-
రేపు ఇంద్రవెల్లికి సీఎం రేవంత్.. అమలులోకి మరో మూడు గ్యారెంటీలు
సాక్షి, హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో రేపు(శుక్రవారం) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. సీఎం అయిన తర్వాత ఇది ఆయన మొదటి జిల్లా పర్యటన కాగా, ఇంద్రవెల్లి సభలో మూడు గ్యారెంటీలను ప్రకటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్, రూ.500కే సిలిండర్ పథకాలను సీఎం ప్రకటించనున్నారు. మూడు పథకాల జాబితాను అధికారులు సిద్ధం చేశారు. 200 యూనిట్లు వాడే కుటుంబాలు 90 లక్షలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. కాగా, సీఎం రేవంత్రెడ్డి ఇంద్రవెల్లి గడ్డను సెంటిమెంట్గా తీసుకున్నారు. అప్పట్లో టీపీసీసీ అధ్యక్షుడిగా నియామకం తర్వాత 2021 ఆగస్టు 9న ఇక్కడే మొదటి సభ నిర్వహించారు. నాడు ‘దళిత, గిరిజన దండోరా’ పేరిట నిర్వహించిన సభకు లక్షకు పైగా జనం విచ్చేశారు. సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో రేవంత్ రెడ్డి ఇక వెనుదిరిగి చూడలేదు. ఆ తర్వాత రాష్ట్రంలో పలు సభలు నిర్వహించారు. అప్పటినుంచే కాంగ్రెస్పై ప్రజల్లో మక్కువ పెరిగిందన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమైంది. దానికి తగ్గట్టుగానే ఎన్నికల్లో హస్తం పార్టీ విజయం సాధించడం, రేవంత్రెడ్డి సీఎం కావడం జరిగిపోయాయి. తాజాగా పార్లమెంట్ ఎన్నికల నగారాను కూడా ఇంద్రవెల్లి గడ్డ మీదనుంచే మొదలుపెట్టాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా, శాసనసభ ఎన్నికల్లో నాలుగు బీజేపీ, రెండు బీఆర్ఎస్ గెలువగా, ఖానాపూర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయినప్పటికీ ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ఈ పార్లమెంట్ సెగ్మెంట్ నుంచే సవాల్గా తీసుకొని సెంటిమెంట్ను కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ రసవత్తరంగా మారనుంది. మొత్తంగా ప్రతికూల పరిస్థితుల నుంచి అనుకూల ఫలితం సాధించే దిశగా పార్లమెంట్ ఎన్నికలకు ఈ గడ్డ మీద నుంచి సమరశంఖం పూరించనున్నారు. ఇదీ చదవండి: కేసీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
కమలం కసరత్తు తెలంగాణ నుంచే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్నగర్, నాగర్కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. 29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు. టికెట్లకు పోటీ ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో 1.40కి మహబూబ్నగర్కు చేరుకుంటారు. 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్లో పాల్గొంటారు తర్వాత హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు. రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. -
ఏపీలో కొనసాగుతున్న కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన
సాక్షి, అమరావతి : రానున్న సాధారణ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సవరణ, సన్నద్ధత వంటి అంశాలను పరిశీలించి తగు సూచనలు ఇవ్వడానికి కేంద్ర ఎన్నికల సంఘం బృందం మంగళవారం నుంచి రెండ్రోజుల పాటు రాష్ట్రంలో పర్యటిస్తోంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్కుమార్, కమిషనర్లు అనూప్చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం పర్యటిస్తున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం నిర్వహించింది. మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్–2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను సమీక్షించనున్నారు. ఓటర్ల జాబితాలో ఎటువంటి గందరగోళం లేకుండా పారదర్శకంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామని, వివిధ రాజకీయ పార్టీల నుంచి వచ్చిన 5.64 లక్షల పేర్లను అనర్హులుగా ఎన్నికల సంఘం తేల్చింది. అలాగే, రాష్ట్రంలో ఎన్నికల సన్నద్ధత కోసం తీసుకున్న చర్యలను జనవరి 10న ఉ.9.30 నుంచి 11 గంటల వరకు స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం.. కేంద్ర, రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉంటుందని.. అలాగే, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశమవుతారన్నారు. ఆ తర్వాత.. సమావేశ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘ అధికారులు 10వ తేదీ సా.4.30కు మీడియాకు వివరిస్తారని ముఖే‹Ù కుమార్ మీనా అన్నారు. సమావేశాలకు ఏర్పాట్లు పూర్తి.. ఇక ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ–2024, ఎన్నికల సన్నద్ధత కార్యకలాపాలపై విజయవాడలో ఈనెల 9, 10 తేదీల్లో ఈసీఐ ఉన్నతస్థాయి సమావేశాలు జరగనున్నాయని.. విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేసినట్లు ఎన్టీఆర్జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించేందుకు ముఖేష్ కుమార్ మీనాతో కలిసి కలెక్టర్ ఢిల్లీరావు విజయవాడ నోవాటెల్ కాన్ఫరెన్స్ హాల్ను పరిశీలించారు. -
నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్లు చొప్పున ఎమ్మెల్యేలకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు. పార్లమెంట్ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా సోమవారం మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఐదు జిల్లాల ఇన్చార్జ్ మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ సమావేశమయ్యారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మహబూబ్నగర్ జిల్లాలతోపాటు హైదరాబాద్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి బాధ్యతలు ఉమ్మడి జిల్లా ఇన్చార్జ్ మంత్రులకు అప్పగిస్తున్నట్టు రేవంత్ ప్రకటించారు. సంక్షేమం..అభివృద్ధిలో అందరూ భాగస్వాములేనని, తాను గత సీఎం తరహా కాదని తేల్చి చెప్పారు. జనవరి 26 తర్వాత వారానికి మూడురోజులు సాయంత్రం 4 గంటల నుంచి ఆరు గంటల వరకు సచివాలయంలో అందుబాటులో ఉంటానని చెప్పారు. ఈ నెల 26 తర్వాత జిల్లాల పర్యటన ఈ నెల 26 తర్వాత సీఎం రేవంత్ జిల్లాల పర్యటన ఉంటుంది. తొలిసభ ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో నిర్వహిస్తారు. గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసభ ఇంద్రవెళ్లిలో నిర్వహించగా, సీఎం హోదాలోనూ అక్కడ జరిగే తొలిసభలో రేవంత్ పాల్గొంటారు. ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్మతివనానికి శంకుస్థాపన చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదిలాబాద్ నేతలకు రేవంత్ సూచించారు. ఇంద్రవెల్లి అమరుల కుటుంబాలను గుర్తించి ఆదుకుంటామన్నారు. రెట్టింపు ఉత్సాహంతో పనిచేయండి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపునకు కృషి చేయాలని, రెట్టి ఉత్సాహంతో పనిచేయాలని పార్టీ నేతలకు రేవంత్ సూచించారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సాధించిన ఓట్ల కంటే ఎక్కువ వచ్చేలా కృషి చేయాలని నేతలకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకుగాను 12 స్థానాలకు తగ్గకుండా గెలిపించుకోవాలన్నారు. బీఆర్ఎస్ నేతలు బదనాం చేస్తున్నారు నియోజకవర్గ సమస్యలతోపాటు పార్టీ బలోపేతానికి సీఎం పలు సూచనలు చేశారని మంత్రి సీతక్క వెల్లడించారు. ప్రభుత్వ పథకాల విధివిధానాలు తయారుకాక మునుపే బీఆర్ఎస్ నేతలు తమను బదనాం చేస్తున్నారన్నారు. అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక ప్రభుత్వాన్ని కూల్చుతామని మాట్లాడుతున్నారని, ఐదేళ్ల వరకు ఎన్నికలు రావని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలన్నారు. ఓటమి పాలైన పార్టీ అభ్యర్థులకు ధైర్యం ఇచ్చేందుకే సీఎం సమావేశం ఏర్పాటు చేశారని మంత్రి కొండా సురేఖ అన్నారు. బీఆర్ఎస్ పాలన తట్టుకోలేక తమకు అధికారం ఇచ్చారని, వచ్చే టర్మ్లోనూ తామే అధికారంలోకి వస్తామని చెప్పారు. సీఎంగా రేవంత్కు వంద మార్కులు : జగ్గారెడ్డి సీఎంతో జరిగిన భేటీలో ఆరు గ్యారంటీల అమలుపై చర్చ జరిగిందని, నియోజకవర్గ అభివృద్ధికి రూ.10 కోట్ల చొప్పున సీఎం ఇస్తారని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. మెదక్ పరిధిలోని రెండు స్థానాలు గెలుచుకోవాలని తమకు దిశానిర్దేశం చేశారన్నారు. అభ్యర్థుల ఎంపికపై చర్చ జరగలేదన్నారు. ఓటమి పాలైనా తాము పార్టీ తరపున ఎమ్మెల్యేలమని, సీఎంగా రేవంత్కు వంద మార్కులు వేస్తానన్నారు. సింగరేణిలో కొత్త గనుల ఏర్పాటు అంశం చర్చకు వచ్చిందని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ తెలిపారు. -
నేడు UPSC ఛైర్మన్ తో భేటీ కానున్న సీఎం రేవంత్ రెడ్డి
-
2023లో ప్రధాని మోదీ ఎన్ని దేశాల్లో పర్యటించారు? ఎవరిని కలిశారు?
ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలు ఎప్పుడూ చర్చనీయాంశంగా నిలుస్తుంటాయి. 2023లో ప్రధాని మోదీ.. జపాన్, పాపువా న్యూ గినియా, ఆస్ట్రేలియా, అమెరికా, ఈజిప్ట్, ఫ్రాన్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌత్ ఆఫ్రికా, గ్రీస్, ఇండోనేషియా, దుబాయ్ తదితర 11 దేశాలలో పర్యటించారు. మే 19.. జపాన్లోని హిరోషిమాలో జరిగిన జీ7 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. జీ7 శిఖరాగ్ర సమావేశం తరువాత ప్రధాని మోదీ పాపువా న్యూ గినియాను సందర్శించారు. ఇక్క జరిగిన ఫోరమ్ ఫర్ ఇండియా-పసిఫిక్ ఐలాండ్స్ కోఆపరేషన్ మూడవ శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. అనంతరం ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ సిడ్నీని సందర్శించారు. ఈ సందర్భంగా మోదీ స్థానిక భారతీయ కమ్యూనిటీతో సంభాషించారు. జూన్ 20.. జూన్లో ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు న్యూయార్క్ చేరుకున్న ప్రధాని జూన్ 21న ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరిగిన అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలకు సారధ్యం వహించారు. ఆ తర్వాత ప్రధాని మోదీ వాషింగ్టన్కు వెళ్లారు. జూన్ 22న వైట్ హౌస్ను సందర్శించారు. జూన్ 22.. యూఎస్ కాంగ్రెస్ సంయుక్త సమావేశంలో పీఎం మోదీ ప్రసంగించారు. ఆ తర్వాత ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సీసీ ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్టు పర్యటనకు వెళ్లారు. ఈజిప్టు సీనియర్ ప్రముఖులతో పాటు అక్కడుంటున్న భారతీయులతో సంభాషించారు. జూలై 13.. బాస్టిల్ డే సైనిక కవాతుకు ముఖ్య అతిథిగా హాజరైన ప్రధాని మోదీ ఫ్రాన్స్లో పర్యటించారు. ఈ సందర్భంగా మోదీ ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్తో అధికారిక చర్చలు జరిపారు. ఒక ప్రైవేట్ విందులో కూడా పాల్గొన్నారు. అనంతరం ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కు వెళ్లి, అక్కడ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో చర్చలు జరిపారు. ఆగస్టు 22.. జోహన్నెస్బర్గ్లో జరిగిన బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. అనంతరం గ్రీస్లో అధికారిక పర్యటన చేశారు. ఇది 40 సంవత్సరాలలో భారత ప్రధాని తొలి పర్యటన. సెప్టెంబర్ 6.. సెప్టెంబర్ నెలలో న్యూఢిల్లీలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశానికి కొన్ని రోజుల ముందు ప్రధాని మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో ఆహ్వానం మేరకు తూర్పు ఆసియా సదస్సు లో పాల్గొన్నారు. నవంబర్ 30.. ఈ ఏడాది చివరిలో వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ దుబాయ్ వెళ్లారు. 200 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ సమ్మిట్లో పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: అన్నీ అమ్ముకుని నౌకపై దేశాలు తిరుగుతూ... -
సీఎం జగన్ కడప టూర్ డే-1
-
వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
ఏపీలో రెండోరోజు కొనసాగుతున్న సీఈసీ పర్యటన
-
వైఎస్సార్ జిల్లా: పలు అభివృద్ధి పనులకు సీఎం జగన్ శ్రీకారం
Updates: ►మూడు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా కడప నుండి రోడ్డు మార్గాన ఇడుపులపాయ చేరుకున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ►రాత్రికి ఇడుపులపాయలో బస ►రేపు ఉదయం వైఎస్సార్ ఘాట్ వద్ద జరిగే ప్రార్థన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేయనున్న సీఎం జగన్►అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరంలో కుటుంబ సభ్యులు,బంధుమిత్రులతో కలిసి ముందస్తు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొననున్న సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్లో గాంధీజీ దండి మార్చ్ విగ్రహాలు ఆవిష్కరణ చేసిన సీఎం జగన్ ►కడప కోటిరెడ్డి సర్కిల్ చేరుకున్న సీఎం జగన్ ►అంబేద్కర్ సర్కిల్ను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►అంబేద్కర్ చౌరస్తా చేరుకున్న సీఎం జగన్ ►ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించిన సీఎం జగన్ ►దివ్యాంగులను ట్రై స్కూటర్లను పంపిణీ చేసిన సీఎం జగన్ ►రిమ్స్లో వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించిన సీఎం జగన్ ►వైఎస్సార్ కేర్ బ్లాక్, వైఎస్సార్ మానసిక వైద్యశాలను ప్రారంభించిన ముఖ్యమంత్రి జగన్ ►కడపలో ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిని ప్రారంభించనున్న సీఎం జగన్ ►సెంచురీ ప్లై ఇండస్ట్రీస్ ప్రారంభించిన సీఎం జగన్ ►రూ.1000 కోట్లతో యూనిట్ ఏర్పాటు ►2,266 మందికి ప్రత్యక్షంగా లభించనున్న ఉపాధి ►కడప ఎయిర్పోర్ట్కు చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ►ప్రత్యేక హెలికాఫ్టర్లో గోపవరం పయనం ►ఘన స్వాగతం పలికిన జిల్లా నాయకులు, అధికారులు ►మరికాసేపట్లో సెంచూరీ పరిశ్రమ వద్దకు చేరుకోనున్న సీఎం ►వైఎస్సార్ కడప జిల్లాకు బయలేర్దిన సీఎం జగన్ ►మూడు రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్న సీఎం ►బద్వేలు, కడప, పులివెందుల, మైదుకూరులలో సీఎం జగన్ పర్యటన సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడు రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
23, 24, 25 తేదీల్లో.. సీఎం జగన్ వైఎస్సార్ జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23, 24, 25 తేదీల్లో వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. అలాగే, క్రిస్మస్ వేడుకల్లోనూ పాల్గొంటారు. ముఖ్యమంత్రి మూడ్రోజుల పర్యటన షెడ్యూల్ ఇలా.. ♦ 23వ తేదీ ఉ.9.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి కడప చేరుకుంటారు. అక్కడి నుంచి గోపవరం చేరుకుని సెంచురీ ప్లై పరిశ్రమలోని ఎండీఎఫ్, హెచ్పీఎల్ ప్లాంట్లను ప్రారంభించి చైర్మన్, సిబ్బందితో మాట్లాడతారు. ♦ ఆ తర్వాత కడప రిమ్స్ వద్ద డాక్టర్ వైఎస్సార్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభిస్తారు. దీంతో పాటు డాక్టర్ వైఎస్సార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ను ప్రారంభించిన అనంతరం అదే రిమ్స్ ప్రాంగణంలో డాక్టర్ వైఎస్సార్ క్యాన్సర్ కేర్ బ్లాక్ను ప్రారంభిస్తారు. ♦ అనంతరం ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి ప్రారంభిస్తారు. ♦ అలాగే, వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కొత్తగా ఏర్పాటుచేసిన ఫ్లడ్లైట్లను ప్రారంభిస్తారు. ♦ ఆ తర్వాత ఆధునీకరించిన కలెక్టరేట్ భవనాన్ని, నవీకరించిన అంబేద్కర్ సర్కిల్, వై.జంక్షన్, కోటిరెడ్డి సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ ప్రారంభిస్తారు. ♦అంతేకాక.. మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసిన అనంతరం ఇడుపులపాయ చేరుకుని వైఎస్సార్ ఎస్టేట్లోని గెస్ట్హౌస్లో రాత్రికి బసచేస్తారు. ♦ఇక 24న ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ ప్రేయర్ హాల్లో జరిగే ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం.. మధ్యాహ్నం సింహాద్రిపురం చేరుకుని పలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అక్కడ నుంచి ఇడుపులపాయ చేరుకుని ఎకో పార్కులో పులివెందుల మండల ప్రజాప్రతినిధులతో సమావేశమవుతారు. రాత్రికి అక్కడి గెస్ట్హౌస్లో బసచేస్తారు. ♦ 25వ తేదీ ఉదయం ఇడుపులపాయ గెస్ట్హౌస్ నుంచి బయల్దేరి పులివెందుల చేరుకుంటారు, అక్కడ సీఎస్ఐ చర్చిలో జరిగే క్రిస్మస్ ప్రార్థనల్లో పాల్గొంటారు, మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. -
రేపు ‘అల్లూరి’ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి,అమరావతి: సీఎం జగన్ ఈ నెల 21న (గురువారం) అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లిలో పర్యటించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లు అందజేసి, అనంతరం జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నుంచి బయలుదేరి చింతపల్లి మండలం చౌడుపల్లి చేరుకుంటారు. అక్కడి నుంచి చింతపల్లి చేరుకుని గిరిజన సంక్షేమ శాఖ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో మాట్లాడి ట్యాబ్లు అందజేయనున్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. -
అపోహలొద్దు.. ఆదుకుంటాం
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తుపాన్తో పంటలు నష్టపోయిన అన్నదాతలందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని, ఈ విషయంలో ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్ ముగిసేలోగా రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని, పంట నష్టపోయిన వారికి 80 శాతం సబ్సిడీతో శనగ విత్తనాలు వెంటనే అందిస్తామని తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం పాతనందాయపాలెం, బుద్దాం గ్రామాల్లో దెబ్బతిన్న మిరప, వరి పంటలను పరిశీలించిన అనంతరం బాధిత రైతులను సీఎం జగన్ ఊరడించారు. ఎన్నడూ లేనంతగా నాలుగు రోజుల వ్యవధిలో భారీ వర్షాలు కురిశాయని సీఎం జగన్ అన్నారు. ఇంత బాధాకరమైన పరిస్థితులు వచ్చినా ఈ ప్రభుత్వం తోడుగా ఉంటుందన్న నమ్మకం ఇక్కడి రైతన్నల్లో కనిపిస్తోందన్నారు. ఈ ప్రభుత్వం మీది.. మీ ప్రభుత్వంలో అందరికి మంచే జరుగుతుందని కచ్చితంగా చెబుతున్నానన్నారు. నాలుగు రోజుల్లో.. 'ఏ రాష్ట్రాలలోనూ లేనిది, మన రాష్ట్రంలోనే ఉన్న గొప్ప వ్యవస్థ సచివాలయాలు, వలంటీర్ వ్యవస్థలు. ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా, నష్టం జరిగినా చేయి పట్టుకుని నడిపించే గొప్ప వ్యవస్థలుగా అవి నిలిచాయి. వివక్షకు తావులేకుండా, ఆఖరికి మనకు ఓటు వేయని వారికి నష్టం జరిగినా ఈ ప్రభుత్వం అందరికి తోడుగా నిలుస్తోంది. జరిగిన నష్టాన్ని పారదర్శకంగా గుర్తించి, జాబితాను సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం ప్రదర్శిస్తున్నాం. ఎక్కడైనా పొరపాటు జరిగి ఉంటే దాన్ని సరిచేసుకుని మరీ సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం మనదే. గతంలో కరువులు, వరదలు వచ్చినా పట్టించుకునే పరిస్థితులు లేవు. ఏ రోజు ఇన్పుట్ సబ్సిడీ వస్తుందో, అసలు ఎంతమందికి వస్తుందో కూడా తెలియని దుస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే మారింది. వరదతో నిండిన గ్రామాల్లో ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ రేషన్తో పాటు ప్రతి ఇంటికి రూ.2,500 ఇచ్చిన చరిత్ర గతంలో ఎప్పుడూ లేదు. దాదాపు 12 వేల మందికి వారికి 25 కేజీల బియ్యం, కిలో కందిపప్పు, లీటరు పామాయిల్, కిలో చొప్పున ఉల్లిపాయలు, బంగాళ దుంపలతోపాటు ప్రతి ఇంటికీ రూ.2,500 ఇస్తున్నాం. ప్రతి ఇంటికీ వలంటీర్ వచ్చి అందచేస్తారు. 4 రోజుల్లో ప్రతి ఇంటికీ పంపిణీని పూర్తి చేస్తాం.' అని సీఎం జగన్ తెలిపారు. ఇన్సూరెన్స్పై ‘ఈనాడు’ దిక్కుమాలిన రాతలు మనం యుద్ధం చేస్తున్నది మారీచులతో. ఒక్క చంద్రబాబుతో మాత్రమే కాదు! అదేపనిగా అబద్ధాలనే చూపించే, ప్రచురించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 లాంటి దుర్మార్గులతో యుద్ధం చేస్తున్నాం. వారు ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా, జరగనిది జరిగినట్టుగా చూపించి భ్రమ కల్పించే కార్యక్రమాలు చేస్తున్నారు. ఈనాడులో ఇన్సూరెన్స్ గురించి సిగ్గుమాలిన, దిక్కుమాలిన రాతలు రాశారు. ఈ ఖరీఫ్ సీజన్లో నష్టం జరిగితే.. మళ్లీ ఖరీఫ్ సీజన్ వచ్చేలోపే ఇన్సూరెన్స్ ఇచ్చింది ఈ ప్రభుత్వంలోనే అన్న సంగతి గుర్తుంచుకోవాలి. జూన్ నాటికి రైతు భరోసాతోపాటు ఈ ఖరీఫ్కు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు ఇస్తాం. గతంలో ఇన్సూరెన్స్ ఎప్పుడొస్తుందో, ఎంత మందికి వస్తుందో తెలియదు. అటువంటి పరిస్థితుల నుంచి ఇప్పుడు ప్రతి ఎకరానూ, ప్రతి సచివాలయం పరిధిలో ఈ–క్రాప్ ద్వారా నమోదు చేసి ఏ ఒక్క రైతు మిస్ కాకుండా వారు కట్టాల్సిన ప్రీమియం సొమ్మును కూడా ప్రభుత్వమే చెల్లిస్తూ అన్నదాతలకు ఇన్సూరెన్స్ ఇస్తున్న చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉందంటే అది మన రాష్ట్రంలో మాత్రమే. గతంలో చంద్రబాబు పాలనలో వరుసగా కరువు కాటకాలే తాండవించినా ఐదేళ్లలో 35 లక్షల మందికి కేవలం రూ.3,400 కోట్లు మాత్రమే ఇన్సూరెన్స్ కింద ఇచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఎక్కడా కరువు కాటకాలు లేకపోయినా నాలుగేళ్లలో 55 లక్షల మందికి రూ.7,800 కోట్ల ఇన్సూరెన్స్ డబ్బులు అందచేశాం. ఈ ఖరీఫ్లో రైతన్న ఇబ్బంది పడితే వచ్చే ఖరీఫ్ నాటికి ఇన్సూ్యరెన్స్ కచ్చితంగా వస్తోంది. దేశంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ సీజన్లో నష్టం జరిగితే ఈ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇచ్చి రైతన్నను ఆదుకుంటున్నది మన ప్రభుత్వమే. పారదర్శకంగా పంట నష్టం వివరాలు తుపాను విపత్తు వేళ కలెక్టర్లు అందరూ వెంటనే స్పందించి ఎన్యుమరేషన్ మొదలు పెడుతున్నారు. ఎన్యూమరేషన్ పూర్తైన తర్వాత 15 రోజులు సమయం ఇచ్చి గ్రామ సచివాలయాల్లో జాబితాను పారదర్శకంగా ప్రదర్శిస్తారు. ఈ జాబితాలో ఎవరైనా రైతు మిస్ అయితే, వారి పేరు మళ్లీ చేర్చుకునే అవకాశం ఉంది. వచ్చే నెలలోనే సంక్రాంతిలోపు అర్హులు అందరికీ ఇన్పుట్ సబ్సిడీ వచ్చేస్తుంది. ఇది కేవలం ఇప్పుడు మాత్రమే కాకుండా గత నాలుగేళ్లుగా ఏటా ఇలానే అమలు చేస్తున్నాం. డబ్బులిచ్చి.. తగినంత సమయం ఎవరు, ఎప్పుడు, ఎక్కడ, ఏ రకంగా ఇబ్బంది పడే పరిస్థితులు వచ్చినా.. సీఎం హోదాలో నేను వచ్చి జరుగుతున్న పనులను చెడగొట్టి, అధికారులను నా చుట్టూ తిప్పుకుని, ఫొటోలకు పోజులిస్తూ టీవీల్లో, పేపర్లలో రావాలని తాపత్రయపడే వ్యక్తిని కాదు. గతానికి, ఇప్పటికి తేడా అదే. ఏదైనా సంఘటన జరిగితే మీ బిడ్డ కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తున్నాడు. ముందుగా కలెక్టర్ల చేతుల్లో వెంటనే డబ్బులు పెట్టి వ్యవస్థను మొత్తం యాక్టివేట్ చేస్తున్నాడు. వారికి సరిపడా వారం రోజులు సమయం ఇచ్చి ఆ తర్వాత బాగా జరిగిందా లేదా? అనేది నిర్ధారించుకునేందుకు స్వయంగా వచ్చి ప్రజలనే నేరుగా అడుగుతున్నాడు. మా కలెక్టర్ బాగా పనిచేశాడు, గొప్పగా పనిచేశాడనే మాట ప్రజల నుంచి రావాలని అధికారులకు చెప్పా. గతంలో చంద్రబాబు కలెక్టర్లకు నిధులు ఇచ్చేవారు కాదు. అసలు ‘టీఆర్ 27’ అనే పదానికి అర్థమే ఆయనకు తెలియదు. కలెక్టర్లు, తహసీల్దార్లు, సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల వరకు ప్రతి ఒక్కరూ విపత్తు సమయంలో పరుగులు తీస్తూ ప్రజలకు మంచి చేస్తున్న కార్యక్రమం ఈ ప్రభుత్వంలోనే జరుగుతోంది. ఇప్పుడు జరిగిన నష్టం అపారం. చేయాల్సిన సాయం అంతా పారదర్శకంగా, వేగంగా జరుగుతోంది. గత ప్రభుత్వాల కంటే కచ్చితంగా ఎక్కువే జరుగుతుందని గుర్తుంచుకోవాలి. పాల్గొన్న మంత్రులు, ప్రజా ప్రతినిధులు కార్యక్రమంలో మంత్రులు కాకాని గోవర్థనరెడ్డి, తానేటి వనిత, మేరుగ నాగార్జున, ఎంపీలు నందిగం సురేష్, మోపిదేవి వెంకట రమణారావు, ఎమ్మెల్యేలు కోన రఘుపతి, కరణం బలరాం, ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, పోతుల సునీత తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: మానవత్వంతో స్పందించిన సీఎం -
Live తుఫాను బాధితులకు నేరుగా సీఎం వైఎస్ జగన్ పరామర్శ
-
తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రేపు సీఎం జగన్ పర్యటన
సాక్షి, తాడేపల్లి:ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(శుక్రవారం) తిరుపతి, బాపట్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సీఎం పర్యటించనున్నారు. తొలుత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న సీఎం.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించనున్నారు. అనంతరం బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్న సీఎం జగన్.. అక్కడ తుపాను బాధితులతో మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతును పరామర్శించనున్నారు. తర్వాత బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సీఎం సమావేశం కానున్నారు. ఇదీ చదవండి: అబద్ధాల బాబు.. నిజం చెప్పరుగా! -
నేడు, రేపు తెలంగాణలో ప్రియాంక గాంధీ పర్యటన
-
అమిత్ షా పర్యటనలో మార్పు.. 18న రాక
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రంలో నిర్వహించనున్న ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ నెల 17వ తేదీన ఆయన రాష్ట్రానికి రావ లసి ఉండగా.. ఆ కార్యక్రమాలన్నీ ఒకరోజు వాయిదా పడ్డాయి. ఈనెల 18న రాష్ట్రానికి రానున్నట్లు బీజేపీ పార్టీ నేతలు చెబుతున్నారు. ఈనెల 18వ తేదీన బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన తర్వాత నల్లగొండ, వరంగల్, గద్వాల, రాజేంద్రనగర్లలో జరిగే బహిరంగ సభల్లో షా పాల్గొంటారు. -
విజయవాడలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
నేడు వైఎస్ఆర్ జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన
-
పులివెందులలో వివిధ కార్యక్రమాల్లో సీఎం జగన్ (ఫొటోలు)
-
13 నుంచి కేసీఆర్ మలివిడత ప్రజా ఆశీర్వాద సభలు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు మలివిడత ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్ ఖరారైంది. తొలి విడతలో అక్టోబర్ 15 నుంచి ఈనెల 3 వరకు 30 నియోజకవర్గాల్లో ఇప్పటికే సభలను నిర్వహించారు. 5వ తేదీ నుంచి 8 వరకు మరో 11 నియోజకవర్గాల్లో జరిగే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొననున్నారు. ఇవి పూర్తికాగానే 5 రోజుల విశ్రాంతి అనంతరం 13 నుంచి 28వ తేదీ వరకు 16 రోజుల పాటు నిర్విరామంగా సీఎం పర్యటన కొనసాగేలా మలి విడత షెడ్యూల్ ఖరారు చేశారు. ఇందులో భాగంగా 54 నియోజకవర్గాల్లో జరిగే సభల్లో సీఎం పాల్గొంటారు. ఈనెల 25న హైదరాబాద్లో భారీ సభను నిర్వహించనున్నారు. రెండో విడత పర్యటనలో ఒక్కో రోజు 3–4 నియోజకవర్గాల్లో సభలను నిర్వహించనున్నారు. ప్రచారానికి చివరి రోజైన 28న గజ్వేల్ నియోజకవర్గంలో జరిగే ప్రజా ఆశీర్వాద సభతో కేసీఆర్ పర్యటన ముగియనుంది. దీంతో మొత్తం 95 నియోజకవర్గాల పర్యటన పూర్తయ్యేలా షెడ్యూల్ను పార్టీ రూపొందించింది. -
రెండో రోజు తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన
-
రాహుల్ పర్యటనలో మార్పు
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అగ్రనేత రాహుల్గాంధీ రాష్ట్ర పర్యటనలో మార్పులు జరిగాయి. వాస్తవానికి ఈనెల 1, 2 తేదీల్లో ఆయన రెండు రోజుల పాటు రాష్ట్రంలో పర్యటించాల్సి ఉన్నా ఒకరోజు ముందుగానే వచ్చారు. షెడ్యూల్ ప్రకారం మంగళవారం సాయంత్రం కొల్లాపూర్లో జరిగిన పాలమూరు ప్రజాభేరి సభకు ఆయన సోదరి, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ హాజరుకావాల్సి ఉంది. రాహుల్ ఢిల్లీలో జరిగే కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) సమావేశానికి హాజరై బుధవారం మధ్యాహ్నానికి రాష్ట్రానికి రావాల్సి ఉంది. కానీ, ప్రియాంకకు ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో రాహుల్ సీఈసీ సమావేశాన్ని రద్దు చేసుకుని కొల్లాపూర్ బహిరంగ సభకు హాజరయ్యారు. అనంతరం రాత్రికి హైదరాబాద్లో బస చేశారు. బుధవారం కల్వకుర్తి, జడ్చర్ల, షాద్నగర్ పట్టణాల్లో రాహుల్ ప్రచారం నిర్వహించనున్నారు. తొలుత కల్వకుర్తి సభలో పాల్గొని, ఆ తర్వాత జడ్చర్లలో జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. అక్కడి నుంచి షాద్నగర్లో పాదయాత్ర చేసి అక్కడ జరిగే కార్నర్ మీటింగ్కు హాజరవుతారు. తర్వాత ఢిల్లీకి తిరుగుపయనమవుతారు. కాగా, రాష్ట్రంలో ముందుగా నిర్ణయించిన 2వ తేదీ షెడ్యూల్ను రాహుల్ వాయిదా వేసుకున్నారు. మూడో తేదీ నుంచి నామినేషన్ల పర్వం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆ ప్రక్రియ ముగిశాక మరోమారు రాహుల్ రాష్ట్రంలో పర్యటించే అవకాశం ఉందని గాం«దీభవన్ వర్గాలు చెప్పాయి. -
నేడు సీఎం వైఎస్ జగన్ విజయవాడ పర్యటన