సమాన అవకాశాలతో కూడిన భారత్ కోసం ఇది అవసరం: జైరాం రమేష్ Caste Census Only Way To Ensure Equal Opportunity For All Says Jairam Ramesh | Sakshi
Sakshi News home page

సమాన అవకాశాలతో కూడిన భారత్ కోసం ఇది అవసరం: జైరాం రమేష్

Published Mon, Mar 25 2024 7:44 AM | Last Updated on Mon, Mar 25 2024 7:56 AM

Caste Census Only Way To Ensure Equal Opportunity For All Says Jairam Ramesh - Sakshi

భారతదేశంలో అందరికి సమానమైన అవకాశాలు కల్పించడానికి కుల గణన ఒక్కటే మార్గమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు.

1951 జనాభా లెక్కలతో ప్రారంభమైన షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు సంబంధించినవి మినహా జనాభా గణనలో కుల వర్గాన్ని తొలగించారని ఆయన పేర్కొన్నారు. 2021లో జరగాల్సిన చివరి జనాభా గణనను మోడీ ప్రభుత్వం పదేపదే వాయిదా వేసింది. స్వతంత్ర దేశం ఎదుర్కొంటున్న సవాళ్లను దృష్టిలో ఉంచుకుని ఇది అవసరమని జైరాం రమేష్ అన్నారు. 

గత మూడు దశాబ్దాలుగా ప్రభుత్వం, ప్రభుత్వ రంగంలోని విద్య, ఉద్యోగాలలో రిజర్వేషన్లు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకే కాకుండా వెనుకబడిన తరగతులకు, ఆర్థికంగా బలహీనవర్గాలకు వర్తించాయి. అయితే కేటగిరీల కింద ఉన్న సమూహాలు, వారికి సంబంధించి డేటా అందుబాటులో లేదు. అన్ని వర్గాల కింద ఉన్నవారికి సామజిక న్యాయం చేకూర్చడానికి ప్రతి సమూహానికి సంబంధించిన డేటా అవసరం. రిజర్వ్‌డ్ కేటగిరీలలో రిజర్వేషన్ ప్రయోజనాల మరింత సమానమైన పంపిణీని నిర్ధారించడానికి కూడా కుల గణన ఉపయోగపడుతుందని జైరాం రమేష్ పేర్కొన్నారు.

వేగవంతమైన ఆర్థిక అభివృద్ధిలో ఎవరు ప్రయోజనం పొందుతున్నారు, దాని ఖర్చులను ఎవరు భరిస్తారనేది మేము సమాధానం చెప్పాల్సిన ప్రశ్న. కులగణన లేకుంటే ప్రయోజనాలు సమానంగా పంపిణీ చేయడంలో లోపాలు తలెత్తుతాయి. కుల సమూహాలు, జాతీయ ఆస్తులు అన్నీ కూడా పాలనా వ్యవస్థలలో భాగం. సమగ్ర సామాజిక ఆర్థిక కుల గణన అని పిలవబడే ఈ సర్వే అందరికీ సమాన అవకాశాలతో కూడిన భారతదేశాన్ని నిర్ధారించడానికి ఏకైక పరిష్కారం అని జైరాం రమేష్ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement