-
పదేళ్ల తర్వాత ఎన్కౌంటర్
-
విశాఖలో ఓ ప్రబుద్ధుడు నిర్వాకం..
మల్కాపురం(విశాఖ పశ్చిమ): కూతురు వయసు ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి ఆమె భర్తకు దూరం చేశాడు ఓ ప్రబుద్ధుడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. శ్రీహరిపురంలో 56 సంవత్సరాల వయసు ఉన్న బెహరా అనే వ్యక్తి.. భార్య, కుమారుడుతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే బెహరాకు హైదరాబాద్ ఎల్బీ నగర్కు చెందిన వ్యక్తితో పరిచయమైంది. ఈ క్రమంలో ఆయన భార్య(36)తో బెహరా పరిచయం పెంచుకున్నాడు. లావుగా ఉన్న ఆమెను సన్నగా మార్చుతానంటూ నమ్మించి బాగా దగ్గరయ్యాడు. ఆమెను గత వారం శ్రీహరిపురం తీసుకువచ్చాడు. అయితే భార్య ఇంట్లో కనిపించకపోవడంతో ఆమె భర్త ఎల్బీ నగర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. (చదవండి: ఆ ఊరికి ఏమైందో!) విశాఖ జిల్లా శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన బెహరాపై అనుమానం ఉందని అక్కడ పోలీసులకు తెలియజేశాడు. దీనిలో భాగంగా అక్కడ పోలీసులు సివిల్ డ్రెస్లో శుక్రవారం సాయంత్రం శ్రీహరిపురం వచ్చి బెహరా వద్ద విచారించారు. ఈ క్రమంలో అక్కడ స్థానికులు బెహరాతో వచ్చిన ఆమెను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు తీసుకువెళ్తేందుకు యతి్నస్తున్నారని భావించి 100కు డయల్ చేశారు. దీంతో అక్కడికి మల్కాపురం పోలీసులు వచ్చి సివిల్ డ్రస్లో ఉన్న ఎల్బీ నగర్ పోలీసులను ప్రశ్నించారు. తాము కూడా పోలీసులమని చెప్పి ఐడీ కార్డులు చూపించారు. ఈ క్రమంలో బెహరాతో పాటు ఆమె కూడా అక్కడి నుంచి నెమ్మదిగా జారుకున్నారు. వారి ఆచూకీ కోసం ఎల్బీ నగర్, మల్కాపురం పోలీసులు గాలిస్తున్నారు. (చదవండి: కథ కంచికి.. మనం ఇంటికి!) -
కస్టడీ నుంచి నిందితుడి పరారీ
పెదగంట్యాడ (గాజువాక): పోలీస్ కస్టడీలో ఉన్న నిందితుడు ఆదివారం తెల్లవారుజామున పరారయ్యాడు. ఇటీవల గంజాయి కేసులో అరెస్టయిన నాగేశ్వరరావు పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం సంచలనంగా మారింది. సోమవారం వరకూ ఈ విషయం బయటకు రాకుండా పోలీసులు గోప్యంగా ఉంచారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు... విశాఖ జిల్లా చీడికాడ మండలం బైలపూడికి చెందిన మిర్తిపాటి నాగేశ్వరరావు పెదగంట్యాడ మండలంలోని గాంధీనగర్లో 486 కిలోల గంజాయి అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో పోలీసులు శనివారం దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసులో నిందితుడైన మిర్తిపాటి నాగేశ్వరరావును అరెస్టు చేసి పోలీస్ కస్టడీలో ఉంచారు. రిమాండ్కు తరలించే ముందు కోవిడ్ – 19 పరీక్షలు నిర్వహించి జైలుకు తరలించాలనే నిబంధనల మేరకు స్టేషన్లోనే అతన్ని ఉంచారు. అయితే ఆదివారం తెల్లవారుజామున నాగేశ్వరరావు మరుగుదొడ్డికి వెళ్తానని చెప్పడంతో ఓ కానిస్టేబుల్తో కలిసి హోంగార్డు అతన్ని బాత్రూమ్కు తీసుకెళ్లారు. బాత్రూమ్ తలుపు రాకపోవడంతో అది తీసేందుకు ఒకరు ప్రయత్నించే సమయంలో మరొకరి చేతిని విడిపించుకుని నిందితుడు పారిపోయాడు. పోలీసులు పరుగులు పెట్టినా ఫలితం లేకపోయింది. నాగేశ్వరరావు కోసం ఆదివారం, సోమవారం పోలీసు బృందాలు గాలించినా ఉపయోగం లేకపోయింది. ఈ సంఘటనపై న్యూపోర్టు పోలీసులను వివరణ కోరగా బిజీగా ఉన్నామంటూ వివరాలు గోప్యంగా ఉంచుతున్నారు. -
పోలీసుల కళ్లుగప్పి సైబర్ నేరస్థుడి పరారీ
-
కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారీ
సాక్షి, పశ్చిమగోదావరి: ఏలూరు సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు ఖైదీలు పరారయ్యారు. జిల్లా జైల్లో ఖైదీలకు కరోనా సోకడంతో 13 మందిని కోవిడ్ కేంద్రానికి తరలించారు. వీరిలో పలు చోరీ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్న ఇద్దరు ఖైదీలు ఇదే అదనుగా భావించి శనివారం తెల్లవారుజామున సుమారు మూడుగంటల ప్రాంతంలో కోవిడ్ కేంద్రం నుంచి పరారయ్యారు. దీంతో ఏలూరు పోలీసులకు సిబ్బంది సమాచారం అందించారు. పరారీలో ఉన్న ఖైదీల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పరారైన ఖైదీలను పట్టుకుంటాం:ఎస్పీ ఖైదీలు పరారైనా ఏలూరు సీఆర్ఆర్ కోవిడ్ సెంటర్ను ఎస్పీ నారాయణ నాయక్ పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పరారైనా నిందితులను పట్టుకుంటామని తెలిపారు. పారిపోయిన ఇద్దరు ఖైదీలు ఇంటి చోరీ కేసుల్లో నేరస్తులని వెల్లడించారు. వీరిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామని ఎస్పీ తెలిపారు. -
ఏలూరు కోవిడ్ సెంటర్ నుంచి ఇద్దరు దొంగలు పరారీ
-
ఏలూరు కోవిడ్ సెంటర్ నుంచి ఖైదీలు పరారీ
-
పాజిటివ్ వస్తుందనే భయంతో..
