-
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వచ్చిరాగానే 2000 కోట్ల అప్పు మొదలైన చంద్రన్న అప్పులు
-
పచ్చ బిల్డింగ్లపై పేర్ని నాని పంచులు
-
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది. -
టీడీపీ, జనసేన నేతల వీరంగం
రామవరప్పాడు: విజయవాడ రూరల్ మండలం ఎనికేపాడు పంచాయతీ కార్యాలయంలో మంగళవారం టీడీపీ, జనసేన నాయకులు బరితెగించి విధ్వంసం సృష్టించారు. ఉదయం సుమారు 11 గంటల సమయంలో 11 మంది కార్లలో సైరన్ మోగించుకుంటూ వచ్చి అందరినీ భయభ్రాంతులకు గురిచేశారు. పార్టీ జెండాలు పట్టుకుని టీడీపీకి అనుకూలంగా నినాదాలు చేస్తూ పంచాయతీ కార్యాలయం కింద బాణసంచా కాల్చి హడావుడి చేశారు. బలవంతంగా కార్యాలయం పైకి చేరుకున్నారు. సర్పంచ్ రూమ్లోకి చొరబడి గోడకు ఉన్న మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలను ధ్వంసం చేశారు. మరోపక్క ఫ్లెక్సీగా ఉన్న మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్చిత్రపటాన్ని పీకి పడేశారు. సర్పంచ్ టేబుల్పై కేక్ కట్చేసి టేబుల్కు, గోడలపైన పులిమారు. కార్యాలయం భవనానికి టీడీపీ జెండా కట్టి నినాదాలు చేశారు. టీడీపీ నాయకులు దౌర్జన్యకాండ చేస్తున్న సమయంలో పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్, కంప్యూటర్ ఆపరేటర్, కొందరు సిబ్బంది ఉన్నారు. కార్యాలయంలో విధ్వంసం గురించి సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు, వార్డు, ఎంపీటీసీ సభ్యులకు సిబ్బంది సమాచారం అందించారు. వెంటనే కార్యాలయానికి చేరుకున్న సర్పంచ్, ఎంపీటీసీ, వార్డు సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. పట్టపగలు ప్రభుత్వ కార్యాలయంలో ఈ విధంగా ప్రవర్తించడంపై భయాందోళనలకు గురైన సిబ్బంది విధులు నిర్వర్తించలేమంటూ కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న ఏసీపీ భాస్కరరావు, పటమట పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించారు. పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తాం : సర్పంచ్ పూర్ణచంద్రరావు పంచాయతీ కార్యాలయంలో టీడీపీ నాయకులు చెలరేగి ప్రవర్తించడంపై పోలీస్ కమిషనర్కు ఫిర్యాదు చేస్తామని సర్పంచ్ రాచమళ్ల పూర్ణచంద్రరావు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఎనికేపాడు గ్రామంలో ఈ విధంగా గొడవలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు. పంచాయతీ కార్యాలయం గోడలపై మాజీ సీఎంలు వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్రపటాలతోపాటు వేరే పార్టీలకు చెందిన నాయకుల ఫొటోలు కూడా ఉన్నాయని తెలిపారు. కానీ వైఎస్సార్సీపీ నాయకులను రెచ్చగొట్టే విధంగా వైఎస్సార్, జగన్ చిత్రపటాలను, మాజీ ఎమ్మెల్యే వంశీ ఫ్లెక్సీని ధ్వంసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో ఉంటే తనపైనా దాడిచేసేవారని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల నాయకులు రాజకీయంగా ఎదగడాన్ని జీరి్ణంచుకోలేక ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఇలా దాడులు చేస్తుంటే పంచాయతీ కార్యాలయంలో విధులు ఎలా నిర్వర్తించాలని ప్రశ్నించారు. ఈ ఘటనపై వెంటనే విచారించి దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ కార్యాలయాలకు కక్ష సాధింపు నోటీసులురాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దాష్టీకాలు ఏడు రోజుల్లో కట్టడాలు తొలగించాలంటూ హెచ్చరిక ఉండి/పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజు నుంచి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, పార్టీ కార్యాలయాల మీద కక్షసాధింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని వైఎస్సార్ విగ్రహాలు, ప్రభుత్వ భవన శిలాఫలకాలను ఓవైపు ధ్వంసం చేస్తుండగా.. మరోవైపు పార్టీ కార్యాలయాలను తొలగించాలంటూ నోటీసులు జారీ చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. దీనిలో భాగంగానే మంగళవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ నిర్మాణం, పార్వతీపురం జిల్లా వైఎస్సార్ సీపీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారంలోని కార్యాలయానికి సంబంధించి మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు పేరిట నోటీసులు ఈ నెల 22న, 25న జారీ చేసినట్లు ప్రస్తుత, పాత తేదీల్లో ముద్రించి నిర్మాణంలో ఉన్న పార్టీ కార్యాలయం గోడలకు అతికించారు. నోటీసులు అందుకున్న ఏడు రోజుల్లో కట్టడాలను కూల్చాలని, లేదంటే తామే కూల్చివేస్తామని హెచ్చరిక జారీ చేశారు. అయితే పార్టీ కార్యాలయాల నిర్మాణం ప్రభుత్వ నిబంధనలను అనుసరించి ప్రారంభించినట్లు వైఎస్సార్సీపీ నాయకులు చెబుతున్నారు. పల్నాడు జిల్లా కార్యాలయానికి నోటీసులు నరసరావుపేట: పల్నాడు జిల్లా నరసరావుపేట లింగంగుంట్ల కాలనీలో సుమారు 1.5 ఎకరాల రెవెన్యూ స్థలంలో నిర్మించిన వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ అధికారులు మంగళవారం నోటీసులు అంటించారు. తమ శాఖ ముందస్తు అనుమతులు తీసుకోకుండా పరిమితికి మించి భవన నిర్మాణం చేశారని, ఏడు రోజుల్లోగా సమాధానం చెప్పాలని, లేనిపక్షంలో ఈ నిర్మాణాన్ని తొలగిస్తామని ప్లానింగ్ అధికారి భాస్కర్ పేరుతో ఉన్న నోటీసును పౌడా అధికారి రఘురామ్, గ్రామ పంచాయతీ కార్యదర్శి శివప్రసాద్ అంటించారు. ఎన్నికల ముందే భవన నిర్మాణం పూర్తికాగా, ఎన్నికల కోడ్ అడ్డు రావటంతో కార్యాలయాన్ని ప్రారంభించలేదు. ఇప్పుడు నోటీసులు ఇవ్వడం కేవలం కక్ష సాధింపులో భాగమేనని వైఎస్సార్సీపీ నాయకులు భావిస్తున్నారు. -
విధ్వంసం... అరాచకం..
సాక్షి నెట్వర్క్: టీడీపీ కార్యకర్తల విధ్వంసకాండ కొనసాగుతూనే ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను పలుచోట్ల ధ్వంసం చేశారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం తాళ్లపాలెం సచివాలయ భవన నిర్మాణానికి సంబందించిన శంకుస్థాపన శిలాఫలాకాన్ని టీడీపీ కార్యకర్తలు సోమవారం రాత్రి ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్ నాయుడు, మండల ప్రజాప్రతినిధుల పేర్లతో ఈ శిలాఫలకాన్ని ఏర్పాటుచేయగా.. దానిని పగులగొట్టారు. టీడీపీ నాయకుడు, సర్పంచ్ యర్రా రామకృష్ణ ఇంటి ముందు రోడ్డు నిర్మాణానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని సైతం ధ్వంసం చేశారు. జెండా దిమ్మె ధ్వంసం తిరుపతి జిల్లా చంద్రగిరికోటలో వైఎస్సార్సీపీ జెండా దిమ్మెను మంగళవారం తెల్లవారుజామున టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చంద్రగిరిలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పాలని పోలీసులను వైఎస్సార్సీపీ నాయకులు కోరారు. జగనన్న కాలనీలో రాళ్లు ధ్వంసం పశి్చమ గోదావరి జిల్లా భీమవరం మండలం కొత్తపూసలమర్రులో టీడీపీ నాయకులు దాషీ్టకానికి తెగబడ్డారు. జగనన్న కాలనీలో సరిహద్దు రాళ్లు ధ్వంసం చేశారు. పైప్లైన్ నిర్మాణ పనులను అడ్డుకున్నారు. గ్రామ టీడీపీ నాయకులు కొల్లాటి గోవిందరాజు, బస్వాని పోతురాజు, బర్రి నాగరాజు, జల్లా బుజ్జి, బొమ్మిడి పోతురాజు, ఒడుగు సామోరు, కొయ్యలగడ్డ బాలాజీ తదితరులు వచ్చి పైప్లైన్ పనులను అడ్డుకున్నారని గ్రామస్తులతోపాటు అభివృద్ధి కమిటీ సభ్యులు ఆవేదన వ్యక్తంచేశారు. లబి్ధదారులు మాట్లాడుతూ టీడీపీ హయాంలో ఒక్క సెంటు భూమి కూడా ఇవ్వలేదని, జగనన్న ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఇస్తే పనులను అడ్డుకుంటున్నారని లబి్ధదారులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యం: పేర్ని నాని
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భద్రతపై టీడీపీ అనుకూల మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేశ్ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు నడుపుతున్నారని ధ్వజమెత్తారు. జగన్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా నిత్యం విష ప్రచారాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల నుంచి వారి దృష్టి మళ్లించేందుకే జగన్ భద్రతపై రాద్ధాంతం చేస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పడు ఆయన సతీమణి భువనేశ్వరి, నారా లోకేశ్, బ్రాహ్మణి, దేవాన్ష్లకు భద్రత కల్పించలేదా అని నిలదీశారు. లోకేశ్ కుమారుడు దేవాన్ష్కు సైతం 4+4తో భద్రత కల్పించారని గుర్తు చేశారు. భద్రత గురించి కాబట్టే.. అప్పుడు ఎవరూ ప్రశ్నించలేదన్నారు. మరి ఇప్పుడు జగన్ భద్రతపై ఎందుకు ఇంత విషప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం పేర్ని నాని మీడియాతో మాట్లాడారు. చంద్రబాబుకు ఎంతమందితో భద్రత కల్పిస్తున్నారో బయటపెట్టే దమ్ముందా అని రామోజీ కుమారుడు కిరణ్ని నిలదీశారు. జగన్కు మొత్తం 196 మందితో మాత్రమే భద్రత కల్పిస్తుంటే 986 మంది అని ఎలా రాస్తారని ప్రశ్నించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మాజీగా ఉన్నప్పుడు ఎంత మంది సెక్యూరిటీ ఉన్నారో.. వారి జీతాలు ఎంతో బయటపెట్టాలని సవాల్ విసిరారు. సుమారు 1,800 నుంచి 2,000 మందిని భదత్రకు సెక్యూరిటీని నియమించుకోలేదా? అని నిలదీశారు. జగన్ ఉంటున్న తాడేపల్లి నివాసంపైనా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్లో చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో ఫొటోలు విడుదల చేయగలరా అని ప్రశ్నించారు. తాడేపల్లిలోని జగన్ ఇంటిలో, హైదరాబాద్లోని చంద్రబాబు నివాసంలో ఏమున్నాయో నిపుణుడితో ఖరీదు కట్టిద్దామా అని సవాల్ విసిరారు. మీడియాకు జూబ్లీహిల్స్ ఇంటిని చూపించగల దమ్ము చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. ఈ సందర్భంగా పేర్ని నాని ఇంకా ఏమన్నారంటే..జగన్ నివాసంపైనా తప్పుడు ప్రచారాలేనా?ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని చంద్రబాబు హైదరాబాద్ నుంచి పారిపోయి విజయవాడ వచ్చారు. కరకట్ట ఇంటికోసం రోడ్లు, హెలీప్యాడ్, టవర్ల రూపేణా వందల కోట్లు ఖర్చు చేశారు. పార్టీ ఆఫీసులకు స్థలాలు ఇవ్వాలని జీవో ఇచ్చింది కూడా చంద్రబాబే. 