-
వర్క్ఫ్రం హోంపై గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కీలక ప్రకటన
Google Work From Home: వర్క్ఫ్రం హోం కొనసాగించడంపై మల్లాగుల్లాలు పడుతున్న కార్పోరేట్ కంపెనీలు క్రమంగా ఓ నిర్ణయానికి వస్తున్నాయి. ఉద్యోగులు ఎక్కడి నుంచి పని చేయాలనే అంశంపై క్లారిటీ ఇస్తున్నాయి. తాజాగా దీనిపై నంబర్ వన్ సెర్చ్ ఇంజన్ గూగుల్ సైతం స్పందించింది. ఆఫీసులకు రండి కరోనా విజృంభనతో కార్పోరేట్ కంపెనీలు, ముఖ్యంగా ఐటీ కంపెనీలు తమ ఆఫీసులకు తాళాలు వేశాయి. ఉద్యోగులను ఇంటి నుంచే పని చేయాలంటూ చెప్పాయి. అయితే వర్క్ఫ్రం హోం మొదలై ఏడాది గడిచిపోవడంతో క్రమంగా అన్ని ఆఫీసులు ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పని చేయాలని కోరుతున్నాయి. గూగుల్ సైతం సెప్టెంబరు మొదటి వారం నుంచి ఉద్యోగులను ఆఫీసులకు వచ్చి పని చేయాలని కోరింది. ఆ తర్వాత ఈ గడువును అక్టోబరుకు పొడిగించింది. తాజాగా వర్క్ఫ్రం హోంపై ఆ కంపెనీ కీలక ప్రకటన చేసింది. గూగుల్ సీఈవో ప్రకటన కరోనా తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోన్నా కొత్త రకం మ్యూటెంట్లతో ఎప్పటికప్పుడు ప్రమాదం ముంచుకొస్తూనే ఉంది. ఇప్పుడు అమెరికాతో పాటు అనేక దేశాల్లో డెల్టా వేరియంట్తో వేల సంఖ్యలో కేసులు వస్తున్నాయి. దీంతో ఉద్యోగులను ఆఫీసులకు రమ్మనే విషయంలో గూగుల్ వెనక్కి తగ్గింది. 2022 జనవరి తర్వాత వరకు వర్క్ఫ్రం కొనసాగించాలని నిర్ణయించింది. ఆఫీసులకు వచ్చి పని చేయాలనే నిబంధను ఐచ్ఛికంగా మార్చింది. ఈ మేరకు గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ కంపెనీ ఉద్యోగులకు ఈ మెయిల్ పంపారు. ‘ 2022 జనవరి 10 తర్వాత వివిధ దేశాల్లో ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ వర్క్ఫ్రం హోం కొనసాగించాలా ?, ఆఫీసులకు వచ్చి పని చేయాలా ? అనే అంశాలపై నిర్ణయం తీసుకుంటాం’ అని మెయిల్లో ఆయన పేర్కొన్నారు. అందరిదీ అదే దారి డెల్టా వేరియంట్ విజృంభణకు తోడు ఆఫీసులకు వచ్చి పని చేసేందుకు ఉద్యోగులు అయిష్టత చూపుతున్నందున ఇప్పటికే అమెజాన్ , లైఫ్ట్ వంటి సంస్థలు వర్క్ఫ్రం హోంను కొనసాగిస్తామని ప్రకటించాయి. వచ్చే ఏడాదిలో పరిస్థితులను బట్టి ఉద్యోగులు ఆఫీసులకు రావాలా ? వద్దా ? అనేది నిర్ణయిస్తామని ప్రకటించాయి. తాజాగా ఈ జాబితాలో గూగుల్ కూడా చేరింది. చదవండి : Work From Home: జనవరి వరకు ఊరట.. ఇప్పుడు ఎంప్లాయిస్ మరో మాట! -
గూగుల్లో ఈ బుల్లి డైనోసార్ ఎలా పుట్టిందో తెలుసా?
గూగుల్లో కనిపించే బ్రౌజర్ గేమ్ ‘డైనోసార్’ తెలుసు కదా. ఇంటర్నెట్ ఆగిపోగానే.. చాలామందికి అదొక టైంపాస్ యవ్వారంగా ఉంటోంది. అయితే ఆ గేమ్కు కొత్త హంగులు అద్దినట్లు గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ స్వయంగా ప్రకటించాడు. ఇంతకీ ఈ Google Dinosaur Game కొత్త అప్డేట్ ఏంటంటే.. ఒలింపిక్స్ మినీ గేమ్స్. సాక్షి, వెబ్డెస్క్: అడ్డుగా వచ్చే ముళ్ల పొదల చెట్లు, పై నుంచి దూసుకొచ్చే పక్షులు. వాటిని తప్పించుకుంటూ పరుగులు తీసే బుల్లి డైనోసార్. స్పేస్ బార్తో ఈ గేమ్ కంట్రోలింగ్ ఉంటుంది. దాని సాయంతో డైనోసార్ను తప్పించి ముందుకు పరిగెత్తాలి. పోను పోను వేగం పెరుగుతూ పోతుంటుంది. అయితే ఈ గేమ్కు ఒలింపిక్స్ గేమ్స్ తరహా ఫీచర్స్ను చేర్చారు. ఆటలకు సంబంధించిన టీ-రెక్స్(డైనోసార్), ఒలింపిక్స్ మినీ గేమ్స్, ఒలింపిక్ ఫ్లేమ్, రింగులు, మెడల్స్.. ఇలాంటి ఫీచర్లను చేర్చారు. అయితే పిచాయ్ కంటే ముందే ఓ రెడ్డిట్ యూజర్ ఈ విషయాన్ని గుర్తించి అప్డేట్ ఇవ్వడం విశేషం. Might need to work on my surfing skills 🌊 chrome://dino/ pic.twitter.com/OqDn3RHLGg — Sundar Pichai (@sundarpichai) July 23, 2021 అంతరించిపోయిన డైనోసార్ల నుంచి ఓ బుల్లి గేమ్.. అదీ అందరికీ అందుబాటులో ఎలా ఉంటుందనే సెబాస్టియన్ గాబ్రియల్ ఆలోచన నుంచి పుట్టింది ఇది. 2014లో శాన్ ఫ్రాన్సిస్కో కు చెందిన ఈ వెబ్ డిజైనర్ డైనోసార్ గేమ్ను లాంఛ్ చేశాడు. 70వ దశకంలో ప్రపంచాన్ని ఊపిన ఇంగ్లీష్ రాక్ బ్యాండ్ టీ రెక్స్ పేరు మీద ఈ గేమ్ను రూపొందించాడు సెబాస్టియన్. మొదట్లో ప్రాజెక్ట్ బోలన్ పేరుతో దీనిని మొదలుపెట్టాడు. మార్క్ బోలన్ ఎవరంటే.. టీ-రెక్స్ లీడ్ సింగర్. 2014 సెప్టెంబర్లో ఈ గేమ్ రిలీజ్ కాగా..పాత డివైజ్లలో పని చేయలేదు. దీంతో డిసెంబర్లో అప్డేట్ వెర్షన్తో రీ-రిలీజ్ చేశారు. పాయింట్లు దాటుకుంటూ పోతుంటే రంగులు కూడా మారుతుంది ఈ గేమ్. సగటున నెలకు 27 కోట్ల మంది(అంతకు మించే) ఈ గేమ్ను ఆడుతుంటారని గూగుల్ చెబుతోంది. తర్వాతి కాలంలో గేమ్కు అప్డేట్స్ రాగా.. డినో స్వార్డ్స్ అని కత్తులు, కటార్లు, గొడ్డలు తగిలించారు. ఆటలో కొంచెం అటు ఇటు తేడా జరిగినా ఆ ఆయుధాలు డైనోసార్ను బలి తీసుకుంటాయి. ఇక రంగు రంగుల టోపీలు, ఐకాన్లు కూడా ఈ బుల్లి డైనోసార్కు తగిలించుకుని ఆడే వీలుంది. తాజా ఒలింపిక్స్ అప్డేట్ ఆఫ్లైన్తో పాటు ఆన్లైన్కి వర్తిస్తుందని గూగుల్ స్పష్టం చేసింది. టీ-రెక్స్ కూడా రూపాలు మారడంతో పాటు పరుగులు పెడుతుందని, ఫినిషింగ్ లైన్ లక్క్ష్యంగా గేమ్ భలేగా ఉందని సదరు రెడ్డిట్ యూజర్ వెల్లడించాడు. ఇంతకీ ఈ గేమ్ మాగ్జిమమ్ పాయింట్లు 99999 రీచ్ అయితే ఏమవుతుందో తెలుసా?.. మళ్లీ సున్నాకే వచ్చేస్తుంది. కాకపోతే ఈసారి డైనోసార్ వేగం శరవేగంగా ఉంటుంది. -
వర్క్ ఫ్రమ్ ‘ఆఫీస్’.. ఉద్యోగుల్లో ఆగ్రహం
కరోనా కారణంగా ఉద్యోగుల్లో చాలామంది వర్క్ ఫ్రమ్ హోంకే ఫిక్స్ అయిపోయారు. అయితే వ్యాక్సినేషన్ ప్రక్రియ పుంజుకుంటున్న తరుణంలో తిరిగి ఆఫీస్ గేట్లు తెరవాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యోగుల్లో తీవ్ర ఆగ్రహ జ్వాలలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మేరకు ఇంటర్నెట్ దిగ్గజ కంపెనీలు యాపిల్, గూగుల్ ఎంప్లాయిస్ తమ ఉద్యోగులకు ఆఫీస్లకు సిద్ధం కావాలని మెయిల్స్ పెడుతుండగా.. ప్రతిగా ఉద్యోగులు తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నట్లు సమాచారం. తాము వర్క్ ఫ్రమ్ హోంలోనే కొనసాగుతామని, ఆఫీస్లకు రావాలని బలవంతపెడితే రాజీనామాలు చేస్తామని చాలామంది బ్లాక్మెయిలింగ్కు దిగుతున్నారు. యాపిల్కు లేఖలు జూన్ నెలలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ ప్రతిపాదన మేరకు ‘హైబ్రిడ్ మోడల్’ తెర మీదకు వచ్చింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి వారంలో మూడు రోజులు ఆఫీస్కు రావాలని ఉద్యోగులకు సూచించారు. అయితే తాము ఆఫీస్లకు రాలేమని, వర్క్ ఫ్రమ్ హోం కొనసాగించాలని కొందరు ఎంప్లాయిస్ విజ్ఞప్తి చేశారు. ఈ తరుణంలో ఎక్కువ రిక్వెస్ట్లు వస్తుండడంతో యాపిల్ కుదరదని తేల్చి చెప్పింది. అయితే ఆఫీస్లకు రావాలని బలవంతం చేస్తే.. రిజైన్ చేస్తామని ఉద్యోగులు తాజాగా లేఖలు రాయడం మొదలుపెట్టారు. మరోవైపు కిందటి నెలలో యాపిల్ నిర్వహించిన ఓ సర్వేలో 90 శాతం ఉద్యోగులు తాము తమకు వీలున్న రీతిలోనే పనులు చేస్తామని వెల్లడించడం విశేషం. ఈ నేపథ్యంలో కొందరు మేనేజ్మెంట్కు మళ్లీ లేఖలు రాయాలని భావిస్తుండగా.. కోర్టుకు వెళ్లే ఉద్దేశంలో మరికొందరు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో యాపిల్ పునరాలోచన చేస్తుందా? లేదా? అనేది చూడాలి. గూగుల్ కూడా.. ఆఫీస్ రిటర్న్ పాలసీపై గూగుల్ ఉద్యోగుల్లోనూ అసంతృప్తే నెలకొంది. మే నెలలో కంపెనీ సీఈవో సుందర్పిచాయ్ ‘హైబ్రిడ్ వర్క్ ఎన్విరాన్మెంట్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. దీని ప్రకారం.. సెప్టెంబర్ మొదటి వారం నుంచి 60 శాతం ఉద్యోగులు ఆఫీస్లకు రావాలని, మరో 20 శాతం మంది రిమోట్ వర్క్, ఇంకో 20 శాతం మంది రీ లోకేట్ కావాలని పిచాయ్ పిలుపు ఇచ్చాడు. ఇక లొకేషన్ టూల్ ఆధారంగా జీతాలు ఉంటాయని కూడా ప్రకటించాడు. ఈ దశలో గందరగోళానికి గురవుతున్న ఉద్యోగులు.. ఆఫీస్లకు రాలేమని చెప్తున్నారు. అంతేకాదు మెయిల్స్ ద్వారా తమ ఫ్రస్టేషన్ను వెల్లగక్కుతున్నట్లు తెలుస్తోంది. మరి ఈ పరిణామాల నేపథ్యంలో గూగుల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. -
ఆఖరిసారి అప్పుడే ఏడ్చాను: సుందర్ పిచాయ్