సాక్షి, విజయవాడ: కరోనా భయంతో ఓ వ్యక్తి ఇంటి నుంచి పరారైన ఘటన విజయవాడలో చోటు చేసుకుంది. నగరానికి చెందిన శ్రీనివాసరావు జర్వం కారణంగా ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు పట్టించుకోకపోవడంతో ఆయన కోవిడ్ ఆసుపత్రికి వెళ్లగా, ప్రభుత్వ వైద్యులు కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పాజిటివ్ వస్తుందనే భయంతో ఈ నెల 4న శ్రీనివాసరావు ఇంటి నుంచి పరారీ అయ్యారు. తన భర్త ఆచూకీ కనిపెట్టాలని పటమట పోలీసులకు భార్య ఫిర్యాదు చేసింది. పరారైన శ్రీనివాసరావుకు నెగిటివ్ రిపోర్ట్ రావడం గమనార్హం. ఏడు రోజులుగా పోలీసులు గాలిస్తున్న ఇప్పటివరకు ఆ వ్యక్తి ఆచూకీ దొరకకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. -
హత్య కేసులో నిందితుడు క్వారంటైన్ నుంచి పరార్
ముంబై : కరోనా సోకిన 49 ఏళ్ల హంతకుడు క్వారంటైన్ సెంటర్ నుంచి తప్పించుకున్న ఘటన మహారాష్ర్టలోని థానేలో చోటుచేసుకుంది. ఆదివారం రాత్రి నిందితుడు పరారీలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. వివరాల ప్రకారం..కళ్యాణ్ మోహన్ అనే వ్యక్తి మే 30న భార్యను హత్య చేసిన ఘటనలో పోలీసులు అతడ్ని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ నేపథ్యంలో జూన్ 16న నిందితుడికి జలుబు, జ్వరం లాంటి కరోనా లక్షణాలు బయటపడటంతో పరీక్షలు నిర్వహించగా కోవిడ్ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో వెంటనే అతడ్ని క్వారంటైన్ సెంటర్కు తరలించి అతడిపై నిఘా ఉంచేందుకు ముగ్గురు పోలీసు సిబ్బందిని నియమించగా ఆదివారం రాత్రి పరారయ్యాడు. అయితే నిందితుడికి ఎవరెవరిని కలిశాడు అతని ద్వారా ఎంత మందికి వైరస్ వ్యాప్తి చెంది ఉండొచ్చు అన్నదానిపై విశ్లేషిస్తున్నారు. త్వరలోనే నిందితుడిని అదుపులోకి తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. (భర్తకు బీమా చేసి హత్య చేసిన భార్య ) -
తాళం పగలగొట్టి.. క్వారంటైన్ నుంచి పరారీ
సాక్షి, మైలవరం: కృష్ణా జిల్లా మైలవరంలో ఏర్పాటు చేసిన క్వారంటైన్ కేంద్రం నుంచి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. సూర్యాపేట జిల్లా కోదాడకి చెందిన మక్కా వెంకటేశ్వరరావు(33), నరసమ్మ (30) అనే మహిళ నాలుగు రోజుల క్రితం మైలవరం బంధువులు ఇంటికి రాగా.. స్థానికులు సమాచారం ఇవ్వడంతో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించి ముందు జాగ్రత చర్యల్లో భాగంగా అధికారులు వారిని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు. (ఏపీలో కొత్తగా మరో 80 కరోనా కేసులు) గురువారం తెల్లవారు జామున క్వారంటైన్ కేంద్రం వెనుక గేట్ తాళం పగలకొట్టి ఇద్దరు పరారైనట్లు సిబ్బంది గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో దర్యాప్తు చేస్తున్నారు. పరారైన ఇద్దరు కోదాడ పట్టణానికి చేరినట్లు సమాచారం. వారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడంతో పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
పోస్ట్మార్టం వద్దంటూ బైక్పై మృతదేహంతో పరార్
-
పోలీస్ స్టేషన్కు తుపాకులతో వచ్చి..
జైపూర్: సాయుధులైన పది మంది ఏకే–47 రైఫిల్తో పోలీస్స్టేషన్పై కాల్పులు జరిపి జైల్లో ఉన్న నిందితున్ని తమతో తీసుకెళ్లిన ఘటన రాజస్తాన్లోని అల్వార్ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పోలీసులు పెట్రోలింగ్ విధులు నిర్వహిస్తుండగా విక్రమ్ గుజ్జర్ (28, పప్లాగా సుపరిచితుడు) వాహనంలో రూ. 30 లక్షలు పట్టుకున్నారు. అనంతరం డబ్బును సీజ్ చేసి పప్లాను పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. పోలీసులు ఆతన్ని విచారిస్తుండగా, సాయుధులైన దాదాపు 15 మంది దుండగులు ఏకే 47 రైఫిళ్లతో పోలీస్స్టేషన్లోకి ప్రవేశించారు. దాదాపు 45 రౌండ్లు కాల్పులు జరిపి పప్లాను తీసుకొని ఉడాయించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. తప్పించుకున్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు అధికారి సుగన్ సింగ్ అన్నారు. హరియాణాకు చెందిన పప్లా మీద ఇప్పటికే అయిదు హత్యా నేర అభియోగాలున్నాయి. ఆయుధాలు ధరించిన ఫొటోలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేస్తుంటాడు. అతడిపై రూ. లక్ష రివార్డు కూడా ఉంది. -
ఇంకా పరారీలోనే కూన రవికుమార్..
సాక్షి, ఆమదాలవలస: మాజీ విప్ కూన రవికుమార్ ఇంకా పరారీలోనే ఉన్నారు. ఎక్కడ ఉన్నారన్న సమాచారం మాత్రం తెలియడంలేదు. అజ్ఞాతంలోనే ఉన్నట్లు అందరూ చర్చించుకుంటున్నారు. పోలీసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నామని చెబుతున్నారు. ముందస్తు బెయిల్ కోసం హైకోర్టులో పిటిషిన్ పెట్టినట్లు తెలిసింది. ముందస్తు బెయిల్ మంజూరు అయితేనే ఆయన బయటకు వస్తారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. శ్రీకాకుళంలో గల కూన రవికుమార్ ఇంటి వద్ద మాత్రం పోలీసులు మొహరించి ఉన్నారు. ఆయన గృహానికి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పలువురు అగ్రనేతలు పరామర్శలకు వచ్చి వెళ్తున్నారు. కూన రవికుమార్తోపాటు మరో ముద్దాయి అంబళ్ల రాంబాబు కూడా పరారీలో ఉన్నారు. -
గంజాయి స్మగ్లర్ల పరార్
సాక్షి, వరంగల్ : టాస్క్ఫోర్స్ పోలీసులు గంజాయి స్మగ్లర్లను అదుపులోకి తీసుకొని బుధవారం రాత్రి సుమారు 12.30 గంటలకు సుబేదారి పోలీసులకు అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న ఓ సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పచెప్పారు. తీరా గురువారం ఉదయం స్మగ్లర్లను తీసుకురమ్మని అధికారులు అదేశించగా నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో నివ్వెరపోవడం వారి వంతైంది. 24 గంటల పాటు కాపలా.. పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది.. శత్రువుల నుంచి ప్రమాదం పొంచి ఉంటుందనే ఆలోచనతో ప్రతీ క్షణం పరిసరాల నిశిత పరిశీల న.. ఇక కస్టడీలోకి తీసుకున్న నిందితుల విషయమైతే మరీ అప్రమత్తత.. ఇదంతా పోలీసుస్టేషన్లలో సర్వసాధారణంగా ఉండే పరిస్థితి.. కానీ పోలీసు కమిషనరేట్కు కూత వేటు దూరంలో ఉన్న సుబేదారి పోలీసు స్టేషన్కు కస్టడీ కోసం తీసుకొచ్చిన ఇద్దరు నిందితులు పోలీసుల కళ్లు కప్పి పారిపోవడం సంచలనం సృష్టించింది. బుధవారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకోగా పోలీసుస్టేషన్లలో భద్రతకు సంబంధించి డొల్లతనం బయటపడినట్లయింది. అంతేకాకుండా అధికారుల పనితీరుకు ఈ ఘటన అద్దం పడుతోందని.. విధి నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం, ఉన్నతాధికారుల పర్యవేక్షణాలోపాన్ని ఎత్తిచూపుతోందని భావిస్తున్నారు. అసలేం జరిగింది? సుబేదారి పోలీసు స్టేషన్ పరిధిలోని జులైవాడలో బుధవారం రాత్రి టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా గంజాయిని విక్రయించటానికి సిద్ధంగా ఉన్న వర్ధన్నపేటకు చెందిన కుమార్, వీర్ పట్టుబడగా అదుపులోకి తీసుకోవడంతో వారి నుంచి సుమారు 80 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను సుబేదారి పోలీసులకు రాత్రి సుమారు 12.30 గంటల సమయంలో అప్పగించారు. కస్టడీలోకి తీసుకున్న సమయంలో ఓ సబ్ ఇన్స్పెక్టర్ రాత్రి విధుల్లో ఉన్న సిబ్బందికి నిందితులను అప్పగించారు. అయితే, గురువారం ఉదయం విధుల్లోకి వచ్చిన అధికారులు రాత్రి కస్టడీలోకి తీసుకున్న నిందితుల(గంజాయి స్మగ్లర్లు)ను తీసుకురమ్మని అదేశించగా సిబ్బంది తెల్లమొహం వేశారు. నిందితులు కనబడటం లేదనే సమాధానం రావడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. ఆఘమేఘాల మీద రాత్రి నుంచి తెల్లవారువరకు జరిగిన విషయాలను సుబేదారి పోలీసులు ఉన్నతాధికారులకు చేరవేశారు. ఈక్రమంలో నిందితులు పరారైన విషయం ఎక్కడా బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారు. ఎలాగోలా గురువారం మధ్యాహ్నం తర్వాత విషయం వెలుగు చూడడం.. నిందితులను కోర్టు సమయం ముగిసేలోగా పట్టుకోవాలని ఉన్నతాధికారులు హెచ్చరించడంతో అధికారులు, సిబ్బంది పరుగులు తీశారు. కానీ సాయంత్రం వరకు గాలించినా నిందితుల ఆచూకీ లభ్యం కాలేదని సమాచారం. ఇదేనా నిఘా? కాలనీల్లో ఎక్కడైనా దొంగతనం జరిగితే సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించే పోలీసులు.. పోలీసుస్టేషన్లలో కూడా ఆ ఏర్పాట్లు చేశారు. కానీ కస్టడీలోకి తీసుకున్న ఇద్దరు నిందితులు విధుల్లో ఉన్న సిబ్బంది కళ్లు కప్పి పారిపోతే ఏం చేశారన్నది ప్రశ్నార్థకంగా మారింది. సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే నిందితులు పరారయ్యారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధి నిర్వహణలో అధికారులు చూపిన నిర్లక్ష్యమే ఇప్పుడు వారికి తలనొప్పిగా మారింది. ఇక కస్టడీలో ఉన్న నిందితులు ఎలా బయటకు వెళ్లారు.. ఆ సమయంలో పోలీసు స్టేషన్లో ఎవరూ లేరా.. ఉంటే ఏం చేశారు.. లేదంటే తప్పించుకుని వెళ్తున్న నిందితులకు ఎవరైనా సహకరించారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటితో పాటు పదుల సంఖ్యలో సీసీ కెమెరాల నిఘా.. పర్యవేక్షణను దాటుకుని నిందితులు పారిపోయే వరకు అధికారులు, సిబ్బంది ఏం చేశారనే ప్రశ్నకు ఎవరి వద్ద సమాధానం లేకపోవడం గమనార్హం. తప్పించుకుపోయిన నిందితులు ఎప్పుడు దొరుకుతారో తెలియకున్నా అప్పటి వరకు సుబేదారి పోలీసుస్టేషన్ అధికారులు, సిబ్బందికి కంటి మీద కునుకు ఉండదనే చెప్పాలి. నాకు ఎలాంటి సమాచారం లేదు సుబేదారి పోలీసు స్టేషన్ నుంచి ఇద్దరు నిందితులు పరారైన విషయమై ‘సాక్షి’ హన్మకొండ ఏసీపీ చల్లా శ్రీధర్ను వివరణ కోరింది. దీనికి ఆయన స్పందిస్తూ ‘మీకు ఈ విషయం ఎవరు చెప్పారు? పోలీసులా... అధికారులా?’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా అలాంటి విషయం ఏదీ లేదని.. తనకు ఎలాంటి సమాచారం లేదంటూ సమాధానం ఇచ్చారు. -
అమెరికాలో తెలుగు యువకుడు అదృశ్యం
సాక్షి, సైదాబాద్: కొడుకు ఉన్నత ఉద్యోగం చేస్తానంటే అప్పు చేసి మరి అమెరికా పంపించారు కన్నవారు. అయితే గత 8 నెలలుగా కొడుకు ఆచూకి లేకపోవడంతో వారు ఆవేదన చెందుతున్నారు. ఒక్కగానొక్క కొడుకు అమెరికాలోని కాలిఫోర్నియాలో అదృశ్యం కావడంతో వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు. దీంతో కుటుంబ సభ్యులు చంపాపేట సమీపంలోని వినయ్ నగర్ కాలనీలో శక్రవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంద్రప్రదేశ్లోని ఈస్ట్గోదావరి జిల్లా అమలాపురం గ్రామానికి చెందిన పండు బంగారం, పుష్పలత దంపతులు ఉద్యోగ రిత్యా నగరానికి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వీరికి ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు అనారోగ్యంతో చిన్నతనంలోనే కర్నూల్లో మృతి చెందారు. దీంతో చిన్న కుమారుడు పి.