33 ఏళ్లకు మాత్రమే లీజుకు ఇవ్వాల్సి ఉండగా 99 ఏళ్లకు లీజు పెంచుకున్నారు. టీడీపీ కట్టుకున్న ఆఫీసులు.. పూరిపాకలు, గుడిసెలు కాదు. మీలా ప్రభుత్వ కాంట్రాక్టులు ఇచ్చుకున్న వారితో మేం ఆఫీసులు కట్టించుకోలేదు.. పార్టీ డబ్బుతో కట్టుకుంటున్నాం. టీడీపీ ద్వంద్వ ప్రమాణాలను రామోజీరావు కుమారుడు కిరణ్ తన పత్రికలో రాయగలరా? జగన్ బెంగళూరు వెళ్తే.. కాంగ్రెస్లో విలీనం చేస్తారని ఫేక్ ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్కు ఎదురొడ్డి ధైర్యంగా రాజకీయాలు చేసిన వ్యక్తి జగన్. భయపడటం ఆయనకు తెలియదు. చంద్రబాబు, సోనియాగాంధీ చీకట్లో కలుసుకుని 16 నెలలు జైల్లో పెడితే ఏమైనా తగ్గారా? ఓడిపోతే తగ్గుతారా? జగన్ మళ్లీ ఎన్నికల్లో గెలిచే వరకు తాడేపల్లిలోనే ఉండి రాజకీయాలు చేస్తారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టుకుంటారో పెట్టుకోండి.ఇంత దుర్మార్గపు రాతలా?కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తప్పుడు వార్తలతో ప్రజల మనసుల్లో విషాన్ని ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాయి. వాళ్ల లక్ష్యం నెరవేరాక కూడా ఈ దుర్మార్గపు రాతలను ఆపకపోవడం వాళ్ల కిరాతక మానసిక నైజానికి అద్దం పడుతోంది. రామోజీరావు లేరనుకుంటే ఆయన కుమారుడు కిరణ్ ఈనాడులో తప్పుడు వార్తలు రాయిస్తున్నారు. జగన్ రక్షణకు 986 మంది, ఇంట్లో ఉంటేనే ఇంత మంది.. బయటకెళ్తే దీనికి రెండు మూడింతలు.. 5 ఏళ్లలో భద్రతా సిబ్బంది జీతాలకే రూ.296 కోట్లు అని అసత్యాలను ఎలా ప్రచురిస్తారు? తాడేపల్లి క్యాంప్ ఆఫీసును ప్యాలెస్ అని లోకేశ్ మాట్లాడుతున్నారు. ఆయన ఎర్రబుక్కు రాసింది నిజమైతే, ఖలేజా ఉన్న రాజకీయ నాయకుడైతే.. వారి జూబ్లీహిల్స్ ఇంటికి మీడియా టూర్ పెట్టాలి. లేదా రిటైర్డ్ జడ్జితో ఆ ఇంటికి విలువ కట్టించాలి. చంద్రబాబు తన రాజ్యకాంక్ష కోసం ఎన్టీఆర్ దగ్గర నుంచి జగన్ వరకు ఎవరినీ వదిలిపెట్టకుండా వ్యక్తిత్వహననం చేయిస్తున్నారు. సీఎం క్యాంప్ ఆఫీసులో ఫర్నీచర్ గురించి మాట్లాడుతున్నారు.. బాబు ఆఫీసులో ఫర్నీచర్ ఎవరు వేశారో లెక్కలు తీయాలి. మీకో న్యాయం.. జగన్కో న్యాయమా?చంద్రబాబు ఇంటి రోడ్డును బ్లాక్ చేయలేదా?మొన్నీమధ్య తాడేపల్లిలోని రోడ్డును మూసేశారంటూ రాశారు. 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఉండవల్లిలో లోటస్ హోటల్ నుంచి మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమం మీదుగా కరకట్ట రోడ్డులో జడ్జిలను తప్ప ఎవరినైనా వెళ్లనిచ్చారా? చివరకు టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా ఆ రోడ్డులో ప్రవేశం లేదు. మందడం, వైకుంఠపురం, కృష్ణాయపాలెం ఊర్లకు లోపలి నుంచి చుట్టూ తిరిగి రావాల్సిందే కదా. నాడు మొత్తం 13 కిలోమీటర్లు రోడ్డు మూసేశారు. తాడేపల్లిలో జగన్ ఇంటి చుట్టుపక్కల అపార్ట్మెంట్లు ఉన్నాయి కాబట్టే ఐరన్ గ్రిల్ ఏర్పాటు చేశారు. ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ ఓనర్లు ఇకనైనా ఈ అసత్య కథనాలను ప్రచురించడంమానుకోవాలి. -
టీడీపీ ప్రభుత్వానికి ఢిల్లీ హై కోర్టు షాక్
-
‘ఏ హోదాతో పిఠాపురంలో పెత్తనం చేస్తున్నారు?’
సాక్షి, కాకినాడ: పిఠాపురం నియోజకవర్గం కూటమి రాజకీయంలో కుంపటి నెమ్మదిగా రాజుకుంటోంది. ఎన్నికల ఫలితాలు వెలువడ్డ మరుసటి రోజే.. జనసేన శ్రేణుల నుంచి టీడీపీ ఇంఛార్జి, మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మకు చేదు అనుభవం ఎదురైంది. ఇక ఇప్పుడు.. ఆయనకు పూర్తిగా చెక్ పెట్టేందుకు జనసేన రాష్ట్ర కార్యదర్శి, పవన్ సోదరుడు నాగబాబు రంగంలోకి దిగారు. నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల్లో ఆయన హల్చల్ చేస్తుస్తుండడంతో.. వర్మ వర్గీయులకు సహించడం లేదు. తాజాగా నియోజకవర్గంలో అధికార యంత్రాంగంతో నాగబాబు సమావేశం అయ్యారు. సమస్యలు ఉంటే పవన్ దృష్టికి లేదంటే పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్కు తీసుకెళ్లాలని సూచించారు. అలాగే.. ఏదైనా ఇష్యూ ఉంటే మర్రెడ్డి డీల్ చేస్తారని, మర్రెడ్డి చెప్తేనే యాక్షన్ తీసుకోవాలని.. అంతేగానీ వేరే పార్టీకి, ఆ పార్టీ నేతలకు సరెండర్ కావాలని అవసరం లేదని నాగబాబు అధికారులకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. నాగబాబు అధికారులతో జరిపిన చర్చ టీడీపీ శ్రేణుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. నాగబాబు ఏ హోదాతో పిఠాపురంలో ఇలాంటి పెత్తనాలు చేస్తున్నారు?.. ఆయన సోదరుడి నియోజకవర్గం అయినంతమాత్రానా ఇలా వ్యవహరించాలా? అని నిలదీస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలని, లేకుంటే భవిష్యత్తులో నియోజకవర్గంలో పార్టీ ఉనికికే ప్రమాదం కలిగించవచ్చని, అదే జరిగితే తమ దారి తాము చూసుకుంటామని వర్మకు వాళ్లు అల్టిమేటం ఇచ్చినట్లు సమాచారం. మరి పిఠాపురంలో నాగబాబు డామినేషన్ను వర్మ ముందుముందు ఎలా డీల్ చేస్తారనేది చూడాలి. -
రెచ్చిపోతున్న టీడీపీ నేతలు ప్రభుత్వోద్యోగుల వార్నింగ్..
-
వైఎస్ జగన్ ఆశీస్సులు.. ప్రజల కోసం పోరాటం
-
పల్నాడులో టీడీపీ, జనసేన అరాచకం
-
నిలిపివేయడం సరికాదు: NBDA
-
చంద్రబాబు మార్క్ వెన్నుపోటు
-
పచ్చ మీడియా విషం..
-
పోలీసులపై టీడీపీ నాయకుల దాష్టీకం
సాక్షి టాస్క్ఫోర్స్: గత 20 రోజులుగా రాష్ట్రంలో చెలరేగిపోతున్న తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు చివరకు పోలీసులపైనే దాడికి బరితెగించారు. అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో పోలీసు స్టేషన్ వద్దే ఎస్సై, కానిస్టేబుల్పై చేయి చేసుకొని, బూతులు తిడుతూ దౌర్జన్యానికి తెగబడ్డారు. చివరకు పోలీసులు లాఠీచార్జీ చేసి టీడీపీ నాయకులను అక్కడి నుంచి తరిమారు. వివరాలు ఇలా ఉన్నాయి . గుర్రంకొండ మండలంలోని అమిలేపల్లెలో వైఎస్సార్సీపీ నాయకుడు రమణ కోర్టులో స్టే తెచ్చుకొని తన స్థలంలో ఇనుప కంచె వేసుకున్నాడు.ఇదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు సోమవారం ఈ స్థలంలో ఉన్న ఇనుప కంచెను దౌర్జన్యంగా తొలగించారు. ఇదేమిటని ప్రశి్నంచిన వైఎస్సార్సీపీ నాయకులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు వైఎస్సార్సీపీ నాయకుడిని పోలీస్ స్టేషన్కు విచారణకు పిలిపించారు. అతని వెంట ఎంపీపీ యోగేంద్ర, జెడ్పీటీసీ సమ్రీన్ ముక్తియార్, మాజీ సర్పంచ్ జగన్మోహన్ పోలీస్ స్టేషన్కు వచ్చారు. స్టేషన్ ముందు కుర్చిలలో వారంతా కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఉన్న టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నా కొ..లని స్టేషన్ వద్ద కుర్చిల్లో ఎలా కూర్చోబెడతారంటూ కేకలు వేస్తూ లోపలికి చొచ్చుకొని వచ్చారు.స్టేషన్లో ఉన్న ఎస్ఐ శ్రీనివాసనాయక్, ఏఎస్ఐ నరసింహులు, సిబ్బంది వారిని అడ్డుకొని ఏమైనా ఉంటే స్టేషన్లో కూర్చోని మాట్లాడుకొందామని కోరారు. దీంతో రెచి్చపోయిన టీడీపీ నాయకులు ఎస్ఐ శ్రీనివాస్ నాయక్పై చేయి చేసుకొని, కింద పడేశారు. అడ్డుకోబోయిన కానిస్టేబుళ్లను కూడా కిందికి తోసేశారు. దీంతో పోలీసులు లాఠీచార్జీ చేసి వారిని చెదరగొట్టారు. దీంతో టీడీపీ వారు అక్కడినుంచి వెళ్లిపోయారు. వాల్మికిపురం సీఐ శేఖర్ స్టేషన్ వద్దకు చేరుకొని విచారణ జరిపారు. పోలీసులపై దాడి చేసిన టీడీపీ నాయకుల కొసం గాలిస్తూ వెళ్లిపోయారు. ఎస్ఐపై దాడి చేయడం గుర్రంకొండ చరిత్రలో ఇదే మొదటిసారని గ్రామస్తులు చర్చించుకొన్నారు. -
టీడీపీ వర్గీయుల వేధింపులతో ఆత్మహత్య
నల్లజర్ల: టీడీపీ వారి సూటిపోటి మాటలు, వేధింపులు తట్టుకోలేక తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం అనంతపల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్త రాము భార్య పెద్దింట్లు (50) పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి భర్త రాము, వారి కుమారుడు ప్రసాద్ సోమవారం తెలిపిన మేరకు.. ఈ కుటుంబం గ్రామంలోని గంగానమ్మ గుడి వీధిలో నివసిస్తోంది. ఆ వీధిలో వీరొక్కరే వైఎస్సార్సీపీకి చెందినవారు.మిగిలిన వారంతా టీడీపీ వారే. గ్రామంలోని పద్మావతి డ్వాక్రా సంఘంలో పెద్దింట్లు సభ్యురాలు. వయస్సు పైబడిన మానికల లక్ష్మమ్మ ఆ గ్రూపు నుంచి వైదొలగడంతో ఆమె స్థానంలో కొత్త సభ్యురాలిని చేర్చుకునే విషయమై గ్రూపులోని మిగిలిన సభ్యులతో పెద్దింట్లుకు ఇటీవల వివాదం జరిగింది. దీనికితోడు పెద్దింట్లు వైఎస్సార్సీపీకి చెందినవారు కావడంతో గ్రూపు సభ్యులు ఆమెను వేధించసాగారు. ఎన్నికల ముందు నుంచే సూటిపోటి మాటలతో వేధిస్తున్న గ్రూపు సభ్యులు.. ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓటమితో వేధింపుల్ని తీవ్రతరం చేశారు. ఇంటిపైకి వచ్చి బెదిరించసాగారు.ఈ నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన పెద్దింట్లు గురువారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. తొలుత స్థానికంగా వైద్యం చేయించిన కుటుంబసభ్యులు తరువాత ఏలూరు, అక్కడి నుంచి గుంటూరు ఆస్పత్రికి తరలించారు. గుంటూరు ప్రభుత్వాస్పపత్రిలో చికిత్స పొందుతూ పెద్దింట్లు ఆదివారం మృతిచెందింది. టీడీపీ వర్గీయులు తమను వేధించడమే కాకుండా, తిరిగి తమపై పోలీస్స్టేషన్లో తప్పుడు కేసు పెట్టారని రాము, ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దింట్లును మానసికంగా వేధించి ఆమె మృతికి కారకులైనవారిని కఠినంగా శిక్షించాలని వారు కోరారు. -
మంత్రి అనగాని ఇలాకాలో శ్రుతిమించిన దౌర్జన్యం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అధికారం అండతో టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు, సానుభూతిపరులే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. వాహనాలను తగులబెడుతున్నారు. కులం పేరుతో దూషిస్తున్నారు. ఊరు వదిలిపోవాలని హెచ్చరిస్తున్నారు. వెళ్లనివారిపై దాడులు చేసి కొడుతున్నారు. తీవ్రంగా గాయపరుస్తున్నారు. నాయకులపై దాడులు చేయడంతోపాటు వారి ఆస్తులకు నష్టం చేస్తున్నారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సొంత ఇలాకా రేపల్లె నియోజకవర్గంలో ఈ తరహా దాడులు పెచ్చుమీరాయి.ఆదివారం రాత్రి చెరుకుపల్లి మండలం రాంబోట్లవారిపాలెంలో వైఎస్సార్సీపీ ఎస్సీ నాయకుడు చేబ్రోలు రాజ్కుమార్ ఇంటిపై 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడిచేశారు. రాజ్కుమార్ను కులం పేరు పెట్టి రాయలేని పదజాలంతో దూషించారు. మాకు వ్యతిరేకంగా పనిచేస్తావా..? అంటూ దాడిచేసి తీవ్రంగా కొట్టారు. బయటకు లాక్కొచ్చి ఇంటిమెట్లపైన, ఇంటిముందున్న ఇసుక దిబ్బపైన పడేసి మళ్లీమళ్లీ కొట్టారు. దాడివిషయం తెలుసుకున్న అతడి బంధువులు అక్కడికి చేరుకోవడంతో రాజ్కుమార్ కొనప్రాణాలతో బయటపడ్డారు. తీవ్రంగా గాయపడిన రాజ్కుమార్ను తొలుత రేపల్లె ఆస్పత్రికి తరలించారు. తరువాత తెనాలి ఆస్పత్రిలో చేర్చారు.తనను ఊరువదలి వెళ్లిపోవాలని టీడీపీ కార్యకర్తలు హెచ్చరించారని రాజ్కుమార్ తెలిపారు. రాం»ొట్లవారిపాలెం, పగడంవారిపాలెం, పిట్టుకోటిరెడ్డిపాలెం గ్రామాలకు చెందిన 30 మందికిపైగా టీడీపీ కార్యకర్తలు కర్రలు, రాడ్లు తదితర మారణాయుధాలతో దాడి చేసినట్లు బాధితుడు సోమవారం జిల్లా పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత ప్రసాదరెడ్డిని టీడీపీ మూకలు బెదిరిస్తున్నాయి.చెరుకుపల్లి మండలం ఆరుంబాక గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, న్యాయవాది కర్ర ప్రతాప్ ఇంటిపై దాడిచేసి ఆయన ద్విచక్రవాహనాన్ని ధ్వంసం చేశారు. గుళ్లపల్లిలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటుచేసిన శిలాఫలకాలను టీడీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. నిజాంపట్నం మండలం అడవులదీవి సర్పంచ్ ఏమినేని రాంబాబు ఇంటిపై దాడిచేసి కిటికీ అద్దాలు పగులగొట్టారు. నియోజకవర్గవ్యాప్తంగా టీడీపీ నేతలు.. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను ఊర్లు వదలివెళ్లాలని నిత్యం బెదిరిస్తున్నారు. -
శిలాఫలకాల ధ్వంసం
సాక్షి నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ కార్యకర్తలు శిలాఫలకాలను ధ్వంసం చేస్తూనే ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రగతి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ఆదివారం రాత్రి, సోమవారం ధ్వంసం చేశారు. వాహనాల దహనం వంటి దుశ్చర్యలకు పాల్పడ్డారు. ⇒ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం శెట్టిపేటలో రూ.27 లక్షలతో నిరి్మంచిన పీఏసీఎస్ భవనం ప్రారంభోత్సవ శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. అప్పటి ఎమ్మెల్యే జి.శ్రీనివాస్నాయుడు ఈ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. త్రిసభ్య కమిటీ పేరుపై ఫ్లెక్సీ ఏర్పాటుచేయగా చైర్మన్గా వ్యవహరించిన గంధం వెంకటరత్నం (షావుకారు) పేరు సైతం తొలగించారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం కె.పెదపూడి గ్రామంలోని మండల ప్రజాపరిషత్ పాఠశాలలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన నాడు–నేడు శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. దీనిపై ఎంఈవో సూచన మేరకు ప్రధానోపాధ్యాయురాలు గంటా రజనీప్రియ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ⇒ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా మండపేటలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన మండపేట–ద్వారపూడి రహదారి పనులకు సంబంధించి స్థానిక తాపేశ్వరం రోడ్డులోని లాకులకు వెళ్లే దారిలో ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని ధ్వంసం చేశారు. శిలాఫలకంపై ఉన్న ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫొటోను పూర్తిగా తొలగించారు. ఘటనాస్థలాన్ని వైఎస్సార్సీపీ రాష్ట్ర నేతలు కర్రి పాపారాయుడు, రెడ్డి రాధాకృష్ణ తదితరులు పరిశీలించారు. శిలాఫలకాల ధ్వంసం దారుణమంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు వెంటనే స్పందించి, ఇటువంటి ఘటనలను నిలువరించకపోతే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ⇒ ఏలూరు జిల్లా దెందులూరు మండలం గాలాయగూడెంలో శ్రీ అచ్చమ్మ పేరంటాలమ్మ తల్లి ఆలయానికి వెళ్లేదారిలో గ్రామంలో జరిగిన అభివృద్ధి పనుల వివరాలు తెలిపే శిలాఫలకాన్ని తొలగించారు. ఇటువంటి చర్యలకు పాల్పడటం బాధాకరమని వైఎస్సార్సీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ⇒ పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కుందురువారిపాలెం గ్రామంలో బత్తుల రాంబాబు ద్విచక్రవాహనాన్ని దహనం చేశారు. గ్రామంలోని బీసీ కాలనీకి చెందిన రాంబాబు ద్విచక్రవాహనాన్ని ఇంటి ఎదురుగా ఉన్న రేకుల షెడ్డులో పార్కింగ్ చేశారు. అర్ధరాత్రి దాటాక మంటలు రావటాన్ని గమనించిన స్థానికులు మంటల్ని ఆరి్పవేశారు. అప్పటికే ద్విచక్రవాహనం పూర్తిగా కాలిపోయింది. రాంబాబు భార్య స్వాతి గ్రామంలో వలంటీరుగా పనిచేసింది. టీడీపీ నాయకులు విజయోత్సవ సంబరాల్లో భాగంగా ఆదివారం రాత్రి ఆర్కెస్ట్రా ఏర్పాటు చేశారు. అదే సమయంలో ద్విచక్రవాహనం దహనమైంది. ఘటనాస్థలాన్ని ఎస్.ఐ. పి.హజరత్తయ్య పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ⇒ ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని మర్లపాడు గ్రామ సెంటర్లో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి సోమవారం గుర్తుతెలియని వ్యక్తులు టీడీపీ కండువా వేశారు. టీడీపీ నాయకుల ఆగడాలు తారస్థాయికి చేరాయని, వైఎస్ రాజశేఖర్రెడ్డికి టీడీపీ కండువా కప్పి అవమానించారని వైఎస్సార్సీపీ మర్లపాడు గ్రామ అధ్యక్షుడు సింగమనేని బ్రహ్మయ్య పేర్కొన్నారు. ఈ విషయమై పోలీసులకు, కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
వైఎస్సార్సీపీ దళిత నేత ఇంటిపై దాడి
పెద్దపంజాణి (చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లాలో వైఎస్సార్సీపీకి చెందిన ఓ దళిత నేత ఇంట్లోకి టీడీపీకి చెందిన వారిగా భావిస్తున్న ముగ్గురు వ్యక్తులు చొరబడి, ఆయన భార్య, కుమారుడిపై దాడి చేసి, విధ్వంసం సృష్టించారు. బాధితుని కథనం ప్రకారం.. దళితుడైన వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ ఎర్రబల్లి శ్రీనివాసులు పెద్దపంజాణి మండలం వీరప్పల్లి పంచాయతీ కెళవాతి సమీపంలోని తన పొలం వద్ద ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు.వైఎస్సార్సీపీలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు. సోమవారం రాత్రి 8.30 గంటల సమయంలో ముసుగులు ధరించి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు అతని ఇంట్లోకి చొరబడ్డారు. శ్రీనివాసులు కోసం ఆరాతీశారు. ఆయన ఇంట్లో లేకపోవడంతో అతని భార్య, కుమారుడి వద్ద ఉన్న సెల్ఫోన్లను తీసుకున్నారు. పెద్దగా కేకలు వేస్తూ వారిద్దరిపైనా దాడి చేసి, గాయపరిచారు. ఇంట్లోని ఫరి్నఛర్ను ధ్వంసం చేసి భయభ్రాంతులకు గురిచేశారు.గతంలో సీఎం చంద్రబాబు, స్థానిక ఎమ్మెల్యే అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా శ్రీనివాసులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడని, అతన్ని ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టబోమని, రాష్ట్రం విడిచి వెళ్లే వరకూ వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించి వెళ్లిపోయారు. కుటుంబీకుల సమాచారంతో ఇంటికి చేరుకున్న శ్రీనివాసులు పెద్దపంజాణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, విచారణ చేపట్టారు. -
స్వామి భూములు స్వాహా!
గంట్యాడ: దేవుడికే టీడీపీ నాయకులు శఠగోపం పెట్టేశారు. దేవుడి భూములను ఆక్రమించి ఫలసాయం పొందడంతో పాటు వాటి విక్రయాలకు తెగబడుతున్నారు. ఈ విషయం దేవదాయశాఖ అధికారులకు తెలిసినా ప్రేక్షకపాత్రకే పరిమితమవడం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. విజయనగరం జిల్లా కేంద్రంలో ఉన్న శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి అదే జిల్లా గంట్యాడ మండలం సిరిపురం గ్రామంలో 48 ఎకరాల భూమి ఉంది.విజయనగరంలోని హుకుంపేటకు చెందిన అనసపురపు జగన్నాథరావు తండ్రి రామమూర్తి పంతులు, అనసపురపు జగన్నాథ రాజగోపాలరావు తండ్రి శ్రీనివాస పంతులు శ్రీమన్నార్ రాజగోపాలస్వామివారి ధూప, దీప నైవేద్యాలు, జాతర నిర్వహణ, ఇతర ఖర్చుల కోసం 1929లో 48 ఎకరాల భూమిని రిజిస్టర్ చేశారు.డాక్యుమెంటేషన్ 1815 పేరిట 32 ఎకరాల పల్లపు భూమి, 16 ఎకరాల మెట్ట భూమిని అప్పగించారు. ఈ భూమి సర్వే నెంబర్ 95/15, 16, 17, 19, 21, 96/1, 3, 4, 97/20, 21, 23, 99/9, 10, 11, 12, 14, 15, 100/4, 5, 8, 9, 10, 140/3, 4, 9, 11, 12, 14 తదితర నంబర్లలో విస్తరించి ఉంది. దీని విలువ రూ.20 కోట్ల నుంచి రూ.25 కోట్ల వరకు ఉంటుందన్నది స్థానికుల మాట. దీనిపై టీడీపీ నేతల కన్నుపడింది. అంతే.. మొత్తం భూమిని తమ గుప్పెట్లోకి లాక్కున్నారు. ఏళ్ల తరబడి అనుభవించడంతో పాటు ఇప్పుడు అధికార బలంతో విక్రయాలకు సిద్ధపడ్డారు. కొందరైతే అందులో అక్రమ కట్టడాలు సైతం తలపెట్టారు. ఇంత జరుగుతున్నా దేవదాయ శాఖాధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలున్నాయి. ఆ రిజిస్ట్రేషన్లు చెల్లవు.. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి ఆలయానికి చెందిన 48 ఎకరాల భూమి సిరిపురం గ్రామ పరిసరాల్లో ఉంది. ఈ భూములన్నీ ఆలయానికి చెందినవే. పక్కా డాక్యుమెంట్లు ఉన్నాయి. శ్రీమన్నార్ రాజగోపాలస్వామి దేవస్థానానికి చెందిన భూములన్నీ మ్యానిíసిప్ట్ డయాగ్లేట్ రిజిస్టర్ (ఎండీఆర్)లో దేవస్థానం భూములుగా నమోదై ఉన్నాయి. ఈ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు నిలిపివేశాం. అక్రమ రిజి్రస్టేషన్లు చెల్లవు. కొనుగోలు చేసేవారే బాధ్యులవుతారు. – శ్రీనివాస్, వీఆర్వో, సిరిపురం -
కొనసాగుతున్న కక్ష సాధింపు
భవానీపురం (విజయవాడ పశ్చిమ)/విజయనగరం/ఆదోని టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ విద్యాధరపురంలోని లేబర్కాలనీలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాన్ని కూల్చేయడానికి పావులు కదుపుతోంది. ఇందుకు సంబంధించి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి, పార్టీ ఆఫీస్ నిర్మాణానికి సంబంధించిన సిబ్బందికి మధ్య జరిగిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘విద్యాధరపురం లేబర్కాలనీ పార్టీ ఆఫీసుకు పాత తేదీలతో (గత నెలలో) నోటీసులు ఇస్తాం. దాని వల్ల మీకు ఇబ్బంది ఏమీ ఉండదు. మీరు ఒప్పుకుంటే రేపు తెల్లవారుజామున 5 గంటలకు వచ్చి నోటీస్ ఇచ్చి వెళిపోతా. అధికారులు మాపై ఒత్తిడి తెస్తున్నారు’ అని కార్పొరేషన్కు చెందిన సిబ్బంది ఒకరు పార్టీ కార్యాలయం సంబంధికునికి ఫోన్ చేశారు.ఇందుకు ఇటు వైపు నుంచి సమాధానమిస్తూ ‘అలా ఎలా తీసుకుంటాం.. మీరు ఎప్పుడు నోటీస్ ఇస్తే ఆ రోజు తేదీ వేసి ఇవ్వండి. అది కూడా సైట్ దగ్గరకు వచ్చి నోటీస్ ఇస్తే తీసుకుంటాం. ఆ విషయాన్ని మాపై వారికి తెలియజేస్తాం’ అని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నగర పాలక సంస్థ చీఫ్ సిటీ ప్లానర్ జీవీజీఎస్వీ ప్రసాద్.. అనుమతి లేకుండా పార్టీ కార్యాలయం నిర్మిస్తున్నారని సోమవారం నోటీస్ జారీ చేశారు. ప్రజలకు ఇబ్బందిగా మారిన మురికి కుంటను పూడ్చేసి, అధికారుల అనుమతితోనే నిర్మాణం చేపట్టినప్పటికీ టీడీపీ సర్కారు కక్షగట్టి వ్యవహరిస్తోంది. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మహారాజుపేటలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నిర్మాణం అక్రమమని టౌన్ ప్లానింగ్ అధికారి ఫిలిప్ సోమవారం నోటీసు జారీ చేశారు. అనుమతి లేకుండా నిర్మిస్తున్నందున తక్షణమే పనులు ఆపేసి, ఏడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. లేని పక్షంలో తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఆదోనిలో వైఎస్సార్సీపీ కార్యాలయ నిర్మాణం అక్రమమని బీజేపీ నాయకుడు నాగరాజుగౌడ్, టీడీపీ నేత ఉమ్మి సలీంతో పాటు మరో ఇద్దరు మున్సిపల్ కమిషనర్ రామచంద్రారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తగిన సమాధానం ఇవ్వాలని టౌన్ ప్లానింగ్ అధికారులు పార్టీ కార్యాలయానికి నోటీసు జారీ చేశారు. -
కావ్య కనుసైగలతో మాలేపాటిపై కేసుల నమోదు?
కావలి టీడీపీలో ఆధిపత్యం.. అంతర్యుద్ధం పతాక స్థాయికి చేరింది. ‘ఏరు దాటే వరకు మల్లన్న.. ఏరు దాటాక బోడి మల్లన్న’ చందానా సార్వత్రిక ఎన్నికలు ముగిసే వరకు సాగిన ఐక్యతారాగం.. ఇప్పుడు శృతి తప్పింది. ఆది నుంచి పార్టీకి వెన్నుదన్నుగా, సార్వత్రిక ఎన్నికల్లో విజయానికి ఎదురొడ్డి నిలిచిన నేతలనే టార్గెట్ చేయడం ఇప్పుడు ఆ పార్టీలో అగ్గి రాజుకుంది. అధికారంలోకి వచ్చామనే అహంకారంతో చెలరేగిపోయిన మాలేపాటి కుటుంబంపైనే కేసులు నమోదు చేయించడంతో జీర్ణించుకోక మానసిక క్షోభతో తీవ్ర అస్వస్థతకు గురై ఐసీయూలో చికిత్స పొందుతున్న పరిస్థితి చూస్తే టీడీపీలో అంతర్యుద్ధానికి అద్దం పడుతోంది.సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి టీడీపీ అంటే బీద రవిచంద్ర.. మాలేపాటి సుబ్బానాయుడు. ఇది మొన్నటి వరకు ఉన్న పరిస్థితి. ఎన్నికలు ముగిశాయి.. ఫలితాలు వెలువడ్డాయి. ఇంకా పరిపాలన గాడిలో పడలేదు. కానీ అప్పుడే టీడీపీలో రాజకీయ ముసలం మొదలైంది. ఆ పార్టీ నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత నుంచి పార్టీ కాడి మోసే నేత లేని పరిస్థితుల్లో దగదర్తికి చెందిన మాలేపాటి సుబ్బానాయుడు రూ.కోట్లు ఖర్చు పెట్టుకుని ఉనికిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర అండతో అధిష్టానం ఆశీస్సులతో నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగారు. తానే కాబోయే ఎమ్మెల్యే అభ్యర్థినంటూ విస్తృత ప్రచారం చేసుకున్నాడు. అయితే రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో కావ్య కృష్ణారెడ్డి తెరపైకి రావడం, సార్వత్రిక ఎన్నికల్లో అధికారం మార్పు జరగడం చకాచకా జరిగిపోయాయి. ఈ క్రమం పార్టీకి విదేయుడిగా పని చేసిన సుబ్బానాయుడు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన కావ్య కృష్ణారెడ్డి విజయంలో తనదైన పాత్ర పోషించారు.అయితే ఇప్పుడేం జరిగిందంటే..ఎన్నికల కౌంటింగ్ పూర్తయ్యాక కావ్య కృష్ణారెడ్డి విజయం సాధించిన తర్వాత టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయిలో విజయోత్సవాలు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలుచోట్ల వైఎస్సా ర్సీపీ మద్దతుదారులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ శ్రేణులు అనేక చోట్ల భౌతిక దాడులు, ఆస్తుల ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలో మాలేపాటి సుబ్బానాయుడు తన స్వగ్రామమైన దగదర్తిలో ఈ నెల 9న టీడీపీకి చెందిన మాలేపాటి రవీంద్రనాయుడు, మాలేపాటి భాను, వడ్డే వినయ్, తాండ్రా కార్తీక్, తాండ్రా వెంకటేశ్వర్లు తదితరులు వైఎస్సార్సీపీ సానుభూతిపరుడు మారెళ్ల వెంకటేశ్వర్లు ఇంటి ప్రహరీని జేసీబీతో ధ్వంసం చేశారు. దీంతో వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితుడు దగదర్తి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా వారిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మాలేపాటి సుబ్బానాయుడు, భాను, గోపాల్, సూరయ్య, వినయ్ తదితరులు జేసీబీతో తమ ఇంటి ప్రహరీని కూల్చి వేశారని, అడ్డుకోబోయిన తన కోడలు, తనను దుర్భాషలాడుతూ దాడి చేయబోయారని దగదర్తికి చెందిన వైఎస్సార్సీపీ మద్దతుదారు అయిన కాండ్రా కామేశ్వరమ్మ టీడీపీ నేతలపై మరో ఫిర్యాదు చేశారు. ‘నీ కొడుకు శ్రీనివాసులు ఎక్కడున్నా వెతికి చంపేస్తామంటూ’ తమపై దాడి చేయబోగా వారి నుంచి తప్పించుకొని పోలీసు స్టేషన్కు చేరుకొని ఫిర్యాదు చేస్తున్నామని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.మాలేపాటికి షాక్ ఇచ్చిన కావ్యమాలేపాటి అండ్ గ్యాంగ్ సాగించిన అరాచకంపై తన మండలంలోనే తమపై కేసులు నమోదు కావడాన్ని జీర్ణించుకోలేకపోయిన మాలేపాటి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. మాపై కేసులు పెడుతుంటే..చూస్తూ ఊరుకుంటావా? అంటూ ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో కావ్య కూడా గట్టిగానే తిరిగి ప్రశ్నలు సంధించడంతో ఇద్దరి మధ్య వాగ్యువాదం తారస్థాయికి చేరింది. ‘ఎవర్ని అడిగి గోడలు కూల్చారు.. ఎవరిని అడిగి విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశారంటూ’ కావ్య నిలదీశారంట. ఎన్నికల ముందు నుంచి మాలేపాటి ఆర్థికంగా తనను వేధించిన విషయాలను మనస్సులో పెట్టుకున్న కావ్య ఒక్కొక్కటిగా కడిగిపారేయడంతో సుబ్బానాయుడు తీవ్ర ఫ్రస్ట్రేషన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు చైన్నెలోని ఆస్పత్రికి తరలించి వెంటిలేటర్పై పెట్టి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలుస్తోంది. ప్రస్తుతంలో ఐసీయూలో కోలుకుంటున్నట్లు కుటుంబ సభ్యుల ద్వారా తెలిసింది.కావ్య వైఖరితోనే ఈ పరిస్థితి.. కావ్య కృష్ణారెడ్డి ఉద్దేశ పూర్వకంగానే మాలేపాటిపై కేసులు పెట్టించి.. ఆయన్ను తీవ్రంగా అవమానించడంతో పాటు వేధింపులకు గురిచేయడం కారణంగానే మాలేపాటి చావుబతుకుల్లో ఉన్నాడని ఆయన బంధువులు, అభిమానులు తీవ్ర ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. టీడీపీ ప్రారంభం నుంచి వీరవిధేయులుగా ఉన్న తమను కాదని, ధన బలంతో పార్టీ టికెట్ చేజిక్కించుకొని ఎమ్మెల్యే స్థాయికి ఎదిగి తమను ఇంతగా కించపరచడాన్ని మాలేపాటి వర్గీయులు ఏ మాత్రం సహించబోమని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రానున్న రోజుల్లో అసలైన తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాలేపాటికి అండగా నిలవాలని అంతర్గతంగా జోరుగా చర్చ జరుగుతున్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే కావలి టీడీపీలో రెండు రాజకీయ కుంపట్లు ఏర్పడి మరింత సంక్షోభావానికి దారి తీయవచ్చని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇదిలా ఉంటే కావ్య కృష్ణారెడ్డి వైఖరిపై బీద రవిచంద్ర కూడా కక్కలేక.. మింగలేక రగిలిపోతున్నట్లు సమాచారం. మాలేపాటి విషయంలో కావ్య వ్యవహరిస్తున్నట్లు తీరు, పార్టీ పరిస్థితిపై లోకేశ్ వద్ద పంచాయితీ పెట్టన్నట్లు తెలుస్తోంది. -
నెల్లూరు జిల్లా: టీడీపీ అరాచకాలు.. ఎస్పీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా ఎస్పీని వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. టీడీపీ కక్ష సాధింపు చర్యలు, దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. అనంతరం మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ అరాచకాలు సృష్టిస్తోందని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతల ఆస్తులను ధ్వంసం చేస్తున్నారన్నారు. ఆధారాలతో సహా ఎస్పీకి ఫిర్యాదు చేశామని కాకాణి తెలిపారు.మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతల దాడులపై ఎస్పీకి ఫిర్యాదు చేశామని.. ఆయన సానుకూలంగా స్పందించారని ఆదాల తెలిపారు.