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి ఏడాదిన్నరకు పైగా ప్రపంచ దేశాలను వణికిస్తుంది. కోవిడ్కు అంతమెన్నడో తెలియడం లేదు.. రెండు వేవ్లతో సతమతమైన జనాలపై మూడో వేవ్ విరుచుకుపడనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ గ్రహం మీద ఉన్న ప్రతి ఒక్కరు ఏదో ఓ విధంగా కోవిడ్ వల్ల ఇబ్బంది పడ్డారంటే అతిశయోక్తి కాదు. కుబేరులు, పేదలు, ప్రముఖులు, సామాన్యులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరిని బాధ పెట్టింది కోవిడ్. ఈ జాబితాలో తాను కూడా ఉన్నాను అంటున్నారు గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్. మహమ్మారి తనను కూడా మానసికంగా బాధించిందన్నారు. బీబీసీకిచ్చిన సుదీర్ఘమైన ఇంటర్వ్యూలో ఆయన ‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడితో సహా పలు ఆసక్తికర విషయాలపై మాట్లాడారు. ఇంటర్వ్యూ సందర్భంగా చివరిసారిగా ఎప్పుడు ఏడ్చారన్న ప్రశ్నకు సుందర్ పిచాయ్ బదులిస్తూ... ‘‘కోవిడ్ వేళ ప్రపంచవ్యాప్తంగా నిలిపి ఉంచిన మోర్గ్ ట్రక్కులను చూసినప్పుడు.. రెండు నెలల క్రితం భారతదేశంలో నెలకొన్న పరిస్థితులను చూసి కన్నీరు పెట్టుకున్నాను’’ అన్నారు. కోవిడ్ సెకండ్ వేవ్లో భాగంగా ఏప్రిల్-మే నెలల్లో భారత దేశంలో వేలాది మంది మరణించారు. గంగా నదిలో పదుల సంఖ్యలో మృతదేహాలు దర్శనమిచ్చాయి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలయ్యాయి. ఈ పరిస్థితులు తనను ఎంతో బాధించాయన్నారు పిచాయ్. అంతేకాక ‘‘నేను అమెరికన్ పౌరుడిని. కానీ నాలో భారతీయత ఎంతో లోతుగా పాతుకుపోయింది. నేను ఎవరు అనే విషయానికి వస్తే.. ఈ భారతీయత నాలో అతి పెద్ద భాగంగా నిలుస్తుంది. నేను దక్షిణ భారతదేశంలోని తమిళనాడులో మధ్యతరగతి కుటుంబంలో జన్మించాను. సాంకేతికతలో చోటు చేసుకుంటున్న మార్పులు నాపై ఎంతో ప్రభావం చూపేవి. నా బాల్యంలో చూసిన రోటరి ఫోన్.. పాత స్కూటర్ ఇవన్ని నన్ను చాలా ఆశ్చర్యపరిచేవి’’ అని సుందర్ పిచాయ్ తెలిపారు. ‘‘నా తండ్రి ఏడాది మొత్తం జీతం ఖర్చు చేస్తే నేను అమెరికా చేరుకోగలిగాను. కాలీఫోర్నియాలో దిగినప్పుడు నేను ఊహించుకున్న దానికి వాస్తవ పరిస్థితులకు చాలా తేడా గమనించాను. అమెరికా చాలా ఖరీదైనది. ఇక్కడ ఓ బ్యాక్పాక్ కొనాలంటే దాని విలువ మా నాన్న నెల జీతంతో సమానంగా ఉంటుంది. ఈ రోజు నేను ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు కేవలం అదృష్టం మాత్రమే కారణం కాదు. సాంకేతికత మీద నాకున్న అభిమానం కూడా నన్ను ఈ స్థాయికి తీసుకువచ్చింది’’ అని తెలిపారు సుందర్ పిచాయ్. పాస్వర్డ్ మార్చను ఎందుకంటే.. బీబీసీకిచ్చిన ఇంటర్వ్యూలో పిచాయ్ తాను పాస్వర్డ్ను తరచూ మార్చనని వెల్లడించారు. వినియోగదారులు వారి పాస్వర్డ్లను తరచూ మార్చడానికి బదులుగా “రెండు-కారకాల ప్రామాణీకరణ” (టూ ఫాక్టర్ అథెంటికేషన్)ఎంచుకోవాలని ఆయన సిఫార్సు చేశారు. ‘‘పాస్వర్డ్ను పదేపదే మార్చడం కంటే రెండు-కారకాల ప్రామాణీకరణ మార్గం ఎంతో సురక్షితం. ఎందుకంటే పాస్వర్డ్లను చాలా తరచుగా మార్చినప్పుడు, వాటిని గుర్తుంచుకోవడంలో మీకు ఇబ్బంది తలెత్తుతుంది. కనుక రెండు-కారకాల ప్రామాణీకరణను ఎంచుకోవడం ఎంతో మంచిది’’ అన్నారు. అంతేకాక తాను ఒకేసారి 20కి పైగా ఫోన్లను ఉపయోగిస్తానని తెలిపారు. మార్కెట్లోకి వచ్చిన ప్రతి ఫోన్ని పరీక్షిస్తాను అని సుందర్ పిచాయ్ తెలిపారు. . -
‘ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్’పై దాడి
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో స్వేచ్ఛాయుత, బహిరంగ అంతర్జాలం(ఇంటర్నెట్) దాడికి గురవుతోందని గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్(సీఈఓ) సుందర్ పిచాయ్ అన్నారు. తాజాగా ఆయన బీబీసీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. సమాచార వ్యాప్తిపై పలు దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయని, కొన్ని దేశాలు ఆంక్షలు విధించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆక్షేపించారు. ఫ్రీ అండ్ ఓపెన్ ఇంటర్నెట్ అనే ఆలోచనను తప్పుగా అర్థం చేసుకుంటున్నాయని చెప్పారు. నిజానికి దీనివల్ల అనర్థాల కంటే మంచే ఎక్కువగా జరుగుతుందని సూచించారు. సమాచార వ్యాప్తి చుట్టూ గోడలు కట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. సమాచార ప్రవాహాన్ని అడ్డుకోరాదని చెప్పారు. భారత్లో సోషల్ మీడియా వేదికలు, వార్తా ప్రచురణ సంస్థలు, ఓటీటీ వెబ్సైట్లు, గూగుల్ వంటి సెర్చ్ ఇంజన్లపై నియంత్రణ విధించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నూతన ఐటీ నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వినియోగదారుల భద్రత కోసమే ఈ నిబంధనలని ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఈ నిబంధనలు వినియోగదారుల గోప్యత, వాక్ స్వాతంత్య్రపు హక్కుకు భంగం కలిగించేలా ఉన్నాయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ చట్టాలను తాము గౌరవిస్తామని, నిబంధనలు పాటిస్తామని సుందర్ పిచాయ్ గతంలోనే స్పష్టం చేశారు. -
చౌక స్మార్ట్ఫోన్ కోసం జియో, గూగుల్ కసరత్తు
న్యూఢిల్లీ: అందుబాటు ధరలో స్మార్ట్ఫోన్లను రూపొందించడంపై దేశీ టెలికం దిగ్గజం జియోతో కలిసి పనిచేస్తున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నాయని ఆసియా పసిఫిక్ విలేకరులతో వర్చువల్ సమావేశంలో ఆయన వివరించారు. అయితే, ఎప్పుడు ప్రవేశపెట్టేదీ, ధర ఎంత ఉంటుందీ వంటి అంశాలను ఆయన వెల్లడించలేదు. చౌక డేటా రేట్లకు చౌక స్మార్ట్ఫోన్లు కూడా తోడైతే ఇంటర్నెట్ను దేశవ్యాప్తంగా మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడనుంది. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను వినియోగించేందుకు ఉపయోగపడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు పిచాయ్ పేర్కొన్నారు. టెక్నాలజీలో కృత్రిమ మేథస్సు సాధనాల వినియోగంలో నైతికత పాటించే విషయంపై స్పందిస్తూ ప్రస్తుతం ఇవి ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉన్నాయని, తమ సంస్థ ఈ అంశంలో పారదర్శకంగా వ్యవహరిస్తోందని ఆయన తెలిపారు. ఇండియా డిజిటైజేషన్ ఫండ్ (ఐడీఎఫ్) కింద కేటాయించిన 10 బిలియన్ డాలర్ల నిధులను (సుమారు రూ. 75,000 కోట్లు) వినియోగించేందుకు తోడ్పడే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. చదవండి: జూలైలో అమెజాన్ కొత్త సీఈవో జెస్సీకి బాధ్యతలు -
H-1B Visa: భాగస్వాముల వీసాలకు గూగుల్ మద్దతు
వాషింగ్టన్: ప్రముఖ టెక్ దిగ్గజ సంస్థ గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. విదేశాల నుంచి అమెరికాకు వచ్చే నైపుణ్యం కలిగిన వలసదారులైన హెచ్1బీ వీసాదారుల భాగస్వాములకు వర్క్ వీసాలు అందించేందుకు గూగుల్ సంస్థ మద్దతు ప్రకటించింది. ఈ విషయంపై ఇప్పటికే పలు సంస్థలు సానుకూలంగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా గూగుల్ సైతం ఈ జాబితాలో చేరింది. అమెరికాకు వచ్చే వలసదారులకు గూగుల్ మద్దతుగా ఉంటుందని ఆ సంస్థ సీఈవో సుందర్పిచాయ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఈ మేరకు హెచ్4ఈఏడీ(ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్) కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో ఆవిష్కరణలు పెరిగి ఉద్యోగ సృష్టి జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, వారి కుటుంబాలకు ఈ కార్యక్రమం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. Google is proud to support our nation’s immigrants. We joined 30 other companies to protect the H-4 EAD program which spurs innovation, creates jobs and opportunities, and helps families. https://t.co/AvmEbLve3C — Sundar Pichai (@sundarpichai) May 14, 2021 హెచ్4 వీసాల వల్ల ఉద్యోగాల్లో పోటీ తత్వం దెబ్బతింటోందని అక్కడి కోర్టులో దాఖలైన కేసులో గూగుల్ మరో 30 సంస్థల తరపున అఫిడవిట్ సమర్పించింది. హెచ్1బీ వీసాదారు కుటుంబసభ్యులకు అవకాశం కల్పించే వ్యవస్థను కోరుకుంటున్నామని పేర్కొంది. దాని ద్వారా సుమారు 90వేల మందికి ప్రయోజనం కలుగుతుందని ఆ సంస్థ న్యాయ విభాగం ఉపాధ్యక్షురాలుకేథరిన్ లఖవేరా తెలిపారు. హెచ్1బీ వీసా కలిగిన వారు తమ భాగస్వామితో పాటు పిల్లలు కూడా అమెరికాలో ఉండేందుకు యూఎస్ సిటిజన్ షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్(యూఎస్సీఐఎస్) అనుమతి ఇస్తుంది. ‘వలసదారులకు మద్దతుగా నిలిచేందుకు మేము ఎంతో గర్విస్తున్నాం. మరో 30 సంస్థలతో కలిసి హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు ఇస్తున్నాం. దీని వల్ల ఆవిష్కరణలు, ఉద్యోగ అవకాశాలుపెరుగుతాయి. ఈ కార్యక్రమం వారి కుటుంబాలకు ఉపయోగకరంగా ఉంటుంది’ అని పిచాయ్ ట్వీట్ చేశారు. అడోబ్, అమెజాన్, యాపిల్, ఈబే, ఐబీఎం, ఇంటెల్, మైక్రోసాఫ్ట్, పేపాల్, ట్విటర్ సహా ఇతర కంపెనీలు హెచ్4ఈఏడీ కార్యక్రమానికి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ‘అమెరికా ఫస్ట్’ నినాదంతో అనేక ఆంక్షలు విధించారు. ఇక జోబైడెన్ అధ్యక్షుడుఅయిన తర్వాత ట్రంప్ విధించిన నియమ నిబంధనలు, ఆంక్షలను ఉపసంహరించిన విషయం తెలిసిందే. చదవండి: భారతీయ టెక్కీలకు భారీ ఊరట -
మహిళా సాధికారతకు గూగుల్ తోడ్పాటు
న్యూఢిల్లీ: బాలికలు, మహిళల సాధికారత కోసం ప్రపంచవ్యాప్తంగా కృషి చేస్తున్న స్వచ్ఛంద సేవా సంస్థలకు 25 మిలియన్ డాలర్ల మేర గ్రాంటు ఇవ్వనున్నట్లు టెక్ దిగ్గజం గూగుల్లో భాగమైన గూగుల్డాట్ఓఆర్జీ వెల్లడించింది. లాభాపేక్ష లేకుండా నిర్వహించే స్వచ్ఛంద సంస్థలు మొదలైనవి దీనికోసం దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ వైస్ ప్రెసిడెంట్ జాక్వెలిన్ ఫుల్లర్ తెలిపారు. ఎంపికయ్యే సంస్థలకు ఒకోదానికి దాదాపు 2 మిలియన్ డాలర్ల దాకా నిధులు లభించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. మరోవైపు, భారత్లో తాము నిర్వహిస్తున్న ఇంటర్నెట్ సాథీ డిజిటల్ అక్షరాస్యత శిక్షణా కార్యక్రమంతో గణనీయ సంఖ్యలో మహిళలు లబ్ధి పొందినట్లు జాక్వెలిన్ వివరించారు. గడిచిన కొన్నేళ్లుగా భారత్లో ఔత్సాహిక వ్యాపారవేత్తలు, నవకల్పనల ఆవిష్కర్తలు, లాభాపేక్ష లేని సంస్థలకు తోడ్పాటు అందించేందుకు దాదాపు 40 మిలియన్ డాలర్ల దాకా ఇన్వెస్ట్ చేశామని ఆమె వివరించారు. ఇంటర్నెట్ సాథీ ప్రోగ్రాం అనుభవాలతో ’ఉమెన్ విల్’ పేరిట వెబ్ ప్లాట్ఫాంని రూపొందించినట్లు గూగుల్ ఇండియా సీనియర్ కంట్రీ మార్కెటింగ్ డైరెక్టర్ సప్నా చడ్ఢా తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని ఔత్సాహిక మహిళా వ్యాపారవేత్తలకు తోడ్పాటు అందించేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. టైలరింగ్, బ్యూటీ సర్వీసులు, హోమ్ ట్యూషన్లు, ఫుడ్ ప్రాసెసింగ్ మొదలైన హాబీలను ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకునే మహిళలకు అవసరమైన సహాయ సహకారాలు దీని ద్వారా అందగలవని ఆమె చెప్పారు. -
జెఫ్ బెజోస్ కు టెక్ దిగ్గజాల అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ వ్యవస్థాపకుడు, సీఈఓ జెఫ్ బెజోస్ ఈ ఏడాది చివరలో అమెజాన్ సీఈఓ పదవి నుంచి తప్పుకొని ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గా కొనసాగనున్నట్లు ప్రకటించారు. జెఫ్ బెజోస్ తీసుకున్న నిర్ణయాన్ని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ బుధవారం అభినందించారు. అమెజాన్ తదుపరి సీఈఓ ఆండీ జాస్సీకి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే జెఫ్ బెజోస్ కు తన ఫీచర్ ప్రాజెక్ట్స్ డే వన్ ఫండ్, బెజోస్ ఎర్త్ ఫండ్ కు ఇండియన్-అమెరికన్ టాప్ ఎగ్జిక్యూటివ్ తన శుభాకాంక్షలు తెలిపారు.(చదవండి: అమెజాన్ సీఈఓ జెఫ్ బెజోస్ సంచలన నిర్ణయం) Congrats @JeffBezos , best wishes for Day 1 and Earth fund. Congrats @ajassy on your new role! — Sundar Pichai (@sundarpichai) February 2, 2021 మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెల్ల: జెఫ్ బెజోస్, ఆండీ జాస్సీ మీరు కొత్త స్థానాలను చేపడుతున్నందుకు శుభాకాంక్షలు. గతంలో మీరు సాధించిన వాటికి తగిన అర్హత ఉంది అని అన్నారు. Congratulations to @JeffBezos and @ajassy on your new roles. A well-deserved recognition of what you have accomplished. — Satya Nadella (@satyanadella) February 2, 2021 27 ఏళ్ల క్రితం 1994లో మిస్టర్ బెజోస్ ఇంటర్నెట్లో పుస్తకాలు అమ్మెందుకు అమెజాన్ను ప్రారంభించిన బెజోస్.. అంచెలంచెలుగా ఎదిగి ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా మారారు. ప్రస్తుత ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ దిగ్గజ కంపెనీగా అమెజాన్ నిలిచింది. బెజోస్ తరువాత అమెజాన్ సీఈఓ బాధ్యతలను స్వీకరించనున్న ఆండీ జాస్సీ ప్రస్తుతం అమెజాన్ క్లౌడ్ కంప్యూటింగ్ విభాగం, అమెజాన్ వెబ్ సర్వీసెస్ అధిపతిగా ఉన్నారు. 1997లో హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేసిన జాస్సీ అమెజాన్లో ఉద్యోగిగా చేరారు. బెజోస్కు టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తూ.. కాలక్రమంలో సంస్థలో కీలక వ్యక్తిగా ఎదిగారు. 2006లో అమెజాన్ వెబ్ సేవలకు నాయకత్వం వహిస్తూ, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి సంస్థలతో పోటీపడే స్థాయికి దాన్ని తీర్చిదిద్దిన ఘనత జాస్సీది. -
ప్రారంభ దశలోనే ఏఐ టెక్నాలజీ
న్యూఢిల్లీ: దేశంలో ఆర్టిఫియల్ ఇంటలిజెన్స్ (ఏఐ) ప్రారంభ దశలోనే ఉందని.. దాని నిజమైన సామర్థ్యం అందుబాటులోకి రావడానికి మరో 10–20 ఏళ్ల కాలం పడుతుందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. భవిష్యత్తులో కరోనా తరహా అంటు వ్యాధులు వైరస్లను పరిష్కరించడంలో ఏఐ టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వర్చువల్ సమ్మిట్లో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 ఎంత కల్లోలాన్ని సృష్టిస్తోందో అదే సమయంలో ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ పనితీరుకు సాంకేతిక పరిజ్ఞానం అందిస్తున్న సహకారాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. కొన్ని దశాబ్దాలుగా సాంకేతిక పురోగతి పునాదిపై ఆధారపడి టీకాల అభివృద్ధి జరుగుతోందని చెప్పారు. వ్యాక్సిన్ పంపిణీలో కంప్యూటిక్, మిషన్ లెర్నింగ్, ఆల్గరిథం వంటి ఏఐ టెక్నాలజీ ఉపయోగపడగలవని.. కాకపోతే అవి ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని పేర్కొన్నారు. వందల సంవత్సరాలలో జరిగిన ప్రపంచ విపత్తు సంఘటన అయిన కోవిడ్–19 గురించి ప్రజలకు సరైన సమాచారాన్ని అందించడంలో ఏఐ కీలకమైందని.. దీనికి ఎన్నో శాస్త్రీయ ఉదాహరణలున్నాయన్నారు. ‘‘ఏ ఒక్క దేశం కూడా ప్రపంచ విపత్తులను ఒంటరిగా పరిష్కరించలేదు. వాతావరణ మార్పులను పరిష్కరించడానికి గ్లోబల్ పారిస్ ఒప్పందం ఉన్నట్టుగానే.. ఏఐ, క్వాంటం కంప్యూటింగ్ వంటి సాంకేతికత పరిజ్ఞానాల ద్వారా పెద్ద, దీర్ఘకాలిక భద్రతా సమస్యలను పరిష్కరించడానికి అన్ని దేశాలు కలిసి ముందుకు రావాలని’’ పిచాయ్ సూచించారు. -
‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్లో ఉన్నారు’
వాషింగ్టన్: డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికలు, సోషల్ మీడియా ద్వారా విద్వేషం, హింసపూరిత వాతావరణం పెరిగిపోతుందన్న ఆరోపణల నేపథ్యంలో టెక్ దిగ్గజాలు అమెరికన్ సెనేట్ విచారణ కమిటీ ఎదుట హాజరయ్యారు. కరోనా నేపథ్యంలో బుధవారం నిర్వహించిన వర్చువల్ సమావేశంలో తమ వాదనలు వినిపించారు. వీరిలో ఫేస్బుక్ కో-ఫౌండర్ మార్క్ జుకర్బర్గ్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్లతో పాటు అమెజాన్ అధినేత, ప్రపంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా ఉన్నారు. ఈ క్రమంలో తొలి సారిగా ఈ మీటింగ్కు హాజరైన బెజోస్ను విచారణ కమిటీ.. అమెరికా కంపెనీల సాంకేతికత, సమాచారాన్ని చైనా ప్రభుత్వం చోరీ చేస్తుందా అని ప్రశ్నించగా ఆయన నుంచి స్పందన రాలేదు.(ఆన్లైన్ వేదికల దుర్వినియోగంపై ఆందోళన) ఈ క్రమంలో ఫ్లోరెడ్ రిపబ్లికన్ గ్రెగ్ స్ట్రేబ్.. ‘‘మిస్టర్ బెజోస్.. మీరు మ్యూట్లో ఉన్నారు’’అంటూ బెజోస్కు గుర్తు చేశారు. దీంతో వెంటనే తేరుకున్న బెజోస్.. అన్మ్యూట్ చేసి.. ‘‘క్షమించండి. కొన్ని ఖరీదైన వస్తువులకు సంబంధించిన నకిలీ ఉత్పత్తులు తయారు చేస్తున్నారని విన్నాను. అయితే ఇందులో డ్రాగన్ ప్రభుత్వ ప్రమేయం ఉందో లేదో తెలియదు’’ అని బదులిచ్చారు. ఇక ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తమదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ‘‘ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు, ఈ- కామర్స్ బిజినెస్ మ్యాన్కు అన్మ్యూట్ చేయాలనే విషయం తెలియదా లేదా ఆ సమయంలో స్నాక్స్ తినడానికి వెళ్లారా.. అదీ కాదంటే విచారణ కమిటీకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకున్నారా’’ అని కామెంట్లు చేస్తున్నారు. ఇక మరికొంత మంది.. సైలెంట్గా ఉన్న సమయంలో ఆయన ఎన్ని మిలియన్ డాలర్లు సంపాదించారో అంటూ బెజోస్ సంపాదనను లెక్కలేసే పనిలో పడ్డారు. (2026 నాటికి జెఫ్ బెజోస్, మరి ముకేశ్ అంబానీ?) ఇప్పుడే చెప్పలేం ఇదిలా ఉండగా.. అమెరికా- చైనాల మధ్య వాణిజ్య, దౌత్య యుద్ధం ముదురుతున్న వేళ అగ్రరాజ్యం ఇప్పటికే డ్రాగన్ కంపెనీలపై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే. డేటా చౌర్యానికి పాల్పడుతుందనే కారణంతో చైనీస్ కంపెనీ హువావేను నిషేధించడం సహా జాతీయ భద్రత దృష్ట్యా మరిన్ని కఠిన చర్యలకు సిద్ధమైనట్లు ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో బుధవారం నాటి సమావేశంలో.. టెక్ దిగ్గజాలను అడిగిన పలు ప్రశ్నల్లో డ్రాగన్ ప్రస్తావన రావడం గమనార్హం. ఈ క్రమంలో తమకు సంబంధించిన సాంకేతికతను చైనా ప్రభుత్వం దొంగిలించిందన్న విషయంలో ప్రాథమిక నిర్దారణకు రాలేమని జుకర్బర్గ్, టిమ్ కుక్, సుందర్ పిచాయ్ స్పష్టం చేసినట్లు సమాచారం. -
ఉద్యోగులకు గూగుల్ శుభవార్త..!
బెంగుళూరు: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రంగాలు సంక్షోభంలో కూరుకుపోయాయి. కానీ సాఫ్ట్వేర్ రంగం మాత్రం వర్క్ ఫ్రమ్ హోమ్(ఇంటి నుంచే ఉద్యోగం) ద్వారా కొంత మేర నిలదొక్కుకుంది. అయితే మహమ్మారి తగ్గడానికి ఎంత సమయం పడుతుందో ఎపరు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో సాఫ్టవేర్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు శుభవార్త ప్రకటించబోతున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. ఇది వరకు తమ ఉద్యోగుల క్షేమం కోసం ఈ ఏడాది డిసెంబర్ వరకు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని కల్పించింది. అయితే ఇంకా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ సౌలభ్యాన్ని వచ్చే ఏడాది(2021, జూన్)సంవత్సరం వరకు పోడగించే ఆలోచనలో ఉన్నట్లు సంస్థ ఉద్యోగులు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా గూగుల్లో 2లక్షల మంది రిగ్యూలర్, కాంట్రాక్ట్ ఉద్యోగులు సేవలందిస్తున్నారు. దేశంలో పనిచేస్తున్న గూగుల్ ఉద్యోగులకు ఈ వెసలుబాటు వర్తించనుంది. అయితే గూగుల్కు దేశంలో బెంగుళూరు, హైదరాబాద్లో మంచి మార్కెట్ ఉంది. ఇటీవల గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ దేశంలో 75,000కోట్ల డిజిటల్ పెట్టుబడులు పెట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. -
భారత్కు గూగుల్ దన్ను!
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం గూగుల్ తాజాగా భారత్లో భారీ పెట్టుబడి ప్రణాళికలను ఆవిష్కరించింది. వచ్చే 5–7 సంవత్సరాల్లో సుమారు రూ. 75 వేల కోట్లు (దాదాపు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేయనున్నట్లు కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇందుకోసం గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఏర్పాటును ప్రకటించారు. ’గూగుల్ ఫర్ ఇండియా’ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సోమవారం పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వెల్లడించారు. భారత్పైనా, భారత డిజిటల్ ఎకానమీ భవిష్యత్పైనా తమ కంపెనీకి ఉన్న నమ్మకాన్ని తాజా పెట్టుబడులు ప్రతిబింబిస్తాయని పిచాయ్ తెలిపారు.‘గూగుల్ ఫర్ ఇండియా డిజిటైజేషన్ ఫండ్ ఆవిష్కరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. దీని ద్వారా వచ్చే 5–7 ఏళ్లలో భారత్లో రూ. 75,000 కోట్లు (సుమారు 10 బిలియన్ డాలర్లు) ఇన్వెస్ట్ చేస్తాం. ఈక్విటీ, వ్యూహాత్మక భాగస్వామ్యాలు, ఇతరత్రా మౌలిక సదుపాయాల కల్పన తదితర మార్గాల్లో ఈ పెట్టుబడులు ఉంటాయి‘ అని పిచాయ్ తెలిపారు. నాలుగు ప్రధానాంశాలపై దృష్టి... భారత్ డిజిటలీకరణకు తోడ్పడేలా ప్రధానంగా నాలుగు విభాగాల్లో ఈ ఇన్వెస్ట్మెంట్లు ఉంటాయని సుందర్ తెలిపారు. ప్రతి భారతీయుడికి తమ తమ ప్రాంతీయ భాషల్లో సమాచారం అందుబాటులో ఉండేలా చూసే ప్రాజెక్టు కూడా ఇందులో ఒకటని వివరించారు. అలాగే, ప్రత్యేకంగా భారత్ అవసరాలకు అనుగుణంగా కొత్త ఉత్పత్తులు, సర్వీసుల రూపకల్పనపైనా ఇన్వెస్ట్ చేయనున్నట్లు సుందర్ పేర్కొన్నారు. వ్యాపార సంస్థలు డిజిటల్కు మళ్లేందుకు అవసరమైన తోడ్పాటు అందిస్తామన్నారు. చివరిగా సామాజిక శ్రేయస్సుకు తోడ్పడేలా వైద్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలు మరింత మెరుగుపడేలా టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)ని మరింత వినియోగంలోకి తేవడంపై దృష్టి పెడతామని సుందర్ తెలిపారు. భారత్ ప్రత్యేకం... ప్రస్తుతం భారతీయులు టెక్నాలజీ తమ దాకా వచ్చేంత వరకూ నిరీక్షించాల్సిన అవసరం ఉండటం లేదని.. కొత్త తరం టెక్నాలజీలు ముందుగా భారత్లోనే ఆవిష్కృతమవుతున్నాయని సుందర్ తెలిపారు. ‘భారత్తో పాటు యావత్ ప్రపంచం ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కొంటోందని అనడంలో సందేహం లేదు. మన ఆరోగ్యాలు, మన ఆర్థిక వ్యవస్థలకు ఎదురైన పెను సవాళ్లు.. మన పనితీరును, జీవన విధానాలను పునఃసమీక్షించుకునేలా చేశాయి. అయితే, ఇలాంటి సవాళ్లే కొంగొత్త ఆవిష్కరణలకు దారితీస్తాయి‘ అని ఆయన పేర్కొన్నారు. కొత్త తరం ఆవిష్కరణలతో ప్రయోజనం పొందడం మాత్రమే కాదు.. వాటి రూపకల్పనలోనూ భారత్ ముందుండేలా చూడటం తమ లక్ష్యమని సుందర్ చెప్పారు. ముందుగా భారత్ కోసం ఉత్పత్తులు తయారు చేయడమన్నది.. మిగతా ప్రపంచ దేశాలకు మరింత మెరుగైన ఉత్పత్తులను అందించే దిశలో గూగుల్కు ఎంతగానో ఉపయోగపడిందని గూగుల్ చీఫ్ పేర్కొన్నారు. ప్రధాని మోదీతో పిచాయ్ భేటీ... డేటా భద్రత, ఆన్లైన్ విద్య తదితర అంశాలపై చర్చ ప్రధాని నరేంద్ర మోదీతో గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం వర్చువల్గా సమావేశమయ్యారు. డేటా భద్రత, గోప్యతపై సందేహాలు, రైతాంగానికి సాంకేతికతను మరింతగా చేరువ చేయడం, ఆన్లైన్ విద్య విధానాన్ని విస్తరించడం తదితర అంశాలపై ఈ భేటీలో చర్చించినట్లు ప్రధాని కార్యాలయం (పీఎంవో) తెలిపింది. ‘డేటా భద్రతపై సందేహాలను పారద్రోలేందుకు టెక్ కంపెనీలు మరింతగా కృషి చేయాలని ప్రధాని సూచించారు. అలాగే, సైబర్ దాడుల ద్వారా జరిగే సైబర్ నేరాలు, ముప్పుల గురించి ప్రస్తావించారు. రైతులకు టెక్నాలజీ ప్రయోజనాలు అందించడం, వ్యవసాయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగాలు వంటి అంశాలపై చర్చించారు. విద్యార్థులతో పాటు రైతులకు కూడా ఉపయోగపడేలా వర్చువల్ ల్యాబ్స్ ఏర్పాటు ఆలోచన గురించి ప్రస్తావించారు‘ అని పీఎంవో తెలిపింది. వ్యవసాయ రంగంలో సంస్కరణలు, కొత్త ఉద్యోగాల కల్పన కోసం తీసుకుంటున్న చర్యలు మొదలైన అంశాలను ప్రధాని వివరించారు. కరోనా వైరస్ సంబంధ సమాచారం, తీసుకోవాల్సిన జాగ్రత్తల వివరాలను అందించడంలోనూ .. అపోహలు, తప్పుడు వార్తలకు అడ్డుకట్ట వేయడంలోనూ గూగుల్ క్రియాశీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ‘సుందర్పిచాయ్తో భేటీలో రైతులు, యువత, ఔత్సాహిక వ్యాపారవేత్తల జీవితాలను మార్చగలగడంలో టెక్నాలజీ వినియోగం గురించి చర్చించాం‘ అని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్లో ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘సమావేశానికి సమయం కేటాయించినందుకు మీకు కృతజ్ఞతలు. డిజిటల్ ఇండియాకి సంబంధించి మీ విజన్ను సాకారం చేసే దిశగా మేము కూడా కృషి చేయడం కొనసాగిస్తాం‘ అని ప్రతిగా సుందర్ పిచాయ్ ట్వీట్ చేశారు. మరిన్ని భాగస్వామ్యాలు.. భారత మార్కెట్లో ప్రణాళికల్లో భాగంగా ప్రసార భారతితో కూడా జట్టు కడుతున్నట్లు గూగుల్ తెలిపింది. డిజిటల్ సాధనాలతో ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా వ్యాపారాలను మల్చుకునేలా చిన్న సంస్థల్లో అవగాహన పెంచేందుకు దూరదర్శన్లో ఎడ్యుటెయిన్మెంట్ సిరీస్ను ప్రారంభించింది. అలాగే, 2020 ఆఖరు నాటికి భారత్లో 22,000 పైచిలుకు పాఠశాల్లో 10 లక్షల మంది పైగా ఉపాధ్యాయులకు శిక్షణ అందించేందుకు సీబీఎస్ఈతో జట్టుకట్టామని గూగుల్ వెల్లడించింది. ఇక గ్లోబల్ డిస్టెన్స్ లెర్నింగ్ ఫండ్ ద్వారా అల్పాదాయ వర్గాల కోసం కైవల్య ఎడ్యుకేషన్ ఫౌండేషన్కు గూగుల్డాట్ఆర్గ్ ద్వారా మిలియన్ డాలర్లు గ్రాంట్ అందిస్తున్నట్లు పేర్కొంది. చిన్న సంస్థల డిజిటలీకరణ.. చిన్న వ్యాపార సంస్థలు డిజిటల్ బాట పట్టడంలో గూగుల్ గణనీయంగా తోడ్పాటు అందిస్తోందని సుందర్ చెప్పారు. ప్రస్తుతం 2.6 కోట్లకు పైగా ఎస్ఎంబీలను (చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలు) సెర్చి, మ్యాప్స్లో చూడవచ్చని, వీటికి ప్రతి నెలా 15 కోట్ల మంది పైగా యూజర్లు ఉంటున్నారని ఆయన వివరించారు. కరోనా వల్ల డిజిటల్ సాధనాల వినియోగం మరింత పెరిగిందన్నారు. ‘మా బామ్మకు కూరగాయల వాళ్లతో బేరాలడటం కుదరకపోవడం అనే ఒక్క లోటు తప్ప..లాక్డౌన్ వేళ వివిధ ఉత్పత్తులు, సర్వీసులను పొందేందుకు డిజిటల్ చెల్లింపుల విధానం బాగా ఉపయోగపడింది’ అంటూ సరదాగా చెప్పుకొచ్చారు. -
యూజర్లకు గూగుల్ గుడ్న్యూస్
