-
గుండెపోటుతో బ్యాంక్లోనే కుప్పకూలిన ఉద్యోగి.. సీసీటీవీ దృశ్యాలు వైరల్
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువవుతున్నాయి. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు సడెన్ హార్ట్ ఎటాక్లు ఆందోళన కలిగిస్తున్నాయి. అప్పటి వరకు ఎంతో ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి గుండెపోటుతో ప్రాణాలు విడుస్తున్నారు. ఈ మరణాలు యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి. తాజాగా మరో 30 ఏళ్ల యువకుడు ఆకస్మిక గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్లో వెలుగుచూసింది.మహోబాలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్లో 30 ఏళ్ల అగి జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ తన ల్యాప్ టాప్లో పనిచేస్తూ ఉన్నాడు. అకస్మాత్తుగా తన కుర్చీపై కుప్పకూలిపోయాడు. పక్కన కూర్చున్న అతని సహచరులు ఇతరులను అప్రమత్తం చేసి, అతన్ని అతని డెస్క్ నుండి బహిరంగ ప్రదేశంలోకి మార్చారు. వారు అతని ముఖం మీద నీరు చల్లి, మేల్కొలిపే ప్రయత్నం చేశారు. యువకుడికి సీపీఆర్ ఇచ్చేందుకు సైతం యత్నించారు. కానీ ఫలితం లేకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే అతడు ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే యువకుడు బ్యాంక్లో కుప్పకూలిన వీడియో అక్కడి సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.खौफनाक...लैपटॉप पर काम करते करते कुर्सी पर ही HDFC Bank मैनेजर की मौत हो गई।38 साल उम्र थी। कुछ सेकंड पहले तक कीबोर्ड पर हाथ चला रहे थे। अगले पल कुर्सी पर ही जान निकल गई।यूपी के महोबा ब्रांच में थे।#mahoba#covidvaccines #covid #heartattack #hdfc #uttarpradesh pic.twitter.com/xXuw9Ndhnu— Sunil Yadav B+ (@sunilyadav21) June 26, 2024 -
బెంగళూరులో.. ఏరోనాటికల్ ఇంజనీర్ విషాదం!
ఖమ్మం: మండలంలోని పిండిప్రోలు గ్రామానికి చెందిన ఊడుగుల కృష్ణమూర్తి(44) బెంగళూరులోని హిందుస్తాన్ ఎరోనాటికల్ లిమిటెడ్ కంపెనీలో డిప్యూటీ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తుండగా గుండెపోటుతో మృతి చెందారు. పిండిప్రోలుకు చెందిన ఊడుగుల వెంకయ్య – మాణిక్యమ్మ మూడో కుమారుడు కృష్ణమూర్తి ఇరవై ఏళ్ల క్రితం బెంగళూరులోని హెచ్ఏఎల్లో ఇంజనీర్గా చేరి డిప్యూటీ మేనేజర్ స్థాయికి ఎదిగాడు.ఇటీవలే సొంత గ్రామంలో జరిగిన గ్రామ దేవత వేడుకకు కూడా హాజరయ్యాడు. ఈనెల 22న బెంగళూరులోని నివాసంలో బాత్రూమ్కు వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో కుప్పకూలి మృతి చెందినట్లు తెలిసింది. ఆ సమయాన భార్య శిరీష, పిల్లలు ఖమ్మంలో ఉండడంతో కృష్ణమూర్తి మృతి విషయం రెండు రోజుల తర్వాత స్నేహితుల ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో ఆయన బంధువులు మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు బెంగళూరు వెళ్లారు. కాగా, కృష్ణమూర్తి విషయం తెలియడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.గంటల వ్యవధిలోనే తల్లీ కుమారుడు...ముదిగొండ: గడ్డిమందు సేవించి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన రఘునాధపాలెం మండలం చిమ్మపూడికి చెందిన కణతల శేషగిరి(36) ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి మృతిచెందాడు. కుటుంబ, ఆర్థిక స మస్యల కారణంగా చిమ్మపూడికి చెందిన తల్లీ,కుమారుడు కణతాల నర్సమ్మ(55), శేషగిరి(36) ముదిగొండ మండలం సువర్ణాపురం శివారులో ఈనెల 23న గడ్డిమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం విదితమే.వీరిని ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించగా, సోమవారం ఉదయం నర్సమ్మ మృతి చెందింది. అలాగే, ఆమె కుమారుడు శేషగిరి అర్థరాత్రి దాటాక మృతి చెందగా, కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదిగొండ ఎస్ఐ గజ్జెల నరేష్ తెలిపారు. కాగా, గంటల వ్యవధిలోనే తల్లీకుమారుడు మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది. -
తండ్రి మరణాన్ని తట్టుకోలేక..
శాలిగౌరారం: కన్న తండ్రి మరణాన్ని తట్టుకోలేక గుండెపోటుతో కొడుకు మృతిచెందిన ఘటన శాలిగౌరారం మండలంలోని మనిమద్దె గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు.. మనిమద్దె గ్రామానికి చెందిన అంతటి శంకరయ్య(72)కు భార్య, వివాహితులైన ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు శ్రీను అనారోగ్యం బారిన పడి ఆరేళ్ల క్రితం మృతిచెందాడు. చిన్న కుమారుడు రాంబాబు(34) భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్లో ఉంటూ అక్కడే ఎలక్ట్రికల్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శంకరయ్య, అతడి భార్య మనిమద్దె గ్రామంలోనే ఉంటున్నారు. శంకరయ్య అనారోగ్యంతో మూడు నెలలుగా మంచం పట్టి ఆదివారం మృతిచెందాడు. తండ్రి మృతిచెందిన విషయాన్ని తెలుసుకున్న రాంబాబు హైదరాబాద్ నుంచి కుటుంబంతో కలిసి స్వగ్రామానికి వచ్చాడు. తండ్రి మృతదేహాన్ని చూసినప్పటి నుండి శంకరయ్య తీవ్ర మనోవేదనతో రోదిస్తూ ఉన్నాడు. బంధువులు, ఎంత నచ్చజెప్పినా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాడు. సోమవారం మధ్యాహ్నం గ్రామంలో తండ్రి శంకరయ్య అంత్యక్రియలు జరిగాయి. అంత్యక్రియల అనంతరం ఇంటికి వచ్చిన రాంబాబు తండ్రి మరణాన్ని తట్టుకోలేక సాయంత్రం గుండెపోటుకు గురై ఒక్కసారిగా కుప్పకూలాడు. దీంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు వెంటనే రాంబాబును నార్కట్పల్లిలోని కామినేని హాస్పిటల్కు తరలించారు. అక్కడ రాంబాబును పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అదే రోజు రాత్రి రాంబాబు మృతదేహాన్ని మనిమద్దెకు తీసుకురాగా మంగళవారం గ్రామంలో అంత్యక్రియలు జరిగాయి. రాంబాబుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక్కరోజు వ్యవధిలో తండ్రీకొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. చిన్నపాటి పెంకుటిల్లు తప్ప ఎలాంటి స్థిరాస్తులు లేని ఆ కుటుంబంలో పెద్దదిక్కుగా ఉన్న తండ్రి, ఇద్దరు కుమారులు దూరం కావడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. -
రామోజీ కన్నుమూత
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ప్రముఖ వ్యాపారవేత్త, రామోజీ గ్రూపు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు (88) కన్నుమూశారు. ఈ నెల 5న గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురైన రామోజీని కుటుంబ సభ్యులు నానక్రాంగూడలోని స్టార్ ఆస్పత్రికి తరలించారు. గుండె పనితీరు దెబ్బతిన్నదని, బీపీ పడిపోయిందని గుర్తించిన వైద్యులు.. ఆయనకు వెంటిలేటర్ అమర్చారు. యాంజియోగ్రామ్ చేసి గుండె నాళాల్లో స్టంట్ వేశారు. అయినా ఆయన కోలుకోలేదు.శుక్రవారం మధ్యాహ్నం నుంచి ఆరోగ్యం మరింతగా క్షీణించి.. శనివారం తెల్లవారుజామున 4.51గంట లకు తుదిశ్వాస విడిచారు. ఆస్పత్రి నుంచి ఆయన భౌతిక కాయాన్ని ఉదయం 7.45 గంటలకు రామోజీ ఫిలింసిటీకి తెచ్చారు. రామోజీ మరణ వార్త తెలిసి రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులు, అభిమానులు సంతాపం వ్యక్తం చేశారు. ఫిలింసిటీలో రామోజీ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులు అరి్పంచారు. రామోజీతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఆదివారం ఉదయం 10 గంటలకు ఫిలింసిటీలోని నాగన్పల్లి–అనాజ్పూర్ గ్రామాల మధ్యలో ప్రత్యేకంగా నిర్మించిన స్మృతివనంలో రామోజీరావు భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశాల కోసం ఢిల్లీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో ఫోన్లో మాట్లాడి ఈ మేరకు సూచనలు చేశారు. దీంతో ఏర్పాట్లను పర్యవేక్షించాల్సిందిగా రంగారెడ్డి కలెక్టర్, రాచకొండ పోలీస్ కమిషనర్లను సీఎస్ ఆదేశించారు. బతికుండగానే రామోజీ స్మృతివనం ఇబ్రహీంపట్నం రూరల్: రామోజీరావు తాను బతికి ఉండగానే ఇబ్రహీంపట్నం మండలం నాగన్పల్లి–అనాజ్పూర్ మధ్యలో ప్రత్యేక స్మృతి వనాన్ని నిర్మించుకున్నారు. ఇప్పుడు ఆయన అంత్యక్రియలను ఈ స్మృతివనంలోనే నిర్వహించనున్నారు. రంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ భూపాల్రెడ్డి శనివారం స్మృతి వనాన్ని పరిశీలించి.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిపించేందుకు ఏర్పాట్లు చేయించారు. -
ఆటలో సిక్స్... జీవితంలో ఔట్!
