-
జులైలో ప్రధాని రష్యా టూర్..!
న్యూఢిల్లీ: జులైలో ప్రధాని మోదీ రష్యాలో పర్యటించే అవకాశాలున్నాయి. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపనున్నారని తెలుస్తోంది. మోదీ చివరిసారిగా 2019లో రష్యాలో పర్యటించారు.రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత ఆయన రష్యాలో పర్యటించనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన ఒక రోజు మాత్రమే ఉండనున్నట్లు సమాచారం. పర్యటన వివరాలను ప్రభుత్వ వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే మోదీ పర్యటన కోసం రష్యాలో ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. పర్యటన తేదీ ఖరారైన తర్వాత ఇరు దేశాలు దీనిపై అదికారిక పర్యటన చేసే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. కాగా, ఇటీవలే మోదీ ప్రధానిగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత జీ7 సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితుడిగా ఇటలీకి వెళ్లొచ్చారు. -
రూ.14 వేలకే 'దివ్య దక్షిణ్ యాత్ర'..తొమ్మిది రోజుల్లో ఏకంగా ఏడు..!
దక్షిణాది పుణ్య క్షేత్రాలు దర్శించుకోవాలనుకునేవారికి ఇది మంచి ఆఫర్. తక్కువ ధరలోనే దక్షిణది పుణ్యక్షేత్రాలను దర్మించుకునేలా ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మంచి టూర్ ప్యాకేజ్ ప్రకటించింది. అందుకోసం సికింద్రబాద్ నుంచి మరో భారత గౌరవ్ టూరిస్ట్ రైలుని తీసుకొచ్చింది. పుణ్యక్షేత్రాలు, ఆధ్యాత్మిక ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటుచేసే భారత్ గౌరవ్ రైళ్లకు యాత్రికుల నుంచి అనూహ్య స్పందన రావడంతో సికింద్రాబాద్ నుంచి జ్యోతిర్లింగ సహిత దివ్యదక్షిణ యాత్ర కోసం ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ఈ పర్యటన తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రైలు ప్రయాణీకులకు జ్యోతిర్లింగం (రామేశ్వరం) దర్శనం చేసుకునే అవకాశాన్ని అందిస్తుంది. అలాగే ఇతర ముఖ్యమైన యాత్రా స్థలాలను కూడా కవర్ చేస్తుంది. ఈనెల 22 నుంచి ఈ యాత్ర ప్రారంభం అవుతుంది. ఈ గౌరవ్ రైలుని విజయవాడ, గూడూరు, ఖమ్మం, కాజీపేట, నెల్లూరు, ఒంగోలు, రేణిగుంట, సికింద్రాబాద్, తెనాలి, వరంగల్ స్టేషన్లలో ఎక్కొచ్చు. ప్రయాణం అనంతరం ఆయా రైల్వేస్టేషన్లలో దిగే వెసులుబాటు ఉంది. ఈ టూర్ మొత్తం ఎనిమిది రాత్రులు, తొమ్మిది పగళ్లుగా కొనసాగుతుంది. టూటైర్ ఏసీ, త్రీటైర్ ఏసీ, స్లీపర్ క్లాసుల్లో ప్రయాణానికి టికెట్లు బుక్ చేసుకోవచ్చు. టికెట్ ధరలు రూ.14వేల నుంచి మొదలవుతాయి.జర్నీ ఎలా సాగుతుందంటే..సికింద్రాబాద్లో మధ్యాహ్నం 12.00 గంటలకు రైలు బయలు దేరుతుంది. రెండో రోజు ఉదయం 7 గంటలకు తిరువణ్ణామలై(అరుణాచలం) చేరుకుంటారు. అరుణాచలం రైల్వే స్టేషన్కు చేరుకున్న తర్వాత, ఫ్రెష్ అవ్వడానికి హోటల్కు చేరుకుంటారు.ఆ తర్వాత అరుణాచలం ఆలయాన్ని దర్శించుకుంటారు. ఇక సాయంత్రం కుదల్నగర్కు పయనమవుతారు.మూడో రోజు ఉదయం 6.30 గంటలకు కూడాల్ నగర్ రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో రామేశ్వరానికి చేరుకుంటారు. హోటల్లో బస చేసి, ఫ్రెష్ అప్ అయిన తర్వాత రామేశ్వరంలోని దేవాలయాలను సందర్శిస్తారు రాత్రికి రామేశ్వరంలోనే బస ఉంటుంది.నాలుగో రోజు మధ్యాహ్న భోజనం తర్వాత రామేశ్వరం నుంచి మధురైకి బస్సులో బయలుదేరతారు. మీనాక్షి అమ్మ వారి ఆలయాన్ని దర్శించుకుంటారు. సాయంత్రం స్థానికంగా షాపింగ్ చేయడానికి సమయం ఉంటుంది. కన్యాకుమారి వెళ్లేందుకు రాత్రి కూడాల్ నగర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. రాత్రి 11.30 కన్యాకుమారికి పయనమవుతారు. ఐదో రోజు ఉదయం 8 గంటలకు కొచ్చువేలి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో కన్యాకుమారికి వెళ్తారు. హోటల్లో బస చేస్తారు. ఆ తర్వాత వివేకా రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్సెట్ పాయింట్ టూర్ ఉంటుంది. రాత్రికి కన్యాకుమారిలోనే స్టే చేస్తారు.ఆరో రోజు కన్యాకుమారి - కొచ్చువేలి - తిరుచ్చి-హోటల్ నుంచి చెక్ అవుట్ చేసి..రోడ్డు మార్గంలో త్రివేండ్రం బయలుదేరి వెళ్తారు. త్రివేండ్రంలో అనంత పద్మనాభస్వామి దేవాలయం, కోవలం బీచ్ని సందర్శిస్తారు. ఇక తిరుచిరాపల్లికి వెళ్లడానికి కొచ్చువేలి స్టేషన్లో రైలు ఎక్కుతారు.ఏడో రోజు ఉదయం 5 గంటలకు తిరుచిరాపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుంటారు. హోటల్ చేరుకుని ఫ్రెష్ అయ్యి తర్వాత శ్రీరంగం ఆలయ దర్శనానికి వెళ్తారు. మధ్యాహ్న భోజనం తర్వాత రోడ్డు మార్గంలో తంజావూరు (60 కి.మీ.) వెళ్తారు. తంజావూరు బృహదీశ్వర దేవాలయాన్ని సందర్శించుకుంటారు. అనంతరం రాత్రి 11 గంటలకుతంజావూర్లో సికింద్రాబాద్ రైలు ఎక్కుతారు.ఎనిమిదో రోజు మొత్తం రైలు జర్నీయే ఉంటుంది. పైన పేర్కొన్న స్టేషన్లలో స్టాపింగ్ ఉంటుంది. తొమ్మిదో రోజు ఉదయం 2:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది.ఛార్జీలు: ఎకానమీలో ఒక్కరికి రూ. 14,250, 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ. 13,250 చెల్లించాలి.స్టాండర్ట్లో ఒక్కరికిరూ.21,900; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.20,700 చెల్లించాలి.కంఫర్ట్లో ఒక్కరికిరూ.28,450; 5 నుంచి 11 ఏళ్ల మధ్య చిన్నారులకు రూ.27,010 చెల్లించాలి.ఫుడ్ ఐఆర్టీసీదే..రైలులో టీ, టిఫిన్, భోజనంన్ని ఐరా్టీసీనే ఏ ర్పాటు చేస్తుందియాత్రికులకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ఉంటుంది.పర్యాటక ప్రదేశంలో ఎక్కడైనా ప్రవేశ రుసుములు మాత్రం వ్యక్తులే చెల్లించువాల్సి ఉంటుంది.పుణ్యక్షేత్రాల్లో స్త్రీ, పురుషులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది.దక్షిణ భారత్లోని జ్యోతిర్లింగ దివ్య క్షేత్రాల ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ వివరాలు, బుకింగ్ కోసం ఐఆర్టీసీ టూరిజం లింక్పై క్లిక్ చేయండి.(చదవండి: తిరుచ్చిలో చూడాల్సిన అద్భుత పర్యాటకప్రదేశాలివే..!) -
లండన్ కు చేరుకున్న సీఎం జగన్
-
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్ పర్యటన
-
చైనా–రష్యా కరచాలనం!
తాము చైనాను పీపుల్స్ రిపబ్లిక్గా గుర్తించి 75 యేళ్లు అవుతుండగా... ఉక్రెయిన్ దురాక్రమణ యుద్ధంలో పట్టు సాధించిన ఛాయలు కనబడుతుండగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బీజింగ్లో అడుగుపెట్టారు. రెండు రోజుల పర్యటనలో ఇరు దేశాలమధ్యా వివిధ ఒప్పందాలు కుదరటంతోపాటు సంయుక్త ప్రకటన కూడా విడుదలైంది. ప్రచ్ఛన్నయుద్ధ కాలంనాటి మనస్తత్వాన్ని విడనాడాలని రెండు దేశాలూ అమెరికాకు హితవు పలికాయి. ప్రాంతీయ భద్రత, రక్షణ బేఖాతరు చేస్తూ కొన్ని బృందాలకు మద్దతుగా నిలిచే వినాశకర విధానాలకు స్వస్తి పలకాలని సూచించాయి. పుతిన్ వరసగా ఆరోసారి ఎన్నికై దేశాధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొమ్మిది రోజులవుతోంది. 2030 వరకూ ఆయనదే రాజ్యం. అయితే ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ప్రపంచం మునపట్లా లేదు. ఆంక్షల చక్రబంధంలో బిగించి రష్యాను పాదాక్రాంతం చేసుకోవాలని అమెరికా, దానికి మద్దతుగా నిలిచిన యూరొప్ దేశాలూ పట్టుదలగా వున్నాయి. పర్యవసానంగా రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వణుకుతోంది. ఆ దేశంతో ఎవరు లావాదేవీలు సాగించినా చర్యలు తీసుకుంటామని అమెరికా హెచ్చరిస్తోంది. రెండేళ్ల క్రితం రష్యా ఉక్రెయిన్పై దండెత్తటానికి కొన్ని రోజులముందు రష్యా–చైనాల మధ్య ‘హద్దుల్లేని వ్యూహాత్మక ఒప్పందం’ కుదిరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ రెండు దేశాలూ ఇప్పటికీ ‘హద్దులెరగని’ బంధాన్ని కొనసాగిస్తాయా... రష్యాపై అమలవుతున్న ఆంక్షలకూ, అమెరికా హెచ్చరికలకూ చైనా తలొగ్గుతుందా అనే ప్రశ్నలు గత కొన్ని రోజులుగా పాశ్చాత్య ప్రపంచాన్ని వేధిస్తున్నాయి. పుతిన్కు బీజింగ్లో దక్కిన ఘనస్వాగతమూ, ఇరు దేశాల ఉమ్మడి ప్రకటనా, ఉభయ దేశాధినేతల ప్రసంగాలూ గమనించాక అమెరికా, యూరొప్ దేశాలకు అసంతృప్తే మిగిలివుంటుందన్నది వాస్తవం. అయితే 75 ఏళ్లక్రితం కొత్తగా ఆవిర్భవించిన చైనాను గుర్తించిననాటి సోవియెట్ యూనియన్కూ, ఇప్పటి రష్యాకూ పోలికే లేదు. అప్పట్లో అది అమెరికాతో ‘నువ్వా నేనా’ అన్నట్టు తలపడే తిరుగులేని శక్తి. అనంతర కాలంలో ఆ దేశం కుప్పకూలింది. చీలికలు పేలికలైంది. ఈ మూడు దశాబ్దాల్లో గత వైభవాన్ని సంతరించుకోవాలని చేసిన ప్రయత్నాలు ఎంతో కొంత ఫలిస్తున్న వైనం కనబడుతుండగానే క్రిమియా ఆక్రమణ, ఆ తర్వాత ఉక్రెయిన్పై దురాక్రమణ యుద్ధం రష్యాను సంక్షోభంలోకి నెట్టాయి. చైనా మాదిరే భద్రతామండలిలో రష్యా శాశ్వతసభ్య దేశమే కావొచ్చు. కానీ ఇప్పుడది దాదాపు ఒంటరి. చెప్పాలంటే చైనాకు జూనియర్ భాగస్వామి.తమది కూటమి కాదని, తమ స్నేహం వెనకున్న ఉద్దేశం దశాబ్దాల బంధాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లటమేనని ఉభయ దేశాలూ చెబుతున్నాయి. కానీ ఆ రెండు దేశాల ఉమ్మడి ప్రత్యర్థి అమెరికాయేనని ప్రపంచానికంతకూ తెలుసు. డ్రోన్లు, క్షిపణి సాంకేతికత, ఉపగ్రహ నిఘా నివేదికలు, ఫైటర్ జెట్లకు పనికొచ్చే విడిభాగాలు, మైక్రోచిప్లు సరఫరా చేస్తూ దురాక్రమణ యుద్ధానికి చైనా ఆజ్యం పోస్తున్నదని అమెరికా అనుమానం. ఈ చైనా సంస్థలను నిషేధ జాబితాలో పెడతామని హెచ్చరిస్తోంది. ఇది ఎంతోకొంత పనిచేసింది. చైనా బ్యాంకులు రష్యా సంస్థలతో మొన్న మార్చినుంచి లావాదేవీలు బాగా తగ్గించాయి. పర్యవసానంగా ఇటీవల వాణిజ్యం మందగించింది. దీన్ని మళ్లీ యధాస్థితికి తీసుకెళ్లటం పుతిన్ ప్రాధాన్యాంశాల్లో ఒకటి. అందుకే ఆయన వెంట భారీ ప్రతినిధి బృందం బీజింగ్ వెళ్లింది. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలు గమనిస్తే చైనాతో రష్యా వాణిజ్యం రికార్డు స్థాయిలో 24,000 కోట్ల డాలర్లకు చేరుకుంది. ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యే నాటికున్న వాణిజ్యంతో పోలిస్తే ఇది 60 శాతం అధికం. రష్యా ఎగుమతుల్లో చైనా వాటా 30శాతం కాగా,దాని దిగుమతుల్లో చైనా వాటా 40శాతం. ఆంక్షల బారిన పడకుండా వ్యాపార, వాణిజ్యాలను ఎలా కొనసాగించాలన్నదే ప్రస్తుతం రష్యా, చైనాల ముందున్న ప్రశ్న. ఇంధనం, పరిశ్రమలు, వ్యవసాయం, నిర్మాణ రంగాల్లో తమకు సహకరించాలని పుతిన్ అర్థించారు. అలాగే ఆంక్షల తర్వాత ఎలక్ట్రానిక్ ఉపకరణాల నుంచి కార్ల వరకూ అన్ని మార్కెట్లనుంచీ పాశ్చాత్య దేశాలు తప్పుకున్నాయి. ఆ లోటును చైనా తీరుస్తోంది. దాన్ని మరింత పెంచాలని ఉభయ దేశాలూ నిర్ణయించాయి. డాలర్లలో కాక తమ తమ కరెన్సీల్లోనే లావాదేవీలు జరుపుకుంటున్నాయి. జార్ చక్రవర్తుల కాలం నుంచీ పాశ్చాత్య దేశాలతో రష్యాకున్న వాణిజ్యబంధం ఇప్పుడు పూర్తిగా స్తంభించిపోయింది. ఇన్నాళ్లూ యూరొప్ దేశాలకు వెళ్లిన సహజవాయు ఎగుమతుల్ని చైనాకు మళ్లించేందుకు పుతిన్ సిద్ధపడినా ప్రస్తుతానికైతే ఒప్పందం ఖరారు కాలేదు. వ్లాదిమిర్ సోరోకిన్ అనే రచయిత 2028 నాటికి రష్యా పోకడలెలా వుంటాయో చిత్రిస్తూ 2006లో ‘డే ఆఫ్ ఆప్రిష్నిక్’ అనే నవల రాశాడు. అప్పటికల్లా చైనా సాంకేతికతే అన్ని రంగాల్లోనూ వర్ధిల్లుతుందనీ, కానీ జార్ సామ్రాజ్యానికి ఆద్యుడిగా భావించే మధ్యయుగాలనాటి మాస్కో ప్రిన్స్ ఇవాన్ను తలపించే అత్యంత క్రూరమైన పాలన సాగుతుందనీ ఆ కాల్పనిక ఇతివృత్తం చెబుతుంది. పుతిన్ ఎలా పరిణమిస్తారన్న సంగతలావుంచి చైనా సాంకేతికతలు ఇప్పటికే రష్యాకు వచ్చాయి. చైనా కార్లు రష్యా రోడ్లపై పరుగులెడుతున్నాయి. ప్రపంచం గతంలో మాదిరి లేదని, ఎవరినీ ఎవరూ శాసించలేరని అమెరికా, పాశ్చాత్య దేశాలు గుర్తించాలి. ఉద్రిక్తతలు ఉపశమింపజేసేందుకూ, శాంతి సాధనకూ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వ్యవహరించటం, రాజీకి సిద్ధపడటం అవసరమని ఇరు పక్షాలూ తెలుసుకోవాలి. అందుకు భిన్నమైన వినాశకర మార్గంలో పోతామంటే ప్రపంచ ప్రజానీకం క్షమించదు. -
గుండె నిండా కేసీఆర్..
-
పవన్ ఆపసోపాలు.. హైదరాబాద్ ఫాంహౌస్కు జంప్
‘‘రెండు రోజులు ప్రచారం చేయలేని వాడు ఎమ్మెల్యే అవుతాడా?. హైదరాబాద్ ఫాంహౌస్లకు అలవాటు పడిన వాడు పిఠాపురంలో ఇల్లు కట్టుకుంటాడా?. పార్ట్టైం పాలిట్రిక్స్ చేస్తే జనం నమ్ముతారా?. స్టంట్లలో డూపులను పెట్టినట్టు.. జనసేన సింబల్ కింద టీడీపీ నేతలతో పోటీ చేయిస్తావా?. ఇదేనా నిఖార్సయిన రాజకీయం?. ఇదేనా గోదావరి ప్రజల ముందుకెళ్లి తేల్చుకునే అంశం?’’ అంటూ పవన్కల్యాణ్పై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. జ్వరం కారణంగా పవన్ కల్యాణ్ తెనాలి పర్యటనను రద్దు చేసుకున్నారు. హైదరాబాద్కు వెళ్లిపోయిన పవన్.. మూడు రోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒక్కరోజు ఎండలో తిరిగేసరికి జ్వరం వచ్చి వెంటనే ఆస్పత్రికి పరుగెత్తే పరిస్థితి వచ్చింది.. దీంతో అయన టూర్ కోసం ఈరోకు ఎదురు చూసిన జనసైనికులు.. అక్కడి ఓటర్లు అయ్యో.. సేనాని దమ్ము ఇంతేనా.. ముదురు కబుర్లు చెప్పడం.. నోటికొచ్చినట్లు అరవడం.. స్క్రిప్టెడ్ డైలాగ్స్ చెప్పడం తప్ప ఆయనకు పట్టుమని రెండ్రోజులు కూడా ప్రజల్లో ఉండే స్టామినా లేదా అని నవ్వుకుంటూన్నారు. ఇక ఈయన మిగతా నియోజకవర్గాల్లో టూర్లు చేస్తారా.. క్యాడర్ కోసం అన్ని జిల్లాలు ఈ నిప్పులుగక్కే ఎండల్లో తిరిగి ప్రచారం చేయగలరా? పిఠాపురం ఒక్కదానికే ఆయన ఆపసోపాలు పడిపోతుంటే మిగతా జిల్లాలకు వస్తారన్న నమ్మకమే పోతోంది అంటున్నారు. ఆయన్ను నమ్ముకుని టిక్కెట్లు తెచ్చుకుని డబ్బులు ఖర్చు చేసి పోటీకి దిగిన మా పరిస్థితి ఏమిటని అభ్యర్థుల్లో ఆందోళన మొదలైంది. దీంతో ఆగండాగండి రెండ్రోజులు రెస్ట్ తీసుకుని.. బ్రాయిలర్ కోడి మళ్లీ కోలుకుని కూతకు వస్తుంది అని కొందరు పంచులు వేస్తున్నారు. మరో వైపు, పిఠాపురంలో పవన్ కల్యాణ్ పిల్లి మొగ్గలు వేస్తున్నారు. గతంలో టీడీపీని గెలిపిస్తే నన్ను నా తల్లిని తిట్టారు.. టీడీపీ వాళ్ళను వదిలిపెట్టను అన్నారు. కానీ, మళ్ళీ టీడీపీతో అంటకాగుతున్నారు. ఇక ఇప్పుడు పిఠాపురంలో పోటీకి దిగిన పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ఎన్నికలు అంటే అసలు భయం పట్టుకుని తనను తానూ ఓ యోధుడిగా భావించుకుని రాజకీయాలు చేస్తున్నారు. పవన్ గతంలో భీమవరం.. గాజువాక.. రెండుచోట్లా ఓడిపోవడంతో షాక్ తిన్నారు. దీంతో ఇప్పుడు పిఠాపురంలో ఎలాగైనా గెలిపించాలని అర్థిస్తున్నారు. సీఎం అవ్వాలనుకుంటే నన్నెవడ్రా ఆపేది అనే డైలాగ్స్ దగ్గర్నుంచి ప్లీజ్.. నన్ను గెలిపించండి.. అర్థిస్తున్నాను అనేవరకు పవన్ వచ్చారు. -సిమ్మాదిరప్పన్న -
కేసీఆర్ దూకుడు మరో పర్యటనకు సిద్ధం
-
US: విమానం కన్నా హాయిగా అమెరికాలో బస్సు జర్నీ!
మనం ఇప్పటికీ దేశంలోని చాలా ప్రాంతాల్లో వందల సంవత్సరాలనాటి దారులనే అటు ఇటుగా బాగుచేసుకుంటూ వాటిపైనే ప్రయాణాలు చేస్తున్నాం. అమెరికా వాళ్ళు రాబోయే వందేళ్ల అవసరాలకు ఉపయోగపడే విశాలమైన రోడ్లు దేశమంతా ఎప్పుడో వేసుకున్నారు. ఆ దేశంలో అడుగుపెట్టిన భారతీయులను ముందుగా ఆశ్చర్యచకితులను చేసేవి అక్కడి పెద్దపెద్ద లైన్ల రహదారులు, ఫ్లై ఓవర్లు. అక్కడ రోడ్ల మీద మనకు మనుషులు కనబడరు, పరుగులు తీస్తున్న వాహనాలే దర్శనమిస్తాయి. గుంపులు గుంపులుగా మనుషులను చూడాలంటే మాల్స్కో, సినిమా హాల్స్ కో వెళ్లాల్సిందే. మన దేశంలో మనుషుల కొరత మాత్రం లేదు, ఎక్కడికి వెళ్లినా తనివితీరా చూడొచ్చు, చివరికి ఇండ్లలో కూడా. అయితే ఈ మానవ వనరులే మనకిప్పుడు పెద్ద పెట్టుబడి అయింది నిజం.అమెరికాలో జనం ఎక్కువగా విమానాల్లోనే దూర ప్రయాణాలు చేస్తున్నారు, కార్లలో తిరుగుతున్నారు. మనవాళ్లతో పోల్చుకుంటే అక్కడ రైలు, బస్సు ప్రయాణాలు చాలా తక్కువనే చెప్పాలి, వాళ్లకు అంత ఓపిక ఉండడం లేదు. అక్కడి బస్సుల్లో ఎక్కువగా తిరిగేది శ్రామిక వర్గానికి చెందిన నల్లవారు, మెక్సికో, చైనా వంటి దేశస్తులు. నేను 2008లో అమెరికాలో పర్యటించినప్పుడు తప్పనిసరై టెక్సాస్లోని డాలస్ నుంచి వేన్ కౌంటీలో ఉన్న టేలర్కు బస్సులో జూన్ 7 న ప్రయాణమై వెళ్ళాను. అమెరికా వెళ్లి అక్కడ ఫ్లై ఓవర్ నిర్మాణ నిపుణుడిగా ఉద్యోగం చేస్తున్న మా బంధువుల అబ్బాయి ప్రోత్సాహంతో బస్సు ఎక్కాను. సరదాగా ఉంటుంది వెళ్ళమని నన్ను డల్లాస్ - టేలర్ బస్ జర్నీ కి ప్రోత్సహించింది అతనే. ఆ రోజుల్లో ఈ ప్రయాణ ఛార్జి 44.50 డాలర్లు, మన రూపాయల్లో దాదాపు 3 వేల పైమాటే. నా పాసుపోర్టు చూశాకనే, లగేజీ చెక్ చేశాకనే బస్సులోకి అనుమతించారు. నేను ఎక్కింది వన్ మ్యాన్ సర్వీస్ కావడం వల్ల అన్ని పనులు డ్రైవరే చూసుకునేవాడు, ప్రయాణికుల లగేజీ సర్దిపేట్టేది ఆయనే, వారు దిగేప్పుడు తీసి ఇచ్చేది కూడా అతనే. ఇది చిన్న పని అది పెద్ద పని అనే ఆలోచన చేయకుండా, ప్రయాణికుల నుండి ఏమీ ఆశించకుండా ఓపిగ్గా అన్నీ డ్రైవరే చేయడం విశేషం. అన్నట్లు అమెరికాలో లేడీ డ్రైవర్లు కూడా ఎక్కువే. అమెరికాలో గ్యాస్ స్టేషన్లు అంటే పెట్రోల్ బంకులు చాలా సర్వీస్ చేస్తుంటాయి. అక్కడ కేవలం గ్యాస్ మాత్రమే కాదు ప్రయాణికులకు కావలసిన వస్తువులు దొరుకుతాయి, తినడానికి, విశ్రాంతికి సౌకర్యంగా ఉంటుంది. పాకిస్తానీలు చాలా మంది ఈ స్టేషన్ స్వంతదారులు, పనిలో మనవాళ్ళు కనబడుతుంటారు, ఒంటరిగా ఉంటే గన్తో వచ్చి బెదిరించి ఉన్నవి లాక్కునేవాళ్ళను స్థానికులు అంటారు. మన గమ్యం వస్తుందంటే డ్రైవరే అనౌన్స్ చేస్తుంటాడు, అతన్ని టీవీ స్క్రీన్ మీద గమనించవచ్చు. బస్ టికెట్తో పాటు ఇచ్చిన ప్రకటనల బ్రోచర్స్లో ఆనాటి ఇరాక్ యుద్ధం వల్ల సైనికుల అవసరం పెరిగి సైన్యంలో చేరమన్న విజ్ఞప్తులు కనబడ్డాయి. బస్సులో చాలా మంది ఆడవాళ్లు మేకప్తో కాలక్షేపం చేస్తుంటే మరికొందరు మ్యూజిక్ వింటూ ఊగిపోయేవారు. బస్సులోనే చిన్న టాయిలెట్ మంచి సౌకర్యం ఉంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పొగ త్రాగడం నిషేధం. డౌన్ టౌన్ లో ప్రవేశించే వరకు ప్రయాణం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా హాయిగానే సాగింది. డాలస్లో ఉదయం 6 గంటలకు బయలుదేరిన బస్సు దాదాపు 5 గంటల ప్రయాణం తర్వాత గమ్యస్థానం చేరింది. భారతదేశంతో పోలిస్తే.. ఇక్కడి బస్సు ప్రయాణంలో ఎలాంటి అలసట అనిపించలేదు. సుఖవంతమైన ప్రయాణం కదా అనిపించింది. బస్సులోన నిశబ్ధం, విశాలమైన రోడ్లపై వాహనాల టైర్ల సౌండ్, మధ్యమధ్యన బ్రేక్లలో స్నాక్స్. ఇప్పుడు హైదరాబాద్ - విజయవాడ మధ్య, హైదరాబాద-బెంగళూరు లేదా విజయవాడ - విశాఖ మధ్య బస్సు ప్రయాణం కూడా ఇలాంటి అనుభవమే కనిపిస్తోంది. మున్ముందు మనం కూడా అమెరికా తరహాలో రోడ్డు ప్రయాణం ఉంటుందని ఆశిద్దాం వేముల ప్రభాకర్ (చదవండి: US: అమెరికాలో 911..అదో పెద్ద హడావిడి!) -
రేపు సీఎం జగన్ కర్నూలు, నంద్యాల జిల్లాల పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కర్నూలు, నంద్యాల జిల్లాల్లో ఈ నెల 14న పర్యటించనున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఆయన కర్నూలు జిల్లా ఓర్వకల్లు చేరుకుంటారు. అక్కడ నేషనల్ లా యూనివర్సిటీకి భూమి పూజ చేస్తారు. అనంతరం నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరవుతారు. వైఎస్సార్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల చేసి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తారు. సాయంత్రం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. ముస్లింలకు సీఎం జగన్ శుభాకాంక్షలు పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన నేపథ్యంలో ముస్లిం సోదర, సోదరీమణులకు సీఎం జగన్ శుభాకాంక్షలు తెలుపుతూ మంగళవారం సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్ట్ చేశారు. -
‘కజిరంగా’కు ప్రధాని మోదీ.. దీని ప్రత్యేకతలివే!
ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు(శనివారం) నాలుగు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేయనున్నారు. ఆయన నేడు యూపీతోపాటు అసోం, అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్లలో పర్యటిస్తున్నారు. అసోంలోని కజిరంగాలోని నేషనల్ పార్క్లో సఫారీతో ప్రధాని మోదీ పర్యటన ప్రారంభమయ్యింది. ఈ రిజర్వ్ ఫారెస్ట్లో ప్రధాని మోదీ జీప్ సఫారీతో పాటు ఏనుగు సవారీ కూడా చేశారు. ఈ కజిరంగా నేషనల్ పార్క్ ప్రత్యేకతల విషయానికొస్తే.. ఇది 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. వివిధ జాతులకు చెందిన వెయ్యికి మించిన జంతువులు ఇక్కడ నివసిస్తున్నాయి. ఒక కొమ్ము గల ఖడ్గమృగం ఈ రిజర్వ్ ఫారెస్ట్ ప్రత్యేకత. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పార్కులో 2200కు పైగా ఒక కొమ్ము ఖడ్గమృగాలు ఉన్నాయి. అలాగే ఈ పార్క్ 180కు మించిన బెంగాల్ పులులకు నిలయం. #WATCH | Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/Kck92SKIhp — ANI (@ANI) March 9, 2024 కజిరంగా నేషనల్ పార్క్ నమూనాను నాటి లార్డ్ కర్జన్ భార్య 1904లో రూపొందించారు. 1905, జూన్ ఒకటిన ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పాటయ్యింది. పార్క్ 430 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. 1908లో గోలాఘాట్, నాగావ్ జిల్లాలను ఈ పార్కు కలిపింది. యునెస్కో దీనిని 1985లో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది కజిరంగాను 2006లో టైగర్ రిజర్వ్గా ప్రకటించారు. ఈ పార్క్ నవంబర్ నుండి ఏప్రిల్ వరకు పర్యాటకుల కోసం తెరిచి ఉంటుంది. మే ఒకటి నుండి అక్టోబర్ 31 వరకు పార్కును మూసివేస్తారు. ఈ పార్కులో ఏనుగులు 1,940,వైల్డ్ బఫెలోలు 1666, జింకలు 468 ఉన్నాయి. Assam CM Himanta Biswa Sarma shares video of PM Modi's arrival at Kaziranga National Park pic.twitter.com/FlsjC2fwgU — ANI (@ANI) March 8, 2024 -
నేడు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ బుధవారం ప్రకాశం జిల్లాలో పర్యటించనున్నారు. ఇందుకోసం బుధవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి దోర్నాల మండలం ఎగువ చెర్లోపల్లికి సీఎం జగన్ చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో పాల్గొని పైలాన్ను ఆవిష్కరిస్తారు. అనంతరం వ్యూ పాయింట్ నుంచి వెలిగొండ ప్రాజెక్ట్ను, రెండో టన్నెల్ను పరిశీలిస్తారు. ఆ తర్వాత పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు రెండో టన్నెల్ను సీఎం జగన్ జాతికి అంకితం చేస్తారు. అనంతరం అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు. -
బీఆర్ఎస్, కాంగ్రెస్ల స్కాముల బంధం గట్టిది: ప్రధాని
Updates: 12:36PM, Mar 5th, 2024 ముగిసిన ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్రెడ్డి ప్రధానికి వీడ్కోలు పలికిన గవర్నర్, సీఎం రెండురోజుల తెలంగాణ పర్యటన ముగించుకున్న ప్రధాని మోదీ 12:26PM, Mar 5th, 2024 బీఆర్ఎస్, కాంగ్రెస్ల మధ్య స్కాముల బంధం గట్టిది: ప్రధాని తెలంగాణలో బీఆర్ఎస్ కుంభకోణాలు చూసి ప్రజలు కాంగ్రెస్కు అవకాశమిచ్చారు అయితే బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటే బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య కుంభకోణాల బంధం బలంగా ఉంది కాళేశ్వరంలో బీఆర్ఎస్ దోచుకుంటే విచారణ పేరుతో కాంగ్రెస్ దోచుకుంది. కాంగ్రెస్ తెలంగాణను కొత్త ఏటీఎంగా మార్చుకుంది కాంగ్రెస్ సర్కారు ఆటలు ఎక్కువ కాలం సాగవు మోదీ సర్కారులో ఎయిర్ దాడులు కూడా ఉంటాయి 12:10PM, Mar 5th, 2024 కుటుంబవాదులకు వ్యతిరేకంగా పోరాడుతున్నా : ప్రధాని మోదీ జమ్మూకాశ్మీర్ నుంచి తమిళనాడు దాకా కుటుంబ పార్టీలున్న చోట కుటుంబాలు బాగుపడ్డాయి. కుటుంబవాద పార్టీలు ప్రజాస్వామ్యానికి శత్రువులు పరివార వాదులకు చోరీ చేసేందుకు లైసెన్స్ ఉందా వాళ్లకు కుటుంబం ఫస్ట్... నాకు దేశం ఫస్ట్ కాంగ్రెస్ బయటివారికి ఎవరికీ అవకాశం ఇవ్వదు కుటుంబవాదులు సొంత ఖజానా నింపుకున్నారు. మోదీ దేశఖజానా నింపాడు నేను ఎవరిపైనా వ్యక్తిగత విమర్శలు చేయలేదు. కుటుంబవాదులు మోదీపైనే దాడి చేస్తున్నారు దేశంలో ప్రతి తల్లి, సోదరి, యువకులు, పిల్లలందరూ మోదీ కుటుంబమే ఇందుకు అందరూ మోదీకా పరివార్ అని అంటున్నారు నేను మోదీ కుటుంబం అని తెలంగాణ ప్రజలంటున్నారు తెలంగాణప్రజల కలలు.. నా సంకల్పం ఈ పదేళ్లలో జరిగిన అభివృద్ధి దేశంలో గత 70 ఏళ్లలో జరగలేదు నేను గ్యారెంటీ వ్యక్తిని.. గ్యారెంటీ పూర్తి చేయడం నాకు తెలుసుఘె ఎస్సీ వర్గీకరణపై ఉన్నతస్థాయి కమిటీ వేశాం తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది ఇవాళ రెండోరోజు తెలంగాణ ప్రజలతో ఉండటం సంతోషం సంగారెడ్డి నుంచి రూ. 7వేల కోట్ల అభివృద్ది పనులు ప్రారంభిస్తున్నాం ఎవియేషన్ రంగంలో తెలంగాణకు లబ్ధి చేకూరుతోంది పదేళ్లలో దేశంలో ఎయిర్పోర్టుల సంఖ్య రెట్టింపు అయింది వికసిత్ భారత్ దిశగా మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది దేశంలో తొలి ఎవియేషన్ సెంటర్ను బేగంపేటలో ఏర్పాటు చేశాం ఘట్కేసర్- లింగంపల్లి మధ్య ఎంఎంటీఎస్ ప్రారంభించాం పటాన్చెరులో ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించిన కార్యక్రమాలు NH-65 లోని పుణే - హైదరాబాద్ రహదారిలో సంగారెడ్డి X రోడ్ నుంచి మదీనాగూడ మధ్యన 31 కి.మీ.ల 6 లేన్ హైవే విస్తరణ (1,298 కోట్లు) NH-765Dలో 399 కోట్లతో మెదక్ - ఎల్లారెడ్డి మధ్యన 2 లైన్ హైవే విస్తరణ NH-765Dలో 500 కోట్లతో ఏల్లారెడ్డి - రుద్రూర్ మధ్యన 2 లైన్ హైవే విస్తరణ పనులు జాతికి అంకితం చేసిన ప్రాజెక్టులు (b) పారాదీప్ - హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ 3,338 కోట్లు NH-161 లోని కంది - రామసానిపల్లె సెక్షన్ లో 4 వరుసల జాతీయ రహదారి (1,409 కోట్లు) NH-167 లోని మిర్యాలగూడ - కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి విస్తరణ (323 కోట్లు) హైదరాబాద్, సికింద్రాబాద్ల్లో 103 కి.మీ.