-
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
టీడీపీ, జనసేన నేతల వీరంగం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి విధ్వంసం సృష్టించారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో 11 మంది కార్లలో సైరన్ మోగించుకుంటూ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం కింద బాణసంచా కాల్చి హడావుడి చేశారు. బలవంతంగా కార్యాలయం పైకి చేరుకున్నారు. సర్పంచ్ రూమ్లోకి చొరబడి గోడకు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను ధ్వంసం చేశారు. మరోపక్క ఫ్లెక్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్చిత్రపటాన్ని పీకి పడేశారు. సర్పంచ్ టేబుల్పై కేక్ కట్చేసి టేబుల్కు, గోడలపైన పులిమారు. కార్యాలయం భవనానికి టీడీపీ జెండా కట్టి నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్న సమయంలో పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కొందరు సిబ్బంది ఉన్నారు. కార్యాలయంలో విధ్వంసం గురించి సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు, వార్డు, ఎంపీటీసీ సభ్యులకు సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కార్యాలయానికి చేరుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ప్రవర్తించడంపై భయాందోళనలకు గురైన సిబ్బంది విధులు నిర్వర్తించలేమంటూ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ భాస్కరరావు, పటమట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తాం : సర్పంచ్ పూర్ణచంద్రరావు పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చెలరేగి ప్రవర్తించడంపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఎనికేపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యాలయం గోడలపై మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలతోపాటు వేరే పార్టీలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్, జగన్ చిత్రపటాలను, మాజీ ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉంటే తనపైనా దాడిచేసేవారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తుంటే పంచాయతీ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే విచారించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కక్ష సాధింపు నోటీసులురాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు ఏడు రోజుల్లో కట్టడాలు తొలగించాలంటూ హెచ్చరిక ఉండి/పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాల మీద కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వైఎస్సార్ విగ్రహాలు, ప్రభుత్వ భవన శిలాఫలకాలను ఓవైపు ధ్వంసం చేస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యాలయాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం, పార్వతీపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని కార్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరిట నోటీసులు ఈ నెల 22న, 25న జారీ చేసినట్లు ప్రస్తుత, పాత తేదీల్లో ముద్రించి నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం గోడలకు అతికించారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లో కట్టడాలను కూల్చాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేశారు. అయితే పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కార్యాలయానికి నోటీసులు నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలో సుమారు 1.5 ఎకరాల రెవెన్యూ స్థలంలో నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. తమ శాఖ ముందస్తు అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భవన నిర్మాణం చేశారని, ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్లానింగ్ అధికారి భాస్కర్ పేరుతో ఉన్న నోటీసును పౌడా అధికారి రఘురామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ అంటించారు. ఎన్నికల ముందే భవన నిర్మాణం పూర్తికాగా, ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కేవలం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు. -
విధ్వంసం... అరాచకం..
సాక్షి నెట్వర్క్: టీడీపీ కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పలుచోట్ల ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం సచివాలయ భవన నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, మండల ప్రజాప్రతినిధుల పేర్లతో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయగా.. దానిని పగులగొట్టారు. టీడీపీ నాయకుడు, సర్పంచ్ యర్రా రామకృష్ణ ఇంటి ముందు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. జెండా దిమ్మె ధ్వంసం తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను మంగళవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. జగనన్న కాలనీలో రాళ్లు ధ్వంసం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రులో టీడీపీ నాయకులు దాషీ్టకానికి తెగబడ్డారు. జగనన్న కాలనీలో సరిహద్దు రాళ్లు ధ్వంసం చేశారు. పైప్లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు కొల్లాటి గోవిందరాజు, బస్వాని పోతురాజు, బర్రి నాగరాజు, జల్లా బుజ్జి, బొమ్మిడి పోతురాజు, ఒడుగు సామోరు, కొయ్యలగడ్డ బాలాజీ తదితరులు వచ్చి పైప్లైన్ పనులను అడ్డుకున్నారని గ్రామస్తులతోపాటు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. లబి్ధదారులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని, జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పనులను అడ్డుకుంటున్నారని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
Russia-Ukraine war: ఉక్రెయిన్ దాడుల్లో ఆరుగురి మృతి
కీవ్: రష్యా భూభాగాలపై ఉక్రెయిన్ ఆదివారం డ్రోన్లు, క్షిపణులతో ప్రతీకార దాడులకు దిగింది. వాటిలో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. క్రిమియా ద్వీపకల్పంలోని సెవస్టోపోల్ తీరపట్టణంపై ఉక్రెయిన్ ఐదు క్షిపణులను ప్రయోగించింది. రష్యాను ఎదుర్కొనేందుకు అమెరికా, పాశ్చాత్య దేశాలు తమకు మరిన్ని ఆయుధాలివ్వాలని అధ్యక్షుడు జెలెన్స్కీ మరోసారి కోరారు. -
మావోయిస్టు కీలకనేత బిచ్చు లొంగుబాటు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన కీలకనేతల్లో ఒకరైన నంగ్సు తుమ్రెట్టి అలియాస్ గిరిధర్ ఆలియాస్ బిచ్చుతోపాటు ఆయన భార్య లలితా ఉసెండీ అలియాస్ సంగీత ఆదివారం మహారాష్ట్రలోని గడ్చిరోలిలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో లొంగిపోయారు. గడ్చిరోలి జిల్లా ఎటపల్లి తాలూకాకు చెందిన బిచ్చు 1997లో మావోయిస్టు పార్టీలో చేరి అంచలంచెలుగా ఎదిగారు. దాడులు చేయడంలో దిట్టగా పేరున్న కంపెనీ–4కు కమాండర్గా బిచ్చు వ్యవహరించారు. ఆ తర్వాత దక్షిణ గడ్చిరోలి జిల్లా కార్యదర్శి, కమాండర్ హోదాలో బిచ్చు మావోయిస్టు పార్టీలో కొనసాగారు. ఇప్పటి వరకు ఆయనపై 179 కేసులు నమోదు కాగా, అందులో ఎదురుకాల్పులకు సంబంధించినవి 86 వరకు ఉన్నాయి. బిచ్చుపై రూ.25లక్షల రివార్డు ఉంది. బిచ్చు భార్య సంగీతపై 18 కేసులుండగా, రూ.16 లక్షల రివార్డు ఉంది. రిక్రూట్మెంట్లు తగ్గిపోయాయి : ఫడ్నవిస్గడిచిన నాలుగేళ్లలో గడ్చిరోలి జిల్లాలో మావోయిస్టు పార్టీలోకి రిక్రూట్మెంట్లు గణనీయంగా తగ్గిపోయాయని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అన్నారు. గడిచిన నాలుగేళ్లలో పోలీస్ రిక్రూట్మెంట్లకు ఈ జిల్లా నుంచి 28 వేల దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. మావోయిస్టుల కంటే ప్రభుత్వానికే ప్రజల మద్దతు ఎక్కువగా ఉందనేందుకు ఇది ఉదాహరణ అన్నారు. డీఐజీ అంకిత్గోయల్ మాట్లాడుతూ 2021 నుంచి జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో గడ్చిరోలి జిల్లాలో 65 మంది మావోయిస్టులు మృతి చెందారని, వీరిలో ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఉన్నారన్నారు. -
కొనసాగిన శిలాఫలకాల ధ్వంసం
తెనాలి అర్బన్/భీమవరం (ప్రకాశం చౌక్)/నాగులుప్పలపాడు: అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో శనివారం యథేచ్ఛగా గత ప్రభుత్వంలో ఏర్పాటైన అభివృద్ధి శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అలాగే దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని పగులకొట్టారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గుంటూరు జిల్లా తెనాలి 13వ వార్డులో రూ.20 లక్షలతో పలు అభివృద్ధి పనులు చేపట్టారు. ఈ సందర్భంగా నాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. దాన్ని తాజాగా టీడీపీ కార్యకర్తలు పగులకొట్టారు. అలాగే ఐదో వార్డులో కౌన్సిలర్ తోట రఘురామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. భీమవరంలో టీడీపీ, జనసేన కార్యకర్తల విధ్వంసం.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో శిలాఫలకాలను జనసేన, టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో నాటి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం టూటౌన్లో కోట్ల రూపాయలతో సీసీ రోడ్లను నిర్మించి వినియోగంలోకి తెచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను జనసేన, టీడీపీకి చెందిన అల్లరి మూకలు ధ్వంసం చేశాయి. ప్రశాంతమైన భీమవరంలో ఈ దుశ్చర్య దారుణమని స్థానికులు మండిపడ్డారు. వైఎస్సార్ విగ్రహం ధ్వంసం ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చవటపాలెంలో శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు గ్రామంలోని నడిరోడ్డులో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారు. పెద్ద బండరాయితో తొలుత మెడ భాగంలో పగలగొట్టి తల భాగం తీసేయాలని ప్రయత్నించారు. అయితే వీలుకాకపోవడంతో ఎడమ చేతిని బండరాయితో బలంగా కొట్టడంతో ఆ భాగం పూర్తిగా విరిగిపోయింది. వైఎస్సార్సీపీ శ్రేణుల ఫిర్యాదు మేరకు నాగులుప్పలపాడు ఎస్సై బ్రహ్మనాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు.వైఎస్సార్సీపీ కార్పొరేటర్ ఇంటిపై రాళ్ల దాడికొమ్మాది (విశాఖ): గ్రేటర్ విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) 4వ వార్డు వైఎస్సార్సీపీ కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆయన ఇంటి అద్దాలు పగిలిపోయాయి. చేపలుప్పాడలో కొండబాబు నివాసం ఉంటున్నారు. శుక్రవారం అర్థరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. ఈ దాడిలో ఇంటి ఎలివేషన్ అద్దాలు పగిలిపోయాయి. రాత్రి పెద్ద శబ్దాలు రావడంతో బయటకు వచ్చి చూశానని వైఎస్సార్సీపీ కార్పొరేటర్ కొండబాబు తెలిపారు. అదే సమయంలో కరెంటు లేకపోవడంతో ఎవరు దాడి చేశారో కనబడలేదన్నారు. వెంటనే భీమిలి పోలీసులకు సమాచారమివ్వగా ఇద్దరు కానిస్టేబుళ్లు ఘటనా స్థలానికి వచ్చారని, వారిని చూసి గుర్తు తెలియని వ్యక్తులు పరారైనట్లు తెలిపారు. శనివారం భీమిలి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. ఈ దాడులను మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, అవంతి శ్రీనివాసరావు ఖండించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు అండగా ఉంటామని తెలిపారు. దాడులు చేసినవారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.తాడిపత్రిలో టీడీపీ నాయకుల బరితెగింపుతాడిపత్రి టౌన్: అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలకు అంతూపొంతూ ఉండటం లేదు. శనివారం తాడిపత్రి మండలం సజ్జలదిన్నెలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకుడు, వాల్మీకి కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ సజ్జలదిన్నె రాజు అనుచరుడు వేణుగోపాల్రెడ్డికి చెందిన నాపరాళ్ల ఫ్యాక్టరీలో బండలను ధ్వంసం చేశారు.దాదాపు 20 చదరాల బండలు ధ్వంసం అయినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ వారే ధ్వంసం చేసి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. అలాగే తాడిపత్రి మండలం గంగాదేవిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త రవీంద్రారెడ్డి తన రెండెకరాల పొలంలో నెల క్రితం సాగు చేసిన పత్తి పంటను టీడీపీ వర్గీయులు శనివారం దున్నేసి నాశనం చేశారు. అదే గ్రామానికి చెందిన ఆలూరు రామాంజులరెడ్డి, జూటూరు రామాంజులరెడ్డి ట్రాక్టర్తో తన పంటను దున్నేసినట్లు బాధితుడు వాపోయాడు. దాదాపు రూ.30 వేలు నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా వారు స్వీకరించలేదు. -
వైఎస్సార్సీపీ సర్పంచ్పై కక్షసాధింపు
చంద్రగిరి (తిరుపతి జిల్లా): చంద్రగిరి నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ శ్రేణులు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను ధ్వంసం చేస్తూ ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. ఇందులో భాగంగా చంద్రగిరి మండలం కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు రామిరెడ్డిపల్లి వైఎస్సార్సీపీ సర్పంచ్ కొటాల చంద్రశేఖర్రెడ్డిపై కక్ష సాధింపు శృతిమించుతోంది. ఎన్నికల రోజు చంద్రశేఖర్రెడ్డి ఇంటిపై టీడీపీ నాయకులు దాడిచేసి ధ్వంసం చేయడంతో పాటు ఇంటికి నిప్పంటించారు. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో ఊరు వదిలి వెళ్లిపోయింది. అయినా వారు సర్పంచ్పై ఇంకా కక్ష సాధింపులకు పాల్పడుతూనే ఉన్నారు. సర్పంచ్ ఇంటికి దారిలేకుండా చేయాలనే కుట్రతో ఆలయం పేరుతో నాటకానికి తెరలేపారు. సర్పంచ్ ఇంటి ముందు 10 అడుగుల దారి ఉంది. ఆ పక్కనే ప్రైవేటు ఇంటి స్థలాలూ ఉన్నాయి. దీంతో శుక్రవారం టీడీపీ నేతలు ప్రైవేటు స్థలాన్ని ఆక్రమించుకుని ఆలయం ముసుగులో అక్రమ నిర్మాణాలను ప్రారంభించారు. దీంతో స్థలాల యజమానులు తమ స్థలాలను కొనుగోలు చేసి తమకు డబ్బులిస్తే వెళ్లిపోతామన్నారు. రిజి్రస్టేషన్ అయిన స్థలాలను సైతం ఆక్రమించుకోవడం దారుణమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. సర్పంచ్ ఇంటికి దారిలేకుండా చేసి ఆయన్ను గ్రామంలోకి రానీయకూడదన్నదే వీరి లక్ష్యమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు.. కూచువారిపల్లిలో ఇన్ని దారుణాలు జరుగుతున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ భూమి కబ్జాకూ యత్నం.. ఇదిలా ఉంటే.. కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు ప్రభుత్వ భూముల కబ్జాకూ పాల్పడుతున్నారు. అడ్డొచ్చిన మహిళలను అసభ్య పదజాలంతో దూషిస్తూ.. మీకు దిక్కున్నచోట చెప్పకోండంటూ శుక్రవారం బెదిరింపులకు పాల్పడ్డారు. గ్రామస్తుల వివరాల మేరకు.. రామిరెడ్డిపల్లి సర్వే నంబరు 413, 414లో సుమారు 2.77 ఎకరాల కుంట పోరంబోకు స్థలం ఉంది. ఇందులో పాడి రైతులు కొందరు పశువుల కోసం తాత్కాలిక షెడ్లు వేసుకుని జీవనోపాధి పొందుతున్నారు. అయితే, కూచువారిపల్లికి చెందిన టీడీపీ నేతలు మురళీనాయుడు, సునీల్ మరికొంతమంది శుక్రవారం జేసీబీ తీసుకొచ్చి ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి పనులు ప్రారంభించారు. సమాచారం తెలుసుకున్న రైతులు, గ్రామస్తులు పనులను అడ్డుకున్నారు. దీంతో చెలరేగిపోయిన టీడీపీ నేతలు మహిళలపట్ల అసభ్య పదజాలంతో దూషించారు. అడ్డుకోబోయిన వీఆర్ఓపైన విరుచుకుపడ్డారు. ఇక్కడే ఉంటే కొడతామని బెదిరించడంతో రైతులు, మహిళలు వెనుదిరిగారు. ‘ఇది మా ప్రభుత్వం.. మా ఇష్టమొచ్చినట్లు మేం చేస్తాం.. మీవల్ల ఏమికాదు’.. అంటూ బెదిరించారు. ఇక్కడకు పోలీసు, రెవెన్యూ అధికారులు వచ్చినప్పటికీ ప్రేక్షకపాత్ర వహించడం విమర్శలకు తావిచ్చింది. -
కక్షగట్టి దాడులు.. విధ్వంసాలు
తోపల్లిగూడూరు: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా తోటపల్లిగూడూరు మండలం కోడూరుకు చెందిన వైఎస్సార్సీపీ నేత కావల్రెడ్డి రంగారెడ్డికి చెందిన ట్రాక్టర్, ఏయిరేటర్లు, ఆక్వా సామగ్రికి టీడీపీ నేతలు గురువారం రాత్రి నిప్పంటించారు. మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డికి సమీప బంధువైన రంగారెడ్డి ఇటీవలి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ కోసం పనిచేశారు. ఇది గిట్టని స్థానిక టీడీపీ నాయకులు అధికారం అండతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని, ఈ ఘటనలో రూ.50 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు రంగారెడ్డి చెప్పారు. శుక్రవారం రాత్రి మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో మంచి పాలన అందిస్తారని ప్రజలు అధికారం ఇచ్చారని, దానిని విస్మరించి టీడీపీ గూండాలు ఇలా ఆటవిక దాడులు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ శ్రేణులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్న ఈ దాడులను ఉపేక్షించేది లేదన్నారు. పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తామన్నారు. దాడులు ఆపనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పోలీసులు దోషులను కఠినంగా శిక్షించాలన్నారు. వైఎస్సార్సీపీ నేతలు చిల్లకూరు సుధీర్రెడ్డి, ఉప్పల శంకరయ్య గౌడ్, కావల్రెడ్డి రవీంద్రరెడ్డి, కావల్రెడ్డి రంగారెడ్డి, కొడూరు దిలీప్రెడ్డి, కాల్తిరెడ్డి సుబ్రహ్మణ్యం, తూపిలి ఉదయకుమార్రెడ్డి, చెరుకూరు శ్రీనివాసులనాయుడు, మన్నె చిరంజీవులగౌడ్, విశ్వనాథ్రెడ్డి, ఆగాల శ్రీనివాసులరెడ్డి, దగ్గు సతీ‹ష్, పామంజి దుర్గ పాల్గొన్నారు. -