ఇటీవల గుండెపోటు మరణాలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారిన ఆకస్మిక గుండెపోటు మరణాలు వెంటాడుతున్నాయి. ఐదేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల ముసలి వరకు హఠాత్తుగా ప్రాణాలు కోల్పోతున్నారు. కళ్ల ముందు హుషారుగా ఉన్న వారు క్షణాల్లో విగత జీవులుగా మారుతున్నారు. జిమ్లో కసరత్తులు చేస్తూ, క్రికెట్ ఆడుతూ, డ్యాన్స్ చేస్తూ.. అంతెందుకు రోడ్డుపై నడుస్తున్న వారు ఆకస్మాత్తుగా కుప్పకూలి అందరికి దూరమవుతున్నారు.తాజాగా ఓ యువకుడు క్రికెట్ ఆడుతూ ఉన్నట్టుండి కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. మహారాష్ట్ర థానెలోని మీరా రోడ్డులో ఆదివారం ఈ ఘటన జరిగింది. గ్రౌండ్లో రెండు టీమ్లు క్రికెట్ ఆడుతుండగా.. పింక్ జెర్సీ ధరించి బ్యాటింగ్ చేస్తున్న యువకుడు బంతిని గట్టిగా సిక్స్ కొట్టాడు. బాల్ అమాంతం ఎగిరి పార్క్ గ్రౌండ్ బయట పడింది. ఇంతలో ఏమైందో ఏమో వెంటనే ఉన్నచోటే బ్యాటర్ కుప్పకూలిపోయాడు. గమనించిన తోటి క్రీడాకారులు అతన్ని బతికించేందుకు ప్రయత్నించారు. వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ వారి ప్రయత్నాలేవీ ఫలించలేదు. యువకుడు అప్పటికే మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడిని రామ్ గణేష్ తేవార్గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. యువకుడి మరణానికి ఖచ్చితమైన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. అయితే యువకుడు కుప్పకూలడానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.#DisturbingVisuals : On camera, man dies immediately after hitting six in match near mumbai. In a shocking incident in Thane's Mira Road area in Maharashtra, a man died while playing cricket. #shocking#Thane #HeartAttack #Cricket #heartattack pic.twitter.com/882Zi9QwcS— Indian Observer (@ag_Journalist) June 3, 2024 -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
కైకలూరు: మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి (74) సోమవారం కన్నుమూశారు. హైదరాబాద్లో ఉంటున్న ఆమె సోమవారం గుండెపోటుకు గురై ప్రాణాలు విడిచారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండూరు ఆమె స్వగ్రామం. ముదినేపల్లి నియోజకవర్గం నుంచి 1983లో టీడీపీ తరఫున పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ఉద్దండుడిగా పేరొందిన పిన్నమనేని కోటేశ్వరరావుపై పోటీ చేసి ఓటమి చెందారు. తిరిగి ముదినేపల్లి నుంచి 1985లో కోనేరు రంగారావుపై విజయం సాధించారు. అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 19 89లో ప్రాథమిక, ఉన్నత, సాంకేతిక విద్యా శాఖ మంత్రిగా ఆమెకు అవకాశం కల్పించారు.ఆ సమయంలో పరీక్ష పేపర్ లీక్ అంశం వివాదాస్పదమైంది. యెర్నేని సీతాదేవి మంత్రిగా ఉన్నప్పుడే మొదటిసారి ఇన్స్టెంట్, బెటర్మెంట్ పరీక్షలు ప్రవేశపెట్టారు. 1994లో పిన్నమనేని కోటేశ్వరరావు కుమారుడు వెంకటేశ్వరరావుపై పోటీ చేసి విజయం సాధించారు. 1999, 2004 ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. 2004 తర్వాత జిల్లా ల పునరి్వభజనలో భాగంగా ముదినేపల్లి నియోజకవర్గం రద్దయి.. కైకలూరు నియోజకవర్గంలో కలి సింది.సీతాదేవి టీటీడీ బోర్డు సభ్యురాలుగా పనిచేశారు. 2013లో బీజేపీలో చేరారు. బీజేపీలో మహి ళా మోర్చా నేషనల్ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా బా ధ్యతలు నిర్వర్తించారు. ప్రస్తుతం విజయ మిల్క్ డెయిరీ డైరెక్టర్గా సేవలు అందిస్తున్నారు. సీతాదేవి భర్త యెర్నేని నాగేంద్రనాథ్ (చిట్టిబాబు) రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఆయన గతేడాది అనారోగ్యంతో మరణించారు. సీతాదేవి పార్థివదేహాన్ని సొంతూ రు కొండూరుకు తీసుకొచ్చారు.పలువురు నేతలు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులరి్పంచారు. -
మాజీ మంత్రి యెర్నేని సీతాదేవి కన్నుమూత
హైదరాబాద్: మాజీ మంత్రి, విజయ డెయిరీ డైరెక్టర్ యెర్నేని సీతాదేవి కన్నుమూశారు. సోమవారం ఉదయం గుండెపోటుతో హైదరాబాద్లో ఆమె తుదిశ్వాస విడిచారు. సీతాదేవి స్వస్థలం ఏపీలోని కైకలూరు మండలం కోడూరు. ముదినేపల్లి నుంచి ఆమె రెండుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఎన్టీఆర్ కేబినెట్లో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత ఆమె బీజేపీలో చేరారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.యెర్నేని సీతాదేవి కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం ఉన్నదే. ఆమె భర్త నాగేంద్రనాథ్(చిట్టిబాబు) ఆంధ్రప్రదేశ్ రైతాంగ సమాఖ్య, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా, కృష్ణా, గోదావరి, పెన్నార్ డెల్టా డ్రెయినేజీ బోర్డు సభ్యుడిగా పని చేశారు. కిందటి ఏడాదే ఆయన కన్నుమూశారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు యెర్నేని రాజారామచందర్(దివంగత ) రెండు పర్యాయాలు కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. -
సెల్ఫోన్తో హై బీపీ!
సాక్షి, అమరావతి: మొబైల్ ఫోన్లో ఎక్కువ సేపు మాట్లాడితే అధిక రక్తపోటు (హై బీపీ) ప్రమాదం పొంచి ఉందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. దైనందిన జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న సెల్ఫోన్లతో అంతే స్థాయి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వారానికి 30 నిమిషాలు, అంతకంటే ఎక్కువసేపు మొబైల్ ఫోన్లో మాట్లాడేవారిలో దుష్ప్రభావాలు తీవ్ర స్థాయిలో ఉంటున్నాయని, ముఖ్యంగా రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తాజా అధ్యయనంలో తేల్చారు. ‘యూరోపియన్ హార్ట్ జర్నల్–డిజిటల్ హెల్త్’లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. చైనాలోని గ్వాంగ్జౌలోని సదరన్ మెడికల్ వర్సిటీ పరిశోధకులు మొబైల్ ఫోన్ల నుంచి వెలువడే తక్కువ స్థాయి రేడియో ఫ్రీక్వెన్సీ శక్తి రక్తపోటు పెరుగుదలతో ముడిపడి ఉందని గుర్తించారు.130 కోట్ల మందిలో.. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 30–79 సంవత్సరాల వయసు గల దాదాపు 130 కోట్ల మంది అధిక రక్తపోటు సమస్య ఎదుర్కొంటున్నారు. ఇందులో 82% మంది తక్కువ, మధ్య–ఆదాయ దేశాలలో నివసిస్తున్న వారే. భారత్లో 120 కోట్ల మందికిపైగా మొబైల్ ఫోన్ వినియోగదారులు ఉంటే 22 కోట్ల మంది అధిక రక్తపోటు బాధితులు ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. రక్తపోటు సమస్య గుండెపోటు, అకాల మరణానికి దారితీస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు.హైబీపీ వల్ల వచ్చే హైపర్ టెన్షన్, ఇతర సమస్యలపై అవగాహన పెంచుకోవాలన్నారు. తాజా పరిశోధనలో వారంలో 30 నిమిషాల కంటే తక్కువ సమయం ఫోన్లో మాట్లాడే వారితో పోలిస్తే మిగిలిన వారిలో రక్తపోటు వచ్చే ప్రమాదం 12% ఎక్కువగా ఉంటుందని తేల్చారు. వారానికి ఆరుగంటలకు పైగా ఫోన్లో మాట్లాడేవారిలో రక్తపోటు ప్రమాదం 25 శాతానికి పెరిగింది.కండరాలపై ఒత్తిడి..మెడ, భుజాలు, చేతుల్లో కండరాల నొప్పులు అత్యంత సాధారణ దుష్ప్రభావాలలో ఒకటిగా వైద్యులు చెబుతున్నారు. ఎక్కువ సేపు ఫోన్ను పట్టుకోవడంతో కండరాలు ఒత్తిడికి గురవడంతో పాటు తీవ్ర తలనొప్పికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఫోన్ను చెవికి చాలా దగ్గరగా పెట్టుకుని మాట్లాడటం, ఇయర్ఫోన్లు్ల, హెడ్ఫోన్లను నిరంతరం ఉపయోగించడంతో టిన్నిటస్ (చెవుల్లో నిరంతరం రింగింగ్ సౌండ్ వినిపించే పరిస్థితి) వంటి చెవి సమస్యలు వస్తాయంటున్నారు. ఫోన్ స్క్రీన్పై ఎక్కువ సేపు చూడటంతో కంటిపై ఒత్తిడి పెరిగిన కళ్లుపొడిబారడం, చూపు మసకబారడం, తలనొప్పి, ఊబకాయం వంటి సమస్యలకు దారితీస్తుందని పేర్కొంటున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి: ఐదేళ్ల తర్వాత 11 మంది వైద్యులపై కేసు!
వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన మహిళకు ఐదేళ్ల తరువాత న్యాయం లభించింది. ఈ ఉదంతం మహారాష్ట్రలోని నాగ్పూర్లో చోటుచేసుకుంది. ఈ కేసును విచారించిన నాగపూర్ కోర్టు ప్రభుత్వ వైద్యశాల డీన్ రాజ్ గజ్భియేతో సహా 11 మంది వైద్యులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు నాగ్పూర్లోని అజ్ని పోలీస్ స్టేషన్లో వీరిపై కేసు నమోదైంది.వివరాల్లోకి వెళితే 2019లో నాగపూర్కు చెందిన కేవల్రామ్ పాండురంగ్ పటోలే భార్య పుష్ప తన గొంతులో చిన్నపాటి గడ్డకు చికిత్స కోసం నాగ్పూర్లోని మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. ఈ సమయంలో సర్జరీ విభాగానికి అధిపతిగా ఉన్న డాక్టర్ గజ్భియే బాధిత మహిళ భర్త కేవల్రామ్ పాండురంగ్ పటోలేతో శస్త్రచికిత్స ద్వారా బాధితురాలి గడ్డను తొలగించవచ్చని తెలిపారు. ఆ వైద్యుని సలహా మేరకు పటోలే తన భార్య పుష్పను 2019 జూలై 5న ఆసుపత్రిలో చేర్చారు. 6న ఉదయం 8 గంటలకు ఆమెకు ఆపరేషన్ జరిగింది.ఈ ఆపరేషన్ తర్వాత పుష్ఫ పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఐసీయూలో ఆమెకు చికిత్సనందించారు. అయితే జూలై 7న ఆమె చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. పుష్ఫ మృతికి గుండెపోటు కారణమని వైద్యులు పేర్కొన్నారు. అయితే తన భార్య ఆపరేషన్లో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ పటోలే 2020 జూన్ 30న డాక్టర్ గజ్భియేతో పాటు ఇతర వైద్యులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా వైద్యాధికారులు విచారణ కమిటీని ఏర్పాటు చేసి, కోర్టుకు ఒక నివేదిక సమర్పించారు. అయితే ఆ నివేదికలో బాధితురాలు గుండెపోటుతో మృతి చెందిందని కమిటీ పేర్కొంది.అయితే పటోలే దీనిపై రాష్ట్ర వైద్య మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ నేపధ్యంలో వైద్యశాఖ ఈ ఉదంతంపై విచారణకు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ బాధితురాలికి ఆపరేషన్ చేసేటప్పుడు వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ నివేదిక ఆధారంగా పటోలే నాగపూర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేసి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై కేసు నమోదు చేయాలని కోరారు. దీనిపై విచారించిన కోర్టు ఆ వైద్యులపై కేసు నమోదు చేయాలని అజ్ని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. -
గుండెపోటుతో ప్రిసైడింగ్ అధికారి మృతి
బీహార్లో లోక్సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్ ప్రారంభమయ్యింది. ఇంతలో ముంగేర్లోని చకాసిం ఇబ్రహీం శంకర్పూర్ మిడిల్ స్కూల్లోని బూత్ నంబర్ 210లో విషాదం చోటుచేసుకుంది. డ్యూటీ చేస్తున్న ప్రిసైడింగ్ అధికారి ఓంకార్ చౌదరి గుండెపోటుతో మృతి చెందారు. అతని ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. అతన్ని ఆసుపత్రికి తరలించేలోగానే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.దర్భంగాలోని హోలీ క్రాస్ స్కూల్లోని ఆదర్శ్ పోలింగ్ సెంటర్ ఉత్సాహంగా ఓటింగ్ జరుగుతోంది. ముందుగా ఇద్దరు పెద్దలు తమ ఓటు వేసి, యువత తప్పక ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఈ పోలింగ్ కేంద్రం ముందు పెద్ద సంఖ్యలో ఓటర్లు బారులు తీరారు. జిల్లా కేంద్రానికి ఆనుకుని ఉన్న బహదూర్పూర్ బ్లాక్లోని బహదూర్పూర్ పోలింగ్ నంబర్ 120 వద్ద ఈవీఎంలో అవాంతరం తలెత్తింది. దీంతో కొద్దిసేపు ఓటింగ్ నిలిచిపోయింది.బీహార్లోని ఐదు స్థానాల్లో నాలుగో దశ పోలింగ్ ప్రారంభమైంది. 9,447 పోలింగ్ కేంద్రాల్లో ఓటింగ్ జరుగుతోంది. చాలా చోట్ల ఉదయం ఆరు గంటలకే ఓటర్లు బూత్లకు చేరుకున్నారు. కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ తన సొంత జిల్లా బర్హియాలోని 34వ నంబర్ బూత్కు చేరుకుని ఓటు వేశారు.ఈ దశ పోలింగ్లో కేంద్రమంత్రులు గిరిరాజ్ సింగ్, నిత్యానంద్ రాయ్, జనతాదళ్ యునైటెడ్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాజీవ్ రంజన్ అలియాస్ లలన్ సింగ్, బీహార్ మంత్రి అశోక్ చౌదరి కుమార్తె శాంభవి చౌదరి, మంత్రి మహేశ్వర్ హజారీ కుమారుడు సన్నీ హజారీతో సహా 55 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. -
గుండెపోటుతో కన్నుమూసిన బీజేపీ కీలక నేత
భోపాల్: దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో మధ్యప్రదేశ్ యూనిట్ బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి 'గోవింద్ మాలూ' గుండెపోటుతో మరణించారు. ఈ విషయాన్ని స్థానిక పార్టీ నాయకుడు గురువారం తెలిపారు. బుధవారం భోపాల్ నుంచి ఇంటికి వచ్చిన తరువాత రాత్రి భోజనం చేశారు. ఆ తరువాత ఇంటి వద్ద గుండెపోటుకు గురయ్యారని సన్నిహితులు పేర్కొన్నారు.గుండెపోటు రావడంతోనే హుటాహుటిగా గోవింద్ మాలూను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. కానీ అయన అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మాలూ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ గురువారం ఉదయం ఇండోర్ చేరుకున్నారు.గోవింద్ మాలూ బీజేపీకి పెద్ద ఆస్తి అని మోహన్ యాదవ్ అన్నారు. కార్డియాక్ అరెస్ట్తో మాలూ ఆకస్మిక మృతి పట్ల చాలా బాధపడ్డాను. పార్టీకి సంబంధించిన అనేక బాధ్యతలు ఆయన నిర్వహించారని సీఎం పేర్కొన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు విష్ణు దత్ శర్మ, పార్టీ రాష్ట్ర సంస్థ ప్రధాన కార్యదర్శి హితానంద్, ఇతర సీనియర్ నేతలు కూడా మాలూ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు.మాలూ బీజేపీ రాష్ట్ర విభాగానికి మీడియా ఇన్ఛార్జ్గా పనిచేశారు. అంతేకాకుండా రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా కూడా పనిచేశారు. రాజకీయాల్లోకి రాకముందు స్థానిక వార్తాపత్రికల్లో స్పోర్ట్స్ రివ్యూలు రాశారు. ఆయనకు తల్లి, భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. -
గుండె ఘోష విన్నారు..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంభవిస్తున్న మరణాల్లో 32.4 శాతం గుండె సంబంధిత వ్యాధుల కారణంగానే ఉంటున్నాయి. నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ (ఎన్సీడీ)లో గుండె జబ్బులదే అగ్రస్థానం. ఈ క్రమంలో ప్రజారోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కలిగిన సీఎం వైఎస్ జగన్ మునుపెన్నడూలేని రీతిలో ఎన్సీడీ నిర్వహణపై పక్కా ప్రణాళికతో అడుగులు వేశారు. ఇందులో భాగంగా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయిలో ప్రభుత్వాస్పత్రుల ఆధునీకరణ సహా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ప్రధానంగా గుండె జబ్బులు, క్యాన్సర్ తదితర పెద్ద జబ్బులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. కార్డియాలజీ, కార్డియో వాసు్క్యలర్ సేవలను మరింతగా విస్తృతం చేసి, ప్రజలకు చేరువ చేస్తూ ఎమర్జెన్సీ కార్డియాక్ కేర్ (ఈసీసీ) కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఇందులో భాగంగా గుండెపోటు బాధితులకు గోల్డెన్ అవర్లో చికిత్స అందించి బాధితుల ప్రాణాలను కాపాడింది. నగరాలకు దూరంగా ఉండే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు గుండెపోటు బారినపడితే తొలి 40 నిమిషాల్లోనే ఈ కార్యక్రమం