ల పొడవున చేపట్టిన MMTS ఫేజ్ - II ప్రాజెక్ట్ (1,165 కోట్లు) ఘట్ కేసర్ - లింగంపల్లి మధ్యన కొత్త MMTS రైలు ప్రారంభం తక్కువ చార్జీలకే హైదరాబాద్ ప్రయాణ సౌకర్యం: కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం కృషి చేస్తోంది ఘట్కేసర్-లింగంపల్లి మధ్య అందుబాటులోకి కొత్త ఎంఎంటీఎస్ ఇవాళ రూ.9 వేల కోట్ల ప్రాజెక్టులను ప్రధాని ప్రారంభింస్తారు గత పదేళ్లుగా తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోదీ ప్రభుత్వం అంకితభావంతో పనిచేసింది. తెలంగాణలో నరేంద్ర మోదీ ప్రభుత్వం అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది. జాతీయ రహదారుల కోసం రూ. 1.20 లక్షల కోట్లు ఎరువుల సబ్సిడీ కోసం రూ. 33 వేల కోట్లు రైల్వేల అభివృద్ధి కోసం రూ. 35 వేల కోట్లు. రేషన్ సబ్సిడీపై రూ. 30 వేల కోట్లు, ఉపాధి హామీ పథకం కింద రూ. 26,728 కోట్లు. రామగుండం ఎన్టీపీసీ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల పవర్ ప్రాజెక్టు కోసం రూ. 10,998 కోట్లు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ. 10 వేల కోట్లు. సర్వశిక్షా అభియాన్ కింద రూ. 7,500 కోట్లు. గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం రూ. 7,200 కోట్లు రామగుండంలో యూరియా పరిశ్రమ కోసం రూ. 6,338 కోట్లు. ఎల్పీజీ సబ్సిడీ కింద రూ. 5,859 కోట్లు హెల్త్ మిషన్ కింద రూ. 5,550 కోట్లు. ప్రధానమంత్రి కేంద్రీయ విశ్వవిద్యాలయాల కోసం రూ. 4,500 కోట్లు స్వచ్ఛ భారత్ కింద రూ. 3,745 కోట్లు.. ఈఎస్ఐ మెడికల్ కాలేజ్, హాస్పిటల్, ఎయిమ్స్.. ఇలా అనేక రకాలుగా తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రం కృషి చేసింది. బీఆర్ఎస్ పార్టీ కేంద్రం తెలంగాణకు ఏం ఇవ్వడం లేదంటూ బురదజల్లుతోంది. కేసీఆర్ కుటుంబ పాలనతో తెలంగాణ సంపద దోచుకున్నారు. 11:00AM, Mar 5th, 2024 పటేల్గూడలోని ఎస్ఆర్ ఇన్ఫినిటీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 10:40AM, Mar 5th, 2024 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న ప్రధాని మోదీ కాసేపట్లో సంగారెడ్డికి వెళ్లనున్న మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించనున్న మోదీ 10:30AM, Mar 5th, 2024 ఉజ్జయిని మహంకాళి ఆలయం నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు బయలుదేరిన ప్రధాని మోదీ 10:20AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దర్శించుకున్నారు మహంకాళి అమ్మవారి ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు ప్రధాని మోదీ పూజలు చేసే సమయంలో ఆలయం లోపలికి ఇద్దరికి మాత్రమే అనుమతి దేవాలయం చుట్టూ వెయ్యిమంది పోలీసులతో సెక్యూరిటీ అమ్మవారి దర్శనం అనంతరం బేగంపేట ఎయిర్పోర్టుకు ప్రధాని #WATCH | Telangana: Prime Minister Narendra Modi visits and offers prayers at Ujjaini Mahankali temple in Secunderabad. pic.twitter.com/zijxd4LYAX — ANI (@ANI) March 5, 2024 10:06AM, Mar 5th, 2024 సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి చేరుకున్న ప్రధాని 9:50AM, Mar 5th, 2024 కాసేపట్లో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయానికి ప్రధాని మోదీ ప్రధాని నరేంద్రమోదీ రెండో రోజు తెలంగాణ పర్యటన షెడ్యూల్ రాజ్ భవన్ నుంచి బయలుదేరనున్న ప్రధాని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి పఠాన్ చెరువు బయలుదేరనున్న ప్రధాని పఠాన్ చెరువులో ఉదయం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్న ప్రధాని పఠాన్ చెరువు బహిరంగ సభలో మాట్లాడనున్న ప్రధాని సభకు ఏర్పాట్లు పూర్తి.. భారీగా బందోబస్తు ప్రధాని సభ కోసం పటాన్చెరులోని పటేల్గూడ సభా వేదిక వద్ద 23 ఎకరాల్లో భారీగా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం, పరిసర ప్రాంతాలను ఫ్లెక్సీలు, కటౌట్లు, కాషాయ జెండాలతో నింపేశారు. అధికారిక కార్యక్రమాల కోసం ఒకటి, రాజకీయ ప్రసంగం కోసం మరొకటి.. రెండు వేదికలను ఏర్పాటు చేశారు. ప్రధాని ముందుగా అధికారిక కార్యక్రమాలు నిర్వహించి, తర్వాత బహిరంగ సభా వేదికపై ప్రసంగిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని మెదక్, జహీరాబాద్ లోక్సభ సీట్లతోపాటు సమీపంలోని నియోజకవర్గాల్లో పార్టీ అభ్యర్థులకు మద్దతు కూడగట్టేలా ప్రధాని సభను నిర్వహిస్తున్నారు. కాగా ప్రధాని పర్యటన సందర్భంగా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ఉజ్జయని మహంకాళి అమ్మవారి ఆలయం, అక్కడి నుంచి బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకునే మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలను అమలు చేయనున్నారు. వర్చువల్గా శంకుస్థాపన చేయనున్న కార్యక్రమాలివీ.. ► రూ.1,298 కోట్లతో ఎన్హెచ్–65పై సంగారెడ్డి చౌరస్తా నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల మేర ఆరు లేన్లుగా విస్తరణ ► రూ.399 కోట్లతో ఎన్హెచ్–765డిపై మెదక్–ఎల్లారెడ్డి మధ్య 2 లైన్ల హైవే విస్తరణ. జాతికి అంకితం చేయనున్న ప్రాజెక్టులివీ.. ► రూ.3,338 కోట్లతో నిర్మించిన పారాదీప్– హైదరాబాద్ గ్యాస్ పైప్లైన్ ► రూ.400 కోట్లతో చేపట్టిన సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ► రూ.1,409 కోట్లతో నిర్మించిన ఎన్హెచ్–161లోని కంది–రామసానిపల్లె సెక్షన్లో 4 వరుసల జాతీయ రహదారి ► రూ.323 కోట్ల ఖర్చుతో చేసిన ఎన్హెచ్–167 మిర్యాలగూడ–కోదాడ సెక్షన్ జాతీయ రహదారి విస్తరణ ► రూ.1,165 కోట్లతో హైదరాబాద్–సికింద్రాబాద్లలో 103 కిలోమీటర్ల పొడవున చేపట్టిన ఎంఎంటీఎస్ ఫేజ్–2 ప్రాజెక్టు. ► ఘట్కేసర్– లింగంపల్లి మధ్య కొత్త ఎంఎంటీఎస్ రైలు ప్రారంభం -
కాసేపట్లో తెలంగాణకు ప్రధాని మోదీ
-
Rashmika Mandanna: జపాన్లో రష్మిక.. భారత్ నుంచి మొట్టమొదటి సెలబ్రిటీ (ఫోటోలు)
-
నేడు పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో సీఎం పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 28న (బుధవారం) పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి భీమవరం చేరుకుని అక్కడి రాధాకృష్ణ కన్వెన్షన్లో జరిగే వైఎస్సార్సీపీ నేత గుణ్ణం నాగబాబు కుమారుడు వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి విశాఖ చేరుకుని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో జరిగే పార్టీ నేత కోలా గురువులు కుమారుడి వివాహ వేడుకకు హాజరై వధూవరులను ఆశీర్వదించిన అనంతరం సాయంత్రం తాడేపల్లికి చేరుకుంటారు. కాగా, ఈ నెల 29న కృష్ణా జిల్లా పామర్రులో జరగాల్సిన సీఎం జగన్ పర్యటన వాయిదా పడింది. -
కులు, మనాలీ, సిమ్లా.. ఒకేసారి చూసేందుకు ఐఆర్సీటీసీ అద్భుత ప్యాకేజీ!
హిమాచల్ప్రదేశ్లోని కులు, సిమ్లా, మనాలి పర్యాటక ప్రాంతాలు ఏడాది పొడవునా టూరిస్టులతో రద్దీగా ఉంటాయి. ముఖ్యంగా మార్చి ప్రారంభం నుండి కులు, సిమ్లా, మనాలిలకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇప్పుడు ఈ మూడు అద్భుత ప్రాంతాలను ఒకేసారి సందర్శించేలా ఐఆర్సీటీసీ అద్భుతమైన ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. తాజాగా ఐఆర్సీటీసీ ఒక ట్వీట్లో ఈ టూర్ ప్యాకేజీ గురించిన సమాచారాన్ని తెలియజేసింది. ఐఆర్సీటీసీ అందించే ఈ టూర్ ప్యాకేజీ 2024, మార్చి 27 నుండి ప్రారంభంకానుంది. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణం తిరువనంతపురం నుంచి ప్రారంభం కానుంది. ఇది ఎయిర్ టూర్ ప్యాకేజీ. ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన ఈ టూర్ ప్యాకేజీలో హిమాచల్లోని ఈ మూడు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను చూడవచ్చు. ఈ టూర్ ప్యాకేజీలో ప్రయాణించాలనుకుంటే.. ఒకరైతే రూ.67,500, ఇద్దరికైతే రూ.53,470, ముగ్గురికి రూ.51,120 చెల్లించాల్సివుంటుంది. 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు బెడ్ రిజర్వేషన్కు రూ.46,420, బెడ్ లేకుండా అయితే రూ.43,800 చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. అయితే రెండు నుంచి నాలుగేళ్ల వయసు గల పిల్లలకు, ఛార్జీగా రూ. 33,820లు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవడానికి ఐఆర్సీటీసీ అధికారిక వెబ్సైట్ను సందర్శించాలి. It's time for a vacation amidst the hills. Visit #shimla-#Kullu-#Manali with IRCTC (SEA23) on 27.03.2024 from #Thiruvananthapuram Book now on https://t.co/9ulobfRHWU . . .#dekhoapnadesh #Travel #Booking #Tours #traveller #vacations #ExploreIndia #HimachalPradesh @hp_tourism… pic.twitter.com/dgf3PbNLhp — IRCTC (@IRCTCofficial) February 21, 2024 -
రాజశ్యామల అమ్మవారిని దర్శించుకోనున్న సీఎం జగన్
-
విశాఖలో సీఎం జగన్ పర్యటన
-
కోడ్ కూయక ముందే.. మోదీ టూరు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగానే.. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల కంటే ముందుగానే తొలివిడత ప్రచారాన్ని పూర్తిచేయాలని బీజేపీ భావిస్తోంది. వచ్చే నెల మొదటివారంలో షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందనే అంచనాల మధ్య పెద్దఎత్తున ముందస్తు ప్రచారానికి కమలదళం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా తెలంగాణ పర్యటనకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రానున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఈ నెలాఖరులోగా లేదంటే మార్చి మొదటివారంలోగా రెండు, మూడు పర్యాయాలు మోదీ రాష్ట్రానికి వస్తారని చెబుతున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని స్వయంగా ప్రధానితోనే ప్రారంభించినట్టు అవుతుందని బీజేపీ నాయకులు అంచనావేస్తున్నారు. మోదీ చేతుల మీదుగా శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వెలువడడానికి ముందే గత అక్టోబర్ 1న మహబూబ్నగర్లో, 3న నిజామాబాద్లలో ఏర్పాటు చేసిన బహిరంగసభల్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంతో పాటు, ములుగులో గిరిజన యూనివర్సిటీ, తెలంగాణలో పసుపుబోర్డులను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ అదే పంథాలో లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించేలోగానే వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా శాసనసభ ఎన్నికలకు ముందు కేంద్రప్రభుత్వం ప్రకటించిన వివిధ కార్యక్రమాలకు సంబంధించి యాక్షన్ప్లాన్ కూడా అమల్లోకి తీసుకురావాలని బీజేపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే కేంద్రం ద్వారా రాష్ట్రంలో వివిధ రూపాల్లో చేపట్టనున్న ఎన్టీపీసీ, రోడ్లు, తదితర అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్లకు శంకుస్థాపనలు, ప్రారంబోత్సవాలు చేయనున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్లో బహిరంగసభ? ఆదిలాబాద్లో వివిధ అభివృద్ధి పనులను ప్రారంభించిన అనంతరం అక్కడే విడిగా ఏర్పాటు చేసే బహిరంగసభలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లక్ష్యంగా చేసుకుని మోదీ రాజకీయ విమర్శలు సంధిస్తారని పార్టీ నాయకులు చెబుతున్నారు. ఇక మోదీ రాష్ట్ర పర్యటనలో భాగంగా... ములుగులో గిరిజన యూనివర్సిటీ, నిజామాబాద్లో పసుపు బోర్డ్ ఏర్పాటుకు శంకుస్థాపనలు, తెలంగాణకు మరీ ముఖ్యంగా రాష్ట్ర రాజధానికి ప్రయోజనం చేకూరేలా చేపట్టనున్న రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్ట్కు శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. ఇక చర్లపల్లిలో రైల్వే టెరి్మనల్ను మోదీ లాంఛనంగా ప్రారంభిస్తారని అంటున్నారు. మొత్తంగా ఈ కార్యక్రమాల ద్వారా లోక్సభ ఎన్నికల్లో రాజకీయ మైలేజీని సాధించే దిశలో పెద్దఎత్తున ప్రచార కార్యక్రమాలను చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. -
టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా పట్టాలిచ్చి తీరతాం: బాలినేని
సాక్షి, ప్రకాశం జిల్లా: ఈ నెల 20న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒంగోలు పర్యటించనున్నట్లు మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్రెడ్డి తెలిపారు. అదే రోజున నగరంలో 25 వేల మంది పేదల కోసం సిద్ధం చేసిన ఇంటి స్థలాలను సీఎం చేతుల మీదుగా లబ్ధిదారులకు అందిస్తామని బాలినేని తెలిపారు. అర్బన్ లేఔట్ను బాలినేని శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్ల పట్టాలు అడ్డుకునేందుకు కోర్టులో పిల్ వేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలులో పేదలకు పట్టాలు ఇవ్వకుండా టీడీపీ నేతలు పదే పదే కోర్టుకు వెళ్తున్నారని.. వారికి ఇష్టం లేకపోతే పోటీ నుంచి తప్పుకుంటానే తప్ప ఇంటి పట్టాలు ఇవ్వకుండా ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని బాలినేని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒకచోట కోర్టుకెళ్లి ఇంటి స్థలాలను అడ్డుకున్న టీడీపీ.. మరోసారి కోర్టులో పిల్ వేయడంపై బాలినేని అసహన వ్యక్తం చేశారు. ఇంత నీచ రాజకీయం నా జీవితంలో చూడలేదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: చిల్లర పాలిటిక్స్ చేస్తున్న వ్యక్తి వంశీ: ఎంపీ ఎంవీవీ ఫైర్ -
AP: ‘ఐబీ’ సిలబస్ శిక్షణ ఇదిగో
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నేషనల్ బాకలారియెట్ (ఐబీ) సిలబస్ అమలుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. దీనికి సంబంధించి గత నెల 31వతేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఐబీ సంస్థతో ఏపీ ఎస్సీఈఆర్టీ ఒప్పదం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 15 రోజుల వ్యవధిలో ఐబీ ప్రతినిధులు ఏపీలో విద్యా విధానం, సంస్కరణల అమలు, ఉపాధ్యాయ శిక్షణ తదితర అంశాలను పరిశీలించారు. ఒప్పందం జరిగిన వెంటనే విజయవాడలోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో ఐబీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి సంస్థ ప్రతినిధులు కార్యకలాపాలు ప్రారంభించారు. ఈనెల 26వతేదీ నుంచి 9 రోజుల పాటు ఐబీ అధికారుల బృందం జిల్లాల్లో పర్యటించేందుకు ఏర్పాట్లు చేశారు. జిల్లా, మండల, మున్సిపల్ స్కూళ్లతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర మేనేజ్మెంట్ పాఠశాలను బృందం పరిశీలిస్తుంది. క్షేత్రస్థాయి పరిస్థితులు, ప్రభుత్వం కల్పించిన సదుపాయాలు, ఉపాధ్యాయుల సామర్థ్యాలను అంచనా వేయనున్నారు. – సాక్షి, అమరావతి తొలుత విజయవాడలో టీచర్లకు శిక్షణ ఇంటర్నేషనల్ బాకలారియెట్ సిలబస్ బోధనపై మార్చి నుంచి విజయవాడలో మాస్టర్ ట్రైనర్స్గా తొలుత కొందరు ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వాలని యోచిస్తున్నారు. మెక్సికోకు చెందిన ఐబీ ప్రతినిధి ఆల్డో ఇటీవల ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని పలు ప్రభుత్వ పాఠశాలలను స్వయంగా పరిశీలించారు. సదుపాయాలు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెళ్ల వినియోగం, బోధనా విధానాన్ని పరిశీలించారు. విద్యార్థులకు ప్రభుత్వం అందించిన ట్యాబ్ల పనితీరును అడిగి తెలుసుకోవడంతో పాటు వారితో సంభాషించి పలు ప్రశ్నలకు సమాధానాలు రాబట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను సైతం రుచి చూశారు. పాఠశాలల్లో భౌతిక, జీవశాస్త్ర ప్రయోగశాలలు, ఇంగ్లిష్ ల్యాబ్, సైన్స్ ల్యాబ్లను పరిశీలించి ఉపాధ్యాయులను ప్రశంసించారు. ఐబీకి చెందిన మరో ప్రతినిధి ఆశిష్ రెండు రోజులు విద్యాశాఖ అధికారులతో సమావేశమై పాఠశాలల్లో ఐటీ, ఆన్లైన్ సేవలను తెలుసుకున్నారు. ఏపీ విద్యా విధానాలు ఐబీకి దాదాపు దగ్గరగా ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. వచ్చే ఏడాది ఒకటో తరగతి నుంచి.. ఐబీ అమలుపై 2024–25 విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ సిబ్బందికి పూర్తి స్థాయిలో శిక్షణ ఇవ్వనున్నారు. ఉపాధ్యాయులతోపాటు మండల, జిల్లా విద్యాధికారులు, ఎస్సీఈఆర్టీ, డైట్ సిబ్బంది, ఎస్సెస్సీ, ఇంటర్ బోర్డు సిబ్బంది వీరిలో ఉంటారు. వీరికి దశలవారీగా ‘ఐబీ’పై అవగాహన, నైపుణ్యం, సామర్థ్యాల పెంపుపై శిక్షణ ఇచ్చి ఐబీ సర్టిఫికెట్లు అందచేస్తారు. దీంతో వీరంతా ప్రతిష్టాత్మక ఐబీ గ్లోబల్ టీచర్ నెట్వర్క్లో భాగమవుతారు. అనంతరం 2025 జూన్లో ప్రారంభమయ్యే 2025–26 విద్యా సంవత్సరం నుంచి అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతితో ఐబీ విద్యాబోధన ప్రారంభం అవుతుంది. ఏటా ఒక్కో తరగతి చొప్పున పెంచుకుంటూ వెళతారు. విద్యార్థులు 2035 నాటికి పదో తరగతి, 2037లో ప్లస్ 2లో ఐబీ సిలబస్లో పరీక్షలు రాస్తారు. విద్యార్థులకు ఐబీ, ఏపీ ఎస్సీఈఆర్టీ కలిసి అందించే జాయింట్ సర్టిఫికేషన్కు అంతర్జాతీయ గుర్తింపు ఉంటుంది. రూ.73 వేల కోట్లతో సంస్కరణలు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పేద పిల్లలు అధికంగా చదువుకునే పాఠశాల విద్యకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోంది. విద్యార్థులు ఉన్నతంగా ఎదిగి ప్రపంచ పౌరులుగా తీర్చిదిద్దేందుకు ప్రాథమిక స్థాయి నుంచి ప్రణాళికలు అమలు చేస్తోంది. జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, గోరుముద్ద తదితర విప్లవాత్మక కార్యక్రమాలను ప్రవేశపెట్టి విద్యార్థుల ఉన్నతికి బాటలు వేసింది. 2019 జూన్ నుంచి 2024 జనవరి వరకు విద్యా రంగ సంస్కరణల కోసం ఏకంగా రూ.73,293.68 కోట్లు వెచ్చించింది. ఇప్పుడు ఐబీ బోధనను సైతం ప్రభుత్వ స్కూళ్లలో అందుబాటులోకి తెస్తోంది. అత్యధిక ఐబీ స్కూళ్లు ఏపీలోనే.. ప్రాథమిక విద్యా బోధనలో ప్రపంచంలోనే అత్యుత్తమ విధానాలను ఫిన్ల్యాండ్ అమలు చేస్తోంది. పాలనలో పారదర్శకత, మానవ వనరుల వినియోగం, ప్రణాళికలో ఎప్పుడూ ముందు వరుసలో నిలుస్తోంది. ప్రస్తుతం ఐబీ బోర్డు డైరెక్టర్ జనరల్గా ఉన్న ఓలి పెక్కా హీనోనెన్ ఫిన్ల్యాండ్ జాతీయ విద్యాశాఖకు డైరెక్టర్ జనరల్గా సేవలందించారు. ఆయనే స్వయంగా ఏపీ ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ విధానాలను పర్యవేక్షిస్తుండడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 5 వేల వరకు ఐబీ స్కూళ్లు ఉండగా 2025 జూన్లో ప్రపంచంలోనే అత్యధిక ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్ అమలు చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలువనుంది. ఏపీలో దాదాపు 45 వేల ప్రభుత్వ పాఠశాలలు ఉండగా ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ (ప్రాథమిక, ప్రాథమికోన్నత) స్కూళ్లు 39 వేల వరకు ఉన్నాయి. ఈ స్కూళ్లలో 2025 జూన్లో ఒకటో తరగతితో ఐబీ బోధన ప్రారంభం కానుంది. అంతర్జాతీయంగా పేరున్న ఐబీ బోర్డుకు ప్రపంచంలోనే అతి పెద్ద నెట్వర్క్ మన రాష్ట్రంలోనే ఉండడం విశేషం. -
రేపు సీఎం జగన్ కర్నూలు, గుంటూరు జిల్లాల పర్యటన
సాక్షి,అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15వతేదీన కర్నూలు, గుంటూరు జిల్లాల్లో పర్యటించనున్నారు. కర్నూలులో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అదేరోజు మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వలంటీర్ల అభినందన సభలో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు, అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరుకానున్నారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు, ఆ తర్వాత మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొననున్నారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. -
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు.