 నుంచి కంపెనీ అధ్యక్షుడు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. శంతను నారాయణ్ భారతదేశంలోని హైదరాబాద్లో జన్మించాడు. సృజనాత్మక డిజిటల్ డాక్యుమెంట్ సాఫ్ట్వేర్ ఫ్రాంచైజీలను పెంచేస్తూ కంపెనీని బాగా విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. రంగరాజన్ రఘురామ్: భారత సంతతికి చెందిన రంగరాజన్ రఘురామ్ క్లౌడ్ కంప్యూటింగ్ కంపెనీ విఎంవేర్ కొత్త సీఈఓగా 2021 జూన్ నెలలో ఎంపికయ్యారు. 2003లో కంపెనీలో చేరిన రఘురామ్ జూన్ 1న సీఈఓ పదివిని చేపట్టారు. విఎమ్ వేర్ ప్రధాన వర్చువలైజేషన్ వ్యాపారాన్ని విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. జయశ్రీ ఉల్లాల్: జయశ్రీ వి. ఉల్లాల్ ఒక అమెరికన్ బిలియనీర్ వ్యాపారవేత్త. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ సీఈఓగా 2008 నుంచి కొనసాగుతున్నారు. అంతకు ముందు ఆమె ఏఎండీ, సిస్కో కంపెనీల్లోనూ సేవలు అందించారు. లక్ష్మణ్ నరసింహన్: గతంలో పెప్సికోలో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్గా ఉన్న లక్ష్మణ్ నరసింహన్ సెప్టెంబర్ 2019లో రాకేష్ కపూర్ తర్వాత రెకిట్ బెంకిసర్ సీఈఓగా బాధ్యతలు చేపట్టాడు. రాజీవ్ సూరి: 1967 అక్టోబరు 10న జన్మించిన రాజీవ్ సూరి ఒక సింగపూర్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్, మార్చి 1 2021 నుంచి ఇన్మార్శాట్ సీఈఓగా పనిచేస్తున్నారు. అతను గతంలో 31 జూలై 2020 వరకు నోకియా సీఈఓగా ఉన్నారు. దినేష్ సి. పాల్వాల్: పాల్వాల్ 2007 నుంచి 2020 వరకు హర్మన్ ఇంటర్నేషనల్ అధ్యక్షుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ)గా పనిచేశారు. దాదాపు 13 సంవత్సరాల తర్వాత అతను సీఈఓ పదవి నుంచి వైదొలిగారు. ఇప్పుడు డైరెక్టర్ల బోర్డుకు సీనియర్ సలహాదారుగా పనిచేస్తున్నారు. పరాగ్ అగ్రవాల్: ప్రస్తుత ట్విట్టర్ సీఈఓ పరాగ్ అగర్వాల్ ఐఐటీ ప్రవేశ పరీక్షలో 77వ ర్యాంకు సాధించారు. బాంబే ఐఐటీలో ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్లో బీటెక్ పూర్తి చేశారు. ప్రఖ్యాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్లో పీహెచ్డీ పూర్తి చేశారు. 2011లో ట్విట్టర్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా చేరి తన ప్రతిభతో 2018లో ట్విటర్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ)గా హోదా చేజిక్కించుకున్నారు. మరో 4 ఏళ్లలోపే ట్విట్టర్ ముఖ్య కార్యనిర్వాహణాధికారిగా ఎదిగారు. -
వర్క్ఫ్రమ్ హోం.. గూగుల్కు ఉద్యోగుల ఝలక్!
Google Employees Oppose vaccination Mandatory : టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్కు వర్క్ఫ్రమ్ హోంలో ఉద్యోగులు భారీ షాకిచ్చారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అని కంపెనీ జారీ చేసిన ఆదేశాలపై నిరసన వ్యక్తం చేయడమే కాదు.. ఈ సాకుతో వర్క్ఫ్రమ్ హోంను మరికొంతకాలం పొడిగించాలని డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఏకంగా సంతకాలతో ఓ మ్యానిఫెస్టో తయారుచేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. గూగుల్ సంస్థ ఉద్యోగులు తమ కంపెనీకి వ్యతిరేకంగా ఓ మ్యానిఫెస్టోను సిద్ధం చేశారు. వ్యాక్సినేషన్ తప్పనిసరి అంటూ జారీ చేసిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ వందల మంది సంతకాలతో ఆ మ్యానిఫెస్టో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. పైగా పోను పోను ఆ సంతకాల సంఖ్య పెరుగుతుండడం విశేషం. త్వరలో వర్క్ఫ్రమ్ హోం ముగిసి.. ఉద్యోగులు ఆఫీసులకు వస్తారనుకుంటున్న తరుణంలో ఈ పరిణామం గూగుల్కు మింగుడుపడడం లేదు. సర్కార్ ఉత్తర్వుల నేపథ్యంలోనే.. ఇదిలా ఉంటే కరోనా ప్రభావం తగ్గని నేపథ్యంలో బైడెన్ ప్రభుత్వం తాజాగా అమెరికన్ కంపెనీలకు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ కంపెనీలో వంద, అంతకంటే ఎక్కువ మంది వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాల్సిందేనని, కంపెనీలు ఈ అంశాన్ని పర్యవేక్షించాలని తేల్చి చెప్పింది. ఇందుకోసం జనవరి 4వ తేదీని డెడ్లైన్గా విధించింది. ఈ తరుణంలో గూగుల్ తమ కంపెనీలో పని చేసే లక్షా యాభై వేల మంది ఉద్యోగులకు మెయిల్ పంపించింది. ఆఫీసులకు వచ్చినా, వర్క్ఫ్రమ్ హోంలో కొనసాగుతున్నా వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని ఉండాలంటూ అందులో పేర్కొంది. అంతేకాదు డిసెంబర్ 3వ తేదీకల్లా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ను తమ కంపెనీ ప్రొఫైల్లో అప్డేట్ చేయించాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే ‘తప్పనిసరి’ అనే ఆదేశాల్ని ఉద్యోగులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఆ ఆదేశాల్ని వ్యతిరేకిస్తూ.. వ్యాక్సినేషన్లో తమకు స్వేచ్ఛ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సంతకాల సేకరణ చేపట్టారు. అంతేకాదు కరోనా ప్రభావం కారణంగా తాము మరికొంత కాలం వర్క్ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, బలవంతం చేస్తే ఉద్యోగాలకు రాజీనామాలు చేయాల్సి వస్తుందని బెదిరింపులకు దిగారు. అయితే గతంలో చాలాసార్లు ఉద్యోగుల బ్లాక్మెయిలింగ్లకు తలొగ్గినప్పటికీ.. ఈసారి కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించుకున్నట్లు గూగుల్ సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇంకోవైపు వ్యాక్సినేషన్ తప్పనిసరి ఆదేశాలు గూగుల్కు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద కంపెనీలకు తలనొప్పిగా మారింది. క్లిక్ చేయండి: గూగుల్ అసిస్టెంట్తో టీకాల బుకింగ్ -
జియోఫోన్ నెక్ట్స్ లాంచ్...! సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు..!
భారత మొబైల్ నెట్వర్క్లో జియో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పుడు జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్తో జియో మరో సంచలనాన్ని నమోదు చేయనుంది. ప్రపంచంలో అత్యంత చౌకైన ఫోన్ జియోఫోన్ నెక్ట్స్ త్వరలోనే రిలీజ్ కానుంది. దీపావళి రోజున జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేయనున్నారు. జియో, గూగుల్ భాగస్వామ్యంతో జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్ఫోన్ను రూపొందించిన విషయం తెలిసిందే. సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు...! జియోఫోన్ నెక్ట్స్ లాంచ్ భారత్లో ఈ దీపావళి పండుగకు భారతీయుల ముందుకు వస్తోందని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ధృవీకరించారు. ఈ సందర్భంగా సుందర్పిచాయ్ పలు కీలక వ్యాఖ్యలను చేశారు. భారత స్మార్ట్ఫోన్ మార్కెట్లో జియోఫోన్ నెక్ట్స్ నాయకత్వం వహిస్తోందని సుందర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ స్మార్ట్ఫోన్ రాకతో భారత్లో డిజిటల్ పరివర్తన కోసం ఒక పునాది చూపబడుతుందని అభిప్రాయపడ్డారు. రాబోయే సంవత్సరాల్లో జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్-రీచ్ స్మార్ట్ఫోన్గా నిలుస్తోందని అన్నారు. జియోఫోన్ నెక్ట్స్తో భారతీయులు ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్ఫోన్లకు మారే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. భారత్ లాంటి దేశాలు ఆసియా-పపిఫిక్ రిజియన్లో గూగుల్కు ప్రధాన మార్కెట్గా నిలుస్తోందని వెల్లడించారు. జియోఫోన్ నెక్ట్స్ ఫీచర్స్..! 5.5 అంగుళాల హెచ్ డీ+ డిస్ ప్లే క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 215 చిప్ సెట్ అడ్రినో 306 జీపీయు 2500 ఎమ్ఎహెచ్ బ్యాటరీ 8 మెగాపిక్సెల్ గెలాక్సీ సెల్ఫీ కెమెరా 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా స్మార్ట్ ఫోన్ వాయిస్ అసిస్టెంట్, స్క్రీన్ టెక్స్ట్ లాంగ్వేజ్ ఆండ్రాయిడ్ ప్రగతి ఓఎస్ ధర - రూ.3,499 చదవండి:ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్ -
స్మార్ట్ ఫోన్లో కొత్త సమస్య, బాబోయ్ అంటూ ఫిర్యాదుల వెల్లువ
గూగుల్ ఎంతో ప్రతిష్టాత్మకంగా టెన్సార్ చిప్సెట్లతో పాటు ఆండ్రాయిడ్12 వెర్షన్తో పిక్సెల్ 6, పిక్సెల్స్ 6 ప్రో ఫోన్లను విడుదల చేసింది. ఇప్పుడు ఆ ఫోన్లపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అక్టోబర్ 19న గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఫిక్సెల్ ఫోన్లను విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. సాధారణంగా ఫోన్లలో ఉండే చిప్ సెట్లను క్వాల్కమ్ తయారు చేస్తుంది. అయితే పిక్సెల్ ఫోన్లలో వినియోగించిన చిప్లను గూగులే సొంతంగా తయారు చేసింది. ఈ పిక్సెల్ 6 ప్రారంభ ధర మన కరెన్సీలో రూ.44,971వేలు, పిక్సెల్ ప్రొ ధర దాదాపు రూ.67,494గా ఉంది. We're launching Pixel 6 and Pixel 6 Pro today! They’re unlike any phone we've built before, with a new industrial design, Android 12 with Material You user interface, and running on our custom Google Tensor chip. Can't wait to see how people use them:)https://t.co/QPvVrCtxvB pic.twitter.com/2eFJsGmSOc — Sundar Pichai (@sundarpichai) October 19, 2021 Android 12 is wrecking my Pixel 4a. Touch is all wonky and the animations are running slow. Also a weird thing where I can't touch the date to open my calendar anymore. Curious if others are having these issues. — Donny Turnbaugh (@DonnyOutWest) October 21, 2021 అయితే విడుదల సందర్భంగా ఈ సిరీస్ ఫోన్లను కొనుగోలు చేసిన వినియోగదారులు పిక్సెల్ సపోర్ట్కు పేజ్కు వరుసగా ఫిర్యాదు చేస్తున్నారు. తాము కొనుగోలు చేసిన పిక్సెల్ ఫోన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నట్లు తెలిపారు. అన్లాకింగ్, యాప్స్ క్రాష్, కెమెరాలలో సమస్యలున్నాయని, ఫోన్ రీస్టార్ట్ చేసినా అవి పరిష్కారం కావడం లేదని, ఆండ్రాయిడ్ 12 వెర్షన్ని ఇన్స్టాల్ చేసిన పిక్సెల్ ఫోన్లలో ఎటువంటి మార్పులు లేవని అన్నారు. Are there any other Pixels out there have issues since Android 12 was released, my 4a 5G is have a bunch — Rick Young Jr (@RichardYoungJr7) October 21, 2021 మరికొందరు ఆండ్రాయిడ్ వెర్షన్కి మారిన తర్వాత యాప్లు క్రాష్ అవున్నట్లు చెప్పారు. బ్యాటరీ డ్రెయిన్ సమస్యల్ని ఫేస్ చేస్తున్నట్లు, త్వరగా ఈ సమస్యలకు పరిష్కారం చూపించాలని కోరుతున్నారు. పిక్సెల్ 6 సిరీస్తో పాటు పిక్సెల్ 4ఏ, పిక్సెల్ 4ఏ 5జీ, పిక్సెల్5 ఫోన్లలో సమస్యలు ఉన్నాయని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఇక యూజర్ల వరుస ఫిర్యాదులతో గూగుల్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. చదవండి: గూగుల్ పిక్సెల్ 6 సిరీస్: సొంత చిప్తోనే అదిరిపోయే ఫీచర్లు, ధర ఎంతంటే.. -
వర్క్ఫ్రం హోమ్ ఓల్డ్ మెథడ్... కొత్తగా ఫ్లెక్సిబుల్ వర్క్వీక్
టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాలా ? లేక ఆఫీసుకు రావాలా అనే విషయంలో కొన్నాళ్లుగా కొనసాగుతున్న సందిగ్థతకు తెరదించింది. ఈ రెండింంటికీ మధ్యే మార్గంగా కొత్త విధానం అమల్లోకి తేబోతున్నట్టు ఆ కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. కరోనా సంక్షోభం మొదలైన తర్వాత ప్రపంచ వ్యాప్తంగా పని విధానాల్లో మార్పులు వచ్చాయి. కోవిడ్ నిబంధనల కారణంగా ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు. ఉద్యోగులు సైతం ఇంటి నుంచే వర్క్ ఫ్రం హోం విధానంలో పని చేస్తున్నారు. దాదాపు ఏడాది కాలంగా ఇదే పద్ధతిని అనేక పెద్ద కంపెనీలు కొనసాగిస్తున్నాయి. వర్క్ఫ్రం హోంకి స్వస్తి పలికి ఆఫీసులకు రావాలంటూ ఆదేశాలు ఇచ్చేందుకు దాదాపు అన్ని కంపెనీలు సిద్ధం అవుతుండగా కోవిడ్ సెంకండ్ వేవ్ ప్రపంచాన్ని చుట్టేసింది. కోవిడ్ సెకండ్ వేవ్ అనంతరం ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. మరోవైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ సైతం వేగంగా జరుగుతోంది. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మని పిలించేందుకు అనేక కంపెనీలు రెడీగా ఉన్నాయి. అయితే థర్డ్వేర్ భయం ముంగింట ఉండటంతో ఉద్యోగులను ఆఫీసులకు పిలించేందుకు ముందు వెనుకా ఆలోచిస్తున్నాయి. కొత్తగా ఫ్లెక్సిబుల్ మెథడ్..! ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో విస్తరించిన గూగుల్ సంస్థ ఉద్యోగుల పని విధానం విషయంలో కొత్త విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇటు పూర్తిగా వర్క్ఫ్రం హోం కాకుండా అటూ రెగ్యులర్ పద్దతిలో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనకుండా ఫ్లెక్సిబుల్ వర్క్ వీక్ మెథడ్ను అమలు చేయాలని నిర్ణయించింది. ముందుగా ఈ విధానం అమెరికాలో అమలు చేసి ఆ తర్వాత ఇతర దేశాలకు విస్తరించనున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఐదు రోజుల పని విధానం అమల్లో ఉంది. దీంతో ఉద్యోగులు ఐదు రోజులు మాత్రమే పని చేస్తున్నారు. కొత్త విధానం ప్రకారం ఉద్యోగులు మూడు రోజులు ఇళ్ల నుంచి పని చేస్తే రెండు రోజులు ఆఫీసుకు వచ్చి పని చేయాల్సి ఉంటుంది. గూగుల్ సీఈవో సుంచర్ పిచయ్ ఈ వర్క్ విధానాన్ని టూ బై త్రీ (2/3) మోడల్గా పేర్కొంటున్నారు. ‘ఏడాది కాలంగా ఉద్యోగులు ఇళ్ల నుంచే పని చేయడానికి అలవాటు పడ్డారు, దీంతో చాలా మంది నగరాలకు దూరంగా రిమోట్ ఏరియాల్లో పని చేస్తున్నారు. ఇప్పుడు ఆఫీసులకు రావాలంటే వీరంతా చాలా దూరం ప్రయాణించాల్సి వస్తుంది. దీని వల్ల శారీరక, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. దీన్ని దూరం చేసేందుకు టై బై త్రీ మోడల్ని అమలు చేయాలని నిర్ణయించాం’ అని పిచాయ్ తెలిపారు. చదవండి: Facebook: ఫేస్బుక్ను బద్నామ్ చేసింది అతడేనా..! -
పాఠాలు చెప్పని గురువులు.. అయినా గెలిచిన శిష్యులు
Happy Teacher's Day 2021: గురువంటే బడిత పట్టి పాఠాలు నేర్పేవాడు మాత్రమే కాదు. శిష్యుడంటే పలక పట్టి దిద్దాల్సిన అవసరమూ లేదు. గెలుపు తీరాలను తాకిన వాళ్ల నుంచి పాఠాలు నేర్చుకునే వాళ్లను శిష్యులుగానే భావించొచ్చు. అలాగే వాళ్లకు ప్రత్యక్ష పాఠాలు చెప్పకుండా ‘సక్సెస్’ స్ఫూర్తిని నింపే మార్గదర్శకులు గురువులే అవుతారు. ద్రోణుడికి ఏకలవ్య శిష్యుడిలాగా.. వెతికితే వ్యాపార, టెక్ రంగాల్లో రాటుదేలిన ఎంతో మంది మేధావులు మనకు కనిపిస్తారు. వాళ్లలో గురువుల్ని మించిన శిష్యులుగా, వాళ్ల ‘లెగసీ’కి వారసులుగా ఆయా రంగాల్లో పేరు సంపాదించుకుంటున్న కొందరి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ►సుందర్ పిచాయ్(పిచాయ్ సుందరరాజన్).. 49 ఏళ్ల ఈ టెక్ మేధావి అల్ఫాబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా, గూగుల్ సీఈవోగా సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. మెటీరియల్స్ ఇంజినీర్గా కెరీర్ను మొదలుపెట్టిన సుందర్ పిచాయ్.. 2004లో గూగుల్లో అడుగుపెట్టారు. ఇంతకీ ఈయన గురువు ఎవరో తెలుసా? విలియమ్ విన్సెంట్ క్యాంప్బెల్ జూనియర్. అమెరికా వ్యాపార దిగ్గజంగా పేరున్న విన్సెంట్ క్యాంప్బెల్.. మొదట్లో ఫుట్బాల్ కోచ్ కూడా. ఆపై టెక్నాలజీ వైపు అడుగులేసి.. యాపిల్ లాంటి ప్రముఖ కంపెనీలకు పని చేశారు. సుందర్ పిచాయ్.. అంతకంటే ముందు గూగుల్ ఫౌండర్లు ల్యారీ పేజ్, సెర్గీ బ్రిన్, ఎరిక్ షిమిడెట్, జెఫ్ బెజోస్(అమెజాన్ బాస్), జాక్ డోర్సే, డిక్ కోస్టోలో(ట్విటర్), షెరీల్ శాండ్బర్గ్(ఫేస్బుక్) లాంటి ప్రముఖులెందరికో ఈయనే మెంటర్ కూడా. ఇక యాపిల్ ఫౌండర్ స్టీవ్ జాబ్స్కు వ్యక్తిగత గురువుగా చాలాకాలం పని చేశారు విన్సెంట్ క్యాంప్బెల్. ►మార్క్ జుకర్బర్గ్.. ఫేస్బుక్ ఫౌండర్ కమ్ సీఈవో. చిన్నవయసులోనే బిలియనీర్గా ఎదిగిన ఈ ఇంటర్నెట్ ఎంట్రెప్రెన్యూర్.. ఎవరి స్ఫూర్తితో ఈ రంగంలోకి అడుగుపెట్టాడో తెలుసా? టెక్ మేధావి స్టీవ్ జాబ్స్. అవును.. ఈ విషయాన్ని స్టీవ్ జాబ్స్ తన బయోగ్రఫీలోనూ రాసుకున్నాడు. ఇది చాలామందిని విస్తుపోయేలా చేసింది. అయితే స్టీవ్ జాబ్స్ చనిపోయిన చాన్నాళ్లకు ఓ అమెరికన్ టాక్ షోలో జుకర్బర్గ్ మాట్లాడుతూ.. ఇదే విషయాన్ని నిర్ధారించాడు. ► రిచర్డ్ బ్రాన్సన్ బ్రిటిష్ వ్యాపారవేత్త, వర్జిన్ గెలాక్టిక్ వ్యవస్థాపకుడు. లేకర్ ఎయిర్వేస్ వ్యవస్థాపకుడు, బ్రిటన్ వ్యాపారదిగ్గజం ఫ్రెడ్డీ లేకర్ను తన గురువుగా ఆరాధిస్తుంటాడు. ఆయన స్ఫూర్తితోనే తాను ఇవాళ ఉన్నానంటూ చాలా ఇంటర్వ్యూలో గురుభక్తిని చాటుకుంటాడు బ్రాన్సన్. ►సత్య నాదెళ్ల.. మైక్రోసాఫ్ట్ చైర్మన్, సీఈవోగా ఉన్న సత్య నాదెళ్ల.. సంస్థ సహవ్యవస్థాపకుడు బిల్ గేట్స్ను గురువుగా ఆరాధిస్తుంటాడు. తన కెరీర్ ఎదుగుదలకు గేట్స్ ఇచ్చిన ప్రోత్సాహం, ప్రోద్భలమే కారణమని చెప్తుంటారు. గొప్ప విజయాలు సాధించేందుకు గేట్స్ చెప్పే సూత్రాలు పాటిస్తే చాలాని తనలాంటి వాళ్లకు సూచిస్తుంటాడు సత్య నాదెళ్ల. ►రతన్ నవల్ టాటా(రతన్ టాటా).. ప్రముఖ వ్యాపారవేత్త. టాటా గ్రూపుల మాజీ చైర్మన్. ప్రస్తుతం టాటా చారిటబుల్ ట్రస్ట్ వ్యవహారాలు చూసుకుంటున్న ఈ పెద్దాయన(83).. ఫ్రెండ్లీబాస్ తీరుతో, సహాయక కార్యక్రమాలతో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇంతకీ ఈయన ఎవరిని గురువుగా భావిస్తాడో తెలుసా?.. టాటా గ్రూపుల మాజీ చైర్మన్ జహంగీర్ రతన్జీ దాదాబాయ్ టాటా(జేఆర్డీ టాటా)ని. ►ఎలన్ మస్క్.. బహుతిక్కమేధావిగా పేరున్న మస్క్ తనకు గురవంటూ ఎవరూ లేరని తరచూ ప్రకటనలు ఇస్తుంటాడు. అంతేకాదు స్పేస్ఎక్స్ బిజినెస్ డెవలప్మెంట్ వ్యవహారాలను చూసుకునే జిమ్ కాంట్రెల్ ఓ ఇంటర్వ్యూలో ‘మస్క్ రాకెట్ సైన్స్ గురించి తనంతట తానే తెలుసుకున్నాడ’ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు కూడా. అయితే చాలామందికి తెలియని విషయం ఏంటంటే.. కంప్యూటర్ సైంటిస్ట్-గూగుల్ ఫౌండర్ ల్యారీ పేజ్తో దగ్గరగా ఎలన్మస్క్ పని చేశాడని, ఆ ప్రభావంతోనే మస్క్ రాటుదేలాడని. ►బిల్ గేట్స్.. వ్యాపార మేధావిగా పేరున్న బిల్గేట్స్కు, అమెరికా ప్రముఖ వ్యాపారవేత్త వారెన్ బఫెట్కు మధ్య అపర కుబేరుడి స్థానం కోసం చాలాకాలం పోటీ నడిచిన విషయం చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ, బఫెట్ను అన్నింటా తాను గురువుగా భావిస్తానని బిల్గేట్స్ చాలా ఇంటర్వ్యూల్లో చెప్తుంటాడు. అంతేకాదు ఇద్దరూ వ్యాపార సలహాలు, ఛారిటీలకు సంబంధించిన వ్యవహారాలపై చర్చించుకుంటారు కూడా. - సాక్షి, వెబ్డెస్క్ స్పెషల్