ద్వారా ప్రాథమిక వైద్య సేవలు లభించేలా చర్యలు తీసుకున్నారు. హబ్ అండ్ స్పోక్ విధానంలో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. సామాన్యులకూ అందుబాటులోకి హార్ట్కేర్ సర్వీసులు.. తిరుపతి రుయా ఆస్పత్రిలో 2022 జనవరి నుంచి పైలెట్ ప్రాజెక్టుగా ఈ ఈసీసీ నడుస్తోంది. గతేడాది సెప్టెంబర్లో గుంటూరు, కర్నూలు, విశాఖపట్నం జీజీహెచ్లను హబ్లుగా తీర్చిదిద్ది కార్యక్రమాన్ని విస్తరించారు. నాలుగు చోట్ల కార్డియాలజిస్ట్ వైద్యులతో పాటు, క్యాథ్ల్యాబ్ సౌకర్యం ఉంది. హబ్లకు ఆయా జిల్లాల పరిధిలోని 69 స్పోక్స్ (సెకండరీ హెల్త్ సర్వీసెస్ ఆస్పత్రులు)ను అనుసంధానంచేసి హార్ట్కేర్ సర్వీసులను సామాన్యులు, గ్రామీణులకు అందుబాటులోకి తెచ్చారు. అనంతరం అన్ని జీజీహెచ్లను హబ్లుగా, సెకండరీ హెల్త్ ఆస్పత్రులను స్పోక్స్గా తీర్చిదిద్ది రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాన్ని అమలులోకి తెచ్చారు. స్పోక్స్గా వ్యవహరించే ఆస్పత్రుల్లో ఛాతినొప్పి, ఇతర గుండెపోటు లక్షణాలతో వచ్చిన వ్యక్తులకు వెంటనే ఈసీజీ తీస్తున్నారు. ఆ ఫలితాన్ని హబ్లో ఉన్న కార్డియాలజిస్ట్కు పంపుతున్నారు. కార్డియాలజిస్ట్లు సంబంధిత కేసు గుండెపోటుదా కాదా అని నిర్ధారించి గుండె రక్తనాళం ఎంత శాతం పూడుకుపోయిందో పరిశీలించి థ్రాబోలైసిస్ థెరపీని సూచిస్తున్నారు. ఇలా సూచించిన కేసుల్లో రూ.40 వేల విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ను బాధితులకు ఉచితంగా ఇస్తున్నారు. గతేడాది సెప్టెంబరు 29 నుంచి ఇప్పటివరకూ 3 వేల మందికి పైగా ఛాతినొప్పితో స్పోక్స్కు రాగా వారికి వైద్యులు పరీక్షలు నిర్వహించారు. ఈ క్రమంలో గుండె రక్తనాళం 100 శాతం పూడిపోవడంతో వచ్చే ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియాల్ ఇన్ఫార్క్షన్ (స్టెమీ) సమస్యతో బాధపడుతున్న 489 మందికి వెంటనే థ్రాంబోలైసిస్ నిర్వహించారు. వీరిలో 424 మంది క్షేమంగా ఉన్నారు. సకాలంలో వైద్యసాయం అందకపోయినట్లయితే వీరందరూ కూడా మృత్యువాత పడేవారని వైద్యులు చెబుతున్నారు. భవిష్యత్లోనూ మరింత రక్షణ.. మరోవైపు.. ఫ్యామిలీ డాక్టర్ విధానం ద్వారా బీపీ, షుగర్, ఇతర ఎన్సీడీ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యంపై నిరంతరం పర్యవేక్షించారు. గుండె జబ్బులకు వైఎస్సార్ ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ ఆస్పత్రుల్లో పూర్తి ఉచితంగా వైద్య సేవలు అందించారు. ఐదేళ్లలో 3.67 లక్షల గుండెపోటు బాధితులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్సలు చేశారు. ఇందుకు రూ.2,300 కోట్లకు పైగా వెచ్చించారు. మరింత సమర్థవంతంగా గుండెపోటు మరణాలను నియంత్రించడానికి ఈసీసీను అమలులోకి తెచ్చారు. ఇక వచ్చే ప్రభుత్వంలో గుండె సంబంధిత వైద్యసేవల కోసం విశాఖ, కర్నూలు, గుంటూరుల్లో హబ్లు ఏర్పాటుచేస్తామని వైఎస్సార్సీపీ 2024 మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. -
నటుడు శ్రేయాస్ తల్పాడేకి గుండెపోటు..ఆ వ్యాక్సినే కారణమా..?
బాలీవుడ్, మళయాళీ నటుడు, నిర్మాత, దర్శక్షుడు అయిన శ్రేయాస్ తల్పాడే గతేడాది గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. నాటి దురదృష్టకర ఘటనను గుర్తు తెచ్చుకుంటూ తాను ధూమపానం సేవించనే, మందు తాగాను అయినా తాను ఈ గుండెపోటు బారిని పడ్డానని బాధగా అన్నారు. తనకు కొలస్ట్రాల్ ఎక్కువగా ఉందన్న విషయం తెలుసనిన్నారు. అందుకోసం మందులు వాడుతున్నట్లు చెప్పారు. ఇక తనకు మధుమేహం, రక్తపోటు వంటి దీర్ఘకాలి వ్యాధులు లేవనిన్నారు. అలాంటప్పుడు తాను ఈ గుండె జబ్బు బారిన ఎలా పడ్డానని ఆవేదనగా అన్నారు. బహుశా ఇది కోవిడ్ వ్యాక్సిన్ వల్లే అయ్యి ఉండొచ్చని అనుమానాన్ని వ్యక్తం చేశారు. నిజానికి ఆ మహమ్మారి సమయంలో బయటపడేందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ డ్రైవ్లు చేపట్టింది. మనం కూడా సేఫ్గా ఉండాలనే ఉద్దేశ్యంతో వారి చెప్పిన డోస్లు తీసుకున్నాం. అయితే నిజానికి మనకు శరీరంలో ఏం తీసుకుంటున్నామనేది తెలియదు. ఎలాంటి కంపెనీలను విశ్వసించాలో కూడా తెలియని స్థితి అది. ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకోవడం వల్ల ముగ్గురు చనిపోయారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలోనే శ్రేయాస్ ఇలా తన అనుమానాన్ని బాధగా వెలిబుచ్చారు. ఇక బాధితులు పోస్ట్మార్టంలో కూడా వ్యాక్సిన్ రియాక్షన్ కారణంగానే మరణించినట్లు వెల్లడవ్వడంతో ఒక్కసారిగా అందరిలో తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తాయి. కాగా, నటుడు గతేడాది డిసెంబర్లో శ్రేయాస్ తల్పాడే తనకు గుండెపోటు వచ్చిన విధానాన్ని గూర్తి వివరిస్తూ.."అహ్మద్ ఖాన్ వెల్కమ్ టు ది జంగిల్ కోసం ముంబైలో జోగేశ్వరికి దగ్గరగా ఉన్న ఎస్ఆర్పీఎఫ్ గ్రౌండ్స్లో షూటింగ్ చేస్తున్నాం. ఆర్మీ శిక్షణా సన్నివేశాలు చిత్రికరిస్తుండగా..సడెన్గా ఒక షాట్లో ఊపిరి పీల్చుకోలేకపోడం, ఎడమ ఛాతీలో తీవ్ర నొప్పి రాడం జరిగింది. దీంతో కనీసం ఆ షూట్ తర్వాత నేను నా వానిటీ వ్యాన్కి వెళ్లి బట్టలు కూడా మార్చుకోలేకపోయాను. ఈ విధమైన అలసటను తానెప్పుడూ ఫేస్ చేయలేదని చెప్పుకొచ్చాడు శ్రేయాస్ తల్పాడే. అంతేగాదు తాను కోలుకుని బయటపడాతనని కూడా అనుకోలేదని చెప్పారు. ఇది తనకు భగవంతుడు ఇచ్చిన రెండో అవకామని అన్నారు. నిజంగా కోవిషీల్డ్ ప్రమాదకరమైనదా..?భారతదేశంలో కోవిషీల్డ్ 175 కోట్ల డోస్లు ఇచ్చారు. భారతదేశంలో ప్రజలకు అత్యంత విస్తృతంగా అందించిన టీకా. అయితే ఇటీవల ఈ ఆస్ట్రాజెనెకాకు చెందిన కోవిడ్-19 వ్యాక్సిన్ కోవిషీల్డ్ దుష్ఫ్రభావాలు గురించి ప్రజల్లో తీవ్ర ఆందోళలను మొదలయ్యాయి. కానీ ఆస్ట్రాజెనెకా చట్టపరమైన సమర్పణలో టీకా గురించి సవివరంగా వెల్లడించింది. అందులో ఈ టీకా కారణంగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (టీటీఎస్)తో థ్రాంబోసిస్కు దారితీస్తుందని అంగీకరించింది. ఈ పరిస్థితి కారణంగా రక్తం గడ్డకట్టడం, తక్కువ ప్లేట్లెట్ కౌంట్కి పడిపోవడం జరుగుతుంది. అయితే ఇక్కడ దుష్ప్రభావాలు గురించి క్లియర్ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. నిజానికి మనదేశంలో ఈ టీకా వేసిన తర్వాత పరిమిత సంఖ్యలో ఈ టీటీఎస్ కేసులు నమోదయ్యాయి. టీకా-ప్రేరిత రోగనిరోధక థ్రోంబోటిక్ థ్రోంబోసైటోపెనియా (VITT)తో సహా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ (TTS)తో థ్రాంబోసిస్ అనేది చాలా అరుదైన దుష్ప్రభావం. ఎక్కువగా ప్రాథమిక టీకా తర్వాత కనిపిస్తుంది. అలాగే ఈ వ్యాక్సిన్ని తీసుకున్న ప్రతిఒక్కరు దీని బారిన పడరని ఆస్ట్రాజెనెకా కంపెనీ చట్టపరమైన పత్రాల్లో స్పష్టం చేసింది. చాలావరకు టీకా తీసుకున్న మొదటి 21 రోజుల్లోనే ఈ దుష్ప్రభావం సంభవిస్తుంది. అరుదైన సందర్భాల్లో ప్రాణాంతకం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందువల్ల ఈ టీకా తీసుకున్నవాళ్లు ఎవరు ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే టీకా వేసిన కొన్ని వారాల్లోనే ఇలాంటీ టీటీఎస్ సమస్యలు వస్తాయని తేల్చి చెప్పారు.(చదవండి: ఆజానబాహుడిలా ఉండే జాన్ అబ్రహం ఫిట్నెస్ రహస్యం ఇదే! అందుకే..!) -
సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. సింగం నటుడు కన్నుమూత!
సినీ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది. ప్రముఖ కోలీవుడ్ నటుడు అరుల్మణి(65) కన్నుమూశారు. గుండెపోటుకు గురైన ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న సినీ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటిస్తున్నారు. కాగా.. అరుల్మణి ప్రస్తుతం అన్నాడీఎంకే తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అయితే ఆయన మృతికి ఎన్నికల ప్రచారమే కారణమని తెలుస్తోంది. గత పది రోజులుగా పలు నగరాల్లో ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు. గురువారం చెన్నైకి వచ్చిన ఆయన అస్వస్థతకు గురి కావడంతో ఆస్పత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. కాగా.. అరుల్మణి ప్రముఖంగా సింగం, సింగం- 2, సామాన్యన్, స్లీప్లెస్ ఐస్, థెండ్రాల్, తాండవకొనే, రజినీకాంత్ లింగతో సహా పలు తమిళ చిత్రాలలో ఆయన నటించారు. కాగా.. అరుల్మణి తమిళ సినిమాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పలు సినిమాల్లో నటించారు. 'అళగి' సినిమా అరుల్ మణి కెరీర్ను మలుపు తిప్పింది. కోలీవుడ్లో ఇప్పటి వరకు అళగి, తెనారల్, పొన్నుమణి, ధర్మశీలన్, కరుపు రోజా, వేల్, మరుదమలై, కత్తు తమిళ్, వన యుద్ధం సహా 90 చిత్రాల్లో నటించారు. దాదాపు అందరు ప్రముఖ హీరోలతో ఆయన నటించారు. ఆయనకు ఓ కొడుకు, కూతురు ఉన్నారు. రాజకీయాల్లోకి వచ్చిన ఆయన ఆయన అన్నాడీఎంకే స్టార్ కంపెయినర్గా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. -
బీఎస్పీ అభ్యర్థికి గుండెపోటు
బహుజన్ సమాజ్ పార్టీ అలీగఢ్ అభ్యర్థి గుఫ్రాన్ నూర్ గుండెపోటుకు గురై ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. విషయం తెలిసిన వెంటనే బీఎస్పీ కార్యకర్తలు ఆస్పత్రికి చేరుకున్నారు. తన తండ్రి ఇప్పటికే హార్ట్ పేషెంట్ అని, ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఐసీయూలో చేర్చినట్లు గుఫ్రాన్ నూర్ కుమారుడు ఆదిల్ తెలిపారు. బీఎస్పీ రెండు రోజుల క్రితం గుఫ్రాన్ నూర్ను అభ్యర్థిగా ప్రకటించింది. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ బాబు ముంకద్ అలీ.. గుఫ్రాన్ నూర్ అభ్యర్థిత్వాన్ని వెల్లడించారు. కాగా బీఎస్పీ అలీగఢ్ లోక్సభ నియోజకవర్గ అభ్యర్థిని మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పార్టీ మాత్రం ఇంకా దీన్ని ధ్రువీకరించలేదు. 2012లో గుఫ్రాన్ నూర్ బరౌలీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి క్వామీ ఏక్తా దళ్ టిక్కెట్పై అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. 2023లో జరిగిన మేయర్ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి పోటీ చేశారు. -
డేనియల్ బాలాజీ హఠాన్మారణం: గుండెపోటు వస్తే అంతేనా..?
కోలీవుడ్ నటుడు డేనియల్ బాలాజీ (48) చిన్న వయసులోనే అకాల మరణం పొందారు. కుటుంభ సభ్యుల సమాచారం ప్రకారం..శుక్రవారం అర్థరాత్రి ఒక్కసారిగా తీవ్రమైన ఛాతినొప్పి రావడంతో అస్వస్థతకు గురయ్యారని, ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే చనిపోయారని వెల్లడించారు. 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించిన ఆయన చిన్నవయసులోనే కానరాని లోకాలకు వెళ్లిపోవడ బాధకరం. అస్సలు గుండెపోటు వస్తే ఇక అంతేనా?..ప్రాణాలు కోల్పోవాల్సిందేనా? బయటపడలేమా అంటే.. చాలా ఘటనల్లో గుండెపోటు రావడం ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు చనిపోవడం జరగుతుంది. కానీ ఇలా గుండెపోటు వచ్చే ముందు కొన్ని సంకేతాలు వస్తాయట. వాటిని పట్టించుకోకపోవడంతోనే సమస్య తీవ్రమై ఆస్పత్రికి తరలించే వ్యవధి సరిపోక చనిపోవడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఎలాంటి వారికి వస్తుందంటే.. మధుమేహం, ఊబకాయం, ఒత్తిడి, రక్తపోటు వంటి సమ్యలున్న వారికి గుండె పోటు వచ్చే అవకాశం ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. అలాగే కుటుంబ చరిత్రలో గుండె పోటు సంకేతాలు ఉంటే వారికి కూడా గుండె పోటు వచ్చే అవకాశం ఉంది. ముందుగా వచ్చే సంకేతాలు.. ఛాతి నొప్పి శ్వాస ఆడకపోవడం కుడి లేదా ఎడమ చేయి లాగడం ఛాతీ అసౌకర్యం ఆ నొప్పి 20 నిమిషాలకు పైనే ఉన్నా.. వికారం కష్టపడు, చేమాటోర్చు గుండెల్లో మంట అజీర్ణం లేదా కడుపు నొప్పి అలసట మరియు వాపు మైకము ఆ టైంలో ఏం చేయాలంటే.. ఈ సంకేతాలు కనిపించిన వెంటనే సార్బిట్రేట్(5 ఎంజీ నుంచి 10 ఎంజీ) ట్యాబ్లెట్ను నాలుక కింద పెట్టుకుని చప్పరించాలి. అయినా నొప్పి తగ్గకపోతే దాన్ని గుండె పోటుగా పరిగణించి వెంటనే వైద్య సాయం పొందడానికి చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సమయంలో ఆస్పిరిన్ (300 ఎంజీ), క్లోపిడోగ్రిల్ (300 ఎంజీ), అటోర్వాస్టాటిన్( 80 ఎంజీ ) ట్యాబ్లెట్ తీసుకోవాలి. అప్పుడు ఈసీజీ కోసం ఆస్పత్రికి వెళ్లాలి. అయితే వీటిని పరిస్థితి క్రిటికల్ అనిపించినప్పుడే ఇవి వేసుకోవాలి. అలాగే వైద్యుని వెంటనే సంప్రదించి తాను ఏ ట్యాబ్లెట్ వేసుకున్నామో? వివరించాలి. ఇక్కడ ఇలాంటి లక్షణాలు కనిపించిన.. 30 నిమిషాలలోపు ఆస్పిరిన్ నమలడం వల్ల ప్లేట్లెట్ అభివృద్ధిని నిరోధిస్తుంది, అలాగే రక్తం గడ్డకట్టడాని ఆలస్యం చేస్తుంది. కొంతమంది రోగులు గుండె సంబంధిత సంఘటన కంటే రక్తపోటు అకస్మాత్తుగా పడిపోవడం వల్ల విపరీతమైన చెమట, మైకం వచ్చిందని చెబుతారు. అలాంటప్పుడూ రోగికి సార్బిట్రేట్ ట్యాబెలెట్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వకూడదు. ఎందుకంటే..? ఇది బీపీను మరింత తగ్గిస్తుంది. ఈ విషయంపై పూర్తి అవగాహన ఉండి.. అవతలి వ్యక్తి పరిస్థితిని క్షణ్ణంగా తెలుసుకున్నాక ఇలాంటి ప్రథమ చికిత్సలను చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ ట్యాబ్లెట్లు వేసుకున్నాం కదా!.. గుండె నొప్పి తగ్గిందని వైద్యుని వద్దకు వెళ్లకుండా నిర్లక్ష్యంగా అస్సలు వ్యవహరించొద్దు. ఇది కేవలం అంబులెన్స్ లేదా ఆస్పత్రికి వెళ్లే సమయం వరకూ ప్రాణాలను కాపాడుకోవడానికే అనే విషయం గుర్తు పెట్టుకోవాలి. గోల్డెన్ అవర్లోపు తరలించాలి.. అంతేగాదు మెజారిటీ గుండెపోటు మరణాలు సమయానికి ఆస్పత్రికి చేరుకోకపోవడం వల్లనే జరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చిన మొదటి గంటలోనే పేషెంట్ను ఆస్పత్రికి తీసుకెళ్తే ప్రాణాలతో బయట పడే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చాలా కేసులలో బాధితులకు ఛాతిలో నొప్పి వచ్చిన కొన్ని గంటల తర్వాత ఆస్పత్రిలో చేరుతున్నారని.. అయితే అప్పటికే జరుగాల్సిన నష్టం జరుగుతుందని అంటున్నారు. ఎవరికైనా గుండెపోటు వచ్చిన గంటసేపటి వరకు కూడా శరీరానికి రక్తసరఫరా జరుగుతుందని.. ఇందులో మొదటి గంట తర్వాతనే రక్త ప్రసరణ ఆగిపోతుందని వైద్యులు అంటున్నారు. అందుకే గుండెపోటు వచ్చిన మొదటి గంటను గోల్డెన్ అవర్ లేదా గోల్డెన్ టైమ్ అని అంటారని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ గంట సమయంలోగా ఆసుపత్రిలో చేరాలని సూచిస్తున్నారు. (చదవండి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఫాలో అయ్యే డైట్ ఇదే!) -
అమెరికాలో గుండెపోటుతో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి
జనగామ జిల్లా: బచ్చన్నపేట మండలం వంగ సుదర్శన్రెడ్డినగర్ గ్రామానికి చెందిన చిట్టోజు మహేష్(34) అమెరికాలో గుండె పోటుతో బుధవారం ఉదయం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. చిట్టోజు ప్రమీల, మదనాచారి దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మహేష్ హైదరాబాద్లోని నాగారంలో స్థిరపడ్డాడు. మూడేళ్ల క్రితం ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన అతను జార్జియాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్గా పని చేస్తున్నాడు. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం మహేష్ డ్యూటీలో ఉండగా గుండె పోటు రావడంతో తోటి ఉద్యోగులు ఆస్పత్రికి తరలించే లోపే మృతి చెందాడు. మహేష్కు భార్య రాధ, నాలుగేళ్ల కుమారుడు ఉన్నారు. కాగా, మృతదేహం అమెరికా నుంచి ఇండియాకు రావడానికి ఐదు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
దొరికిన బంగారు గొలుసు.. బాధితురాలికి ఇవ్వాలని ఠాణాకు వెళ్లిన వ్యక్తి గుండెపోటుతో మృతి
హైదరాబాద్: ఆటోలో దొరికిన బంగారు గొలుసును బాధితురాలికి అప్పగించేందుకు పోలీస్స్టేషన్కు వెళ్లిన ఓ నగల వ్యాపారి గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన షాయినాయత్గంజ్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. సౌత్వెస్ట్ జోన్ డీసీపీ ఉదయ్కుమార్రెడ్డి, గోషామహల్ ఏసీపీ కోట్ల వెంకట్రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. నల్లకుంటకు చెందిన కోర్టు ఉద్యోగిని మేఘన శుక్రవారం ర్యాపిడో ఆటోలో హైకోర్టుకు వెళ్లింది. కోర్టుకు వెళ్లిన తర్వాత మెడలోని బంగారు గొలుసు కనిపించకపోవడంతో తన భర్తకు ఫోన్ చేసి సమాచారం అందించింది. ఆ తర్వాత కొద్ది సేపటికే అదే ఆటోను బుక్ చేసుకున్న వెండి నగల వ్యాపారి గోవింద్రామ్ సోని (70) బేగంబజార్ నుంచి కోఠీకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు.. ఈ క్రమంలో అతడికి ఆటోలో పడి ఉన్న బంగారు గొలుసు కనిపించింది. దీంతో ఆటో డ్రైవర్ నునావత్ తరుణ్ను వివరాలు అడగడంతో హైకోర్టు వద్ద ఓ మహిళను వదిలిపెట్టి వస్తున్నానని, సదరు గొలుసు ఆమెదే అయి ఉండవచ్చని చెప్పాడు. దీంతో గోవింద్రామ్ సోనీ నేరుగా అదే ఆటోలో షాయినాయత్గంజ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి గొలుసును పోలీసులకు అప్పగించాడు. ఇంతలోనే బాధితురాలు మేఘన ఆటో డ్రైవర్కు ఫోన్ చేసి గొలుసు విషయమై ఆరా తీసింది. సదరు ఆటో డ్రైవర్కు ఆమెకు విషయం చెప్పడంతో భర్తతో కలిసి పీఎస్కు వచి్చన బాధితురాలికి పోలీసుల సమక్షంలో గోవింద్రామ్ సోనీ బంగారు గొలుసును అప్పగించాడు. ఆ తర్వాత కొద్ది క్షణాల్లోనే అతను కుప్పకూలి పోవడంతో అప్రమత్తమైన పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గోవింద్రామ్ సోనీ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సహాయం చేసేందుకు పోలీస్స్టేషన్కు వచి్చన గోవింద్రామ్ సోనీ గుండెపోటుతో మృతి చెందడం బాధాకరమని డీసీపీ విచారం వ్యక్తంచేశారు. -
Heart Attack: గుండెపోటుతో పదో తరగతి విద్యార్థిని మృతి
వైఎస్సార్ : మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన శ్రీపతి లిఖిత (15) అనే విద్యార్థిని సోమవారం అనారోగ్యంతో మృతి చెందింది. ఆ విద్యార్థిని రాజుపాళెంలోని శివప్రియ హైస్కూల్లో విద్యను అభ్యసిస్తోంది. రాజుపాళెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉదయం పది పరీక్షలు రాసింది. పరీక్ష అనంతరం శివప్రియ హైస్కూల్కు వెళ్లి తోటి విద్యార్థులతో కలసి భోజనం చేసింది. అనంతరం రేపటి పరీక్షకు చదువుకునేందుకు క్లాసు రూంకు వెళుతున్న సమయంలో కళ్లు తిరిగి కుప్పకూలిపోయింది. వెంటనే ఆ విద్యార్థినిని ప్రథమ చికిత్స కోసం రాజుపాళెంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే కొన ఊపిరితో ఉన్న లిఖిత కొద్ది సేపటికి మృతి చెందిందని తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతురాలిని ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఆ విద్యార్థిని కొన్నేళ్లుగా గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ ఉండేదని ఆ పాఠశాల యాజమాన్యం తెలిపింది. అనురాధ, సుధాకర్ దంపతులకు ముగ్గురు కుమార్తెలు కాగా, మృతి చెందిన విద్యార్థిని లిఖిత రెండో సంతానం. మొదటి కుమార్తె పూణెలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె శివప్రియ హైస్కూల్లో ఆరో తరగతి చదువుతోంది. -
గుండెపోటు సడెన్గా వస్తుందా? కసరత్తు, కోవిడ్తో లింకేంటి?
వయసుతో సంబంధం లేకుండా యువత హాట్ ఎటాక్తో కుప్పకూలి పోతున్న ఘటనలు రోజు దేశ వ్యాప్తంగా ఏదో ఒక మూల వెలుగు చూస్తూనే ఉన్నాయి. తాజాగా ఓదెల మండలం కొలనూర్ గ్రామంలో ఓ పెళ్లి బారాత్ లో డాన్స్ చేస్తూ గుండెపోటుతో రావుల విజయ్ కుమార్( 33) అనే యువకుడు మృతి చెందడం ఆందోళన రేపింది. ఇటీవలి కాలంలో చిన్నపిల్లలు యవకులు, నిరంతరం వ్యాయామం చేస్తున్నవారు కూడా గుండెపోటుకు గురవుతున్నారు. న్యూఇయర్ పార్టీల్లోనూ, పెళ్లి బారాత్లో డాన్స్ చేస్తూ, జిమ్లో వ్యాయామం చేస్తూ, చివరకు , మెట్లు ఎక్కుతూ, రోడ్డుపై నడుస్తూ, కూర్చున్నవారు కూచున్నట్టుగానే కుప్పకూలిన సంఘటలను అనేకం. ప్రధానంగా వైసీపీ నేత, ఫిట్నెస్ ఫ్రీక్ మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం విషాదాన్ని నింపింది. ఇంకా కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్, బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ శుక్లా, ఇంకా పలువురు పోలీసు ఉన్నతాధికారులు గుండెపోటుతో ప్రాణాలు కోల్పోతున్నారు.అతేకాదు ఈ కోవలో ఫిట్నెస్ ట్రైనర్లు కూడా చాలామందే ఉన్నారు. జిమ్కు, గుండెపోటుకు సంబంధం ఏమిటి? నియంత్రణ లేకుండా ఎక్కువగా వ్యాయామం చేయడం. అతిగా వ్యాయాయం చేయడం అనేది ఎవరికైనా ముప్పే అంటున్నారు డాక్టర్లు. సాధారణంగా ప్రతి మనిషికి రోజుకి ఒక అరగంట లేదంటే నలభై నిమిషాల వ్యాయామం సరిపోతుందట. బాడీ ఫిట్గా ఉండాలనో, కండలు పెంచాలనో గంటల తరబడి జిమ్కే పరిమితం కాకూడదు. అంతేకాదు తొందరపాటుతో ఒక్కసారిగా జిమ్కు వెళ్లి పెద్దపెద్ద బరువులు ఎత్తాలని ప్రయత్నించ కూడదు. అస్సలు నిపుణుల సలహా, ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోనిదే జిమ్లోకి ఎంటర్ కాకూడదు. వ్యాయామం చేస్తున్నపుడు విపరీతంగా చెమటలు పడితే తక్షణమే ఆపివేయాలి. మరోవైపు శరీరంలో సోడియం స్థాయిలు పడిపోకుండా జాగ్రత్త వహించాలి. సప్లిమెంట్లు, ఎనర్జీ డ్రింక్ల విషయంలోనూ అప్రమత్తంగా ఉండాలి. హానికరమైన కృత్రిమ రసాయనాలు, స్టెరాయిడ్స్ వాడకంపై పూర్తి అవగాహన ముఖ్యం. ఎలాంటి దురలవాట్లు లేకుండా సంతులిత ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామంతో గుండెను పదిలంగా ఉంచుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. జీవన శైలి మార్పులు ధూమపానం, మద్యం సేవించడం, జంక్ఫుడ్స్, మైదాతో చేసిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం లాంటివి ఇక్కడ ప్రధాన పాత్ర పోషిస్తాయంటున్నారు వైద్య నిపుణులు. కరోనాతో సంబంధం ఏంటి? భారతదేశంలో కోవిడ్ మహమ్మారి అనంతరం గుండెపోటు కేసులు, మరణాలు బాగా పెరిగియాని ఇటీవలి అధ్యయనాలు, నివేదికల ద్వారా తెలుస్తోంది. ఆరోగ్యంగా ఉన్నవారిని కూడా గుండెపోటు కబళిస్తోంది. కోవిడ్-19 దీర్ఘకాలిక లక్షణాల ప్రభావంతోనే ఈ పరిస్థితి అని చెబుతున్నారు. ఫలితంగా గుండె నాళాల్లో తీవ్ర మంట, గుండెపోటుకు దారితీయవచ్చు. అధిక సోడియం ఉన్న ఆహారం, కనీస వ్యాయామం లేకపోవడం, ధూమపానం, అతిగా మద్యపానం, కదలికలు లేని జీవనశైలి, అధిక హిమోగ్లోబిన్ స్థాయిలు వంటి కారకాలు కూడా గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుందని చెబుతున్నారు. -
డ్యాన్స్ చేస్తే గుండెపోటు వస్తుందా? ఎందుకిలా పిట్టల్లా రాలిపోతున్నారు!
ఏదైనా వేడుక, జాతర, పెళ్లిళ్లలో జరిగే బారత్లోనూ అంతా జోషఫుల్గా డ్యాన్సులు వేస్తూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది సర్వసాధారణం. కానీ ఇలా చేయడమే శాపంగా మారి చివరికి ఆ వేడుక/పెళ్లి కాస్త విషాదంగా ముగుస్తుంది. ఇటీవల కాలంలో అందుకు సంబంధించిన పలు ఘటనలు ఎక్కువయ్యాయి కూడా. అసలు ఇలాంటి వేడుకల్లో ఆనందంగా డ్యాన్స్లు చేసి..చిన్నా, పెద్దా పిట్టల్లా రాలిపోతున్నారు. బతికించుకునే ఛాన్స్ కూడా దొరకడం లేదు. చెప్పాలంటే డీజేలాంటి మ్యూజిక్లు పెట్టుకుని ఎంజాయ్ చేద్దామంటేనే భయం వేస్తోంది. అసలెందుకు ఈ పరిస్థితి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని డ్యాన్స్లు చేయాలి?. ఎంత మేర మ్యూజిక్ వింటే బెటర్ తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం!. ఎన్ని ఘటనలు జరిగాయంటే.. ఇంతవరకు ఇలాంటి విషాదకర ఘటనుల గతేడాది నుంచి వరుసగా చోటు చేసుకున్నాయి. గతేడాది అక్టోబర్లో గుజరాత్లో గార్భా డ్యాన్స్ చేస్తూ ఏకంగా 10 మంది చనిపోయారు. అది మరువక ముందే అదే ఏడాది తెలంగాణలో 19 ఏళ్ల యువకుడు తన బంధువు పెళ్లిలో డ్యాన్య్ చేస్తూ కుప్పకూలి చనిపోయాడు. అలాగే గతేడాది మార్చి4న బిహార్లో సీతామర్హి నివాసి 22 ఏళ్ల సురేంద్ర కుమార్ వేదికపై దండలు మార్చుకుని నవ వధువుతో కూర్చొని ఉండగా.. ఆకస్మాత్తుగా కుప్పకూలి చనిపోయాడు. బాధితుడు చనిపోవడానకి ముందు డీజే సౌండ్ అసౌకర్యంగా ఉందని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం అదేలాంటి విషాద ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఓదెల మండలం కొలనూర్లో చోటు చేసుకుంది. రావు విజయ్కుమార్(33) అనే యువకుడు ఆనందంగా డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో చనిపోయాడు. ఇలా చనిపోయినవారంతే యువకులు. చాలా చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఎందుకు జరుగుతోందంటే..? ఏదైన ఉత్సవం, పెళ్లి వేడుకలో జనాల కోలాహలం ఎక్కువగా ఉంటుంది. దీనికి తగ్గట్టు డీజే మ్యూజిక్ లాంటివి పెద్దగానే పెడతారు. ఆ చుట్టూ ఉన్న జనాలు, ఆ మ్యూజిక్కి, ఉత్సాహం వచ్చి.. చిన్నా, పెద్దా, కాలు కదిపి చిందులు వేసేందుక రెడీ అయిపోతారు. దీంతో అక్కడుండే వాళ్లు మరింత ఉత్సాహంతో సౌండ్ పెంచేస్తుంటారు. ఇక డ్యాన్స్ చేసేవాళ్లు చుట్టూ ఉన్నజనం ఎంకరైజ్మెంట్, ఈలలను చూసి మరింతగా డ్యాన్స్ చేస్తుంటారు. దీంతో శరీరం అలసటకు గురై గుండెపై ఒత్తిడి పెరిగిపోతుంటుంది. ఇదేం పట్టించుకోకుండా ఆయా వ్యక్తులు శక్తికి మించి డ్యాన్స్లు చేసి కుప్పకూలి చనిపోవడం జరిగిపోతుంది. ఆ తర్వాత వైద్యులు గుండెపోటు లేదా గుండె ఆగిపోవడంతో చనిపోయారని ధృవీకరిస్తున్నారు. డ్యాన్స్ వల్ల వస్తుందా అంటే..? శరీరం బాగా అలిసిపోయేలా డ్యాన్స్ చేస్తే గుండెపోటు రావడం జరుగుతుందని చెబుతున్నారు వైద్యులు. ఎందుకంటే..? అప్పటికే శరీరంలో గుండెకు రక్తం సరఫరా అయ్యే నాళాల్లో అడ్డంకులు ఉంటాయి. ఎప్పుడైతే ఇలా అలసిపోతారు ఆ రక్త సరఫరా వేగం ఎక్కువ అవుతుంది. అది కాస్త గుండెపై ఒత్తిడి ఏర్పడి ఆగిపోవడం లేదా ఆకస్మికంగా రక్తం గడ్డకట్టి గుండె పోటు వచ్చి కుప్పకూలిపోవడం జరుగుతుంది. అందువల్ల శరీర సామర్థ్యానికి మించి డ్యాన్స్లు వంటివి చేయకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు మ్యూజిక్ వల్ల కూడా వస్తుందా..? భారీ శబ్దాలు వల్ల హార్ట్ ఎటాక్ వస్తుందా?. చెవి నుంచి వెళ్లే శబ్ద తరంగాలు గుండెను ప్రభావితం చేస్తాయా? అంటే ఔననే! చెబుతున్నారు వైద్యులు. భారీ శబ్దాలు మనిషిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయని పరిశోధకులు యూరోపియన్ హార్ట్ జర్నల్లో వెల్లడించారు. పెద్ద పెద్ద శబ్దాల వద్ద గుండె వేగంలో పెరుగుతున్న మార్పులను గుర్తించామని అన్నారు. ఈ బిగ్గర శబ్దాల కారణంగా వ్యక్తుల్లో గుండె దడ, స్ట్రోక్లు వచ్చే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని పేర్కొన్నారు. మానవ చెవికి 60 డెసిబుల్స్ వరకు సాధారణమని వైద్యులు చెబుతున్నారు. నిజానికి ఆహ్లాదకరమైన వాయిస్ లేదా శబ్దాన్ని వినగానే కేవలం చెవితోనే వినం. హృదయంతో ఆస్వాదిస్తాం. ఇది తెలియకుండానే జరుగుతుంది. సంగీతంతో కొన్ని జబ్బులు నయం చేయడం అనే పురాతన వైద్యం ఇందులోనిదే. భయోత్సాహమైన సౌండ్లతో సాగే మ్యూజిక్ తరంగాలు కారణంగా మన శరీరంలో ఒక రకమైన ఆందోళనకు గురవ్వుతుంది. అది నేరుగా మన గుండెపైనే ప్రభావం చూపిస్తుంది. ఏవిధంగా మంచి సంగీతం హృదయాన్ని హత్తుకుని గుండె పదిలంగా ఉండేలా చేస్తుందో.. అదే మ్యూజిక్ మోతాదుకు మించితే గుండెకి డేంజరే అని అరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. (చదవండి: గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!) -
గుండె ‘లయ’ తప్పితే..ముప్పే! ఈ లక్షణాలు గమనించండి!
ఒకపుడు గుండెపోటు అంటే.. మధుమేహం ఉన్న వారికి, శారీరక శ్రమ లేని వారికి, వయసు మీద పడిన వారికి, ఊబకాయ ఉన్నవారికి మాత్రమే వస్తుంది అని అనుకునే వాళ్ళం. కానీ ప్రస్తుత కాలంలో గుండె పోటు తీరు మారింది. మాకు రాదులే అని అనుకోడానికి లేదు. చిన్నా పెద్దా తేడా లేకుండానే ఇటీవలి కాలంలో గుండెపోటు సమస్య చాలా ఎక్కువగా వస్తుంది. మరీ ముఖ్యంగా జిమ్ చేస్తున్నవారు, ఎక్కువ కసరత్తు చేస్తున్న వారు కూడా ఎంతోమంది చిన్న వయసులోనే గుండెపోటుతో ప్రాణాలను కోల్పో తున్నారు. అసలు గుండె పోటు ఎందుకు వస్తుంది? గుండె పోటు వచ్చే ముందు మన శరీరం అసలు సంకేతాలు పంపిస్తుందా? ఈ కథనంలో చూద్దాం. జీవనశైలి మార్పులు, శారీరక శ్రమ లేకపోవడం, బీపీ, షుగర్ లాంటి వ్యాధుల బారిన పడిన వారిలో గుండె వ్యాధుల ప్రమాదం ఎక్కువ. అయితే ఇటీవలి కాలంలో అసలు అనారోగ్య సమస్యలేకపోయినా కూడా హార్ట్ ఎటాక్తో చనిపోతున్నారు. గుండెపోటు గుండె కండరానికి మంచి రక్తాన్ని తీసుకువెళ్లే రక్తనాళాలలో కొవ్వు కాని గడ్డలు కాని ఏర్పడడం వల్ల రక్తసరఫరాలో ఆటంకం ఏర్పడితే గుండె పోటు వస్తుంది. సాధారణంగా గుండె (కరోనరీ) ధమనులలో కొవ్వు, కొలెస్ట్రాల్ ,ఇతర పదార్థాలు పేరుకుపోవడం వల్ల అడ్డంకులు(బ్లాక్స్) ఏర్పడతాయి. రక్తనాళాలు పూడుకుపోవడం, రక్తాన్ని గుండె సరిగా సరఫరా చేయలేకపోవడం తదితర కారణాల వల్ల గుండె పోటు వచ్చే అవకాశముందని వైద్యులు చెబుతున్నారు. వీటికి సరైన సమయంలో చికిత్స అవసరం. అలాగే బాడీలో విపరీతంగా కొలెస్ట్రాల్ పెరిగిన వారు కూడా గుండెపోటు బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. గుండెపోటు వచ్చే ముందు కనిపించే లక్షణాలు వాస్తవానికి కొంతమందిలో తేలికపాటి లక్షణాలు ఉంటాయి. మరికొందరికి తీవ్రమైన లక్షణాలు ఉన్నాయి. కొందరిలో ఎలాంటి లక్షణాలు ఉండవు. కానీ సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు కచ్చితంగా కొన్ని లక్షణాలు కనిపిస్తాయని, కానీ చాలామంది వాటిని గుర్తించడంలో వైఫల్యంతోనే ముప్పు ముంచుకొస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి లక్షణాలు గుర్తించి, ప్రాథమిక చికిత్స తీసుకుంటే ప్రాణాపాయం తప్పే అవకాశం చాలా ఉందిలో ఉంటుందని అంటున్నారు. ►గుండెల్లో మంట లేదా అజీర్ణం ►గొంతులో ఏదో ఇరుక్కున్నట్లు అనిపించడం ►ఛాతీలో నొప్పి, గుండె లయలో మార్పులు ►శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ►తల తిరుగుతున్నట్లుగా అనిపిస్తుంది. ►తొందరగా అలసిపోవడం, అంటే కొద్దిగా నడిస్తేనే నీరసం ► నాలుగు మెట్టు ఎక్కంగానే ఆయాసం ఇలాంటి లక్షణాలున్నపుడు వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలి. ► మరి కొందరిలో ముందు దవడ, మెడ, జీర్ణాశయం పై భాగంలో నొప్పిగా ఉంటుంది. ► ఒకటి లేదా రెండు రోజులకు మించి ఎడం చెయ్యి లేదా రెండు చేతులలో అకారణంగా నొప్పి, వికారం, వాంతి వచ్చినట్టు ఉంటే కచ్చితంగా వైద్యుడిని సంప్రదించాలి లక్షణాలు లేకపోయినా ఎవరు జాగ్రత్త పడాలి ►అధిక బరువు వున్నా, హైబీపీ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నా, ధూమపానం అలవాటు ఉన్న వారంతా గుండె పోటు ప్రమాదం పట్ల అవగాహనతో ఉండాలి. ► అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండే ఉద్యోగాలు చేసేవారిలోనూ గుండె పోటు వచ్చే అవకాశాలు ఎక్కువ అనేది గమనించాలి. ►ముఖ్యంగా మధ్య వయసులో స్త్రీల కన్నా మగవారికి గుండెపోటువచ్చే ప్రమాదం ఎక్కువని నిపుణులు చెబుతన్నారు. ► మెనోపాజ్ దశలో మహిళల్లో ఈస్ట్రెజెన్ స్థాయి తగ్గిపోతుంది. అప్పుడు వారిలో గుండె పోటు ముప్పు పెరుగుతుంది. అయితే 65 ఏళ్ల తర్వాత పురుషుల్లో కంటే మహిళల్లో ఎక్కువ గుండె పోటు వస్తున్నట్టు పలు అధ్యయనాల ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురిలోనూ అలసత్వం ఎంతమాత్రం మంచిది కాదు. ►మరీ ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా గుండెపోటు వచ్చిన చరిత్ర ఉన్నా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. వంశపారంపర్యంగా ఈ గుండె వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. పై లక్షణాలున్నవారందరికీ గుండెజబ్బు వచ్చేసినట్టు కాదు. కానీ లక్షణాలు కనిపించగానే రోగ నిర్ధరణ అనేది చాలా కీలకం. క్రమం తప్పని వ్యాయామం, సమతుల ఆహారంపై శ్రద్దతో పాటు ఏ చిన్న అనుమానం వచ్చినా అజాగ్రత్త చేయకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవడం ఉత్తమం. -
మాజీ మంత్రికి గుండెపోటు
బీజేపీ నేత, పంజాబ్ మాజీ ఆర్థిక మంత్రి మన్ప్రీత్ సింగ్ బాదల్ ఆదివారం గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను వెంటనే భటిండాలోని జిందాల్ హార్ట్ హాస్పిటల్లో చేర్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడ ఉంది. మన్ప్రీత్ సింగ్ బాదల్కు రెండు స్టెంట్లు అమర్చామని, ఆయన త్వరలోనే కోలుకుంటుందని వైద్యులు తెలిపారు. ఎస్ఏడీ చీఫ్ సుఖ్బీర్ బాదల్ కూడా ఆసుపత్రికి చేరుకుని మన్ప్రీత్ ఆరోగ్యంపై ఆరా తీశారు. బటిండా అర్బన్ నుండి ఎమ్మెల్యే అయిన బాదల్ 2023 జనవరిలో కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలో చేరారు. కాంగ్రెస్, ఎస్ఏడీ ప్రభుత్వాల్లో మంత్రిగా పనిచేసిన ఆయన చాలాసార్లు పార్టీ మారారు. శిరోమణి అకాలీదళ్తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన మన్ప్రీత్ సింగ్ బాదల్ 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్ అనే ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత 2016లో కాంగ్రెస్లో చేరారు. ఎన్నికల్లో ఆప్ అభ్యర్థిపై ఓడిపోయిన తర్వాత 2023లో బీజేపీలో చేరారు. -
గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి!
ఉత్తర ప్రదేశ్లో విషాదకర ఘటన చోటు చేసుకుంది. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి చెందాడు. ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని హన్స్ వాహిని పాఠశాలలో శనివారం లంచ్ టైంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్నారు. ఆ సమయంలో చంద్రకాంత్(8) అనే బాలుడు అకస్మాత్తుగా నడుం చుట్టూ చేతులేసుకుని కుప్పకూలిపోయాడు. తోటి విద్యార్థులు అతన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. టీచర్లకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. గుండెపోటుకు గురై చనిపోయాడని వైద్యులు ప్రకటించారు. ప్రస్తుతం ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. గుండెపోటుతో 2వ తరగతి విద్యార్థి మృతి ఉత్తరప్రదేశ్ -ఫిరోజాబాద్ నగరంలోని హన్స్వాహిని పాఠశాలలో శనివారం మధ్యాహ్నభోజన సమయంలో విద్యార్థులంతా స్కూల్ ఆవరణలో ఆడుకుంటుండగా చంద్రకాంత్(8) అనే బాలుడు గుండెపోటుకు గురై కుప్పకూలిపోయాడు. pic.twitter.com/fsEWKuJLZU — Telugu Scribe (@TeluguScribe) March 10, 2024 Video Credits: Telugu Scribe -
అమ్మా.. 'ఎందుకు ఏడుస్తున్నావమ్మా..! నాన్నకు ఏమైంది..?
కరీంనగర్: ‘అమ్మా.. నాన్నకు ఏమైంది..? నాన్నాను ఎక్కడికి తీసుకెళ్తన్నారు.. ? మళ్లీ ఎప్పుడొస్తాడు..? అమ్మ ఎందుకు ఏడుస్తున్నావమ్మా..’ అంటూ ఆ చిన్నారులిద్దరూ అమాయకంగా అడుగుతుంటే ఏమని చెప్పాలో తెలియక అక్కడున్న వారందరూ గుండెలవిసేలా రోదించారు. నాన్న దూరమై చిన్నారులు.. కట్టుకున్న వాడు దూరమై భార్య, వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న ఒక్కగానొక్క కొడుకు దూరమై గుండెలవిసేలా ఏడుస్తున్న ఆ కుటుంబాన్ని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. స్థానికుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మూగల రవి (35) ఉపాధి నిమిత్తం గల్ఫ్ వెళ్లి మూడు నెలల క్రితమే ఇంటికొచ్చాడు. ప్రస్తుతం స్థానికంగా కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. బుధవారం ఉదయం అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. అప్పటివరకూ అందరితో కలివిడిగా గ్రామంలో తిరిగిన రవి గుండెనొప్పి బారిన పడడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన జగిత్యాల ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో మృతిచెందాడు. రవికి భార్య జ్యోతి (29), కూతుళ్లు శాన్వి (7), సమన్వి (4) ఉన్నారు. రవి తల్లిదండ్రులకు ఒక్కగానొక్క కొడుకు. చివరి దశలో ఆసరాగా ఉంటాడనుకున్న కొడుకు దూరమై తల్లిదండ్రులు, తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త మధ్యలోనే వదిలేసి వెళ్లడంతో వారి రోదనలు మిన్నంటాయి. తండ్రికి ఏమైందో తెలియని ఆ చిన్నారులు అమాయకంగా చూస్తుండడం అక్కడున్నవారిని కంటతడి పెట్టించింది. ఇవి చదవండి: తండ్రి మందలించాడని..