రాఘవేందర్రావును ఎంతో గారాంభంగా పెంచారు. ఉన్నత చదువులు చదించారు. జెన్టీయులో బీటెక్, ఆ తరువాత లండన్లో 2010లో ఎంబీఏ చదివించారు. రాఘవేందర్రావు 2011లో అమెరికా వెళ్లాడు. అక్కడి కాలిఫోర్నియాలోని మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ప్రాజెక్ట్ మెనేజర్గా ఉద్యోగం చేస్తున్నాడు. కాగా ప్రతి రోజు రాఘవేందర్రావు తల్లిదండ్రులతో ఫోన్లో, వాట్సాప్ వీడియో కాల్ మాట్లాడేవారు. అయితే అక్టోబర్ 2017 నుంచి రాఘవేందర్ ఫోన్ స్విచ్ఆఫ్ వస్తుంది. అప్పటి నుంచి నేటి వరకు కొడుకు ఆచూకి లభించడం లేదు. అతడి స్నేహితులను ఆరా తీసినా సరైన సమాచారం లేదు. దీంతో అప్పటి నుంచి కొడుకు ఆచూకి కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ విషయంమై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి విన్నవించారు. సైదాబాద్ పోలీసులను సంప్రదించగా వారు ఎన్ఆర్ఐ సెల్కు పంపించారు. ఒక్కగానొక్క కొడుకు ఎప్పటికైన తిరిగొస్తాడని దీనంగా ఎదురు చూస్తుంది ఆ కుంటుంబం. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. -
చీటీ పేరుతో రూ.2 కోట్ల మోసం
సాక్షి,తిరుత్తణి : చీటీల పేరుతో రూ.2 కోట్లు మోసం చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరమంగళం గ్రామస్తులు మంగళవారం తిరుత్తణి పోలీసులను ఆశ్రయించారు. తిరుత్తణి సమీపంలోని కోరమంగళం గ్రామానికి చెందిన దాము అలియాస్ దామోదరన్ (45) తపాలా శాఖలో విధులు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో గ్రామంలో 20 సంవత్సరాల నుంచి చీటీలు నడుపుతున్నారు. అతని వద్ద కోరమంగళం, పరిసర గ్రామాలకు చెందిన వారు చీటీలు కట్టారు. అయితే రెండేళ్ల నుంచి చీటీలు కట్టిన వారికి డబ్బులు ఇవ్వలేదు. ఈ విషయమై బాధితులు అడిగితే బాండు రాసి ఇస్తానని డబ్బులు త్వరలో చెల్లిస్తానని చెపుతూ కాలం వెల్లదీస్తూ వచ్చాడు. అయితే చీటీలో నష్టం వచ్చిందని డబ్బులు ఇవ్వడం కుదరదని చెప్పడంతో డబ్బులు కట్టి మోసపోయిన బాధితులు దామును నిలదీశారు. దీంతో అతను అదృశ్యమయ్యాడు. బాధితులు వంద మంది తిరుత్తణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అయితే రూ.2 కోట్లు కావడంతో జిల్లా ఎస్పీ కార్యాలయంలోని నేర విభాగంలో ఫిర్యాదు చేయాలని పోలీసులు చెప్పి పంపారు. -
లాటరీ పేరిట లూటీ చేశాడు!
మీకు లాటరీ వచ్చిందని మాయ మాటలు చెప్పి, రెండు కుటుంబాలకు టోకరా వేశాడో దుండగుడు. ఒకే రోజు బాన్సువాడతో పాటు వర్ని మండలం అపాంధిఫారంలో ఇదే తరహాలో బాధితులను మోసగించాడు. అమాయకులను మాయ చేసి, ఐదు తులాల బంగారు గొలుసులతో ఉడాయించాడు. బాన్సువాడ టౌన్(బాన్సువాడ): మాయమాటలు చెప్పి రెండున్నర పుస్తెల తాడు తో ఉడాయించాడో దుండగుడు. ఈ ఘటన బాన్సువాడలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథ నం ప్రకారం.. పట్టణంలోని గౌలిగూడకు చెందిన వ నందాస్ రాజు, రుక్మిణి దంపతులు నివాసముంటు న్నారు. మంగళవారం మధ్యాహ్నం వేళ రుక్మిణి ఇంటి ఎదుట దుస్తులు ఉతుకుండగా, ఓ దుం డగుడు బైక్పై వచ్చి ఆమెతో మాట కలిపాడు. ‘మీ భర్త పేరు రాజు కదా.. ఆయన మా దగ్గర స్కీం కట్టా డు. స్కీంలో మీకు లాటరీ తగిలింది.. మీ భర్త నిన్ను తీసుకొని షోరూంకు రమ్మన్నాడని’ చెప్పాడు. దుండగుడి మాటలు నమ్మని రుక్మిణి.. మా ఆయన ఏ స్కీం కట్టలేదు.. అదంతా అబద్దమని కొట్టి పడేసింది. అయి తే, మీ ఆయన దగ్గర నుంచే వస్తున్నా.. ఆయన షోరూంలో ఉన్నాడు.. నిన్ను తీసుకుని రమ్మన్నాడని నమ్మబలికాడు. రెండో సారి చెప్పడంతో అతడి మాట లు నమ్మిన రుక్మిణి వెంట వెళ్లేందుకు సిద్ధపడింది. మీ మెడలో ఉన్న పుస్తెల తాడు ఇంట్లో పెట్టి రండి అని అగంతకుడు చెప్పడంతో ఆమె తాళి తీసి వంటింట్లోని స్టీలు డబ్బాలో దాచిపెట్టింది. అనంతరం అత్త లలితతో కలిసి రుక్మిణి దుండగుడి బైక్పై వెళ్లా రు. అగంతకుడు వారిని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో దింపి.. మీరు షోరూంకు పదండి, నేను అన్నం తిని వస్తానని చెప్పి వెళ్లిపోయాడు. దీంతో వారిద్దరు షోరూం వరకు నడుచుకుంటూ వెళ్లారు. అగంతకుడు నేరుగా రాజు ఇంటికి వచ్చి రుక్మిణి మామతో మాట కలిపాడు. నీ కోడలు షోరూం దగ్గర ఉంది.. వంటింట్లో పెట్టిన పుస్తెల తాడు తీసుకురమ్మన్నదని చెప్పి, చైన్ తీసుకొని ఉడాయించాడు. అయితే, షోరూంలో భర్త లేకపోవడంతో మోసపోయానని గ్రహించిన రుక్మిణి ఇంటికి వచ్చి వంటింట్లో చూడగా పుస్తెల తాడు కనిపించలేదు. దీంతో మామను అడగగా, మీరే తెమ్మన్నారని