కొత్తగా గూగుల్(మెయిల్) ఉపయోగించేవారికి సెర్చ్ ఇంజన్ దిగ్గజం గుడ్న్యూస్ చెప్పింది. ఇకపై వారి లోకేషన్ హిస్టరీ, యాప్ హిస్టరీ, వెబ్ హిస్టరీ మొత్తం ఆటోమెటిక్గా డిలీట్ కాబోతుంది. ఈ మేరకు గూగుల్ సెట్టింగ్స్లో మార్పులు చేసినట్లు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తన గూగుల్ బ్లాగ్ ద్వారా వివరించారు. ‘మేం ఏదైనా ప్రొడక్ట్ను రూపొందిచేటప్పుడు ప్రధానంగా మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. మీ సమాచారాన్ని గోప్యంగా ఉంచడం, బాధతాయుతంగా ఉండటం, నియంత్రణలో ఉంచడం. ఈ విషయంలో మరింత భద్రతను కల్పించడం కోసం గూగుల్ సరికొత్త ఆవిష్కరణను ఈ రోజు మీ ముందుకు తీసుకు వచ్చింది. డేటాకు సంబంధించి కొన్ని మార్పులు చేశాం’ అని తెలిపారు. (గూగుల్ @కరోనా సెంటర్) ఇక నుంచి గూగుల్ యూజర్ హిస్టరీ 18 నెలల తరువాత ఆటోమేటిక్గా డిలీట్ అవుతుంది. డేటాను డిలీట్ చేయాలనుకుంటే ఇప్పటి వరకు ఆ పనిని మాన్యువల్గా చేయాల్సి ఉండేది, కానీ ఇప్పుడు ఆటోమేటిక్గా డిలీట్ కానుంది. ఇది గూగుల్ అకౌంట్ కొత్తగా వాడటం మొదలుపెట్టిన వారికి మాత్రమే వర్తిస్తుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. పాత యూజర్లకు కూడా డేటాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఈ- మెయిల్ ద్వారా సమాచారాన్ని అందిస్తామని తెలిపారు. వారు ఎంచుకునే ఆప్షన్ బట్టి డేటా మూడు నెలలకొకసారి లేదా 18 నెలల కొకసారి ఆటోమెటిక్గా డిలీట్ అవుతుందని గూగుల్ వర్గాలు తెలిపాయి. దీంతో వినియోగదారుల భద్రత మరింత పెరిగే అవకాశం ఉందని గూగుల్ వర్గాలు పేర్కొన్నాయి. అయితే ప్రస్తుతం ఉపయోగిస్తున్న వినియోగదారుల సెట్టింగ్స్ను గూగుల్ మార్చబోవడం లేదని కూడా తెలిపారు. ఈ ఆటోమెటిక్ డిలిట్ ఆప్షన్ జీ మెయిల్, గూగుల్ డ్రైవ్కు వర్తించదని వారు తెలిపారు. (అందుకే మిట్రాన్ యాప్ తొలగించాం: గూగుల్) -
కార్పొరేట్ కథానాయకులు
భారతీయులు ఎక్కడ ఉన్నా ప్రత్యేకంగానే ఉంటారు. తమ ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంటారు. ప్రపంచీకరణ నేపథ్యంలో దొరికిన అవకాశాలను అందింపుచ్చుకుని, అత్యున్నత శిఖరాలకు చేరుకున్న వాళ్లలో భారతీయులే ఎక్కువగా కనిపిస్తారు. బహుళజాతి కార్పొరేట్ దిగ్గజ సంస్థల పగ్గాలను చేపట్టి, విజయపథంలో వాటికి సారథ్యం వహిస్తున్న వాళ్లలో మన భారతీయులే ముందంజలో ఉంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, నోకియా, మొటొరోలా వంటి బడా బడా సంస్థలకు అధినేతలు మనోళ్లే... ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న భారీ కార్పొరేట్ సంస్థలకు నాయకత్వం వహిస్తున్న భారతీయుల గురించి ఈ వారం ప్రత్యేక కథనం... సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ కంప్యూటర్లు ఉపయోగించే వారందరికీ చిరపరిచతమైన పేరు ‘మైక్రోసాఫ్ట్’. ప్రపంచంలోని అపర కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ నెలకొల్పిన ప్రతిష్ఠాత్మక మైక్రోసాఫ్ట్ సంస్థకు మన తెలుగువాడైన సత్య నాదెళ్ల సీఈవోగా పనిచేస్తున్నారు. సత్య నాదెళ్ల హైదరాబాద్లో పుట్టి పెరిగారు. ఆయన తండ్రి యుగంధర్ ఐఏఎస్ అధికారిగా పనిచేశారు. పాఠశాల విద్యను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కొనసాగించారు. మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశాక, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు. విస్కాన్సిన్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ షికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కొంతకాలం సన్ మైక్రోసిస్టమ్స్లో పనిచేశాక, 1992లో మైక్రోసాఫ్ట్లో చేరారు. మైక్రోసాఫ్ట్లోని వివిధ విభాగాలను విజయవంతంగా నిర్వహించి, తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ తర్వాత సీఈవోగా పనిచేసిన స్టీవ్ బాల్మెర్ 2014లో వైదొలగిన తర్వాత, సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ పగ్గాలను చేపట్టారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్’. పత్రిక 2019 సంవత్సరానికి గాను సత్య నాదెళ్లను ‘పర్సన్ ఆఫ్ ది ఇయర్’గా ప్రకటించింది. సత్య నాదెళ్ల నేతృత్వంలో మైక్రోసాఫ్ట్ ఏడాదికేడాది వృద్ధి రేటును పెంచుకుంటూ దూసుకుపోతోంది. సాంకేతిక పరిజ్ఞానమే ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దుతుందని సత్య నాదెళ్ల బలంగా నమ్ముతారు. తన జీవితానుభవాలను పంచుకుంటూ ఆయన రాసిన ‘హిట్ రిఫ్రెష్’ యువతరం పాఠకులకు అమితంగా స్ఫూర్తినిస్తోంది. సుందర్ పిచయ్ గూగుల్ ఇంటర్నెట్ యుగంలో గూగుల్ లేనిదే ఎవరికీ గడవదు. గూగుల్ సంస్థకు, గూగుల్ మాతృసంస్థ అయిన ఆల్ఫాబెట్ ఇన్కార్పొరేషన్ సంస్థకు సుందర్ పిచయ్ సీఈవోగా ఉన్నారు. తమిళనాడులోని మదురైలో పుట్టిన సుందర్ పిచయ్, స్కూలు చదువు మద్రాసులో కొనసాగింది. తర్వాత ఐఐటీ ఖరగ్పూర్లో బీటెక్ పూర్తి చేశారు. తర్వాత అమెరికా చేరుకుని, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్, యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలోని వార్టన్ స్కూల్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. అమెరికాలోని మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సంస్థ ‘మెక్ కిన్సీ అండ్ కంపెనీ’లో కెరీర్ ప్రారంభించారు. తర్వాత 2004లో గూగుల్లో చేరారు. గూగుల్ క్రోమ్ బ్రౌజర్, క్రోమ్ ఆపరేటింగ్ సిస్టమ్, మొబైల్ ఫోన్ల ఆపరేటింగ్ సిస్టమ్ ‘ఆండ్రాయిడ్’ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. మైక్రోసాఫ్ట్ సీఈవో పదవికి సుందర్ పిచయ్ పేరు కూడా పరిగణనలోకి వచ్చినా, చివరకు ఆ పదవి సత్య నాదెళ్లకు దక్కింది. అయితే, గూగుల్ వ్యవస్థాపకుల్లో ఒకరైన లారీ పేజ్ సీఈవో బాధ్యతల నుంచి వైదొలగుతూ, తన వారసుడిగా సుందర్ పిచయ్ని 2015 ఆగస్టులో ప్రకటించారు. గూగుల్ హోల్డింగ్ కంపెనీ ‘ఆల్ఫాబెట్’ రూపకల్పన పూర్తయిన తర్వాత అదే ఏడాది అక్టోబరులో సుందర్ పిచయ్ ‘అల్ఫాబెట్’, ‘గూగుల్’లకు సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. చైనాలో 2017లో జరిగిన వరల్డ్ ఇంటర్నెట్ కాన్ఫరెన్స్లో సుందర్ పిచయ్ గూగుల్ సీఈవో హోదాలో పాల్గొని ప్రసంగించారు. అరవింద్ కృష్ణ ఐబీఎం కంప్యూటర్ల తయారీ రంగంలో అతి పురాతనమైన సంస్థ ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ (ఐబీఎం). దాదాపు శతాబ్ది చరిత్ర కలిగిన ఐబీఎం సీఈవోగా అరవింద్ కృష్ణ ఎంపికయ్యారు. ఆయన ఈ ఏడాది ఏప్రిల్ 6న ఐబీఎం సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్నారు. అమెరికన్ సాఫ్ట్వేర్ కంపెనీతో ఐబీఎంకు భారీ ఒప్పందం కుదర్చడంలో అరవింద్ కృష్ణ కీలక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టిన అరవింద్ కృష్ణ, ఐఐటీ కాన్పూర్ నుంచి బీటెక్ చేశారు. అమెరికాలోని ఇల్లినాయీ వర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. అరవింద్ కృష్ణ తండ్రి విజయ్ కృష్ణ భారత సైన్యంలో మేజర్ జనరల్గా పనిచేశారు. ఐబీఎంలో 1990లో చేరిన అరవింద్ కృష్ణ, సుదీర్ఘకాలం అదే సంస్థలో కొనసాగుతూ, అనతి కాలంలోనే ఉన్నత స్థానాలకు చేరుకున్నారు. ఐబీఎంకు గల సుదీర్ఘ చరిత్రలో ఒక భారతీయుడు సీఈవో పదవికి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఐబీఎం ప్రస్తుత సీఈవో జిన్నీ రోమెట్టీ నుంచి కొద్దిరోజుల్లోనే బాధ్యతలు చేపట్టనున్న అరవింద్ కృష్ణ, ఐబీఎంకు మరిన్ని విజయాలను చేకూర్చిపెడతారని ఆశించవచ్చు. అజయ్పాల్ సింగ్ బంగా మాస్టర్కార్డ్ అమెరికాకు చెందిన బహుళజాతి ఆర్థిక సేవల సంస్థ ‘మాస్టర్కార్డ్’కు అజయ్పాల్ సింగ్ బంగా సీఈవోగా సేవలందిస్తున్నారు. మహారాష్ట్రలోని పుణే సమీపంలోని ఖడ్కే పట్టణంలో బంగా పుట్టారు. పంజాబ్లోని జలంధర్లో మూలాలు గల ఆయన తండ్రి హర్భజన్సింగ్ బంగా ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్గా పని చేశారు. తండ్రి ఆర్మీ ఉన్నతాధికారి కావడంతో అజయ్ బంగా చదువు దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొనసాగింది. హైదరాబాద్–సికింద్రాబాద్ జంట నగరాలతో పాటు జలంధర్, సిమ్లా, ఢిల్లీలలో స్కూలు చదువు కొనసాగింది. ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీ నుంచి ఎకనామిక్స్లో బీఏ ఆనర్స్ చేశాక, ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. నెస్లే కంపెనీలో 1981లో తొలి ఉద్యోగం చేశారు. ఆ తర్వాత వివిధ సంస్థల్లో సేల్స్, మార్కెటింగ్, మేనేజ్మెంట్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత పెప్సీకోలో చేరి, భారత్లో పెప్సీకి చెందిన ఫాస్ట్ ఫుడ్ ఫ్రాంచైజీలను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. న్యూయార్క్ హాల్ ఆఫ్ సైన్స్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్కు ఉపాధ్యక్షుడిగా ఎంపికయ్యారు. ఆర్థిక సాంకేతిక రంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రసంగాలు చేస్తూ ప్రముఖ స్థానానికి చేరుకున్నారు. అమెరికన్ టీవీ ప్రముఖుడు జిమ్ క్రామర్ నిర్వహించే ‘మ్యాడ్ మనీ’ షోలో కూడా పాల్గొన్నారు. మాస్టర్కార్డ్ సీఈవోగా 2010లో బాధ్యతలు చేపట్టి, ‘మాస్టర్కార్డ్’ను విజయాల బాటలో నడిపిస్తున్నారు. రాజీవ్ సూరి నోకియా సెల్ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో ఎక్కువ మంది చేతిలో కనిపించేవి ‘నోకియా’ ఫోన్లే! ఫిన్లాండ్కు చెందిన బహుళజాతి సంస్థ నోకియా కార్పొరేషన్కు సీఈవోగా రాజీవ్ సూరి సారథ్యం వహిస్తున్నారు. రాజీవ్ సూరి ఢిల్లీలో పుట్టారు. కువైట్లో ఆయన స్కూల్ చదువు కొనసాగింది. తర్వాత మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి బీఈ పూర్తి చేశారు. కెరీర్ తొలినాళ్లలో భారత్లోను, నైజీరియాలోను కొన్ని బహుళజాతి సంస్థల్లో కొంతకాలం పనిచేశాక 1995లో నోకియాలో చేరారు. 2004 నాటికి నోకియా కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన నోకియా సొల్యూషన్స్ అండ్ నెట్వర్క్ సీఈవో స్థాయికి ఎదిగారు. పశ్చిమాసియా, ఆఫ్రికా, యూరోప్ దేశాలలో నోకియా మార్కెట్ను విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. సంస్థలోని సమస్యలను పరిష్కరించడంలోనూ ఆయన తనదైన ముద్ర వేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2014లో నోకియా కార్పొరేషన్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. శంతను నారాయణ్ అడోబ్ దేశ దేశాల్లో కార్యకలాపాలు నిర్వహించే బడా కంప్యూటర్ సాఫ్ట్వేర్ సంస్థల్లో ఒకటైన అడోబ్కు సీఈవోగా శంతను నారాయణ్ 2007 నుంచి కొనసాగుతున్నారు. హైదరాబాద్లో పుట్టి పెరిగిన శంతను నారాయణ్, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఈ చేశారు. ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లి, కాలిఫోర్నియా వర్సిటీ నుంచి ఎంబీఏ, బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివర్సిటీ నుంచి ఎంఎస్ పూర్తి చేశారు. కంప్యూటర్ల తయారీ సంస్థ ‘ఆపిల్’తో కెరీర్ ప్రారంభించిన శంతను నారాయణ్, కొందరు మిత్రులతో కలసి ‘పిక్ట్రా’ సంస్థను నెలకొల్పారు. డిజిటల్ ఫొటోలను ఇంటర్నెట్ ద్వారా షేర్ చేసే వెసులుబాటును తొలిసారిగా అందుబాటులోకి తెచ్చిన ఘనత ‘పిక్ట్రా’ సంస్థకే దక్కుతుంది. తర్వాత ఆయన 1998లో అడోబ్ సంస్థలో వైస్ప్రెసిడెంట్ హోదాలో చేరారు. బరాక్ ఒబామా హయాంలో 2011లో మేనేజ్మెంట్ అడ్వైజరీ బోర్డు సభ్యుడిగా నియమితుడయ్యారు. ఫొటోషాప్, పీడీఎఫ్, ఆక్రోబాట్ వంటి అడోబ్ ఉత్పత్తుల విజయం వెనుక కీలక పాత్ర పోషించిన శంతను నారాయణ్, అనతి కాలంలోనే సీఈవో స్థానానికి చేరుకున్నారు. ‘ఎకనామిక్ టైమ్స్’ 2018లో శంతను నారాయణ్ను ‘గ్లోబల్ ఇండియన్ ఆఫ్ ది ఇయర్’గా గుర్తించింది. ప్రస్తుతం ఆయన అమెరికా–భారత్ వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఉపాధ్యక్షుడిగా కూడా ఉన్నారు. జయశ్రీ ఉల్లాల్ అరిస్టా నెట్వర్క్స్ క్లౌడ్ నెట్వర్కింగ్ కంపెనీ అయిన అరిస్టా నెట్వర్క్స్కు జయశ్రీ ఉల్లాల్ సీఈవోగా సారథ్యం వహిస్తున్నారు. లండన్లో పుట్టిన జయశ్రీ ఉల్లాల్ పాఠశాల విద్య ఢిల్లీలో కొనసాగింది. తర్వాత శాన్ఫ్రాన్సిస్కో యూనివర్సిటీ నుంచి బీఎస్, శాంటా క్లారా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. సెమీ కండక్టర్ వస్తువులను తయారు చేసే అమెరికన్ బహుళ జాతి సంస్థ అడ్వాన్స్డ్ మైక్రో డివైసెస్ (ఏఎండీ) నుంచి తన కెరీర్ ప్రారంభించారు. కొంతకాలం ఫెయిర్ చైల్డ్ సెమీకండక్టర్ సంస్థలో వివిధ హోదాల్లో పనిచేశారు. తర్వాత కంప్యూటర్ నెట్వర్కింగ్ సంస్థ యూబీ నెట్వర్క్స్లో చేరారు. అంచెలంచెలుగా ఎదుగుతూ, 2008 నాటికి అరిస్టా నెట్వర్క్స్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. అరిస్టా నెట్వర్క్స్ వ్యవస్థాపకులైన ఆండీ బెక్టాల్షీమ్, డేవిడ్ షెరిటన్లు ఏరి కోరి మరీ జయశ్రీ ఉల్లాల్ను ఈ పదవికి ఎంపిక చేశారు. ఆమె సారథ్యంలో అరిస్టా నెట్వర్క్స్ ఎన్నో విజయాలను నమోదు చేసుకుంది. నెట్ వర్కింగ్ సంస్థల్లో పనిచేసే ఐదుగురు ప్రభావవంతమైన వ్యక్తుల్లో ఒకరిగా జయశ్రీ ఉల్లాల్ను ‘ఫోర్బ్స్’ పత్రిక 2014లో ఎంపిక చేసింది. దినేష్ పాలీవాల్ హర్మాన్ ఆడియో, వినోద సమాచార సాధనాలను తయారు చేసే బహుళజాతి సంస్థ హర్మాన్ ఇంటర్నేషనల్ ఇండస్ట్రీస్కు దినేష్ పాలీవాల్ సీఈవోగా సేవలందిస్తున్నారు. ఆగ్రాలోని ఒక సామాన్య కుటుంబంలో పుట్టిన దినేష్ పాలీవాల్ చిన్నప్పటి నుంచి చదువులో అసమాన ప్రతిభా పాటవాలు కనబరచేవారు. యూనివర్సిటీ ఆఫ్ రూర్కీ (ప్రస్తుతం ఐఐటీ,రూర్కీ) నుంచి ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేశారు. ఇంజనీరింగ్లో ఉన్నత చదువు కొనసాగించడానికి స్కాలర్షిప్ లభించడంతో అమెరికాలోని మయామీ యూనివర్సిటీలో చేరి, అక్కడ ఎంఎస్, ఎంబీఏ డిగ్రీలు పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, చైనా, సింగపూర్, స్విట్జర్లాండ్లలో వివిధ సంస్థల్లో ఉద్యోగాలు చేశారు. అంచెలంచెలుగా ఎదిగి, 2003లో హర్మాన్ ఇంటర్నేషనల్ సీఈవోగా బాధ్యతలు చేపట్టారు. పాలీవాల్కు మయామీ యూనివర్సిటీ గత ఏడాది గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. ప్రముఖ మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ సామ్సంగ్ 2017లో హర్మాన్ సంస్థను స్వాధీనం చేసుకున్నా, దినేష్ పాలీవాల్ను ఈ పదవిలో కొనసాగనిచ్చింది. ఆయన ఈ ఏడాది ఏప్రిల్లో సీఈవో బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. అయితే, కొత్త సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న మైకేల్ మాసర్కు సలహాదారుగా డిసెంబరు వరకు కొనసాగనున్నారు. జార్జ్ కురియన్ నెట్యాప్ థామస్ కురియన్ గూగుల్ క్లౌడ్ జార్జ్ కురియన్, థామస్ కురియన్ సోదరులు కవలలు. కేరళలోని కొట్టాయం జిల్లాలో పుట్టి పెరిగారు. ఇద్దరికీ ఐఐటీ మద్రాసులో సీటు దొరికినా, అక్కడ వారిద్దరూ చదువుకున్నది ఆరు నెలలు మాత్రమే. మరింత మెరుగైన చదువు కోసం, ఉన్నతమైన అవకాశాల కోసం ఈ కవల సోదరులిద్దరూ అమెరికా చేరుకుని ప్రిన్స్టన్ యూనివర్సిటీలో చేరి, బీఎస్ పూర్తి చేశారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ పూర్తి చేశారు. కెరీర్ ప్రారంభంలో ఈ కవల సోదరులిద్దరూ ఒరాకిల్లో కొంతకాలం పనిచేశారు. తర్వాత ఇద్దరూ వేర్వేరు కంపెనీల్లో వివిధ హోదాల్లో పని చేశారు. జార్జ్ కురియన్ నెట్యాప్ సీఈవోగా 2015లో బాధ్యతలు చేపట్టగా, థామస్ కురియన్ 2019లో గూగుల్ క్లౌడ్ సీఈవో బాధ్యతలు చేపట్టారు. భారత్కు చెందిన ఇద్దరు కవల సోదరులు ప్రతిష్ఠాత్మకమైన రెండు వేర్వేరు బహుళ జాతి సంస్థలకు సీఈవోలుగా ఎదగడం విశేషం. సంజయ్ మెహ్రోత్రా మైక్రాన్ టెక్నాలజీ కంప్యూటర్స్ మెమొరీ స్టోరేజ్ పరికరాల సంస్థ మైక్రాన్ టెక్నాలజీకి సంజయ్ మెహ్రోత్రా 2017 నుంచి సారథ్యం వహిస్తున్నారు. సంజయ్ మెహ్రోత్రా స్కూలు చదువు ఢిల్లీలో కొనసాగింది. తర్వాత బిట్స్ పిలానీలో చేరినా, కొద్ది కాలానికే అక్కడి నుంచి కాలిఫోర్నియా వర్సిటీకి బదిలీ అయి, అక్కడ కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీలు సాధించారు. తర్వాత స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్లో గ్రాడ్యుయేషన్ కోర్సు చేశారు. కెరీర్ తొలినాళ్లలో 1988లోనే ఆయన తన మిత్రులతో కలసి కంప్యూటర్ మెమొరీ స్టోరేజ్ పరికరాల ఉత్పాదన సంస్థ శాన్డిస్క్ను నెలకొల్పారు. శాన్డిస్క్ సీఈవోగా 2011 నుంచి 2016 వరకు కొనసాగారు. కంప్యూటర్ స్టోరేజ్ పరికరాల రూపకల్పనలో విశేషమైన పరిశోధనలు సాగించిన మెహ్రోత్రా ఏకంగా 70 పేటెంట్లను సొంతం చేసుకున్నారు. సిలికాన్ వ్యాలీ ఎంటర్ప్రెన్యూర్స్ ఫౌండేషన్ మెహ్రోత్రాను 2013లో ‘సీఈవో ఆఫ్ ది ఇయర్’గా గుర్తించి, సత్కరించింది. ఇదివరకటి సారథులు వీరే... ప్రస్తుతం వివిధ బహుళ సంస్థల సీఈవోలుగా కొనసాగుతున్న భారతీయుల గురించి తెలుసుకున్నాం సరే, సమీప గతంలోనే కొందరు భారతీయులు కొన్ని బహుళజాతి సంస్థలకు సారథ్యం వహించి తమదైన ముద్ర వేశారు. అలాంటి వారిలో పెప్సీకోకు సారథ్యం వహించిన ఇంద్రా నూయీ అగ్రస్థానంలో నిలుస్తారు. మద్రాసులో పుట్టి పెరిగిన నూయీ తన కెరీర్ను భారత్లోనే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ద్వారా ప్రారంభించారు. ఆమె పెప్సీకో సీఈవోగా 2006 నుంచి 2018 వరకు కొనసాగారు. ప్రస్తుతం ఆమె పెప్సీకో చైర్వుమన్గా కొనసాగుతున్నారు. ఇక సంజయ్కుమార్ ఝా ప్రముఖ మొబైల్ఫోన్ల తయారీ సంస్థ ‘మోటొరోలా’కు, ‘గ్లోబల్ ఫౌండ్రీస్’కు సీఈవోగా పనిచేశారు. యూనివర్సిటీ ఆఫ్ లివర్పూల్, యూనివర్సిటీ ఆఫ్ స్ట్రాత్క్లైడ్లలో ఇంజనీరింగ్ పోస్ట్గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ చేసిన సంజయ్కుమార్ ఝాను అమెరికా ప్రభుత్వం 2018లో యూఎస్ నేషనల్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్లో కీలక పదవిలో నియమించింది. ఇదిలా ఉంటే, ప్రముఖ ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్ సీఈవోగా భారత సంతతికి చెందిన ఫ్రాన్సిస్కో డిసౌజా 2007 నుంచి 2019 వరకు సేవలందించారు. డిసౌజా తండ్రి ఐఎఫ్ఎస్ అధికారి. ఆయన కెన్యాలో విధులు నిర్వర్తిస్తున్న కాలంలో ఫ్రాన్సిస్కో డిసౌజా నైరోబీలో పుట్టారు. కార్నెగీ మెలాన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ ఆసియాలలో బిజినెస్ మేనేజ్మెంట్లో ఉన్నత చదువులు చదువుకున్నారు. – పన్యాల జగన్నాథదాసు -
పిచాయ్ని టచ్ చేసిన అమ్మాయ్!
ఆ ట్వీట్ దగ్గర సుందర్ పిచాయ్ కళ్లు ఆగిపోయాయి! గూగుల్ సీఈవో ఆయన. అంతటి మనిషిని పట్టి ఆపిన ట్వీట్ అంటే.. అది మామూలు ట్వీట్ అయి ఉండదు అనుకుంటాం. కానీ అతి మామూలు ట్వీట్ అది. ‘నాలుగేళ్ల క్రితం.. క్వాంటమ్ ఫిజిక్స్ పరీక్షలో నాకు జీరో మార్కులు వచ్చాయి. వెంటనే మా ప్రొఫెసర్ని కలిశాను. సర్, ఫిజిక్స్ని వదిలేసి ఇంకో సబ్జెక్ట్ తీసుకోనా అని అడిగాను. అదే నయమేమో అన్నట్లు ఆయనా చూశారు. కానీ ఈరోజు నేను ఆస్ట్రోఫిజిక్స్లో పీహెడ్.డి. పూర్తి చేశాను. రెండు అధ్యయన పత్రాలు సమర్పించాను. స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్) ఎవరికైనా కొరుకుడు పడనిదే. గ్రేడ్ తక్కువ వచ్చినంత మాత్రాన వదిలేయనవసరం లేదు’ అని శారాఫినా నాన్స్ అనే యువతి చేసిన ట్వీట్ అది. పిచాయ్ని ఆకట్టుకుంది. వెంటనే ‘‘వెల్ సెడ్ అండ్ సో ఇన్స్పైరింగ్’’ అంటూ ఆమెను అభినందిస్తూ ట్వీట్ పెట్టారు. ఓటమి అంటే గెలవలేకపోవడం కాదు. గెలిచేవరకు ప్రయత్నించక పోవడం. -
వారి నమ్మకాన్ని కాపాడతాం: సుందర్ పిచాయ్
వాషింగ్టన్: వివాదాస్పద అంశాల చర్చ విషయంలో తమ కంపెనీ ఇబ్బందులను ఎదుర్కొంటోందని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ప్రయాణ నిషేధ నిర్ణయాన్ని సమర్థించిన సెక్యూరిటీ అధికారి మైల్స్ టేలర్ను గూగుల్ నియమించడాన్ని సమర్థించారు. తాజాగా పిచాయ్ మాట్లాడుతున్న ఓ వీడియో లీకైంది. గురువారం పిచాయ్, నిపుణుల సమావేశంలో పలు కీలక అంశాలను చర్చించారు. ముఖ్యంగా కొంతమంది ఉద్యోగుల నమ్మకాన్ని సంస్థ కోల్పోయిందని అంగీకరించారు. ఉద్యోగుల అసంతృప్తిని పరిష్కరించే మార్గాలను చర్చించారు. గూగుల్ వైస్ ప్రెసిడెంట్ కరన్ భాటియా మాట్లాడుతూ టైలర్ను ఇమ్మిగ్రేషన్ పాలసీలో కాకుండా ఉగ్రవాదాన్ని నిరోధించడానికి, జాతీయ భద్రతను పెంపొందించే అంశాలలో అతని సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. ఈ క్రమంలో ఉద్యోగులు వివాదాస్పద రాజకీయ అంశాలను, కించపరిచే అంశాలను చర్చించొద్దని ఈ వేసవిలో కంపెనీ ఓ మెమోను జారీ చేసింది. అయితే ఎప్పటకప్పుడు ఉద్యోగుల ఫోరమ్లను పర్యవేక్షిస్తామని తెలిపింది. గూగుల్ అధికారి బరోసో మాట్లాడుతూ ఫోరమ్ల కంటే సాఫ్టవేర్ను ఉపయోగించుకొని సమస్యలను పరిష్కరించవచ్చని తెలిపారు. కంపెనీలో అసభ్య ప్రవర్తన, రహస్య సమాచారాన్ని లీక్ చేయడం స్పష్టమైన కంటెంట్ లేకపోవడం వంటి అంశాలను సాఫ్టవేర్లో ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు. -
దిమ్మ తిరిగే స్పీడుతో కంప్యూటర్
పారిస్: సూపర్ ఫాస్ట్ కంప్యూటర్లు 10 వేల యేళ్లలో గణించగల గణనలను కేవలం 200 సెకన్లలో సాధించిన కొత్త కంప్యూటర్ ‘సికామోర్ మెషీన్’ను శాస్త్రవేత్తలు పరీక్షించారు. ఇది సూపర్ కంప్యూటర్లకంటే కోట్ల రెట్ల వేగంతో పని చేసిందని బుధవారం తెలిపారు. ఈ తరహా వేగాన్ని ‘క్వాంటమ్ సుప్రిమసీ’ అంటారు. గూగుల్ సంస్థకు చెందిన పరిశోధనా బృందం దీన్ని తయారు చేస్తోంది. సాధారణ కంప్యూటర్లు ప్రతి విషయాన్ని బైనరీల రూపంలో (1, 0) అర్థం చేసుకుంటాయి. ఇందులోనూ అదే పద్ధతి ఉన్నా రెంటినీ ఒకేసారి తీసుకోగలదు. సాధారణ కంప్యూటర్లు సమాచారాన్ని బిట్స్ రూపంలో తీసుకుంటుండగా, సికామోర్ క్యూబిట్స్ రూపంలో తీసుకుంటుంది. ఇందులోని క్వాంటమ్ ప్రాసెసర్ 54 క్యూబిట్స్ సామర్థ్యంతో తయారైంది. తమ సంస్థకు చెందిన ఉద్యోగులు దీన్ని నిర్మించడం తమకు గర్వకారణమని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ట్వీట్చేశారు. -
ఒకే వేదికపై సచిన్, సుందర్ పిచాయ్
బర్మింగ్హామ్ : భారత లెజెండరీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ ఒకే వేదికపై కనిపించి అభిమానులను అలరించారు. ప్రపంచకప్లో భాగంగా టీమిండియా ఇంగ్లండ్ మధ్య ఆదివారం జరిగిన క్రికెట్ మ్యాచ్ను వీరుద్దరూ తిలకించారు. సచిన్, పిచాయ్ పక్క పక్కనే కూర్చొని మ్యాచ్ వీక్షిస్తున్న ఫోటోను.. బీసీసీఐ తన అధికారిక ట్విటర్లో షేర్ చేసింది. ఈ ఫొటోపై అభిమానులు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. (చదవండి : తగిలింది తొలి షాక్) గూగుల్లో పిచాయ్ క్రికెట్ స్కోర్ వివరాలు అప్డేట్ చేస్తున్నారని ఒకరు.. టెక్నాలజీ, స్పోర్ట్స్ జతకలిసి వచ్చే కొత్త తరానికి క్రికెట్ పాఠాలు నేర్పాలి అని మరొకరు కామెంట్ చేశారు. ఇంతకూ ఈ ఇద్దరూ లెజెండ్స్ ఏం మాట్లాడుకున్నారబ్బా అని మరో నెటిజన్ ఉత్సాహం చూపించాడు. కాగా మ్యాచ్కు ముందు యూఎస్-ఇండియా బిజినెస్ కౌన్సిల్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న పిచాయ్ భారత్, ఇంగ్లండ్ దేశాలు ప్రపంచకప్ ఫైనల్ చేరాలని ఆకాక్షించారు. చిన్నతనంలో క్రికెటర్ కావాలని కలలు కనేవాడినని.. సునీల్ గవాస్కర్, సచిన్ను ఆరాధించేవాడినని చెప్పుకొచ్చారు. ఇక భారత్-ఇంగ్లండ్ మ్యాచ్లో 31 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
‘విద్వేష వీడియోలపై విధానంలో కీలక మార్పులు’
వాషింగ్టన్ : యూట్యూబ్లో విద్వేష ప్రసంగాల వీడియోలపై తమ విధానంలో కీలక మార్పులు చేశామనీ, గత త్రైమాసికంలో ఏకంగా 90 లక్షల వీడియోలను తొలగించామని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ సోమవారం చెప్పారు. అయితే తాము చేయాల్సింది ఇంకెంతో ఉందని ఆయన అన్నారు. విద్వేషపూరిత, వివాదసహిత, పూర్ణాధిపత్య ధోరణితో ఉన్న వీడియోలను తొలగించేందుకు యూట్యూబ్ ప్రయత్నించినప్పటికీ, ఆ వీడియోలు మళ్లీ మళ్లీ కనిపించడంతో గత రెండేళ్లుగా ఆ కంపెనీపై ఉగ్రహం వ్యక్తం అవుతుండటం తెలిసిందే. సీఎన్ఎన్తో పిచాయ్ మాట్లాడుతూ ‘పరిస్థితిని చక్కదిద్దేందుకు మేం చాలా కష్టిస్తున్నాం. యూట్యూబ్ వాడకంలో మార్పులను బట్టి ప్రతీ కొన్ని సంవత్సరాలకోసారి పరిణామం చెందాలని మేం అనుకుంటాం. గత వారమే విద్వేష పూరిత వీడియోలపై మా విధానాలను సవరించాం. -
భారత్ కీలకం..
వాషింగ్టన్ : టెక్ దిగ్గజం గూగుల్ కొంగొత్త ఉత్పత్తులు ఆవిష్కరించడంలోనూ, అంతర్జాతీయంగా ఇతర దేశాల్లో వాటిని ప్రవేశపెట్టడంలోనూ భారత్ కీలక పాత్ర పోషిస్తోంది. పరిమాణం పరంగా భారత్ చాలా భారీ మార్కెట్ కావడంతో ఇక్కడిలాంటి ప్రయోగాలు చేయటం గూగుల్కు సాధ్యమవుతోంది. అమెరికా, ఇండియా వ్యాపార మండలి (యూఎస్ఐబీసీ) నిర్వహించిన ‘ఇండియా ఐడియాస్’ సదస్సులో పాల్గొన్న సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఈ విషయాలు చెప్పారు. పాలనను, సామాజిక.. ఆర్థిక పరిస్థితులను మెరుగుపర్చడానికి భారత ప్రభుత్వం టెక్నాలజీని అద్భుతంగా వినియోగించుకుంటోందని ఆయన కితాబిచ్చారు. ఇందులో తాము కూడా భాగస్వాములం కావడం సంతోషదాయకమన్నారు. ‘భారత మార్కెట్ భారీ పరిమాణం కారణంగా ముందుగా అక్కడ కొత్త ఉత్పత్తులు, సాధనాలు రూపొందించేందుకు, ఆ తర్వాత ఇతర దేశాల్లో ప్రవేశపెట్టేందుకు మాకు వీలుంటోంది. ముఖ్యంగా గత మూడు, నాలుగేళ్లుగా ఈ ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. ప్రస్తుతం భారత్ క్రమంగా డిజిటల్ చెల్లింపుల వైపు మళ్లుతోంది. దీంతో చెల్లింపుల సాధనాలను ప్రవేశపెట్టడానికి భారత్ సరైన మార్కెట్ అని మేం భావించాం. ఇది నిజంగానే మంచి ఫలితాలు కూడా ఇచ్చింది. ఇలా భారత మార్కెట్ కోసం రూపొందించిన సాధనాన్ని ప్రస్తుతం ఇతర దేశాల్లో కూడా అందుబాటులోకి తేవడంపై మా టీమ్ కసరత్తు చేస్తోంది‘ అని పిచయ్ పేర్కొన్నారు. ఫోన్ల ధరలను తగ్గించి, మరింత మందికి అందుబాటులోకి తెచ్చేందుకు గూగుల్ ప్రయత్నిస్తూనే ఉందన్నారు. 2004లో భారత్లో రెండు దేశీ తయారీ సంస్థలు మాత్రమే ఉండగా.. ఇప్పుడు 200 పైచిలుకు ఉన్నాయని పిచయ్ చెప్పారు. మరోవైపు, డేటా ప్రైవసీని కాపాడేందుకు అనుసరించాల్సిన ప్రమాణాల రూపకల్పనలో భారత్, అమెరికా కీలక పాత్ర పోషించగలవని ఆయన అభిప్రాయపడ్డారు. డిజిటల్ వాణిజ్య లావాదేవీలకు సమాచార మార్పిడి స్వేచ్ఛగా జరగడం ప్రధానమని, అయితే అదే సమయంలో యూజర్ల ప్రైవసీకి భంగం కలగకుండా ఉండటం కూడా ముఖ్యమేనని ఆయన పేర్కొన్నారు. సదస్సు సందర్భంగా పిచయ్ గ్లోబల్ లీడర్షిప్ పురస్కారాన్ని అందుకున్నారు. భారత్, ఇంగ్లండ్ మధ్యే వరల్డ్ కప్ ఫైనల్స్... ఐసీసీ వరల్డ్ కప్ ఫైనల్స్లో భారత్, ఇంగ్లండ్ తలపడే అవకాశాలు ఉన్నాయని పిచయ్ జోస్యం చెప్పారు. భారత జట్టు గెలవాలని తాను కోరుకుంటున్నానన్నారు. ‘భారత్, ఇంగ్లండ్ మధ్య ఫైనల్ పోరు ఉండొచ్చనుకుంటున్నాను. అయితే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కూడా మంచి పటిష్టమైన జట్లే. వాటినీ తక్కువగా అంచనా వేయలేం’ అన్నారాయన. క్రీడల్లో తనకు క్రికెట్ అంటే మక్కువని తెలిపిన పిచయ్.. అమెరికాలో తన క్రికెట్, బేస్బాల్ ఆటల అనుభవాలు వెల్లడించారు. ‘నేను ఇక్కడికి వచ్చిన కొత్తల్లో బేస్బాల్ ఆడేందుకు ప్రయత్నించాను. అది కాస్త కష్టమైన ఆటే. మొదటి గేమ్లో బాల్ను గట్టిగా కొట్టా. క్రికెట్లో అలా చేస్తే గొప్ప షాట్ కాబట్టి.. గొప్పగానే ఆడాననుకున్నా. అందరూ వింతగా చూశారు. అలాగే క్రికెట్లో రన్ తీసేటప్పుడు బ్యాట్ను వెంట పెట్టుకుని పరుగెత్తాలి. ఇందు లోనూ అలాగే చేశాను.. కానీ తర్వాత తెలిసింది.. బేస్బాల్ అనేది క్రికెట్ లాంటిది కాదని. ఏదైతేనేం.. నేను క్రికెట్కే కట్టుబడి ఉంటా’ అన్నారు. -
ఫైనల్లో తలపడేవి ఆ జట్లే..!!
వాషింగ్టన్ : ప్రపంచకప్ ఫైనల్లో ఆతిథ్య ఇంగ్లండ్, టీమిండియా జట్లు తలపడతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ జోస్యం చెప్పారు. అయితే మెగా టోర్నీలో ఇండియానే గెలవాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. వాషింగ్టన్లో జరిగిన అమెరికా- ఇండియా వ్యాపార మండలి సదస్సుకు సుందర్ పిచాయ్ హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో సహా పలువురు కార్పోరేట్ దిగ్గజాల సమక్షంలో ఆయన గ్లోబల్ లీడర్షిప్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా క్రీడలపై పట్ల తనకున్న మక్కువ గురించి పిచాయ్ మాట్లాడుతూ..‘ ఇక్కడికి(అమెరికా) వచ్చిన కొత్తలో బేస్బాల్ అంటే ఇంట్రస్ట్ ఉండేది. అది చాలెంజింగ్ గేమ్ అనిపించేది. మొదటి మ్యాచ్లోనే బాల్ను వెనక్కి బలంగా కొట్టేసా. నిజానికి అది క్రికెట్ మ్యాచ్ అయి ఉంటే గ్రేట్ షాట్ అయ్యి ఉండేది. కానీ బేస్బాల్ మ్యాచ్లో అలా ఆడినందుకు అందరూ వింతగా చూశారు. అందుకే బేస్బాల్ కాస్త కఠినంగా తోచింది. దీంతో క్రికెట్కు షిఫ్ట్ అయిపోయాను. ఇప్పుడు ప్రపంచకప్ అనే అద్భుతమైన టోర్నమెంట్ జరుగుతోంది కదా. మెన్ ఇన్ బ్లూ గెలవాలని ఆశిస్తున్నా. నాకు తెలిసి ఇంగ్లండ్, భారత్ ఫైనల్లో తలపడతాయి. ఇక న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలు మంచి జట్లు. వాటిని కూడా తక్కువగా అంచనా వేయలేం’ అని చెప్పుకొచ్చారు. -
సుందర్ పిచయ్ ఓటేశారా?
సామాజిక మాధ్యమాల పుణ్యమా అని ఏది అసలు వార్తో ఏది అబద్ధమో తెలియకుండా పోతోంది. పాత ఫొటోలు, మార్ఫింగ్ చేసిన ఫొటోలు పెట్టి అసలు వార్తల్లా భ్రమింప చేస్తున్నారు. ఈ కోవలోకే వస్తుంది గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటేసిన వార్త. రెండో దశ ఎన్నికల్లో భాగంగా తమిళనాడులో గురువారం పోలింగ్ జరిగింది. ఆ ఎన్నికల్లో గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ ఓటు వేసినట్టు సామాజిక మాధ్యమాల్లో వార్త వచ్చింది. తమిళనాడుకు చెందిన సుందర్ పిచయ్ ఓటు కోసమే పని గట్టుకుని భారతదేశం వచ్చారని, ఓటు వేసి వెళ్లిపోయారని ఆ వార్త సారాంశం. ఓటు వేయడానికి వస్తున్న సుందర్ పిచయ్ అంటూ ఫొటో కూడా పెట్టారు. అయితే, నిజానికి సుందర్ పిచయ్ ఓటు వేయలేదు. అమెరికాలో ఉంటున్న ఆయనకు ద్వంద్వ పౌరసత్వం ఉంది. అంటే ఆయన భారత పౌరుడిగా, అమెరికా పౌరుడిగా కూడా చెలామణి అవుతున్నారు. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం ద్వంద్వ పౌరసత్వం ఉన్న ప్రవాస భారతీయులు భారతదేశంలో జరిగే ఎన్నికల్లో ఓటు వేయడానికి వీల్లేదు. కాబట్టి సుందర్ పిచయ్ ఓటు వేశారనడం నిజం కాదు. ఈ వార్తతో పాటు పెట్టిన ఫొటో రెండేళ్ల కిందటిది. 2017లో భారత దేశం వచ్చిన సుందర్ తాను చదువుకున్న ఖరగ్పూర్ ఐఐటీకి వెళ్లారు. అప్పుడు తీసిన ఫొటోను ఇప్పటి వార్తతో కలిపి పెట్టేశారు. దాన్ని చూసిన వారు నిజంగా పిచయ్ ఓటు వేయడానికి వచ్చారని నమ్మేశారు. -
గూగుల్ సీఈవో ఓటు వేసాడా?
వినేవాడుంటే చెప్పేవాడు ఎన్నయినా చెబుతాడు. కొంచెం పద్ధతిగా చెప్పుకున్నాం కాబట్టి ఈ సామెత వినడానికి బాగుంది. కానీ ఇదే సామెతకు ఈ మధ్య చాలా రీమిక్స్ లు పుట్టుకొచ్చాయి. అలా పుట్టుకొచ్చిన రీమేక్ సామెతను యాజ్ ఇటీజ్ గా సోషల్ మీడియాకు అపాదిస్తే... వినేవాడుంటే సోషల్ మీడియా ఎన్నయినా చెబుతోందనవచ్చు. అవును అసత్య వార్తలను ప్రచారం చేసి.. ఏది నిజం.. ఏది అబద్దమో తెలుసుకోలేని పరిస్థితిలోకి నెట్టేస్తుంది. ఆ మధ్య కేరళ వరదలప్పుడు ఆ హీరో, ఈ క్రికెట్ ఇంత సాయం చేశాడంటూ అందరిని తప్పుదోవ పట్టించింది. పిల్లలను ఎత్తుకుపోతున్నారంటూ మూక దాడులకు కారణమైంది. ఇలా సోషల్ మీడియా ఫేక్ కథల గురించి చెప్తే ఒడిసేది కాదు.. దంచితే దంగేది కాదు.తాజాగా లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్లో మరో అసత్యవార్త హల్చల్ చేస్తోంది. దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లో ఉన్న 95 లోక్సభ నియోజకవర్గాలకు జరిగిన రెండో దశ పోలింగ్లో సినీతారాలు, రాజకీయ ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుని తమ ఇంకుడ్ వేలును చూపిస్తూ ఫొటోలకు ఫోజిచ్చారు. అయితే గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ కూడా గురువారం జరిగిన రెండో దశ పోలింగ్లో ఓటుహక్కు వినియోగించుకున్నాడని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షికారు చేస్తుంది. పైగా సుందర్ తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అమెరికా నుంచి ప్రత్యేకంగా వచ్చాడని ప్రచారం జరుగుతోంది. ఈ పోస్ట్కు జత చేసి ఫొటోను ఫ్యాక్ట్ చెక్ చేయగా అసలు విషయం బయటపడింది. సోషల్మీడియాలో జరుగుతున్న ప్రచారం అంత ఉత్తదేనని తేలిపోయింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సుంధర్ ఫొటో.. 2017 ఐఐటీ కరగ్పూర్ను సందర్శించిననాటిదని తేలిపోయంది. ఆ సమయంలో సుంధర్ ఈ ఫొటో తన ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ఈ ఫొటోనే వాడుకుంటూ సుందర్ ఓటు హక్కు వినియోగించుకున్నాడని అసత్యప్రచారాని తెరలేపారు. సుందర్ తమిళనాడులోని మధురైలో జన్మించినప్పటికి.. అతను అమెరికా పౌరసత్వం కలిగి ఉన్నారు. అతను భారత్లో ఓటేస్తానన్నా.. ఈసీ అనుమతించదు. భారత పౌరసత్వం కలిగి ఉన్న ఎన్ఆర్ఐలకు మాత్రం ఓటేసే అవకాశం కల్పిస్తారు. Also got to visit my alma mater (and old dorm room!) for the first time in 23 years. Thanks to everyone @IITKgp for the warm welcome! pic.twitter.com/OUn7mlKGI7 — Sundar Pichai (@sundarpichai) 7 January 2017 -
గూగుల్లో అత్యధిక మంది వెతికింది దానికోసమే!!
ఈ ఏడాది పూర్తవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉంది. 2018 తమకు మిగిల్చిన తీపి ఙ్ఞాపకాలను, చేదు అనుభవాలను గుర్తు చేసుకుంటూ నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికేందుకు.. మనలో చాలా మంది ఇప్పటినుంచే ప్రిపరేషన్స్ మొదలుపెట్టేసి ఉంటారు కూడా. ఈ నేపథ్యంలో 2018లో అత్యధిక మంది నెటిజన్లు ఎక్కువగా దేని గురించి వెదికారో అన్న దానిపై గూగుల్ ఓ వీడియోను విడుదల చేసింది. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ తన ట్విటర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్షణాల్లోనే వైరల్గా మారింది. యూట్యూబ్ విడుదల చేసిన ఆన్యువల్ రివైండ్ వీడియో కంటే కూడా గూగుల్ వీడియోనే సూపర్బ్గా ఉందంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంతకీ గూగుల్లో ఎక్కువ మంది వెదికింది దేనికోసం అంటే...‘మంచి’ కోసం. అవును మీరు చదివింది నిజమే. గుడ్ సింగర్, డ్యాన్సర్, కిస్సర్ ఇలా ప్రతీవిషయంలో గుడ్ అనిపించుకోవడానికి ఏం చేయాలా అని నెటిజన్లు సెర్చ్ చేశారట. ఇయర్ఇన్సర్చ్ పేరిట విడుదల చేసిన ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఇంకేం మీరు కూడా ఓ లుక్కేయండి మరి. In a year of ups and downs, the world searched for "good" more than ever before. Here’s to all the good moments from 2018 and all the people who searched for them. #YearInSearch https://t.co/hj2FnX4mR4 — Sundar Pichai (@sundarpichai) December 12, 2018