కొనసాగుతున్నవిధ్వంసం
ద్వారకాతిరుమల/తాడేపల్లిగూడెం/గోపాలపురం: అధికారమే అండగా టీడీపీ కార్యకర్తలు అరాచకాలకు పాల్పడుతున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా శిలాఫలకాలను, ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. పలు ప్రాంతాల్లో గురువారం కూడా యథేచ్ఛగా విధ్వంసం సాగించారు. ఏలూరు జిల్లాలో సీసీ రోడ్డు శిలాఫలకం ధ్వంసంఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం గుణ్ణంపల్లిలో సీసీ రోడ్డు ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. అంతేకాకుండా విలేజ్ హెల్త్ క్లినిక్ భవనం కిటికీ అద్దాలను పగులగొట్టాయి. ఇలా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఏమిటని గ్రామస్తులు మండిపడుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోనూ..పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం 14వ వార్డు సత్యనారాయణపేటలో టీడీపీ కార్యకర్తలు సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మాణానికి సంబంధించిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. సత్యనారాయణ పేటలో రెండేళ్ల క్రితం రూ.9 లక్షల నిధులతో సిమెంటు రోడ్డు, డ్రెయిన్ నిర్మించారు. తాజాగా ఈ శిలాఫలకాన్ని నాశనం చేశారు. ‘తూర్పు’లో శిలాఫలకం పగులకొట్టి.. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వెంకటాయపాలెంలో టీడీపీ, జనసేన కార్యకర్తలు సచివాలయ నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని పగులకొట్టారు. అంతేకాకుండా సుమారు రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించతలపెట్టిన వెంకటాయపాలెం – గౌరీపట్నం రోడ్డు శిలాఫలకాన్ని ధ్వంసం చేసి తుప్పల్లో పడేశారు. దీంతో వెంకటాయపాలెంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా పికెట్ ఏర్పాటు చేశామని ఎస్సై సతీష్కుమార్ తెలిపారు. -
వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపై హత్యాయత్నం
రాయచోటి: ఎన్నికల ముందురోజు వరకు ప్రశాంతంగా ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో టీడీపీ నేతలు వరుస దాడులతో అరాచకం సృష్టిస్తున్నారు. కౌంటింగ్ ముగిసిననాటి నుంచి టీడీపీ రౌడీలు వైఎస్సార్సీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని హత్యాయత్నాలకు తెగబడుతున్నారు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి రాయచోటి టీడీపీ నేత సయ్యద్ ఖాన్ కొంతమంది రౌడీలతో వైఎస్సార్సీపీకి చెందిన మున్సిపల్ కౌన్సిలర్లపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది. రాత్రి 11.30 గంటల సమయంలో నాలుగో వార్డు కౌన్సిలర్ హారూన్ బాషా ఇంటి వద్దకు వెళ్లి ఇంట్లో నుంచి బయటికి రావాలని, చంపుతామంటూ టీడీపీ రౌడీలు కేకలు వేశారు. ఆ సమయంలో హారూన్ ఇంటిలో లేకపోవడంతో ఆయన తల్లి బయటకు వచ్చి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వారిని ప్రాధేయపడ్డారు. అయినా వినని టీడీపీ రౌడీలు పెద్ద బండరాళ్లతో ఇంటి ఆవరణలో ఉన్న బైక్ను ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పీఏ నిస్సార్ అహ్మద్ను కూడా చంపుతామంటూ కేకలు పెడుతూ వెళ్లిపోయారు. ఆ తర్వాత వీధుల్లో బైకులపై కేకలు వేసుకుంటూ 7వ వార్డు కౌన్సిలర్ మున్నీసా ఇంటికి వెళ్లి ఆమె భర్త ఇర్ఫాన్పై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ రౌడీల దాడిలో ఇర్ఫాన్ కత్తిపోట్లకు గురయ్యారు. ఆయన తలకు బలమైన గాయాలయ్యాయి. ఆయనను కుటుంబ సభ్యులు మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. ఘటన సమాచారం అందుకున్న పోలీసులు టీడీపీ నేత సయ్యద్ ఖాన్, బాబ్జీ, ఫిరోజ్ ఖాన్, శివారెడ్డి, అఫ్రోజ్, అబూజర్లను అరెస్టు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ సీఐ సుధాకర్ రెడ్డి, డీఎస్పీ రామానుజులు టీడీపీ నేతలపైన హత్యాయత్నం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కౌంటింగ్ నాటి నుంచే వరుస దాడులు..ఈనెల నాలుగో తేదిన ఎన్నికల కౌంటింగ్ పూర్తి కాగానే అదే రోజు రాత్రి రాయచోటి రూరల్ మండలం ఎండపల్లి పంచాయతీ బోయపల్లిలో వైఎస్సార్సీపీ మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి ఇంటిపై టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డాయి. ఈ దాడిలో సుబ్బారెడ్డి సోదరుడు, మరొకరు గాయాలపాలయ్యారు. ఇంటి ముందు ఉన్న కారును కూడా ధ్వంసం చేశారు.అలాగే వైఎస్సార్సీపీ సానుభూతిపరుడిగా ఉన్న ఆర్టీసీ కండక్టర్ రామ్మోహన్ ఇంటిపై దాడులకు తెగబడి ఆయన బైకును తగులబెట్టారు. ఇలా రాయచోటిలో టీడీపీకీ చెందిన రౌడీ మూకలు, గ్యాంగ్లు దాడులు చేయడమే కాకుండా ఫోన్ల ద్వారా తీవ్రమైన అసభ్య పదజాలంతో దూషిస్తూ చంపుతామని బెదిరిస్తున్నారు.టీడీపీ రౌడీమూకల దాడులు దారుణంరాయచోటిలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లపైన టీడీపీ రౌడీ మూకలు దాడి చేయడం దారుణమని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ దాడులను ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రశాంత వాతావరణానికి అలవాటుపడిన రాయచోటి ప్రజలను ఈ రకమైన దాడులు చేసి భయాందోళనలకు గురి చేయడం సరికాదన్నారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్నవారు ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని కోరారు. అధికారమనేది ఎవరికీ శాశ్వతం కాదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు ఎవరిపైనా కక్షపూరిత రాజకీయాలు చేయ లేదని గుర్తు చేశారు. టీడీపీ రౌడీలు అర్ధరాత్రి వేళ మద్యం తాగి గుంపులుగా వచ్చి తమ పార్టీ కౌన్సిలర్లపై దాడులు చేయడం దారుణమన్నారు.రాబోయే రోజుల్లో మరిన్ని దాడులు చేస్తామంటూ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు ఆయన ఫోన్ చేసి పరామర్శించారు. ప్రస్తుతం తాను విజయవాడలో ఉన్నానని, త్వరలో బాధితులను కలుస్తానని అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. -
ఆగని శిలాఫలకాల ధ్వంసం
సాక్షి, నెట్వర్క్: టీడీపీ అధికారంలోకి వచ్చి 15 రోజులు గడిచినా ఆ పార్టీ నేతలు తమ విధ్వంసాలను ఆపడం లేదు. అధికారం అండగా విచ్చలవిడిగా, యథేచ్ఛగా చెలరేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలు, సీసీ రోడ్ల శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు బుధవారం పగులకొట్టారు. అలాగే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాలను, వైఎస్సార్సీపీ జెండా దిమ్మెలను ధ్వంసం చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరులో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేరుతో ఉన్న శిలాఫలకాన్ని పగులకొట్టారు. విషయం తెలుసుకున్న వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి తుమ్మల సురేశ్, మాజీ జెడ్పీటీసీ రాజేశ్వరి సీఐ బాబుకు ఫిర్యాదు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు మండలం జగన్నాథపురంలో ఆర్బీకేలు, సచివాలయాలకు అతికించిన వైఎస్ జగన్ చిత్రాన్ని, నవరత్నాల వివరాలతో కూడిన శిలాఫలకాలను టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేట విజయలక్ష్మీనగర్లో సీసీ రోడ్డుకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, మున్సిపల్ కో–ఆప్షన్ సభ్యుడు రెడ్డి రాధాకృష్ణ, తదితరులు ఈ దుశ్చర్యపై మండిపడ్డారు. అనకాపల్లి జిల్లా తుమ్మపాలలో శ్రీ వేణుగోపాలస్వామి ఆలయం వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్, మాజీ మంత్రి అమర్నాథ్ చిత్రాలను చెరిపివేశారు. శిలాఫలకం ధ్వంసంపై సర్పంచ్ తట్టా పెంటయ్య నాయుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లా పత్తికొండ మండలం హోసూరులో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం చేతిని విరగకొట్టారు. చుట్టుపక్కల సీసీ కెమెరాల్లో రికార్డు కాకుండా వాటిని తొలగించారు. వైఎస్సార్సీపీ నేతల ఫిర్యాదు మేరకు ఎస్ఐ గోపాల్ సిబ్బందితో గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం జి.అగ్రహారంలో ఒంగోలు–కర్నూలు రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను టీడీపీ కార్యకర్తలు పాలడుగు రమేశ్, తానికొండ బాలకోటయ్య జేసీబీతో ధ్వంసం చేశారు. అలాగే జెండా దిమ్మె పక్కన కొమ్ముల కోటమ్మ రేకుల షెడ్డును కూడా కూల్చారు. -
చిత్తూరులో ఆగని టీడీపీ హింసాకాండ
-
కొనసాగుతున్న టీడీపీ విధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసం కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ జెండా దిమ్మ, ప్రగతిపనుల శిలాఫలకాలను ముక్కలు చేశారు. బాపట్ల జిల్లా కర్లపాలెం మండల కేంద్రంలోని గమేషన్ మిల్లు సెంటర్లో వైఎస్సార్సీపీ మండల కార్యాలయం సమీపంలోని ఆ పార్టీ జెండా దిమ్మను సోమవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుద్ధాం గ్రామంలో సచివాలయ శిలాఫలకాన్ని సోమవారం తెలుగుదేశం కార్యకర్త పొలుగుతో పొడిచి ధ్వంసం చేశాడని వైఎస్సార్సీపీ నాయకులు తెలిపారు. వైఎస్సార్సీపీ జెండా దిమ్మను, సచివాలయ శిలాఫలకాన్ని ధ్వంసం చేసినవారిని అరెస్టుచేసి చట్టప్రకారం శిక్షించాలని వైఎస్సార్సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు యల్లావుల ఏడుకొండలు, నల్లమోతువారిపాలెం సర్పంచ్ మాడా సుబ్రమణ్యం, బాపట్ల ఏఎంసీ మాజీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి డిమాండ్ చేశారు. వారు పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మంగళవారం కర్లపాలెం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్ రహీమ్రెడ్డికి ఫిర్యాదు అందజేశారు. ఈ సందర్భంగా సీతారామిరెడ్డి మాట్లాడుతూ గణపవరం పంచాయతీ వార్డు మెంబరైన పి.నాగరాజురెడ్డిపై ఇటీవల దాడిచేసిన వారిమీద కూడా చర్యలు తీసుకోవాలని పోలీసుల్ని కోరారు. పోలీస్ స్టేషన్కు వెళ్లినవారిలో కర్లపాలెం ఎంపీటీసీ సభ్యుడు ఎస్కె ఆసిఫ్ అలీ, పేరలి సర్పంచ్ మల్లెల వెంకటేశ్వర్లు, పెదగొల్లపాలెం సర్పంచ్ యల్లావుల సురేష్, వైఎస్సార్సీపీ నాయకులు ఆట్ల నాగేశ్వరరెడ్డి, సమ్మెట వెంకటేశ్వరరెడ్డి, దొంతిరెడ్డి జయభారత్రెడ్డి, సలగల ధర్మేంద్ర, తాజుద్దీన్, షంషీర్, మనోహర్, మహేష్, నాగరాజురెడ్డి తదితరులున్నారు. పల్నాడు జిల్లా నాదెండ్ల గ్రామంలో సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు ఓ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఎంపీ ఆర్.కృష్ణయ్య ఎంపీ కోటా నిధుల నుంచి గ్రామాభివృద్ధికి రూ.20 లక్షలు మంజూరు చేయగా.. తిమ్మాపురం నుంచి గ్రామంలోకి వచ్చే రహదారిలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు నిర్మించారు. అప్పట్లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. సోమవారం రాత్రి టీడీపీ కార్యకర్తలు మద్యం తాగి ఈ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు మండలం సీతంపేట పంచాయతీ కొమిరేపల్లికి వెళ్లే రోడ్డులో ఉన్న శిలాఫలకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం ధ్వంసం చేశారు. ఆ శిథిలాలను మంగళవారం వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంటరీ జిల్లా కార్యదర్శి పులవర్తి సంతోష్, పార్టీ నాయకులు రాజు, గంటా పండు, దిలీప్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దశాబ్దాల కాలంగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి రాకపోకలకు నరకాన్ని చవిచూశామని చెప్పారు. గత ఎన్నికల్లో కొఠారు రామచంద్రరావు పల్లె నిద్ర సమయంలో కొమిరేపల్లికి తారురోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత కొఠారు అబ్బయ్యచౌదరి ఎమ్మెల్యేగా గుండుగొలను రోడ్డు నుంచి కొమిరేపల్లి గ్రామానికి కిలోమీటరున్నర మేర రూ.కోటికిపైగా వ్యయంతో తారురోడ్డు నిర్మించారని చెప్పారు. మాజీ సీఎం, మాజీ ఎమ్మెల్యే ఫొటోలున్న శిలాఫలకాన్ని కూల్చివేయడం, అగౌరవపర్చడం బాధాకరమని పేర్కొన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పారు. టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేసిన శిలాఫలకం ఫొటోలను పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఏపీ ఆయిల్ ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావుకు పంపించారు. పశ్చిమగోదావరి జిల్లా యలమంచిలిలోని గ్రామ సచివాలయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రంతో ఉన్న శిలాఫలకాన్ని తెలుగుదేశం కార్యకర్త మంగళవారం ధ్వంసం చేశాడు. ఈ విషయమై గ్రామ కార్యదర్శి పాలా శారదా శ్రీనివాస్ను అడగగా.. తాను కార్యాలయం నుంచి ఇంటికి వచ్చిన తరువాత ఈ దుశ్చర్య జరిగినట్టు తెలిసిందన్నారు. దీనిపై బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని చెప్పారు. -
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడుయూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడుకూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శిచట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీఅన్యాయంగా కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలుఐక్యతతో ముందుకు సాగాలి రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరురాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిరాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన 77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ -
కొనసాగుతున్న టీడీపీ దాడులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు గాయాలు
సాక్షి, కర్నూలు: ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ కార్యకర్తలు, నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై పచ్చ బ్యాచ్ దాడులు చేస్తోంది. ఈ క్రమంలో పలువురి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో, బాధితులు పోలీసులను ఆశ్రయించారు.ఇక, తాజాగా కర్నూలు జిల్లాలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. తుగ్గలి మండలంలోని డీసీకొండలో వైఎస్సార్సీపీ కార్యకర్త శ్రీనివాసులుపై టీడీపీ కార్యకర్తలు దాడులు చేశారు. ఈ క్రమంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. మరో వైఎస్సార్సీపీ కార్యకర్త శేఖర్పైనా దాడికి టీడీపీ నేతలు ప్రయత్నించారు. ఈ సందర్భంగా బాధితులు జొన్నగిరి పీఎస్లో ఫిర్యాదు చేశారు. పుంగనూరులో టీడీపీ నేతలు అరాచకం సృష్టించారు. వైఎస్సార్సీపీ నేత వెంకట్రెడ్డి ఇంటిపై టీడీపీ నేతలు దాడి చేశారు. ఈ క్రమంలో వెంకట్రెడ్డి ఇంటి అద్దాలను ధ్వంసం చేశారు. ఇంతా జరుగుతున్నా పోలీసులు మాత్రం పట్టించుకోవడం లేదు. చూసిచూడనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉండగా.. పుంగనూరులో మరోసారి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీడీపీ కార్యకర్తలు ఓవరాక్షన్కు దిగారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా టీడీపీ కార్యకర్తలు రాస్తారోకో చేపట్టారు. పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి కాసేపట్లో పుంగనూరుకు రానున్న నేపథ్యంలో పచ్చ బ్యాచ్ హంగామా చేస్తోంది. -
యథేచ్ఛగా టీడీపీ దాడులు
సాక్షి టాస్క్ఫోర్స్: రాష్ట్రంలో అధికార మత్తుతో టీడీపీ నేతలు, కార్యకర్తలు పేట్రేగిపోతున్నారు. గత ప్రభుత్వం హయాంలో ఏర్పాటైన ప్రభుత్వ ఆస్తులను, అభివృద్ధి పథకాల శిలాఫలకాలను యథేచ్ఛగా ధ్వంసం చేస్తున్నారు. జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఈ విధ్వంసం కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం కూడా టీడీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. పలుచోట్ల విధ్వంసానికి దిగారు. అనంతపురం రూరల్ మండలం రాచానపల్లిలో పట్టపగలు అందరూ చూస్తుండగానే రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. వీటి పక్కనే ఉన్న జగనన్న పాలవెల్లువ ‘నేమ్ బోర్డు’ను తొలగించారు. పల్నాడు జిల్లా నూజెండ్ల మండలం చింతలచెర్వు గ్రామ సచివాలయం శిలాఫలకాన్ని పగులకొట్టారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్ల సచివాలయం, ఆర్బీకే, హెల్త్ క్లినిక్ భవనాలపై దాష్టీకానికి పాల్పడ్డారు. వైఎస్సార్ హెల్త్క్లినిక్ పేరుతో వేసిన శిలాఫలకంపై ఉన్న వైఎస్ జగన్, మేకపాటి విక్రమ్రెడ్డి చిత్రాలను బండరాయితో తుడిచే ప్రయత్నం చేశారు. రైతు భరోసా కేంద్రం, సచివాలయం భవనాలకు ఉన్న కిటికీ అద్దాలను పగులగొట్టారు. అలాగే ఏఎస్పేట మండలం చౌటభీమవరంలో జగనన్న లేఔట్ను టీడీపీ నాయకుడు రాంబాబు జేసీబీతో తవ్వేశారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలంలో సచివాలయాలు, ఆర్బీకే భవనాల శిలాఫలకాలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు ధ్వంసం చేశారు. కీలపల్లిలో గ్రామ సచివాలయం, ఆర్బీకే భవనాలకు అమర్చిన శిలాఫలకాలు, బోర్డు దిమ్మెలను గునపాలు, సమ్మెటతో పగులకొట్టారు. అలాగే గండ్రాజుపల్లి పంచాయతీ ఆలకుప్పంలో బీఎంసీ సెంటర్కు అమర్చిన శిలాఫలకాన్ని ఆ గ్రామ టీడీపీ నాయకులు తొలగించారు. శ్రీరంగరాజపురం మండలం నెలవాయి సచివాలయం, రైతుభరోసా కేంద్రం, విలేజ్ క్లినిక్ వద్ద, జీఎంఆర్ పురం పంచాయతీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నవరత్నాలు, డిజిటల్ లైబ్రరీ శిలాఫలకాలను ధ్వంసం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్ల మెట్ట సమీపంలో ఏర్పాటు చేసిన దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. -
దాడులు, హింసపై పూర్తి వివరాలివ్వండి: హైకోర్టు
సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో కొన్ని వర్గాలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులకు సంబంధించిన పూర్తి వివరాలను తమ ముందుంచాలని హైకోర్టు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెల్లడైన తరువాత నిర్థి ష్టంగా ఓ రాజకీయ పార్టీకి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుంటూ రాష్ట్రంలో హింసకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని, హింసను అణిచివేసి, బాధితులను రక్షించేందుకు అవసరమైన చర్యలను సత్వరమే చేపట్టేలా కేంద్ర హోంశాఖను, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని, డీజీపీని ఆదేశించాలని కోరుతూ ఎంపీ, వైఎస్సార్సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి హైకోర్టులో పిల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై గురువారం జస్టిస్ కిరణ్మయి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందిఈ వ్యాజ్యంలో ప్రజల హక్కులు, స్వేచ్ఛ ముడిపడి ఉందని రాజు రామచంద్రన్ అన్నారు. దాడులు, హింసను అడ్డుకునేందుకు హైకోర్టు ఏ ఆదేశాలిచ్చినా అవి దేశం మొత్తానికి మార్గదర్శకాలు అవుతాయన్నారు. ఫిర్యాదులు ఇస్తున్నా పోలీసులు కేసు నమోదు చేయడంలేదన్నారు. ఈ నేపథ్యంలో.. తాము కోర్టుకు నిర్థిష్టమైన అభ్యర్థనలు చేశామన్నారు.కొంతమంది లక్ష్యంగా చేసుకుని హింసకు, ఆస్తుల విధ్వంసానికి పాల్పడుతున్న నిందితులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీచేయాలని అభ్యర్థి0చామన్నారు. అలాగే, ఈ హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులకు ఆదేశాలు జారీచేయాలని కూడా కోరామన్నారు. అంతేకాక.. హింసకు కారణమైన వారిని గుర్తించి, వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటుచేసేలా.. బాధితులకు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా కూడా ఆదేశాలు జారీచేయడంతో పాటు, హింసకు దారితీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని ఏర్పాటుచేసేలా ఆదేశాలివ్వాలన్నారు. పూర్తి వివరాలు మా ముందుంచండివాదనలు విన్న ధర్మాసనం, ఈ వ్యాజ్యంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని పోలీసులను, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో హోంశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. ఈ పిల్ విచారణార్హతపై కూడా తమ వాదనను వినిపిస్తామన్నారు. అలాగే, పూర్తి వివరాలు కూడా కోర్టు ముందుంచుతామని చెప్పారు. అనంతరం.. ధర్మాసనం తదుపరి విచారణను 19కి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. ఇళ్లు.. ఊళ్లూ ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నారు వైవీ సుబ్బారెడ్డి తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది రాజు రామచంద్రన్ వాదనలు వినిపిస్తూ, ఎన్నికల ఫలితాల తరువాత నుంచి నేటివరకు యథేచ్చగా హింస కొనసాగుతూ వస్తోందన్నారు. నిర్ధిష్టంగా కొన్ని వర్గాలపైనే ఈ హింస, దాడులు జరుగుతున్నాయని తెలిపారు. ఇందుకు సంబంధించి వీడియో, పేపర్ సాక్ష్యాలున్నాయని, వాటిని పరిశీలించాలని కోరారు. ఇలా విధ్వంసం సృష్టిస్తున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదన్నారు. అందువల్ల హింసను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పైగా.. ఇళ్లు, ఊళ్లు ఖాళీచేసి వెళ్లాలని బెదిరిస్తున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారని తెలిపారు. హింసను, దాడులను నిరోధించేందుకు ఏం చర్యలు తీసుకున్నారో వివరిస్తూ ఓ స్థాయీ నివేదిక ఇచ్చేలా ఆదేశాలివ్వాలని రామచంద్రన్ కోరారు. ఎస్సీ, ఎస్టీ మైనారిటీలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడంలేదన్నారు. ఎవరినీ కూడా ఇందుకు బాధ్యులను చేయడంలేదని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి బాధ్యులను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రధానంగా అణగారిన వర్గాలే దాడులకు గురవుతున్నారని.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిపై, ఆ పార్టీకి మద్దతు తెలిపిన వారిపైనే ప్రధానంగా దాడులు జరుగుతున్నాయన్నారు. వీరిందరి పక్షానే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసినట్లు ధర్మాసనం అడిగిన ఓ ప్రశ్నకు రాజు రామచంద్రన్ బదులిచ్చారు. -
టీడీపీ దాడులపై అన్నిరకాలుగా ఫిర్యాదులు చేశాం: వైవీ సుబ్బారెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఏపీలో వైఎస్సార్సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడుల విషయమై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీ, హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేసినట్టు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. టీడీపీ కార్యకర్తల దాడులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లామన్నారు.కాగా, వైస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి గురువారం ఉదయం ఢిల్లీ నుంచి విశాఖ విమానాశ్రయం చేరుకున్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ..‘ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే రాష్ట్రంలో వైఎస్సార్సీపీ నాయకులపై, ప్రభుత్వ ఆస్తులపై దాడులు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో దాడుల విషయమై రాష్ట్రపతికి, గవర్నర్కు, హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశాం. ఈ దాడులపై కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాం. గవర్నర్కు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాకు ఫిర్యాదు చేశాం’ అని చెప్పారు.ఇక, అంతకుముందు.. అల్లరి మూకలు సాగిస్తున్న విధ్వంసం, హింసాకాండపై వైవీ సుబ్బారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. లక్షిత దాడులకు పాల్పడుతున్న వారిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. హింసను సత్వరమే కఠినంగా అణిచి వేసేలా కేంద్ర హోంశాఖ, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీని ఆదేశించాలని కోరారు. బాధితులు, వారి కుటుంబ సభ్యుల ప్రాణాలకు, ఆస్తులకు ముప్పు తలపెడుతున్న వ్యక్తులు, సమూహాలను నియంత్రించేందుకు చట్ట ప్రకారం గట్టి చర్యలు తీసుకునేలా ఆదేశించాలని కోర్టును అభ్యర్థించారు. లక్షిత హింసపై ఫిర్యాదులు అందిన వెంటనే బాధ్యులపై ఎఫ్ఐఆర్లు నమోదు చేసేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. హింసకు కారకులను గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు వీలుగా ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు.బాధితులు, వారి కుటుంబ సభ్యులకు తగిన రక్షణ కల్పించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. హింసకు దారి తీసిన పరిస్థితులను తేల్చేందుకు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో ఓ కమిటీని నియమించేలా ఆదేశించాలని వైవీ సుబ్బారెడ్డి తన వ్యాజ్యంలో కోర్టును అభ్యర్థించారు. న్యాయమూర్తులు జస్టిస్ మండవ కిరణ్మయి, జస్టిస్ న్యాపతి విజయ్ ధర్మాసనం ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై గురువారం విచారణ జరపనుంది.ఇదీ చదవండి: APలో జంగిల్ రాజ్.. యథేచ్ఛగా హింసాకాండ! -
ఇజ్రాయెల్లో బాంబుల మోత.. రాకెట్లతో హెజ్బుల్లా దాడి..
ఇజ్రాయెల్లో ఉద్రిక్తకర పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఉత్తర ఇజ్రాయెల్పై హెజ్బుల్లా దాడులకు తెగబడింది. రాకెట్ల దాడులతో ఇజ్రాయెల్పై విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కానీ, తీవ్ర ఆస్తి నష్టం జరిగింది.అయితే, హెజ్బుల్లాకు చెందిన కీలక కమాండర్ తలెబ్ సమీ అబ్ధుల్లా హత్యకు ప్రతీకారంగానే ఇజ్రాయెల్పై దాడులు చేసినట్టు హెజ్బుల్లా ప్రకటించింది. దాదాపు 170 రాకెట్లతో హెజ్బుల్లా.. ఇజ్రాయెల్పై దాడులు చేసింది. ఇజ్రాయెల్, హెజ్బుల్లా మధ్య ఘర్షణ ప్రారంభమైన తర్వాత జరిగిన ఇదే అతిపెద్ద దాడి అని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో తెలిపింది. ఇక, ఇప్పటి వరకు లెబనాన్పై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 400 మంది హెజ్బుల్లా సభ్యులు మరణించినట్టు సమాచారం. #Hezbollah fires dozens of suicide drone 🚀 to attack #zionist Military division headquarters in Nahariya . All the drones Destroyed their designated target and the military headquarters are burning 🔥 now . #Lebanon #israel war #FreePalestine https://t.co/4rRHLtIQ4v— Hasib Holy (@HasibHoly) June 13, 2024 మరోవైపు.. హెజ్బుల్లా దాడుల నేపథ్యంలో ఇటు ఇజ్రాయెల్ సైతం దాడులను తీవ్ర తరం చేసింది. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్, హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికాతో సహా అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్న వేళ హెజ్బుల్లా ఈ దాడికి పాల్పడటంతో చర్చనీయాంశంగా మారింది. Israeli soldiers attack Hezbollah forces using ancient Roman war weapons "Catapult" on the Israel-Lebanon border. pic.twitter.com/HzgQsnFEV4— James Wuttichai (@Military9News) June 13, 2024 -
అటు ప్రమాణం.. ఇటు విధ్వంసం
సాక్షి నెట్వర్క్: ఒకవైపు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో బుధవారం రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ, జనసేన, కూటమి శ్రేణులు మరింత రెచ్చిపోయి విధ్వంసాలకు దిగాయి. పలు ప్రభుత్వ కార్యాలయాల పేర్లు మార్చేశారు. ప్రగతి పనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. విగ్రహాలను నేలకూల్చారు. కొన్ని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై టీడీపీ జెండాలు కట్టారు. వైఎస్సార్సీపీ జెండాదిమ్మెల్ని ధ్వంసం చేశారు. అనంతపురం రూరల్ మండలం కాటిగానికాలువ గ్రామంలో రైతుభరోసా కేంద్రం (ఆర్బీకే) శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు.చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కొందరు టీడీపీ కార్యకర్తలు కాటిగానికాలువ రైతుభరోసా కేంద్రంలోకి కేక్ తీసుకొచ్చి కట్ చేశారు. అనంతరం బయటకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఒక మహిళ చేతికి సుత్తి ఇచ్చి పగులగొట్టించారు. తర్వాత ఇద్దరు కార్యకర్తలు ఆ శిలాఫలకాన్ని బయటకు తీసుకెళ్లి పూర్తిస్థాయిలో ధ్వంసం చేశారు. సచివాలయ భవనంపైకెక్కి టీడీపీ జెండా కట్టారు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు అక్కడికి చేరుకుని ప్రభుత్వ కార్యాలయ భవనంపై కట్టిన టీడీపీ జెండాను పీకేయించారు. ఈ ఘటనపై మహిళా పోలీసు మౌనిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన కేసులో వీడియో ఆధారంగా అదే గ్రామానికి చెందిన లక్ష్మీదేవి, రామాంజనేయులు, చంద్రమౌళినాయుడుపై కేసు నమోదు చేసినట్లు సీఐ రామకృష్ణారెడ్డి తెలిపారు. అలాగే కొందరు బెదిరింపులకు దిగుతున్నట్లు ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఎవరైనా బెదిరిస్తే బాధితులు నేరుగా పోలీసులను సంప్రదించాలని సూచించారు. బెదిరించేవారిపట్ల పోలీసుశాఖ కఠినంగా వ్యవహరిస్తుందని హెచ్చరించారు. » కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మండలం ఉలిమేశ్వరం గ్రామంలో విధ్వంసానికి పాల్పడ్డారు. మంత్రివర్గ ప్రమాణస్వీకారాన్ని ప్రజలు చూసేందుకు పంచాయతీ అధికారులు రైతుభరోసా కేంద్రంలో ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ మాజీ సభ్యుడు పేకేటి దొరబాబు, తదితరులు అక్కడున్న ఆర్బీకే ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. కార్యాలయంలోని కరపత్రాలు, అధికారిక పత్రాలను తగులబెట్టారు. ఇదెక్కడి దౌర్జన్యం అంటూ సర్పంచ్ భర్త ఆకుల వీరబాబు నిలదీశారు. దీంతో దొరబాబు, వీరబాబు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. సీఐ రవికుమార్, ఎస్ఐ వెలుగుల సురేష్ అక్కడికి చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు. పోలీస్ పికెట్ను ఏర్పాటు చేశారు. » చిత్తూరు జిల్లా నిండ్ర మండలంలోని అగరం గ్రామ పంచాయతీలో సచివాలయం భవనం ప్రారంభోత్సవం నాడు ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అప్పటి మంత్రి రోజా పేరిట ఉన్న శిలాఫలకాన్ని పగులగొట్టారు. ఈ విషయమై బుధవారం స్థానికులు అధికారులకు ఫిర్వాదు చేశారు. » తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ (తుడా) కార్యాలయానికి ఉన్న డాక్టర్ వైఎస్సార్ పేరును దౌర్జన్యంగా తొలగించారు. ఆ స్థానంలో ఎన్టీఆర్ పేరు ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపల ఉన్న వైఎస్సార్ ఫొటో అక్కడి నుంచి తొలగించారు. » కృష్ణాజిల్లా మచిలీపట్నంలోని ఈడేపల్లిలో శిశు విద్యామందిర్ వద్ద ఉన్న 45వ డివిజన్ సచివాలయానికి పసుపు పచ్చని నూతన బోర్డు ఏర్పాటు చేశారు. ఆ డివిజన్ టీడీపీ నాయకుడు పి.వి.ఫణికుమార్తో కలిసి నాయకులు, కార్యకర్తలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి పవన్కళ్యాణ్, ఎంపీ వల్లభనేని బాలశౌరి చిత్రాలతో తయారు చేసిన సచివాలయం బోర్డు ఏర్పాటు చేశారు. బోర్డు ఏర్పాటుకు సచివాలయ సిబ్బంది సహకరించారు. ఫణికుమార్ కేక్ కట్ చేశారు. » శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రం నెల్లూరులోని 54వ డివిజన్ జనార్దన్రెడ్డికాలనీలో వైఎస్సార్సీపీ జెండాను, స్థూపాన్ని, శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. ఘటనా స్థలాన్ని నెల్లూరు మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, వైఎస్సార్సీపీ నాయకుడు ఎస్కే జమీర్అహ్మద్, పలువురు పార్టీ నాయకులు పరిశీలించారు. » చిత్తూరు జిల్లా కుప్పం మండలం కొత్తయిండ్లు గ్రామంలో వైఎస్సార్సీపీ జెండాను ధ్వంసం చేశారు. మొదటి నుంచి టీడీపీకి పట్టున్న గ్రామంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థానాలను గెల్చుకున్న వైఎస్సార్సీపీ వర్గీయులు జెండా ఎగురవేసారు. అప్పటి నుంచి వైఎస్సార్సీపీపై అక్కసు వ్యక్తంచేస్తున్న టీడీపీ నాయకులు మంగళవారం రాత్రి జెండా పీకేసి స్థూపాన్ని ధ్వంసం చేశారని స్థానికులు తెలిపారు. » శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం ఆర్.హెచ్.పురంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని మంగళవారం రాత్రి కూల్చివేశారు. గ్రామంలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన అనంతరం విద్యుత్ సరఫరా నిలిపేసి సుమారు 15 మంది టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్ విగ్రహాన్ని తొలగించి పొదల్లో పడేశారు. దీనిపై కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు.» ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన నాయకులు బుధవారం గ్రామంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కొందరు కార్యకర్తలు సచివాలయం–2 భవనం ప్రారంభ సమయంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్ద బాణసంచా కాలుస్తూ భయభ్రాంతులకు గురిచేశారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేసినట్లు ఎస్ఐ మణికుమార్ చెప్పారు. » తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం కడియపుసావరం గ్రామంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నేతల విజయోత్సవ ర్యాలీ శృతితప్పింది. మోటారు సైకిళ్లపై ర్యాలీలో పాల్గొన్న కార్యకర్తలు గ్రామంలోని జక్కంపూడి గ్రామ మోహన్రావు మల్టీపర్పస్ సెంటర్ గేట్లు తెరుచుకుని గ్రౌండ్లోకి ప్రవేశించారు. అక్కడున్న ఫ్లెక్సీలను చించేశారు. కళ్యాణ మంటపం గోడపై మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు, జిల్లా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు జక్కంపూడి రాజా తదితరుల పేర్లున్న శిలాఫలకాన్ని లక్ష్యంగా చేసుకుని కొందరు రాళ్లు విసిరారు. దీంతో పలు కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. శిలాఫలకం పాక్షికంగా దెబ్బతింది. -
మీకు చేతులెత్తి మొక్కుతాం..టీడీపీ అరాచకాలపై సామాన్యులు
-
కొనసాగుతున్న శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతోంది. పలుచోట్ల మంగళవారం ఇష్టారీతిన వ్యవహరించారు. పలు ప్రభుత్వ కార్యాలయాలపై పేర్లను తొలగించారు. ప్రగతిపనుల శిలాఫలకాలను ధ్వంసం చేశారు. అధికారం పార్టీ ఆగడాలతో ప్రజలు భయపడుతున్నారు. » జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయ లైటింగ్ సైన్ బోర్డును ధ్వంసం చేశారు. నూతనంగా నిరి్మంచిన జంగారెడ్డిగూడెం మున్సిపల్ కార్యాలయానికి డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి మున్సిపల్ కార్యాలయంగా పేరును నిర్ధారిస్తూ లైటింగ్ నేమ్ బోర్డును కార్యాలయ భవనంపై ఏర్పాటు చేశారు. ఈ లైటింగ్ బోర్డును టీడీపీ మండల కమిటీ అధ్యక్షుడు సాయిల సత్యనారాయణ, మరో ఎనిమిదిమంది ధ్వంసం చేశారు. నిచ్చెనలు వేసుకుని కర్రలతో కొట్టి ధ్వంసం చేయగా, నేలరాలిన అక్షరాలతో ఆ ప్రాంతం చిందర వందరగా తయారైంది. ఘటనపై మున్సిపల్ కార్యాలయ మేనేజర్ కె.వి.రమణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. » దెందులూరు మండలం పోతునూరులోని సచివాలయం, రైతుభరోసా కేంద్రం, రోడ్డు వద్ద ఉన్న శిలాఫలకం, చల్లచింతలపూడిలోని సచివాలయం వద్ద నవరత్నాలతో ఉన్న బోర్డులను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ సంఘటనల్ని పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్, వైఎస్సార్సీపీ సీనియర్ నేత డి.ఎన్.వి.డి.ప్రసాద్ తప్పుబట్టారు. » తిరుపతిలో ఒక శిలాఫలకంపై మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు. తిరుపతి నగరంలో గతంలో ఎమ్మెల్యే హోదాలో భూమన కరుణాకర్ రెడ్డి ఆవిష్కరించిన శిలాఫలకాన్ని మంగళవారం గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి చేసిన భూపిరాట్టి మార్గాన్ని గత ఏడాది నవంబర్ 26వ తేదీన అప్పటి ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నగర మేయర్ డాక్టర్ శిరీషతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన శిలాఫలకంపై భూమన కరుణాకర్రెడ్డి పేరును కొందరు ధ్వంసం చేశారు. » శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం ఆత్మకూరు పంచాయతీలో నిరి్మంచిన రైతుభరోసా కేంద్రం వద్ద శిలాఫలకాన్ని గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి ధ్వంసం చేశారు. గది తాళాన్ని పగలగొట్టి లోపల ఉన్న ఫ్యాన్ను అపహరించారు. టీడీపీ కార్యకర్తలు ఈ పనిచేసి ఉండొచ్చని, దీనిపై ఫిర్యాదు చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు. మండలంలో గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని వైఎస్సార్సీపీ కనీ్వనర్ పోతురాజు, జేసీఎస్ కనీ్వనర్ ధనకోటేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. » బాపట్ల జిల్లా వేమూరు బస్టాండ్ సెంటర్లోని నవరత్నాల స్థూపాన్ని టీడీపీ దుండగులు సోమవారం అర్థరాత్రి కూల్చేశారు. వైఎస్సార్సీపీ హయాంలో నవరత్న పథకాలు ప్రజలకు గుర్తుండేలా వేమూరు బస్టాండ్ సెంటరులో పంచాయతీ అనుమతితో స్థూపం నిర్మించారు. ఈ నెల 7వ తేదీన స్థూపం కూల్చేసేందుకు జేసీబీతో ప్రయత్నించారు. సిమెంట్ కాంక్రీట్తో గట్టిగా నిరి్మంచడం వల్ల జేసీబీ వల్ల కాలేదు. పంచాయతీ అధికారులు, ఎంపీడీవో దగ్గర ఉండి, స్థూపంపై ఉన్న శిలాఫలకాలు, వైఎస్ రాజశేఖర్రెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి, నందిగం సురే‹Ù, మేరుగ నాగార్జున బొమ్మలను పూర్తిగా తొలగించారు. తిరిగి సోమవారం రాత్రి యంత్రాన్ని తీసుకొచ్చి స్థూపాన్ని పూర్తిగా తొలగించారు. తెల్లవారుజామున సెంటరుకు వచ్చిన ప్రజలు స్థూపం కూలి్చవేసి ఉండడాన్ని గమనించి ఆశ్చర్యపోయారు. »చిత్తూరు జిల్లా చౌడేపల్లె ప్రవేటు బస్టాండు ప్రాంతంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం రాత్రి తొలగించారు. కూడలి సమీపంలో ఏర్పాటుచేసిన జెండా దిమ్మెను జేసీబీ సహాయంతో పెకలించినట్లు వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈవిషయమై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. » అనకాపల్లి జిల్లా నాతవరం మండలంలో శృంగవరం గ్రామ సచివాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడిచేశారు. సచివాలయంపై ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బొమ్మలతో పాటు నవరత్నాల పోస్టర్ను «ధ్వంసం చేశారు. ఈ విధ్వంసం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గసభ్యుడు, సర్పంచ్ భర్త ఉలబాల శ్రీనువాసు పేర్కొన్నారు. కోర్టు వివాదంలో ఉన్న ప్రభుత్వ భవనం తాళం విరగొట్టి టీడీపీ కార్యకర్తలు ప్రవేశించటం కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనని చెప్పారు. -
ఊరూరా విధ్వంసాలు, వేధింపులు..
సాక్షి, నెట్వర్క్: రాష్ట్రంలో టీడీపీ నేతలు, కార్యకర్తల ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. వారం రోజులుగా జరిగిన వందలాది ఘటనల్లో వైస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలపాలయ్యారు. పెద్ద ఎత్తున ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లింది. ప్రధానంగా గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలను లక్ష్యంగా చేసుకుని విధ్వంసం సృష్టిస్తున్నారు. శిలాఫలకాలను ధ్వంసం చేస్తూ.. వైఎస్సార్ విగ్రహాలను కూలదోస్తున్నారు. పోలింగ్ ముగిసినప్పటి నుంచి దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు మొదలైనప్పటికీ.. ఫలితాల వెల్లడి తర్వాత పరిస్థితి శ్రుతిమించి పోయింది. ఎక్కడికక్కడ వైఎస్సార్సీపీ కార్యకర్తలను దారి కాచి దాడులు చేస్తున్నారు. గ్రామాల్లో ఇళ్లలోకి దూరి కొడుతున్నారు. వైఎస్సార్సీపీకి ఓటు వేశారన్న అనుమానంతో సామాన్యులను సైతం కక్ష సాధింపుతో వేధిస్తున్నారు. ‘ఇదేం అన్యాయం.. కాపాడండయ్యా..’ అంటూ బాధితులు పోలీస్స్టేషన్కు పరుగులు తీస్తున్నా.. ఆ ఖాకీలు మాత్రం వృత్తి ధర్మాన్ని మరచి చోద్యం చూస్తున్నారు. తాజాగా అనంతపురంలో హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ను చంపుతామని బెదిరించారు.ఊరు వదిలి వెళ్లాలని సాక్షాత్తు పోలీసు అధికారులే ఉచిత సలహా ఇస్తుండటం నివ్వెరపరుస్తోంది. తెనాలిలో వైఎస్సార్సీపీ నేత కాళిదాసు సత్యంపై, పల్నాడు జిల్లా బట్లూరులో ఆర్ఎంపీ వైద్యుడు శివయ్యపై హత్యాయత్నం చేశారు. రోజురోజుకూ పెరుగుతున్న టీడీపీ నేతలు, కార్యకర్తల అరాచకం.. దౌర్జన్యం.. కనుసైగ చేసి దాడులను ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, లోకేశ్ల తీరుపై రాష్ట్రపతికి నివేదించాలని వైఎస్సార్సీపీ నిర్ణయించింది. ఇందులో భాగంగా పార్టీ ఎంపీల బృందం మంగళవారం రాత్రి ఢిల్లీ చేరుకుంది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోరింది. రాష్ట్రంలో విధ్వంసకాండ గురించి బుధవారం జాతీయ మీడియాకు కూడా వివరించనుంది. ఇదే విషయమై సుప్రీంకోర్టును ఆశ్రయించగా, హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఆ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 13న ఈ పిటిషన్ విచారణకు రానుంది. -
దాడులు ఆపకుంటే ప్రతి దాడులు తప్పవు
జగ్గయ్యపేట అర్బన్: ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి అరాచకం సృష్టిస్తూ రాజకీయ ప్రత్యర్థులపై దాడులకు తెగబడుతున్న టీడీపీ మూకలు తమ సహనాన్ని పరీక్షించవద్దని ప్రభుత్వ మాజీ విప్, వైఎస్సార్ సీపీ నేత సామినేని ఉదయభాను హెచ్చరించారు. హద్దులు దాటొద్దని, తమ సహనం నశిస్తే ప్రతిచర్యలు తప్పవని స్పష్టం చేశారు.వారం రోజులుగా విజయోత్సవాల పేరుతో దాడులకు తెగ బడి వైఎస్సార్ సీపీ కార్యకర్తలను హింసించడం, ఇళ్లలోకి చొరబడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి పైశాచిక ఆనందాన్ని పొందటాన్ని తీవ్రంగా ఖండించారు. ఇది తాలిబాన్ల పాలనను తలపిస్తోందన్నారు. సోమవారం జగ్గయ్యపేటలో నేతలతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజాతీర్పును శిరసావహిస్తున్నామని, జగ్గయ్యపేటలో గెలిచిన శ్రీరాం తాతయ్య నియోజకవర్గ ప్రజలకు మంచి చేయాలని తాము కోరుతున్నట్లు చెప్పారు. ఇందుకేనా గెలిపించింది? తాను ఐదు పర్యాయాలు ఎన్నికల్లో పోటీ చేశానని, గెలిచిన పార్టీ ఇలా దౌర్జన్యాలకు పాల్పడటం ఎప్పడూ చూడలేదన్నారు. 2019లో 151 సీట్లు గెలుచుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైఎస్సార్ సీపీ ఎక్కడా దాడులకు దిగలేదన్నారు. కౌంటింగ్ జరుగుతుండగానే సచివాలయాల మీద టీడీపీ జెండాలు ఎగురవేయడం, విగ్రహాలను కూల్చడం, వైఎస్సార్ సీపీ జెండా దిమ్మెలు, శిలాఫలకాలను ధ్వంసం చేయడం టీడీపీ గూండాయిజానికి నిదర్శనమని ఉదయభాను మండిపడ్డారు. ఇందుకేనా చంద్రబాబును గెలిపించింది? అని ప్రజలు అసహ్యించుకుంటున్నారని చెప్పారు. దాడులు.. ఇళ్ల లూటీ తొర్రగుంటపాలెంలో వైఎస్సార్ సీపీ కార్యకర్త పాటి సాంబ ఇంటిపై అల్లరి మూకలు అర్ధరాత్రి దాడి చేసి విలువైన వస్తువులను ధ్వంసం చేయడంతో పాటు బీరువాలోని నగదు, బంగారాన్ని దోచుకున్నాయని ఉదయభాను పేర్కొన్నారు. మైనార్టీ మహిళపై కారం చల్లడంతోపాటు గోపి అనే వ్యక్తిపై దాడి చేశారని చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆకుల శ్రీకాంత్, తన్నీరు నాగేంద్ర, కొండ తదితరుల నివాసాలపై రాళ్లతో దాడి చేశారని ఫొటోలను ప్రదర్శించారు.13వ వార్డులో అభివృద్ధి శిలాఫలకాలు, జెండా దిమ్మెలను టీడీపీ మూకలు నేల కూల్చాయన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తే నిందితులకు 41 ఏ నోటీసు ఇచ్చి స్టేషన్ బెయిల్తో సరిపుచ్చడంతో తిరిగి దాడులకు తెగబడుతున్నట్లు చెప్పారు. పారీ్టకి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తలు ఎవరూ ఆత్మ విశ్వాసాన్ని కోల్పోవద్దని సూచించారు. -
పరాకాష్టకు 'విధ్వంసకాండ'
టీడీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చిపోయి గొడవలు కొనసాగిస్తున్నారు. దాడులు చేయడం తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నారు. అధికారం దక్కింది దౌర్జన్యం చేయడానికే అని చాటి చెబుతున్నారు. ఎన్నికల ఫలితాల అనంతరం టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తల తీరు విస్తుగొలుపుతోంది. పట్టపగలు కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం వేస్తున్నారు. ఊరూరా విగ్రహాలను, శిలా ఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో ఎవరూ ఉండకూడదన్నట్లు బెదిరింపులకు దిగుతున్నారు. ఈ పార్టీకి ఓట్లేసిన వారిని దుర్భాషలాడుతున్నారు. ఓట్లు వేయించిన వారు ఊరు వదిలి వెళ్లాలని హుకుం జారీ చేస్తున్నారు. ఇది అన్యాయం కదా.. అని ప్రశి్నస్తే దుస్తులు విప్పి కొడుతున్నారు. ఏ తప్పూ చేయకపోయినా, వైఎస్సార్సీపీకి మద్దతు ఇచ్చినందుకు బహిరంగ క్షమాపణలు చెప్పిస్తున్నారు. యూనివర్సిటీ వీసీలపై దౌర్జన్యం చేస్తున్నారు. పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో ఇదివరకు ఇలా ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడే ఎందుకు ఇలా జరుగుతోంది? టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని విధ్వంసం సృష్టిస్తుంటే.. ప్రభుత్వ ఆస్తులను పాడు చేస్తుంటే.. స్పందించాల్సిన పోలీసులు ఎందుకు చేష్టలుడిగి చూస్తున్నారు? నిజంగా ఈ పరిణామం ఖాకీ డ్రస్సుకే అవమానం. దేశ చరిత్రలో ఇదివరకెన్నడూ లేని రీతిలో గత ఐదేళ్లలో గ్రామాల్లో ప్రభుత్వ కార్యాలయాల భవనాలు వెలిశాయి. ఆర్బీకేలు, విలేజ్ క్లినిక్లు, సచివాలయాలు, కొత్త రూపు రంగరించుకున్న స్కూళ్లు.. ఇలా ఎన్నెన్నో ప్రభుత్వ బిల్డింగ్లు నిర్మాణమయ్యాయి. ఒక్కో గ్రామానికి కోట్లాది రూపాయల విలువైన ఆస్తి సమకూరింది. ఇదంతా ప్రజలందరి ఉమ్మడి ఆస్తి. భద్రంగా కాపాడుకోవాలి. అలాంటిది పని గట్టుకుని ఊరూరా టీడీపీ సేన గునపాలు చేత పట్టుకుని ధ్వంసం చేస్తుండటాన్ని ఏమనాలి? రౌడీయిజం, దౌర్జన్యం, ఉన్మాదం.. ఇలా ఈ పదాలన్నీ తక్కువే. ఎవర్ని చూసుకుని ఇలా పేట్రేగిపోతున్నారు? చంద్రబాబు, లోకేశ్లను చూసుకునే కదా! బాపట్ల జిల్లాలో పిండ ప్రదానం చేస్తుంటే అడ్డుకోవడం.. మంగళగిరిలో వైఎస్సార్సీపీ అభిమాని ఇంటిని జేసీబీతో కూల్చేయడం.. ఏకంగా నెల్లూరు మేయర్ దంపతులనే బెదిరించడం.. ఇదే జిల్లా దత్తులూరు మండలంలో జగనన్న లే అవుట్లోని ఇళ్లను ధ్వంసం చేయడం.. కొండాపురం మండలం గానుగపెంటలో వైఎస్సార్సీపీ కార్యకర్త ఇంటి ప్రహరీ, మెట్లు కూల్చేయడం.. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉన్న వారిని భయభ్రాంతులకు గురి చేయడం.. ఇకపై పోస్టులు ఆపేస్తామని వారితో ప్రకటనలు ఇప్పించడం.. తప్పుడు కేసులు పెట్టడం.. ఇలా ఒక్కో ఊళ్లో ఒక్కో అరాచకం కళ్లెదుటే కనిపిస్తోంది ఒక్క పోలీసులకు తప్ప అందరికీ. రేషన్ పంపిణీ వాహనంపై దాడివైఎస్ జగన్ ఫొటో చింపేసి.. టైర్లు కోసేసిన వైనం.. శ్రీకాకుళం జిల్లాలో ఘటనకాశీబుగ్గ: ఎన్నికల్లో టీడీపీ గెలిచినప్పటి నుంచి అనేకరకాలుగా ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దాడులకు తెగబడుతున్నారు. ప్రభుత్వ ఆస్తులపైనా దాడులు చేస్తూ ప్రజలకు అందుతున్న సేవలను నిలిపివేయాలని కుట్రలకు పాల్పడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా పలాస మండలం గురుదాసుపురం సచివాలయం పరిధిలో ఉన్న సున్నాదేవి గ్రామంలో రేషన్ వాహనాన్ని ధ్వంసం చేశారు. గ్రామంలో ఆదివారం రాత్రి రేషన్ పంపిణీ చేసి చీకటి పడ్డాక వాహనాన్ని నిలిపి ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు వాహనం వద్దకు వచ్చి దానిపైన ఉన్న వైఎస్ జగన్ చిత్రపటాన్ని చించేశారు. వాహనం ఎడమ టైరును కోసేశారు. అక్కడితో ఆగకుండా వాహనానికి చుట్టూరా గీతలు గీసి రాళ్లతో కొట్టారు. వాహనం ఆపరేటర్ కిరణ్కుమార్ యాదవ్ వాహనం వద్దకు వెళ్లి చూసేసరికి టైర్లు కోసి బండి పాడైపోయి కనిపించింది. దీంతో అక్కడ రేషన్ పంపిణీ ఆగిపోయింది. ఉద్దానం ప్రాంతంలో ఉన్న మరో మూడు గ్రామాలకు సోమవారం బియ్యం పంపిణీ చేయాల్సి ఉండగా నిలిపివేసి పోలీసులకు సమాచారం అందించారు.