దుండగుడు వచ్చి తీసుకెళ్లాడని చెప్పడంతో ఆమె లబోదిబోమంటూ గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్లి చూడగా నిందితుడు కనిపించలేదు. దీంతో భర్తతో కలిసి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారం గిఫ్ట్గా వచ్చిందని.. వర్ని(బాన్సువాడ): గిఫ్ట్ వచ్చిందని చెప్పి రెండున్నర తులాల చైన్తో ఉడాయించాడో దుండగుడు. ఎస్సై చంద్రశేఖర్ కథనం ప్రకారం.. అపాంధి ఫారంలో నివాసముండే గుగ్లోత్ సుభద్ర, దేవిదాస్ దంపతుల ఇంటికి మంగళవారం ఓ అగంతకుడు వచ్చాడు. స్కీంలో మీ అబ్బాయికి స్కూటీ, మూడు తులాల బంగారం వచ్చిందని.. మీరు నాతో వస్తే వాహనం, బంగారం ఇస్తానని చెప్పడంతో ఆశపడ్డ దంపతులు తమ బైక్పై అతడి వెంట వెళ్లారు. కొం త దూరం వెళ్లిన తర్వాత అగంతకుడు నేను ఇప్పు డే వస్తా.. ఇక్కడే ఉండండి అని చెప్పి అక్కడి నుంచి తిరిగి వచ్చాడు. నేరుగా సుభద్ర ఇంటికి చేరుకున్న దుండ గుడు.. ఆమె కోడలు సుమలతతో ‘నీ మెడలో ఉన్న గొలుసును మీ అత్త తీసుకురమ్మని నన్ను పంపిందని’ చెప్పాడు. అంతకు ముందే అత్త, మామతో కలిసి దుండగుడు వెళ్లడం గమనించిన సుమలత మెడలోని రెండున్నర తులాల పుస్తెల తాడును తీసి అతడికివ్వగా, అగంతకుడు అక్కడి నుంచి ఉడాయించాడు. అయితే, రోడ్డుపై చాలాసేపు వేచి చూసిన సుభద్ర దంపతులు మోసపోయామని గుర్తించి ఇంటికి చేరుకున్నారు. అయితే, దుండగుడు చైన్ తీసుకెళ్లిన విషయాన్ని కోడలు చెప్పడంతో బాధితులు లబోదిబోమంటూ చుట్టుపక్కల వెతికారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పోలీసుల కళ్లుగప్పి
నెల్లూరు(క్రైమ్): ఎస్కార్ట్ పోలీసుల కళ్లు గప్పి రిమాండ్ ఖైదీ పరారైన ఘటన సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిందితుడు పలు కేసుల్లో మోస్ట్వాంటెడ్ కావడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు.. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి లింగేశ్వరనగర్కు చెందిన నిమ్మల హరీష్ అలియాస్ హరి చిన్నతనం నుంచే దొంగతనాలకు అలవాటుపడ్డాడు. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కి జైలుపాలయ్యాడు. గుంటూరు జైల్లో ఉన్న సమయంలో హైదరాబాద్ అంబర్పేటకు చెందిన విజయకుమార్ అలియాస్ విక్కీ అలియాస్ రెడ్డితో పరిచయమైంది. జైలు నుంచి బయటకొచ్చిన వారు కార్లలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడేవారు. నిందితులు ఇటీవల కడప పోలీసులకు చిక్కారు. పోలీసుల విచారణలో నెల్లూరు బాలాజీనగర్లో 2017లో ఓ ఇంట్లో దొంగతనం చేసినట్లు నిందితులు నేరం అంగీకరించారు. అప్పటి నుంచి నిందితులు తిరుపతి స్పెషల్ సబ్జైల్లో రిమాండ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల పదిన నెల్లూరు బాలాజీనగర్ పోలీసులు నిందితులను దొంగతనం కేసులో విచారించేందుకు తిరుపతి స్పెషల్ సబ్జైల్ నుంచి నెల్లూరు కోర్టుకు తీసుకొచ్చారు. కోర్టు రిమాండ్ విధించడంతో అదే రోజు జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. అనంతరం కోర్టు అనుమతితో 14వ తేదీన హరీష్, విజయకుమార్ను బాలాజీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించి 15వ తేదీన జిల్లా కేంద్రకారాగారానికి తరలించారు. ఈ నేపథ్యంలో తిరుపతి నగరంలోని తిరుచానూరు పోలీసులు దొంగతనం కేసులో విచారించేందుకు పీటీ వారెంట్పై హరీష్ను మరో రిమాండ్ ఖైదీని నెల్లూరు కేంద్రకారాగారం నుంచి ఈ నెల 16న తీసుకెళ్లారు. 17వ తేదీన నిందితులను ప్రాపర్టీ రికవరీ కోసం తిరుపతిలోని పద్మావతిపురానికి తీసుకెళ్లగా, శ్రీహరిమెస్ వద్ద పోలీసుల కళ్లుగప్పి హరీష్ పరారయ్యాడు. దీనిపై ఎస్కార్ట్ పోలీసులు అదే రోజు తిరుచానూరు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. రిమాండ్ ఖైదీ పరారైన ఘటనపై తిరుచానూరు పోలీసులు ఈ నెల 18న నెల్లూరు జిల్లా కేంద్ర కారాగారానికి సమాచారం అందించారు. నిమ్మ ల హరీష్పై తిరుపతిలో 12, మదనపల్లి, చిత్తూరు, కడపల్లో నాలుగు పెండింగ్ వారెంట్లు ఉన్నాయి. -
లైసెన్సు లేదు.. ఫైన్ వేస్కోండి!
సాక్షి, అమరావతి : ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినా తమ డ్రైవింగ్ లైసెన్సు సస్పెండ్ అవ్వకుండా కొందరు వాహనాదారులు కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఎంతైనా ఫైన్ వేస్కోండి గానీ.. తమకు లైసెన్సు లేదంటూ ఎంచక్కా తప్పించుకుంటున్నారు. తమ తీరుతో రవాణా అధికారులను అవాక్కయ్యేలా చేస్తున్నారు. మితిమీరిన వేగం, సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించుకున్నా, మద్యం తాగి వాహనం నడిపినా.. లైసెన్సు సస్పెండ్ చేయాలని గతేడాది సుప్రీంకోర్టు కమిటీ ఆదేశాలిచ్చింది. దీంతో రవాణా శాఖ సస్పెన్షన్లపై గురి పెట్టింది. ఇప్పటివరకు 20 వేల డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసింది. అయితే దీని నుంచి తప్పించుకునేందుకు వాహనదారులు అసలు తమకు లైసెన్సే లేదని చెబుతున్నారు. గతేడాది రవాణా శాఖ అధికారులు జరిపిన వాహన తనిఖీల్లో దాదాపు 78,130 మంది తమకు డ్రైవింగ్ లైసెన్సులు లేవని చెప్పడం గమనార్హం. రాష్ట్రంలో మొత్తం 1.08 కోట్ల మందికి డ్రైవింగ్ లైసెన్సులున్నట్లు గణాంకాలుండగా.. ప్రతి వంద మందిలో 70 మంది లైసెన్సు లేదని చెప్పడంతో రవాణా శాఖ అధికారులు అవాక్కయ్యారు. ‘డ్రైవింగ్ లైసెన్సు లేదని చెబితే జరిమానా విధించి వదిలేస్తున్నారు. అదే లైసెన్సు ఉందంటే.. ఏకంగా ఆ లైసెన్సును సస్పెండ్ చేస్తున్నారు. దీని వల్ల మా ఉపాధి దెబ్బతింటోంది. అదే లైసెన్సు లేదని చెబితే ఉల్లంఘనలకు గానూ రూ.వెయ్యి నుంచి రూ.5 వేల వరకు జరిమానా చెల్లించి తప్పించుకోవచ్చు..’ అని వాహనదారులు చెబుతుండటం గమనార్హం. కాగా, ఆధార్తో డ్రైవింగ్ లైసెన్సులను లింక్ చేస్తున్నామని.. దీంతో అసలు విషయం తేలిపోతుందని అధికారులు చెబుతున్నారు. జిల్లా డ్రైవింగ్ లైసెన్సులు లేని వారి సంఖ్య అనంతపురం 6,426 చిత్తూరు 5,543 వైఎస్సార్ 1,909 కర్నూలు 7,014 నెల్లూరు 5,311 ప్రకాశం 2,483 గుంటూరు 4,233 కృష్ణా 10,593 పశ్చిమగోదావరి 9,209 తూర్పుగోదావరి 12,755 విశాఖపట్నం 6,541 శ్రీకాకుళం 2,198 విజయనగరం 3,915 మొత్తం 78,130 -
వధూవరుల ఎస్కేప్.. ఒంటరైన పురోహితుడు
సాక్షి, కర్ణాటక : పెళ్లి మంటపంలో వధూవరులు కనిపించకుండా వెళ్లిపోయిన ఘటన ఆదివారం కోలారు జిల్లా, మాలూరులోని పద్మావతి కళ్యాణ మంటపంలో చోటు చేసుకుంది. వివరాలు... తాలూకాలోని చన్నకల్లు గ్రామానికి చెందిన గురేష్, బంగారుపేట తాలూకా నేర్నహళ్లి గ్రామానికి చెందిన ఎన్. సౌమ్యలకు వివాహం జరగాల్సి ఉంది. శనివారం రిసెప్షన్, ఆదివారం వివాహం నిశ్చయించారు. పెళ్లికి వంటలతో పాటు అన్ని ఏర్పాట్లు సిద్దమయ్యాయి. బంధువులు, వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. పురోహితుడు కూడా సిద్ధంగా ఉన్నారు. అయితే శనివారం రాత్రి నిశ్చితార్థ సమయానికి వధువు సౌమ్య కళ్యాణ మండపానికి రాలేదు. రాత్రి 10 గంటలు గడిచినా కల్యాణ మంటపానికి పెళ్లి కూతురు వారి తరుపు వారు రాకపోవడంతో ఆగ్రహించిన వరుడి తాలూకా వారు ఇదే ముహూర్తానికి వధువు సౌమ్య చిన్నాన్న కూతురు వెంకటరత్నమ్మతో గురేష్ వివాహం చేయడానికి నిశ్చయించారు. ఈమేరకు నిశ్చితార్థం ఇతర శాస్త్రాలను ముగించారు. అంతా సుఖాంతం అనుకుంటున్న సమయంలో ఆదివారం పెళ్లి జరగాల్సి ఉండగా ఉదయం వరుడు పెళ్లి మంటపంలో నుంచి కనిపించకుండా పోయాడు. షేవింగ్ చేసుకుని వస్తానని బయటకు వెళ్లినవాడు తిరిగి రాలేదు. తన మొబైల్ ఫోన్ను స్విచాఫ్ చేసుకున్నాడు. దీంతో కల్యాణ మండపంలో తిరిగి గందరగోళం నెలకొంది. ఎంతకీ వరుడు తిరిగి రాకపోవడంతో పెళ్లికి వచ్చిన వారు తిరుగుముఖం పట్టారు. పెళ్లికి చేసిన పిండి వంటలు అలాగే ఉండి పోయాయి. -
పోలీస్ కస్టడీ నుంచి నిందితుడి పరార్?
సదాశివపేట(సంగారెడ్డి): సదాశివపేట పోలీసుల కస్టడీ నుంచి నిందితుడు 1వ వార్డు కౌన్సిలర్ అరుణ్కుమార్ గురువారం పోలీసుల కళ్లుగప్పి ఛాకచక్యంగా తప్పించుకుపారిపోయినట్లు విశ్వసనీయ సమాచారం. నిందితుడు అరుణ్కుమార్పై వివిధ వివాదాలకు సంబంధించి ఇదివరకే 3 కేసులు నమోదయ్యాయి. తాజాగా సాయిబాబా మందిరం కాలనీలో నిర్మిస్తున్న ఓ చర్చి విషయంలో తలదూర్చి పాదర్ డేవిడ్ను బేదిరించి భయబ్రాంతులకు గురి చేసిన విషయంలో ఈ నెలలో అతనిపై మరో కేసు నమోదైంది. నాలుగు కేసులకు సంబంధించి కౌన్సిలర్ అరుణ్కుమార్ను పోలీసులు గురువారం సాయంత్రం 4 గంటలకు అదుపులోకి తీసుకుని విచారించారు. రిమాండ్ రిపోర్టు రాసిన తరువాత వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తుండగా పోలీసుల కళ్లుకప్పి తప్పించుకుపారిపోయినట్లు సమాచారం. కౌన్సిలర్ అరుణ్కుమార్పై 2016లో 384, 379 సెక్షన్ల కింద వేర్వేరుగా రెండు కేసులు నమోదయ్యాయి. 2017లో 448, 447 సెక్షన్ల కింద మరో కేసు నమోదైంది. 2018 జనవరిలో 447, 506 సెక్షన్ల కింద మరో కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ఇన్స్పెక్టర్ సురేందర్రెడ్డిను వివరణ కోరగా కౌన్సిలర్ అరుణ్కుమార్పై నమోదైన కేసులకు సంబంధించి అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. పోలీస్టేషన్లో ఉన్న నిందితుడు అరుణ్కుమార్ ఫోన్ మాట్లాడుకుంటూ బయటకి వేళ్లిపోయాడని సమాధానమిచ్చారు. -
పెట్రోల్ బంకు సొత్తుతో జీవిత ఖైదీ పరార్
నల్గొండ: పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న జీవిత ఖైదీ పరారయ్యాడు. జిల్లా జైలు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ పెట్రోల్ బంకులో ప్రకాశంజిల్లా యద్దనపూడి మండలం చిమ్మటవారి పాలేనికి చెంది జిల్లా జైలులో జీవిత ఖైదీగా ఉన్న శివకృష్ణ పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి బంకులో డ్యూటీ చేసి బంకుకు వచ్చిన ఆదాయం రూ.25,000 తీసుకుని పరారయ్యాడు. ఇతని కోసం జైలు అధికారులు, స్థానిక పోలీసులు గాలిస్తున్నారు. -
నాలుగో భార్యనూ వదిలేశాడు..
నాలుగు పెళ్లిళ్లు చేసుకున్న ఓ వ్యక్తి మూడు నెలలు తిరగకుండానే నాలుగో భార్యను కూడా వదిలేసి పరారయ్యాడు. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టోలిచౌకిలోని పారామౌంట్ కాలనీలో నివసించే సిమ్రాన్ (19) వివాహం గత ఏడాది నవంబర్ 13వ తేదీన సయ్యద్ యాసర్ అహ్మద్తో జరిగింది. పెళ్లి సమయంలో రూ.30 లక్షల నగదు, 20 తులాల బంగారు ఆభరణాలు కట్నంగా ఇచ్చారు. అయితే, వివాహమైన కొద్ది రోజుల నుంచే ఆమె అత్త వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో కొత్త దంపతులు వేరు కాపురం పెట్టారు. అయినాసరే అత్త ఆగడాలు ఆపక పోగా పుట్టింటికి భర్తతో చేరుకుంది. తన భర్త పెళ్ళికి ముందు ఆభరణాల వ్యాపారమని చెప్పి నమ్మించాడు. తీరా చూస్తే ఏమీ చేయకుండా ఇంట్లోనే ఉంటుండటంతో పలుమార్లు దంపతుల మధ్య గొడవలు జరిగాయి. ఇప్పటికే అతడు మూడు పెళ్లిళ్లు కూడా చేసుకున్నట్లు తెలిసింది. పెద్దలతో పంచాయితీ పెట్టినా ఫలితం కనిపించలేదు. తనను నాలుగో వివాహం చేసుకొని మూడు నెలలు తిరగకుండానే పరారైన భర్త, అత్తపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు నిందితుడిపై చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడు కుటుంబసభ్యులతోపాటు పరారైనట్లు సమాచారం.