The Incident Of Two Brothers Died Due To Heart Attack
Sakshi News home page

గుండెపోటుతో తమ్ముడు.. పెద్ద కర్మరోజు అన్నకు కూడా..

Published Thu, Aug 17 2023 7:55 AM | Last Updated on Sat, Aug 19 2023 8:33 PM

The Incident Of Two Brothers Died Due To Heart Attack - Sakshi

కరీంనగర్‌: తమ్ముడి మృతి ని తట్టుకోలేక అన్న గుండె ఆగింది. తమ్ముడు గుండెపోటుతో మృతిచెందగా.. పెద్దకర్మరోజు అన్న కూడా గుండెపోటుతో కుప్పకూలాడు. చికిత్స పొందుతూ బుధవారం కన్నుమూశాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్‌ మండలం రేణికుంటలో జరిగింది. రేణికుంటకు చెందిన ఉమ్మెంతల చంద్రారెడ్డికి ఇద్దరు కొడుకులు సంతోష్‌రెడ్డి(30), మధుకర్‌రెడ్డి(26) ఉన్నారు.

పెద్దకొడుకు సంతోష్‌రెడ్డి కరీంనగర్‌లో, మధుకర్‌రెడ్డి హైదరాబాద్‌లో ప్రయివేటు ఉద్యోగం చేస్తున్నారు. ఇద్దరికీ పెళ్లికాలేదు. 20 రోజుల క్రితం మధుకర్‌రెడ్డికి జ్వరం వచ్చింది. హైదరాబాద్‌లోనే ఓ ఆస్పత్రిలో చేరగా రక్తకణాలు తగ్గినట్లు డాక్టర్లు చెప్పారు. చికిత్స తీసుకుంటున్న క్రమంలో గుండెపోటుకు గురై ఈనెల 3న మృతిచెందాడు. తమ్ముడి పెద్ద కర్మరోజు సంతోష్‌ రెడ్డి గుండెపోటుకు గురయ్యాడు. ఆయనను కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు.

అక్కడి నుంచి హైదరాబాద్‌ తీసుకెళ్లారు. చికిత్సకు సుమారు రూ.20 లక్షలకు పైగా  ఖర్చవుతుందని డాక్టర్లు చెప్పడంతో నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించడంతో బుధవారం సంతోష్‌ మృతిచెందాడు. పక్షం రోజుల వ్యవధిలో ఇద్దరు కొడుకులు మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement