-
సెక్షన్లు మారినయ్.. మావల పీఎస్లో తొలి కేసు..!
సాక్షి, ఆదిలాబాద్: బ్రిటీష్ కాలం నాటి నేర న్యాయ వ్యవస్థను ప్రక్షాళన చేసేలా కొత్తగా రూపొందించిన మూడు నేర న్యాయ చట్టాలు జూలై 1 నుంచి అమల్లోకి వచ్చేశాయి. జల్లాలోని మావల పీఎస్లో తొలి కేసు నమోదైంది. జిల్లాలోని పోలీస్ సిబ్బందికి వీటి పై శిక్షణ దాదాపు పూర్తి చేసినట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. నూతన చట్టాలతో సత్వర న్యాయం అందే అవకాశముంటుందని చెబుతున్నారు.మావలో తొలి కేసు..మావల పోలీసు స్టేషన్ పరిధిలోని పాలిటెక్నిక్ కాలే జ్ గ్రౌండ్ సమీపంలో సోమవారం క్రాంతినగర్కు చెందిన ప్రైవేట్ టీచర్ ఎల్మావార్ నకుల్ రెడ్డి(36) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతని తండ్రి భూమారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చే శాడు. మృతుడి భార్య 15 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లి తిరిగి రాలేదు. దీంతో మనస్తాపం చెందాడు. అప్పటికే మద్యానికి అలవాటుపడ్డ అతను దీని నుంచి తేరుకోలేక పురుగుల మందుతాగి ఆత్మహ త్య చేసుకున్నాడు.దీనికి సంబంధించి పాత చట్టాల పరంగా సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేసేవారు. కొత్త చట్టాలు అమల్లోకి రావడంతో బీఎన్ఎస్ఎస్ 194 సెక్షన్ కింద మావల పోలీసు స్టేషన్లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. ఇక అసహజ మరణాలకు సంబంధించి బీఎన్ఎస్ఎస్ కింద నమోదు చేస్తారు. ఇతర కేసుల్లో ఇది వరకు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యేవి. తాజాగా బీఎన్ఎస్ సెక్షన్ల కింద నమోదు షురూ అయింది.అమల్లోకి..భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్), భారతీయ సాక్ష అధినీయమ్ (బీఎస్ఏ), భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్ఎస్ఎస్) కొత్త చట్టాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించి జూలై 1నుంచి అమల్లోకి తెచ్చింది. ఇకపై జరిగే నేరాలకు సంబంధించి వీటిలోని సెక్షన్ల ఆధారంగానే కేసులు నమోదు కా నున్నాయి. కొత్త చట్టాల రాకతో భారత శిక్షా స్మృతి (ఐపీసీ), భారత సాక్షాధారాల చట్టం, భారత నేర శిక్షా స్మృతి (సీఆర్పీసీ) కనుమరుగు కానున్నాయి.అయితే జూలై 1వ తేది కంటే ముందు ఏవైనా కేసులు జరిగినట్టు రిపోర్టులు వస్తే పాత సెక్షన్లోనే కేసు నమోదు చేస్తారు. నేరడిగొండ పీఎస్ పరిధిలో సోమవారం ఓ మిస్సింగ్ కేసు పోలీసుల దృష్టికి వచ్చింది. అయితే ఆదివారం నుంచి మిస్సింగ్ ఉండడంతో అది పాత సెక్షన్లలోనే నమోదు చేశారు.కొత్త చట్టాల్లోని ప్రధాన అంశాలు..కొత్త చట్టాలపై ప్రజలకు ఇంకా పూర్తిగా అవగాహన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే కొన్ని అంశాలు పరిశీలిస్తే.. బాధితుడు ఇకపై నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లకుండానే జరిగిన సంఘటనపై ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. పోలీసు స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఎవరైనా, ఎక్కడైనా ఫిర్యాదు చేసిన పక్షంలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. హేయమైన నేరాల్లో వీడియోగ్రఫీ తప్పనిసరి చేయనున్నారు.దీంతో దర్యాప్తులో నాణ్యత పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మహిళలు, చిన్నారులపై జరిగే నేరాల్లో దర్యాప్తు నిర్ధేశిత గడువులోపు పూర్తి కావాలి. బాధిత మహిళలు, చిన్నారులకు ఉచితంగా ప్రాథమిక చికిత్స, వైద్య చికిత్స అందించాల్సి ఉంటుంది. సమన్లు ఇకపై నేరుగా వెళ్లి ఇవ్వాల్సిన పని లేదు. ఆన్లైన్లో పంపించవచ్చు. అత్యాచార కేసుల్లో బాధితురాలి వాంగ్ములాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీసులు నమోదు చేయాలి.95 శాతం పోలీసులకు శిక్షణ..కొత్త చట్టాలపై 95 శాతం పోలీసు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేసినట్లు జిల్లా పోలీసు అధికారి చెబుతున్నారు. 11 బ్యాచుల్లో 535 మందికి ఈ శిక్షణ ఇచ్చారు. సీఐడీ తెలంగాణ నుంచి కూడా వచ్చినవారు ఎస్వోపీ స్టాండింగ్ అంశాల్లో ఎలా వ్యవహరించాలనే దానిపై అవగాహన కలిగించారు. మొత్తంగా పోలీసు శాఖ నూతన చట్టాల పరంగా ముందుకు కదిలింది.ఠాణా వారీగా అవగాహనకొత్త చట్టాలకు సంబంధించి పోలీసు స్టేషన్ వారీగా ప్రజలకు అవగాహన కల్పించనున్నాం. ఇదివరకు చట్టాలు పనిష్మెంట్ లాగా ఉండేవి. కొత్త చట్టాలు న్యాయం చేకూరుస్తాయి. సిబ్బందికి శిక్షణ దాదాపుగా పూర్తయ్యింది. – గౌస్ ఆలం, ఎస్పీ -
సినీఫక్కీలో చోరీ..
ఆదిలాబాద్: మండల కేంద్రంలోని లక్ష్మీనారాయణ బంగారం దుకాణంలో గురువారం సినీఫక్కీలో చోరీ జరిగినట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ఉదయం 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు బైక్పై వచ్చి దుకాణం ఎదుట ఆపారు. అందులోంచి ఒకరు దుకాణంలోకి వెళ్లి మెడలో వేసుకునే బంగారు లాకెట్ చూపమని దుకాణం యజమాని వనితను అడిగాడు.రూ.3వేల విలువగల లాకెట్కు రూ.వెయ్యి అడ్వాన్సుగా ఇచ్చాడు. మళ్లీ వచ్చి మిగతా రూ.2వేలు ఇచ్చి లాకెట్ తీసుకెళ్తానని నమ్మబలికాడు. ఇలా యజమానితో మాట్లాడుతునే కౌంటర్లో ప్లాస్టిక్ ప్యాకెట్ కవర్లో ఉన్న రెండు తులాల బంగారు ఆభరణాలు చేతి వేళ్ల మధ్యలో పెట్టుకుని బైక్పై పరారయ్యారు.యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ కెమెరాలు పరిశీలించగా దుండగులు శివాజీ చౌక్ నుంచి నంబర్ప్లేట్లేని బైక్పై వచ్చి ఆదిలాబాద్వైపు వెళ్లినట్లు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
ఘోర రోడ్డు ప్రమాదం! ఆగి ఉన్న లారీని..
ఆదిలాబాద్: కామారెడ్డి జిల్లా కేంద్రం సమీపంలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డుపై ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, 28 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి.. ఆదిలాబాద్కు చెందిన ప్రైవేటు ట్రావెల్స్ బస్సు 34 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో హైదరాబాద్కు బయలుదేరింది.మంగళవారం తెల్లవారుజామున దాదాపు 3 గంటల ప్రాంతంలో కామారెడ్డి సమీపంలోకి రాగానే క్యాసంపల్లి శివారులో జాతీయ రహదారిపై నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఆదిలాబాద్లోని అంబేడ్కర్నగర్ కాలనీకి చెందిన అఫ్సర్ఖాన్ (25) మృతి చెందగా, మరో 28 మందికి గాయాలయ్యాయి.స్థానికుల సమాచారంతో రూరల్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ షేక్ రఫీక్తోపాటు మరో ప్రయాణికుడు మోబీన్కు తీవ్ర గాయాలుకాగా వైద్యులు నిజామాబాద్కు రిఫర్ చేశారు. గాయాలపాలైన వారంతా ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన వారే. అఫ్సర్ఖాన్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నటట్లు దేవునిపల్లి ఎస్సై రాజు తెలిపారు. -
పంట చేలల్లోకి వెళ్లేదారిని మూసేశారు
మాది బజార్హత్నూర్ మండలకేంద్రం. గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 137,138లలో గల స్థలం నుంచి చేలల్లోకి వెళ్లేందుకు బండ్ల బాట ఉంది. 50 ఏళ్లుగా ఈ మార్గం గుండానే మేము చేన్లకు వెళ్తున్నాం. అయితే ఈ నెల 21న 138 సర్వే నంబర్లోని ఇద్దరు వ్యక్తులు ఈ దారిని జేసీబీతో ధ్వంసం చేసి కాలువగా మార్చారు. దీంతో మాకు దారి లేకుండా పోయింది. వ్యవసాయ పనులు ప్రారంభమైనందున విత్తనాలు విత్తుకునేందుకు, ఎరువులు వేసేందుకు తీవ్ర ఇబ్బందులవుతున్నాయి. మాకు న్యాయం చేయాలని విన్నవించాం. – రైతులు, బజార్హత్నూర్ -
రిమాండ్ మహిళా ఖైదీ.. హైడ్రామా!
ఆదిలాబాద్: సుపారి ఇచ్చి ప్రభుత్వ ఉపాధ్యాయుడైన తన భర్త జాదవ్ గజానంద్ను భార్యనే హత్య చేయించిన సంఘటన ఇటీవల జిల్లాలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్ర ధాన నిందితురాలి గా ఉన్న మృతుని భార్య విజయలక్ష్మిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన విష యం తెలిసిందే.ఆది లాబాద్ పట్టణంలోని జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న విజయలక్ష్మి బ్లేడ్ ముక్కలు మింగినట్లుగా జైలు ఽఅధికారులతో ఆదివారం సాయంత్రం తెలిపింది. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నట్లుగా పేర్కొనడంతో జైలు అధికారులు రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు 24గంటల పాటు పర్యవేక్షణలో ఉంచారు.అవసరమైన వైద్య పరీక్షలు నిర్వహించి ఎలాంటి బ్లేడు ముక్కలు లేవని నిర్దారించారు. దీంతో జైలు సిబ్బంది ఆమెను తిరిగి జైలుకు తరలించారు. ఈ విషయమై జిల్లా జైలు సూపరింటెండెంట్ అశోక్ను సంప్రదించగా ఆమె పూర్తి ఆరోగ్యంగా ఉండడంతో తిరిగి జిల్లా జైలుకు తరలించినట్లు తెలిపారు. -
ముగ్గురి ఊపిరి తీసిన ప్రహరీ..
మంచిర్యాల: బతుకుదెరువు కోసం వలస వచ్చిన ముగ్గురు కూలీల ప్రాణాలు మట్టిలో కలిశాయి. పనులు చేస్తుండగా ఒక్కసారిగా ప్రహరీ కూలి మీద పడడంతో ఊపిరాడక అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరు గాయాలతో బయటపడ్డారు. పోలీసులు, స్థానికులు రెండు గంటలపాటు శ్రమించి జేసీబీ, డ్రిల్లర్ సాయంతో మృతదేహాలను వెలికితీశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకున్న ఈ ఘటన మూడు కుటుంబాల్లో విషాదం మిగిల్చింది.మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తా సమీపంలో నందిని ఆస్పత్రి వైద్యురాలికి చెందిన నూతన భవన నిర్మాణ పనులకు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన ఏనంక హన్మంత్(35), బాబాపూర్కు చెందిన ఆత్రం శంకర్(40), చింతలమానెపల్లికి చెందిన గోలెం పోషం(50), కౌటాల మండలం గుడ్లబోరి గ్రామానికి చెందిన మైదం రాములు, మరో ఇద్దరు కూలీలు వెళ్లారు.పిల్లర్ల మధ్యలో మట్టి, బండలు నింపుతుండగా సెల్లార్కు పక్కనే ఇతరులకు చెందిన శిథిలావస్థలో ఉన్న ప్రహరీ కూలి పోషం, శంకర్, హన్మంత్లపై పడడంతో దాని కింద నలిగిపోయి ఊపిరాడక అక్కడికక్కడే మృతిచెందారు. రాములును మరో ఇద్దరు కూలీలు బయటకు లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మృతదేహాలపై పూర్తిగా మట్టి కూరుకుపోవడంతో స్థానిక సీఐ బన్సిలాల్, సిబ్బందితోపాటు జేసీబీ సహాయంతో రెండు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు.ఘటన స్థలంలో మృతుల కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. ఘటన స్థలాన్ని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్, రామగుండం పోలీసు కమిషనర్ శ్రీనివాసులు పరిశీలించి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఘటన స్థలాన్ని మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్, ఆర్డీవో రాములు, ఏసీపీ ప్రకాష్ పరిశీలించారు. భవన నిర్మాణ అనుమతి రద్దు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్ను ఆదేశించారు.న్యాయం చేయాలని కార్మిక సంఘాల డిమాండ్..కార్మికులకు రక్షణ కరువైందని, మృతులు పోషం, హన్మంతు, శంకర్ కుటుంబాలకు న్యాయం చేయాలని కార్మిక సంఘాల నాయకులు డిమండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. సెల్లార్ నిర్మాణానికి అనుమతులు లేవని ఆరోపించారు. భవనం యజ మానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, డిమాండ్ చేశారు.త్వరలో బిడ్డ పెళ్లి.. అంతలోనే మృతి..చింతలమానెపల్లి మండలం రుద్రాపూర్ గ్రామానికి చెందిన ఏనంక హన్మంతు స్వగ్రామంలో కుమ్మరి పని చేసేవాడు. కులవృత్తిలో ఉపాధి లభించక కుటుంబంతో సహా మంచిర్యాల పట్టణంలో భార్య లక్ష్మి, కుమారుడు రాజేష్తో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తున్నాడు. పని చేస్తేనే వీరి పొట్ట గడిచే పరిస్థితి. స్వగ్రామం రుద్రాపూర్లో వృద్ధులైన తల్లిదండ్రులు మారయ్య, బాయక్క ఉన్నారు. ఇటీవల కూతురు శివానికి పెళ్లి కుదిరింది. త్వరలో పెళ్లి చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. ఇంతలోనే కుటుంబ పెద్ద హన్మంతు మృతితో విషాదం నెలకొంది.కూలీకి వెళ్తేనే కడుపు నిండేది..చింతలమానెపల్లికి చెందిన గోలెం పోషం కుటుంబానిది రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. బాబాసాగర్ గ్రామానికి చెందిన పోషం అక్కడి నుంచి చింతలమానెపల్లికి వలస వచ్చాడు. ఆర్థికంగా నష్టాలు రావడంతో అప్పుల పాలయ్యాడు. భార్య గంగతో కలిసి కూలీ పనులు చేసేందుకు మంచిర్యాలకు వచ్చాడు. కుమారుడు శేఖర్ హైదరాబాద్లో పని చేస్తూ చదువుకుంటున్నాడు. బుధవారం ఎల్లారంలో మొక్కులు తీర్చుకున్న పోషం భార్య గంగ, కుమారుడు శేఖర్ ఇంటికి వచ్చారు. పోషం మంచిర్యాలకు వెళ్లి గురువారం సాయంత్రం మృత్యువాత పడ్డాడు.భూమి లేక వలస వచ్చి..బాబాపూర్ గ్రామానికి చెందిన ఆత్రం శంకర్కు సోదరులు మల్లేష్, దుర్గాజీ ఉన్నారు. మల్లేష్ ఉపాధి కోసం మరో గ్రామానికి వెళ్లగా శంకర్, దుర్గాజీ గ్రామంలోనే నివాసం ఉండేవారు. జీవనం సాగించడానికి వీరి వద్ద ఉన్న భూమి సరిపోకపోవడంతో త మ్ముడు దుర్గాజీకి భూమి అప్పగించి భార్యాపిల్లలతో శంకర్ మందమర్రి మండల కేంద్రంలో ఉంటున్నాడు. మంచిర్యాలలో కూలీ పనికి వచ్చి వెళ్తుండేవాడు. భార్య ధనలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు సిరివెన్నెల, హర్షితరాణిలతో నివాసం ఉంటున్నాడు. కూలీ డబ్బులతో పిల్లలను చదివిస్తున్నాడు. -
డ్రైవింగ్ స్కూళ్లలోనూ లైసెన్స్..
ఆదిలాబాద్: రహదారి భద్రత చట్టం అమలులో భాగంగా కేంద్ర ప్రభుత్వం మరో నూతన సంస్కరణకు శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లను అందుబాటులోకి తీసుకు రానుంది. ఇకపై రవాణా శాఖ కార్యాలయానికి వెళ్లనవసరం లేకుండా ఈ స్కూళ్లలో డ్రైవింగ్ శిక్షణ పొందిన వారికి నేరుగా డ్రైవింగ్ లైసెన్స్ జారీ చేస్తారు. మోటారు వాహన చట్టం మార్పులో భాగంగా ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియ అంతా కూడా ప్రైవేటు భాగస్వామ్యంలో సాగనుంది.ఈ చట్టం జూన్ ఒకటి నుంచి అమలులోకి రానుంది. కాగా, జిల్లాలో ఇప్పటివరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ లేదు సరికదా ఇప్పటికిప్పుడు డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కూడా కష్టమే. రవాణా శాఖ చట్టం నిబంధన మేరకు అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలంటే పలు నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇప్పుడున్న వారు ఏర్పాటుకు సముఖంగా లేరు. డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు సంస్థలు, వ్యక్తులు ముందుకు వస్తే అనుమతి ఇస్తామని రవాణా శాఖ అధికారులు పేర్కొంటున్నారు.పారదర్శకతతో డ్రైవింగ్ ఉంటేనే..అక్రిడేటెడ్ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే డ్రైవింగ్ శిక్షణ నాణ్యమైనదిగా, సమర్థవంతమైనదిగా, పారదర్శకతతో ఉంటే లైసెన్స్లు ఇవ్వాలనేది రవాణా శాఖ ముఖ్యోద్దేశం. ఈ డ్రైవింగ్ స్కూళ్లు ఇచ్చే 5–ఏ సర్టిఫికేట్ల ఆధారంగా నేరుగా లైసెన్స్ జారీ చేస్తారు. డ్రైవింగ్ లైసెన్స్ల జారీలో రవాణా శాఖ అధికారులను పరిమితం చేస్తూ తీసుకొస్తున్న అక్రిడేటెడ్ స్కూళ్ల ఏర్పాటు ప్రస్తుతం కష్టతరంగానే ఉండబోనుంది. ప్రస్తుతం ఉన్న సాధారణ డ్రైవింగ్ స్కూళ్లు కూడా కఠిన నిబంధనలతో స్కూళ్ల ఏర్పాటు కష్టమే అంటున్నారు.మూడెకరాలు కావాల్సిందే..డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటుకు కనీసం మూడెకరాల స్థలం కావాలి. రెండెకరాల్లో డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్, ప్రాథమిక శిక్షణ కోసం సిమ్యులేటర్లు ఏర్పాటు చేయాలి. మరో ఎకరంలో శిక్షణ తరగతుల కోసం భవనం, తరగతి గదులు, ఇంటర్నెట్ సదుపాయం, ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ, టీచింగ్ పరికరాలు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలి. ఇందుకు పెద్దమొత్తంలో పెట్టుబడి అవసరం. భూముల విలువ రూ.లక్షలు, రూ.కోట్లలో ఉండగా మూడెకరాల్లో డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు కష్టమే అంటున్నారు. అయినా ముందుకు వచ్చి ఏర్పాటు చేస్తే ఆదాయం ఆ స్థాయిలో ఉంటుందా అనేది అనుమానమేనని అంటున్నారు. -
బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల..
మంచిర్యాల: ప్రతిష్టాత్మక బాసర ట్రిపుల్ఐటీలో నూతన విద్యాసంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి వర్సిటీ అధికారులు సోమవారం ఆన్లైన్లో నోటిఫికేషన్ విడుదల చేశారు. జూన్ 1 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. www.rgukt.ac.in వెబ్సైట్లో, ఈమెయిల్ ద్వారా admissions@rgukt.ac.in సందర్శించాలని సూచించారు.ఆరేళ్ల సమీకృత(ఇంటిగ్రేటెడ్) ఇంజనీరింగ్ కోర్సు కోసం ఆసక్తి ఉన్న విద్యార్థులు టీజీ ఆన్లైన్, మీసేవ, యూనివర్సిటీ వెబ్సైట్లో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చని ఇన్చార్జి వీసీ ప్రొఫెసర్ వెంకటరమణ తెలిపారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలు ముగిసి ఫలితాలు కూడా వచ్చేశాయి. ఉత్తమ జీపీఏ సాధించిన విద్యార్థులంతా కోర్సుల ఎంపికపై కసరత్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఏ కాలేజీలో చదివించాలో.. ఏ కోర్సులు చేయించాలో.. అనే విషయంపై విద్యావేత్తల సలహాలు తీసుకుంటున్నారు.ప్రస్తుతం ఎక్కడ చూసినా విద్యార్థుల చదువులపైనే ప్రత్యేక చర్చ కొనసాగుతోంది. తెలంగాణలోనే ఏకై క విద్యాలయ ప్రాంగణాన్ని కలిగి ఉన్న బాసర ట్రిపుల్ఐటీ నోటిఫికేషన్ విడుదల కావడంతో ఇక్కడ దరఖాస్తు చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. చాలామంది తల్లిదండ్రులూ తమ పిల్లలను ఇక్కడే చదివించాలనుకుంటున్నారు.గ్రామీణ విద్యార్థులకు వరం..గ్రామీణ విద్యార్థులకు అత్యుత్తమ సాంకేతిక విద్య ను అందించే బాసర ట్రిపుల్ఐటీలో ప్రవేశాలకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు పోటీపడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పల్లె విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ సువర్ణ అవకాశంగా మారింది. ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుకు సంబంధించి బాసర ట్రిపుల్ఐటీలో ఏటా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించి అందులో అర్హత ఉన్నవారిని ఎంపికచేసి సీట్లను కేటాయిస్తుంది. మూడేళ్లక్రితం ప్రవేశాలకు సంబంధించి మొదటిసారిగా పాలిసెట్ అర్హతను జోడించి సీట్లను కేటాయించారు. అప్పట్లో కోవిడ్ నేపథ్యంలో పాఠశాలలు మూసి ఉండడంతో పదో తరగతి విద్యార్థులను పరీక్షలు లేకుండానే ఉత్తీర్ణులు చేశారు. అలాంటి పరిస్థితుల్లో విద్యార్థుల సీట్ల కేటాయింపు ప్రక్రియలో పాలిసెట్ అర్హతను జోడించి సీట్లు కేటాయించారు. ఈ యేడు పాత విధానంలో సీట్లు భర్తీ చేయనున్నారు.వేల సంఖ్యలో దరఖాస్తులు..బాసర ట్రిబుల్ ఐటీలో దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతోంది. 2020–21లో 32వేల మంది విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోగా 2021–22లో 20,178 మంది, 2022–23లో 31,432 మంది, 2023–24లో 32,635 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.సమీకృత విద్యావిధానం..ట్రిపుల్ఐటీలో ఆరేళ్లపాటు ఇంటర్తో పాటు సమీకృత ఇంజనీరింగ్ విద్య కొనసాగుతోంది. మొదటి రెండేళ్లు ఇంటర్ తత్సమాన పీయూసీ కోర్సు నేర్పిస్తారు. అనంతరం అందులో మెరిట్ ఆధారంగా మరో నాలుగేళ్ల ఇంజనీరింగ్ సీట్లను ఎంపిక చేసుకోవచ్చు. పీయూసీ విద్య అనంతరం మెరుగైన అవకాశాలు వస్తే విద్యార్థులు ఇక్కడి నుంచి బయటకు వెళ్లి చదువుకునే అవకాశం కూడా ఉంది. నాలుగేళ్ల బీటెక్లో సివిల్, కెమికల్, కంప్యూటర్, ఎలక్ట్రానిక్స్, ఐటీ, ఈసీఈ, ఎంఎంఈ కోర్సులు అందిస్తున్నారు.మొదటి రెండేళ్ల పీయూసీలో సాధించిన మార్కుల ఆధారంగానే బీటెక్లో కోర్సులు కేటాయిస్తారు. ఇక్కడ ఎంపికై న విద్యార్థులకు బాసర ట్రిపుల్ఐటీ అధికారులు అన్ని వసతులను సమకూరుస్తారు. ల్యాప్టాప్, అందరికీ ఒకేరకమైన దుస్తులు, షూస్, స్పోర్ట్స్ డ్రెస్ అందిస్తారు. హాస్టల్, భోజన వసతి యూనివర్సిటీయే కల్పిస్తుంది. చదివే విద్యార్థుల కోసం శారీరక, మానసిక వికాసానికి ఆటలు, వ్యాయామం, సాంస్కృతిక రంగాల్లో రాణించేందుకు సైతం తరగతులు నిర్వహిస్తున్నారు. బాసర ట్రిపుల్ఐటీలో ప్రత్యేక వైద్యశాల, అధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ లైబ్రరీ అందుబాటులో ఉన్నాయి.ఏటా భారీగా దరఖాస్తులు..బాసర ట్రిపుల్ఐటీలో చదివేందుకు రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులు ఆసక్తి కనబరుస్తారు. నోటిఫికేషన్ ప్రక్రియ వెలువడడంతోనే ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరిస్తాం. ఇక్కడ సీటు దక్కించుకునేందుకు ఏటా 30 వేలకు పైగానే విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఇక్కడ చదివేందుకు పోటీపడుతున్నారు. – వెంకటరమణ, ఇన్చార్జి వీసీ -
No Headline
ఇంటెలిజెన్స్ నివేదికలు.. స్టేట్, సెంట్రల్ ఇంటెలిజెన్స్ శాఖలు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పరిస్థితులపై రిపోర్టు తయారు చేసినట్లు తెలుస్తోంది. ఈ రిపోర్టులు ప్రస్తుతం సంచలనం కలిగిస్తున్నాయన్న ప్రచారం సాగుతోంది. ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్లు ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్పై ఉన్న పరిస్థితిపై నివేదిక ఇవ్వడంతో వాటి బలాబలాలు, బలహీనతలపై తీవ్ర చర్చ సాగుతోంది. ప్రధానంగా ముఖ్యనేతలు ఈ సర్వేల రిపోర్టులతో ఉరుకులు పరుగులు పెడుతున్నట్లు తెలుస్తోంది. క్షేత్రస్థాయిలో లోపాలను సరిదిద్దే విషయంలో చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు. అంతలోపే వాటిని సరిదిద్దుకోగలుగుతామా.. లేదా అన్న మీమాంస వారిని వెంటాడుతుంది. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ తేదీకి ముందు ఈ అంశాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజల ఆదరణ ఎంత శాతం ఉంది.. తమకెంత ఉంది.. తమ అభ్యర్థిని, ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులను జనం ఏ మేరకు ఆదరిస్తున్నారు.. సెగ్మెంట్ పరిధి లోని ఏయే నియోజకవర్గాల్లో బలంగా ఉన్నాం.. ప్రత్యర్థులు ఎక్కడ గట్టిగా ఉన్నారు.. ఈ పరిస్థితుల్లో ఎలా ముందుకెళ్లాలి.. లోటుపాట్లను ఎలా సరిదిద్దుకోవాలని ఆయా పార్టీల నుంచి సర్వే చేస్తు న్న కమిటీలు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా రిపోర్టు అందించారు. ఆదిలాబాద్ పార్లమెంట్కు సంబంధించి పార్టీల పరంగా ఆయా కమిటీలు ఇప్పటికే అధిష్టానాలకు నివేదికలు ఇచ్చా యి. ప్రచారానికి గడువు సమీపిస్తున్న తరుణంలో మిగిలిన రోజుల్లో ఆ లోపాలు అధిగమించాలని అక్కడి నుంచి ఆదేశాలు అందాయి. దీంతో అభ్యర్థులతో పాటు పార్టీ ఇన్చార్జీలు, ముఖ్య నేతలు ఇందులో తలమునకలయ్యారు. ప్రస్తుతం సర్వేల అలజడి కొనసాగుతుంది. పార్టీ కమిటీల రిపోర్ట్.. బీజేపీ పరంగా రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి సునిల్ బన్సల్ కమిటీ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిస్థితిపై కూడా ఇప్పటికీ ఒకట్రెండు సార్లు నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాని ఆధారంగా లోటుపాట్లు సరిదిద్దుకునే చర్యలు ఇప్పటికే చేపడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ ఆధ్వర్యంలో సునిల్ కనుగోలు కమిటీ నివేదికను తయారు చేసి ఇచ్చారు. బీఆర్ఎస్ నుంచి సివిక్స్ పోల్స్ అనాలసిస్ (సీ–ప్యాక్)కమిటీ రిపోర్టు ఇచ్చింది. ప్రధానంగా అందులో నియోజకవర్గం వారీగా పరిస్థితులను వివరించినట్లు సమాచారం. ఏయే నియోజకవర్గాల్లో పార్టీ, అభ్యర్థి బలంగా ఉన్నారు.. ఎక్కడ పార్టీ, అభ్యర్థి బలహీనంగా ఉన్నారు.. అక్క డ నష్ట నివారణకు చర్యలు చేపట్టాలి.. ఇందుకోసం ఆ నియోజకవర్గాల్లో ప్రత్యేక సమావేశాల నిర్వహణ, ఇన్చార్జీలు పూర్తిస్థాయిలో దృష్టి సారించి ఆ లోటుపాట్లను అధిగమించేలా ఆయా కమిటీలు ఇచ్చిన నివేదికల ఆధారంగా పార్టీల్లో చర్యలు చేపడుతున్నారు. -
ఆ ముగ్గురి చేరిక నిలిపివేత!
ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జిల్లా కాంగ్రెస్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆరేళ్లపాటు పార్టీ బహిష్కరణకు గురైన జిల్లా కేంద్రానికి చెందిన పీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, డీసీసీ మాజీ అధ్యక్షుడు సాజీద్ఖాన్, ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అల్లూరి సంజీవ్రెడ్డిల వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది.ఇటీవల జగ్గారెడ్డి సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్న ఈ ముగ్గురు ప్రభుత్వ సలహాదారు వేంనరేందర్రెడ్డిని కూడా కలిశారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించి పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఈ ముగ్గురు నాయకులను తిరిగి పార్టీలో చేర్చుకోవద్దంటూ కంది శ్రీనివాసరెడ్డి మద్దతుదారులు ఆందోళన చేపట్టారు.వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేస్తూ ముగ్గురు నాయకుల ఫొటోలతో కూడిన ఫ్లెక్సీ దహనం చేయడంతో పాటు నోటికి నల్లగుడ్డలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితులను గమనించిన పార్టీ నాయకత్వం వారి చేరికలను నిలిపివేస్తున్నట్టుగా ప్రకటించింది. దీంతో కంది వర్గీయుల పోరాటం ఫలించినట్లైందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.టీపీసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షి ఆదేశాల మేరకు ఆ నాయకుల చేరికలను నిలిపివేస్తున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీమెంబర్ జయప్రకాష్ రెడ్డి(జగ్గారెడ్డి) శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా నాయకత్వంతో చర్చించి త్వరలోనే తగు నిర్ణయం తీసుకుంటామని అప్పటి వరకు వారి చేరిక నిలిపివేస్తున్నట్లుగా అందులో పేర్కొన్నారు.ఇవి చదవండి: ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు.. -
లెక్క లేదంటే.. వేటే..!
సాక్షి, మంచిర్యాల: ఆదిలాబాద్, పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది. ఆదిలాబాద్లో 12 మంది, పెద్దపల్లిలో 42మంది బరిలో ఉన్నారు. ఎ న్నికల్లో అభ్యర్థుల గెలుపోటములను ప్రచారమూ ప్రభావితం చేస్తుంది. ఆ ప్రచార వ్యయం కూడా పె రుగుతూ వస్తోంది. ర్యాలీలు, సభలు, సమావేశాలు, సభలకు జనాలను తరలించే వాహనాలు, భో జనాలు, టెంట్లు ఇలా ప్రతీదానికి అభ్యర్థులు ఖ ర్చు చేయాల్సి వస్తుంది. వీటన్నింటికి కూడా ఎన్నిక ల సంఘం స్థానికంగా ధరలను అనుసరించి చెల్లింపులను నిర్దేశించింది.ఆ మేరకు వ్యయ వివరాలను అభ్యర్థులు నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాంకులో ఖాతా తెరిచి దాని ద్వారానే చెల్లింపులు చేయా లి. అభ్యర్థులు ప్రచార వ్యయానికి సంబంధించి ప్ర తీ ఖర్చు వివరాలను ఎన్నికలు పూర్తయిన తర్వాత నెల రోజుల్లోగా ఎన్నికల సంఘానికి సమర్పించాలి. లేనిపక్షంలో ఆ తర్వాత జరిగే ఎన్ని కల్లో పోటీకి అనర్హులుగా ప్రకటిస్తుంది. అలా వేటు పడిన వారిలో రాష్ట్ర వ్యాప్తంగా 107మంది ఉన్నారు.వ్యయ పరిశీలకులు వీరే..ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా మహారాష్ట్రకు చెందిన ఐఆర్ఎస్ అ« దికారి జాదావార్ వివేకానంద, పెద్దపల్లి నియోజకవర్గానికి సమీర్ నైరంతర్య వ్యవహరిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో వీరు పర్యటించి రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ప్రచార వ్యయాలను పరిశీలిస్తారు.పెంపు ఇలా..లోక్సభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచార వ్యయ పరి మితి 1952లో రూ.25వేలుగా ఉండేది. 1971లో రూ.35వేలు ఉండగా.. 1980లో రూ.లక్షకు పెరిగింది. 1984నుంచి 1991వరకు రూ.1.50లక్షలు, 199 6లో రూ.4.50లక్షలకు చేరింది. 1998లో రూ.15లక్షలు, 2004లో రూ.25లక్షలకు పెరుగుతూ వచ్చింది. 2014లో ఎన్నికల ప్రచార వ్యయ పరిమితిపై ప్ర ధాన సవరణ జరిగి రూ.70లక్షలకు పెరిగింది. దీని పై 2020లో 10శాతం పెరిగింది. ఎన్నికల సంఘం ఏర్పాటు చేసిన కమిటీ సూచన మేరకు 2022లో ప్రచార వ్యయ పరిమితిని రూ.95లక్షలకు పెంచా రు. లోక్సభ స్థానాల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు గరి ష్టంగా రూ.95లక్షల వరకు ప్రచారానికి ఖర్చు చేసే అవకాశం ఉంది.107మంది పోటీకి అనర్హులు..రాష్ట్రంలోని 107మందిని ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 2019 ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ప్రచార వ్య యానికి సంబంధించిన వివరాలు సమర్పించకపోవడంతో ప్రజాప్రాతినిధ్య చట్టం–1951 10ఏ ప్రకారం అనర్హత వేటు వేసింది. వీరిలో అత్యధి కంగా నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన 68 మంది ఉ న్నారు. అప్పట్లో పసుపు రైతులు భారీ సంఖ్యలో నామినేషన్ వేసిన వారే కావడం గమనార్హం.వచ్చే జూన్ 23 వరకు వీరు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం లేదు. నల్గొండ లోక్సభ నియోజకవర్గంలోని 2, మహబూబాబాద్, మెదక్లో ఒక్కొక్కరు ఉండగా.. వీరిపై జూన్ 10వరకు వేటు కొనసాగుతుంది. జుక్కల్, రామగుండం, కరీంనగర్, గజ్వేల్, మల్కాజ్గిరి, నాగార్జునసాగర్, ఆలేరు, జనగాం, మహబూబాబాద్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ఒక్కొక్కరు, దేవరకొండ 5, మిర్యాలగూడ, పాలకుర్తి ముగ్గురు చొప్పున, నల్గొండ, ములుగు 4 చొప్పున, నకిరేకల్ 2, మల్కాజ్గిరి ఒకరిపై జూలై 14వరకు వేటు వేసింది. పాలకుర్తిలో ముగ్గురిపై ఆగస్టు 25వరకు, డోర్నకల్ ఒకరిపై సెప్టెంబర్ 21వరకు అనర్హత వేటు పడింది.ఇవి చదవండి: దేవుడి పేరుతో బీజేపీ రాజకీయం.. : మంత్రి సీతక్క -
దేవుడి పేరుతో.. బీజేపీ రాజకీయం! : మంత్రి సీతక్క
ఆదిలాబాద్: దేవుడి పేరు చెప్పి బీజేపీ రాజకీయం చేస్తుందని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా మండలకేంద్రంలో సోమవారం నిర్వహించిన రోడ్షోలో ఆమె మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లను రద్దు చేసే బీజేపీని ఈ ఎన్నికల్లో ఓటుతో రద్దు చేయాలన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి బీజేపీ రాజకీయంగా పబ్బం గడుపుకుంటోందని విమర్శించారు. కార్యక్రమంలో ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ రాందాస్, మండల అధ్యక్షుడు ఫైజుల్లాఖాన్, బ్లాక్ అధ్యక్షుడు గుండవార్ సంజయ్, నాయకులు రూపేశ్రెడ్డి, వామన్, శంకర్, చంద్రకాంత్, తదితరులు పాల్గొన్నారు.అభివృద్ధి అడిగితే అక్షింతలు పంపుతున్నారు..జైనథ్: అభివృద్ధి గురించి అడిగితే ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం అక్షింతలు పంపిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మంత్రి సీతక్క విమర్శించారు. మండల కేంద్రంలో ఎన్ని కల ప్రచారంలో ఆమె మాట్లాడారు. కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. అనంతరం నాయకులతో కలిసి సరదాగా డప్పు కొట్టి కార్యకర్తల్లో జోష్ పెంచారు. అంతకు ముందు మంత్రి లక్ష్మీనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించి పూజలు నిర్వహించారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజా రెడ్డి, జెడ్పీటీసీ అరుంధతి వెంకట్ రెడ్డి, గడ్డం జగదీశ్రెడ్డి, తదితరులున్నారు.రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్..తాంసి: రైతు రుణమాఫీకి కేరాఫ్ కాంగ్రెస్ పార్టీయేనని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు మద్దతుగా భీంపూర్ మండలంలోని అర్లి(టి),తాంసి మండలంలోని కప్పర్ల గ్రామాల్లో రోడ్షో చేపట్టారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి ఆహ్వానించారు. కార్యక్రమంలో బోథ్ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్, మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, తలమడుగు జెడ్పీటీసీ గణేశ్రెడ్డి, నాయకులు నరేశ్ జాదవ్, తదితరులు పాల్గొన్నారు.రాహుల్గాంధీని ప్రధానిగా చూడడమే లక్ష్యం..గుడిహత్నూర్: రాహుల్గాంధీని దేశ ప్రధానిగా చూడడమే మన లక్ష్యమని, కార్యకర్తలు ఆ దిశగా కృషి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి సుగుణతో కలిసి మండల కేంద్రంలోని మాజీ ఏఎంసీ చైర్మన్ ఆడే శీల ఇంటికి చేరుకున్నారు. పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఆడే గజేందర్ స్థానిక నాయకులను మంత్రికి పరిచయం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. విభేదాలు పక్కన పెట్టి సుగుణ గెలుపు కోసం సమష్టిగా కృషి చేయాలన్నారు. అనంతరం స్థానిక యువకులు మంత్రి సమక్షంలో పార్టీలో చేరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కరుణాకర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మాధవ్ మస్కే తదితరులు పాల్గొన్నారు.ఆడబిడ్డను పార్లమెంట్కు పంపుదాం..బోథ్: ఈ ప్రాంత ఆడబిడ్డ, కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపుదామని మంత్రి సీతక్క అన్నారు. సోమవారం రాత్రి బోథ్ మండలంలోని ధన్నూర్ బి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సుగుణ విజయం దాదాపు ఖాయమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. జొన్న పంట కొనుగోళ్లను ఎకరాకు 8 క్వింటాళ్ల నుంచి మరింత పెంచుతామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పసుల చంటి, ఇంద్రారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఇవి చదవండి: ప్రజలు కేసీఆర్నే కోరుకుంటున్నారు.. -
బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..!
బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రాయి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. ఇవి చదవండి: సీఎం హామీల జల్లు! -
సీఎం హామీల జల్లు!
ఆదిలాబాద్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణానికి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ æరాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. పలువురి చేరిక.. బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు.. సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. ఇవి చదవండి: ఒక్క రుణమాఫీపైనే ఒట్టా.. : ఏలేటి మహేశ్వర్రెడ్డి -
ఇమ్యూనైజేషన్ తీరుపై కేంద్ర బృందం పరిశీలన
ఆదిలాబాద్టౌన్: జిల్లాలో ఇమ్యూనైజేషన్ తీరుపై కేంద్ర, రాష్ట్ర బృందం సభ్యులు పరిశీలన జరిపారు. జిల్లా కేంద్రంలోని డీఎంహెచ్వోతో సోమవారం సమావేశం అయ్యారు. అనంతరం డీఐఈవో, జైనథ్ పీహెచ్సీని పరిశీలించారు. జిల్లాలో టీకాల అమలు తీరుపై ఆరా తీశారు. టీకాలను సక్రమంగా వేస్తున్నారా.. లేదా, కొత్త వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది, ఫలితాలు ఎలా ఉన్నాయి, ఎంత మందికి వ్యాక్సిన్ ఇచ్చారనే అంశాలు అడిగి తెలుసుకున్నారు. పీసీవీ, రోటోవైరస్, ఐపీవీ, తదితర వ్యాక్సిన్ల అమలు తీరుపై వివరాలు సేకరించారు. బృందంలో రీజినల్ టెక్నికల్ మేనేజర్ డాక్టర్ జయంత మజుందర్, రాష్ట్ర టెక్నికల్ మేనేజర్ శ్యామ్కుమార్, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ వైసీ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. -
లెనిన్ స్ఫూర్తితో పోరాడుదాం
ఎదులాపురం: కామ్రేడ్ లెనిన్ స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసం పోరాడుదా మని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యవర్గ సభ్యుడు వెంకటనారాయణ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కా ర్యాలయంలో సోమవారం కామ్రేడ్ లెనిన్ జయంతి, పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘ నంగా నిర్వహించారు. ముందుగా లెనిన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ.. మోదీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారన్నారు. కార్మిక, కర్షకులు కళ్లు తెరిచి ఐక్యంగా శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా పో రాడి, సమసమాజ స్థాపన దిశగా ముందు కు సాగాలన్నారు. కార్యక్రమంలో పీవో డబ్ల్యూ జిల్లా కన్వీనర్ దుర్గం కళావతి, సు భాష్, వామన్, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు హరీశ్ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షల్లో ఫెయిలైతే మనోధైర్యం కోల్పోవద్దు●
ఆదిలాబాద్టౌన్: విద్యార్థులు పరీక్షల్లో ఫెయిలైతే మనోఽధైర్యం కోల్పోయి ఎలాంటి అఘయిత్యాలకు పాల్పడకుండా ధైర్య ంగా ఉండాలని జిల్లా ఎన్సీడీ ప్రాజెక్ట్ అధి కారి ఎం.శ్రీధర్ అన్నారు. ఇంటర్మీడియెట్ ఫలితాలు మరో రెండు, మూడు రోజుల్లో వెలువడనున్న నేపథ్యంలో సోమవారం ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. కొన్ని సందర్భాల్లో విద్యార్థులు ఆశించిన మార్కులు రాకపోవచ్చని, దాన్ని చాలెంజ్గా తీసుకొని మళ్లీ పరీక్ష రాసి ఉత్తీర్ణులు కావాలే తప్ప నిరాశ చెంది ఆత్మహత్యకు యత్నించవద్దని పేర్కొన్నారు. ఒకసారి పరీక్ష తప్పినంత మాత్రన బాధపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఎంతోమంది ఇంటర్లో ఫెయిల్ అయిన వారు మళ్లీ సప్లిమెంటరీలో పాస్ అయి వైద్యులుగా, ఇంజినీర్లుగా,ఉన్నతాధికారులుగా అయ్యారని గుర్తు చేశారు. -
సెలవుల్లో ఇంటికి వెళ్తూ అనంతలోకాలకు
● రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతినేరడిగొండ: తమ కుమారుడు విద్యను అభ్యసించి ఉన్నతస్థితికి చేరాలనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు తమకు దూరంగా వసతిగృహంలో ఉంచి చదివిస్తున్నారు. ఇన్ని రోజుల పాటు పుస్తకాలతో కుస్తీ పడ్డ ఆ విద్యార్థి సెలవులు రావడంతో సంతోషపడ్డాడు. తన తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా జ రిగిన రోడ్డు ప్రమాదంలో అనంతలోకాలకు చేరుకున్నాడు. వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలం పంచగుడి గ్రామానికి చెందిన సంజయ్ (12) ఇచ్చోడలోని సాంఘిక సంక్షేమ ఎస్సీ వసతిగృహంలో ఆరోతరగతి చదువుతున్నాడు. సోమవారం నుంచి సెలవులు ప్రకటించడంతో తండ్రి బాబుతో కలిసి బైక్పై ఇంటికి బయల్దేరాడు. నేరడిగొండ మండలంలోని లఖంపూర్ జాతీయ రహదారి వద్ద గుర్తు తెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టడంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స నిమిత్తం 108లో నిర్మల్ ఏరియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనలో విద్యార్థి తండ్రికి సైతం స్వల్పగాయాలయ్యాయి. -
బీజేపీ ప్రచార రథాలు ప్రారంభం
ఆదిలాబాద్రూరల్: బీజేపీ ఆదిలాబాద్ పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని సోమవారం ప్రారంభించారు. మావల మండల పరిధి దుర్గానగర్లో గల దుర్గాదే వి ఆలయంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్, పార్టీ ఎంపీ అభ్యర్థి నగేశ్ ప్రచార రథాలకు పూజలు నిర్వహించి వాహనాలను ప్రారంభించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బ్రహ్మానంద్, మాజీ మంత్రి అమర్సింగ్ తిలావత్, పార్లమెంట్ కోఇన్చార్జి అశోక్ ముస్తాపురే, పార్లమెంట్ కోకన్వీనర్ మయూ ర్ చంద్ర, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రచార రథాలకు పూజలు చేస్తున్న ఎమ్మెల్యే శంకర్, ఎంపీ అభ్యర్థి నగేశ్ -
● ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ప్రత్యేక చర్యలు ● ఆదిలాబాద్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ● జనజాతర సభ సక్సెస్.. ‘హస్తం’ శ్రేణుల్లో జోష్
కైలాస్నగర్: సీఎం రేవంత్రెడ్డి హామీల జల్లు కురి పించారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డైట్ కళాశాల మైదానంలో సోమవారం నిర్వహించిన తెలంగాణ జన జాతర బహిరంగసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సభ ప్రాంగణాని కి చేరుకున్న ఆయన ప్రజలకు అభివాదం చేసిన అనంతరం ప్రసంగించారు. ఉమ్మడి జిల్లా అభివృద్ధికి సంబంధించి అనేక హామీలు ప్రకటించారు. బోథ్ నియోజకవర్గ పరిధిలోని దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కుప్టి ప్రాజెక్ట్ను నిర్మించి రైతులకు సా గునీటిని అందిస్తామన్నారు. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం విస్మరించిన తూర్పు ప్రాంతంలోని తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ ను నిర్మించడంతో పాటు దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట నామకరణం చేస్తామన్నారు. ముంపు నిర్వాసితుల అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నామని తెలిపారు. అలాగే కేసీఆర్ నిర్లక్ష్యం చేసిన కడెం ప్రాజెక్ట్కు మరమ్మతులు చేసి దానిపై ఆధారపడ్డ ప్రజలకు సాగు, తాగునీటిని అందిస్తామన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మూతపడ్డ సీసీఐ ఫ్యాక్టరీని ప్రైవేట్ వ్యాపారులతో మాట్లా డి తెరిపిస్తామని తద్వారా ఈ ప్రాంత యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. అలాగే జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని భరోసానివ్వడం ఈ ప్రాంత వాసుల్లో ముఖ్యంగా కాంగ్రెస్ శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతుంది. సభ సక్సెస్తో పార్టీ నేతల్లో హుషారు కనిపించింది. రెండు గంటలు ఆలస్యంగా ... ప్రత్యేక హెలిక్యాప్టర్లో జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియానికి చేరుకున్న సీఎం అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభ వేదిక వద్దకు చేరుకున్నా రు. షెడ్యూల్ ప్రకారం ఉదయం 11గంటలకు హాజ రుకావాల్సి ఉండగా మధ్యాహ్నం 12.57 గంటలకు వచ్చారు. రెండు గంటలు ఆలస్యంగా హాజరైనప్పటికీ పార్టీశ్రేణులు, ప్రజలు సీఎం రాక కోసం ఓపిగ్గా నిరీక్షించారు. సభ వేదిక వద్దకు చేరుకుని ప్రజలకు అభివాదం చేశారు. ఈ సమయంలో పార్టీ శ్రేణులు కేరింతలు కొడుతూ ఉత్సాహాన్ని చాటారు. సాంస్కృతిక కళాకారుల బృందం ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, మాజీ ఎమ్మెల్యేలు రేఖానాయక్, రాథోడ్ బాపూరావు, రామారావు పటేల్, కోనేరు కోనప్ప, జెడ్పీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, టీపీసీసీ కార్యదర్శి సత్తు మల్లేశ్, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జీలు కంది శ్రీనివాసరెడ్డి, ఆడె గజేందర్, శ్యాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక పోలీస్ బందోబస్తు సీఎం రాక నేపథ్యంలో పోలీసులు పకడ్బందీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా హెలిప్యాడ్ నుంచి సభ ప్రాంగణం వరకు దారి పొడవునా పోలీసులను మోహరించారు. సభా ప్రాంగణం వద్ద సీఆర్పీఎఫ్ బలగాలతో పాటు జిల్లా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సీఎం రాకకు ముందు నుంచే బహిరంగ సభ ప్రాంగణానికి చేరుకున్న ఎస్పీ గౌస్ ఆలం సీఎం వెనుదిరిగే వరకు అక్కడే ఉండి భద్రతను స్వయంగా పర్యవేక్షించారు. పలువురి చేరిక బీజేపీ, బీఆర్ఎస్ల నుంచి పలువురు సీఎం స మక్షంలో కాంగ్రెస్లో చేరారు. బీఆర్ఎస్కు చెందిన మాజీ కేంద్రమంత్రి సముద్రాల వేణుగోపాలాచారి, మున్సిపల్ వైస్చైర్మన్ జహీర్ రంజా నీ, కౌన్సిలర్లు ఆవుల వెంకన్న, కలాల శ్రీని వాస్, మడావి మంగళ, మాజీ ఎంపీపీ ఆడే శీల, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి లోక ప్రవీణ్ రెడ్డి తదితరులు కాంగ్రెస్లో చేరారు. వారికి సీఎం కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే.. సక్కు, నగేశ్పై సీఎం సైటెర్లు బీఆర్ఎస్, బీజేపీ ఎంపీ అభ్యర్థులపై సీఎం రేవంత్రెడ్డి తనదైన స్టైల్లో విమర్శలు గుప్పించారు. ‘ఆత్రం సక్కును చూశారు.. గోడం నగేశ్ను చూశారు.. వారు మీకు కొత్తేమి కాదు.. వాళ్ల పనితీనమేంటో కూడా మీకు తెలుసు.. మంచోడు మంచోడని మంచమెక్కిస్తే మంచమంతా పాడు చేశాడట వెనుకటికి ఆత్రం సక్కులాంటోడని’ అన్నారు. అలాగే గోడం నగేశ్ గురించి మా ట్లాడుతూ ‘బుద్ధిమంతుడని సద్దికట్టిస్తే బొడ్రా యి వద్ద భోంచేసి తిరిగి ఇంటికొచ్చి బోర్లాపడుకున్నడట.. అంటూ సామెతలను వివరిస్తూ వారిద్దరిపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. నగేశ్ ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎంపీగా అన్ని పదవులు చేసిన విషయం మీకందరికీ తెలుసన్నారు. వారిద్దరు తక్కువేమి కాదని కేసీఆర్ దొర ఎంతనో ఈ గిరిజన నాయకులు అంతటి దొరలేనన్నారు. ఉదయం 11గంటలైతే తప్ప కిందకి దిగడని, సామాన్యులు చేయి కలిపితే వెంటనే జేబులో పెట్టి తుడ్చుకునే నగేశ్ లాంటి దొరలు మనకు అవసరమా అని ప్రశ్నించారు. ఫాంహౌస్లో ఉండే దొరలైనా ఆదిలాబాద్లో ఉండే ఈ దొరలతో మనకేం పని అని అన్నారు. సామాన్యురాలిగా, ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న ఆత్రం సుగుణను పార్టీ ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టిందని ఆమెను భారీ మెజార్టీతో గెలిపించి పార్లమెంట్కు పంపించాలని కోరారు. -
పేదింటి బిడ్డ సుగుణ : ఎమ్మెల్యే బొజ్జు
ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ఆదివాసీ సంస్కృతి, సంప్రదాయాలు తెలియనటువంటి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోడం నగేశ్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణపై దేవుళ్ల పేరిట విష ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. ఏ ఒక్క రోజు తలపాగా చుట్టని, దోతి కట్టని, జంగుబాయిని దర్శించుకోని వ్యక్తి నగేశ్ అన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన పేదింటి ఆడబిడ్డ ఆత్రం సుగుణను గెలిపించాలని ప్రజలను కోరారు. సభకు హాజరైన జనంసభలో ప్రసంగిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, పక్కన ఎమ్మెల్యే బొజ్జు, ఎంపీ అభ్యర్థి సుగుణ -
ఐదో రోజు మూడు నామినేషన్లు
కై లాస్నగర్: పార్లమెంట్ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐదో రోజైన సోమవారం ఆదిలాబాద్ ఎంపీ స్థానానికి సంబంధించి మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. కాంగ్రెస్ అ భ్యర్థి ఆత్రం సుగుణ తన రెండో సెట్ నామినేషన్ దాఖలు చేశారు. జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, ఖా నాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్, మాజీ ఎ మ్మెల్యే కోనేరు కోనప్ప, నిర్మల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీహరిరావుతో కలిసి నామినేషన్పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి రాజర్షి షాకు అందజేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పట్టణంలోని రణదీవేనగర్కు చెందిన మేస్రం గంగాదేవి నామినేషన్ దాఖలు చేయగా, మరో స్వతంత్య్ర అభ్యర్థి రాథోడ్ సుభాష్ తరఫున మరో సెట్ దాఖలు చేశారు. కలెక్టరేట్లోని కలెక్టర్ చాంబర్లో ఆర్వోకు వారు నామినేషన్ పత్రాలు అందజేశారు. దీంతో ఇప్పటి వరకు అందిన నామినేషన్ల సంఖ్య ఆరుకు చేరింది. నేడు బీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్ ఆదిలాబాద్టౌన్: బీఆర్ఎస్ ఆదిలా బాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు భారీగా తరలిరానున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు. ● కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్కు హాజరైన మంత్రి సీతక్క -
‘మోదీని మళ్లీ ప్రధాని చేయడమే కర్తవ్యం’
ఆదిలాబాద్టౌన్: మోదీని మరోసారి ప్రధాని చేయడమే ముందున్న కర్తవ్యమని బీజేపీ నాయకులు అన్నారు. పట్టణంలోని ఓ హోటల్లో మహిళ శక్తి సమ్మేళనం సో మవారం నిర్వహించారు. కార్యక్రమానికి పార్లమెంట్ పొలిటికల్ ఇన్చార్జి పాయల్ శంకర్, ఎంపీ అభ్యర్థి గొడం నగేశ్, జెడ్పీ మాజీ చైర్ పర్సన్ చిట్యాల సుహాసిని రెడ్డి, పార్లమెంట్ ప్రభారి అల్జాపుర్ శ్రీనివాస్, పార్లమెంట్ కన్వీనర్ అయ్యన్నగారి భూ మయ్య తదితరులు హా జరై మాట్లాడారు. మహిళలు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదన్నారు. ప్రధాని మోదీ మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ఎ న్నికల్లో ఎంపీగా నగేశ్ను గెలిపించాలని కోరా రు. ఇందులో ఇంద్రవెల్లి జెడ్పీటీసీ పుష్పలత, నాయకురాలు దోని జ్యోతి, అనిత, నివేదిత వఝే తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ : మంత్రి సీతక్క
జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పనిచేయడంతోనే బీఆర్ఎస్ను ప్రజలు పక్కనపెట్టారన్నారు. మోదీ చేసిందేమి లేకపోవడంతోనే కాంగ్రెస్పై తప్పుడు విమర్శలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి తప్పుడు విమర్శలు చేయడం తగునా అని ప్రశ్నించారు. హిందువుల పార్టీ తమదని చెప్పుకునే మోదీ అగర్బత్తీలను సైతం జీఎస్టీ నుంచి వదల్లేదని ఎద్దేవా చేశారు. ప్రజల సంక్షేమాన్ని కాంక్షించేది కాంగ్రెస్ పార్టీ అని.. వారి కోసం ఆహారభద్రత, ఉపాధిహామీ, విద్యాహక్కు వంటి చట్టాలను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. జీఎస్టీ పేరిట రూ.54లక్షల కోట్లు దండుకున్న ఘనత కేంద్రంలోని మోదీ సర్కారుదని మండిపడ్డారు. ప్రజలకు బీఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రేవంత్రెడ్డి ప్రభుత్వం 3 నెలల్లోనే 38వేల మందికి ఉద్యోగాలు కల్పించిందని గ్యారంటీలకే రేవంత్రెడ్డి గ్యారంటీ అని స్పష్టం చేశారు. -
బీజేపీది అసత్య ప్రచారం : మంత్రి శ్రీధర్బాబు
రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు మాట్లాడుతూ.. మతతత్వ పార్టీ బీజేపీ తమ ఎన్నికల మేనిఫెస్టోలో లేని అంశాల ను ప్రస్తావిస్తూ అసత్య ప్రచారం చేస్తుందన్నారు. గడిచిన పదేళ్ల పాలనలో బీజేపీ ప్రకటించిన మేనిఫెస్టోలోని ఏ ఒక్క అంశాన్నైనా అమలు చేసిందా అని ప్రశ్నించారు. దేశ ప్రజలంతా దేవుళ్లను కొలుస్తారని, తాము అనేక గుడులను నిర్మించామన్నారు. కానీ దేవుడు మా వాడేనని మార్కెటింగ్ చేసుకునేలా బీజేపీ వ్యవహరించడం దుర్మార్గమని మండిపడ్డారు. అలాగే పదేళ్ల పాలనలో తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ చేసిందేమీ లేదని ఆరోపించారు.