-
రైతుకు రొక్కమేది?
సాక్షి, అమరావతి, నెట్వర్క్: తాము అధికారంలోకి రాగానే ప్రతీ రైతుకు రూ.20 వేలు చొప్పున సాగు సాయం అందిస్తామంటూ సూపర్ సిక్స్లో ఇచ్చిన హామీని టీడీపీ–జనసేన–బీజేపీ కూటమి ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాలు డిమాండ్ చేశాయి. మాట ప్రకారం కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ తొలి విడత సాయాన్ని ఇటీవలే జమ చేసిందని, అదే తరహాలో రాష్ట్ర ప్రభుత్వం సైతం అన్నదాతా సుఖీభవ ద్వారా రైతన్నలకు పెట్టుబడి సాయం అందించి ఆదుకోవాలని కోరాయి. వ్యవసాయదారులకు తొలి విడత పెట్టుబడి సాయాన్ని వెంటనే జమ చేయాలని కోరుతూ ఏపీ రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో గురువారం రాష్ట్రవ్యాప్తంగా తహసీల్దార్ కార్యాలయాల ఎదుట పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా రైతులతో పాటు కౌలు రైతులు, అటవీ, దేవదాయ, అసైన్డ్ భూసాగుదారులకు పెట్టుబడి సాయం అందించాలని కోరుతూ తహసీల్దార్లకు వినతిపత్రాలు సమర్పించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జి.ఈశ్వరయ్య కడపలో, ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె.కాటమయ్య పుట్టపర్తిలో, ఆయా సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కేవీవీ ప్రసాద్, పి.జమలయ్య విజయవాడ రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ఎదుట నిర్వహించిన ప్రదర్శనల్లో పాల్గొన్నారు. గత ఐదేళ్లుగా పీఎం కిసాన్ – వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున మూడు విడతల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెట్టుబడి సాయాన్ని అందించిందని గుర్తు చేశారు. తొలివిడత సాయాన్ని గత ప్రభుత్వం ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందుగానే జమ చేసిందని చెప్పారు. ఆ డబ్బులు దుక్కి పనులు, విత్తనాల కొనుగోలు లాంటి సాగు అవసరాలకు రైతులకు ఎంతగానో ఉపయోగపడేవన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి రైతుకు రూ.20 వేల చొప్పున సాగు సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి నేతలు విస్తృతంగా ప్రచారం చేశారని, ఈ హామీని వెంటనే అమలులోకి తేవాలని సూచించారు. తొలి విడత సాయం అందకపోవడంతో పెట్టుబడి ఖర్చుల కోసం ఖరీఫ్ సీజన్లో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పీఎం కిసాన్తో సంబంధం లేకుండా రూ.20 వేలు చొప్పున సాగు సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎన్ని విడతల్లో ఎంత జమ చేస్తారో స్పష్టత ఇవ్వడంతో పాటు త్వరలో ప్రవేశపెట్టనున్న పూర్తి స్థాయి బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు కూడా జరపాలన్నారు. పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ను పెంచి పంట రుణాలు అందించాలన్నారు. రూ.3 లక్షల వరకు వడ్డీ లేకుండా, రూ.5 లక్షల వరకు పావలా వడ్డీతో రైతు, కౌలురైతులకు రుణాలివ్వాలని కోరారు. సాగు చేస్తున్న భూమి దామాషాను పరిగణలోకి తీసుకొని పంటరుణాలు మంజూరు చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతంలోని మురుగునీటి కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టాలన్నారు. వ్యవసాయ మోటార్లకు బిగించిన స్మార్ట్ మీటర్లను వెంటనే తొలగించి ఉచిత విద్యుత్ పథకాన్ని సమర్ధంగా అమలు చేయాలన్నారు. గత ప్రభుత్వం 2019లో తెచ్చిన పంట సాగుదారు హక్కుల చట్టాన్ని సవరించాలని, గ్రామ సభలోనే కౌలు రైతులను గుర్తించి స్వీయ ధృవీకరణ ఆధారంగా గుర్తింపు కార్డులు జారీ చేయాలని కోరారు. గుర్తింపు కార్డులు ఇప్పటివరకు జారీ చేయనందున కౌలు రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకుని పచ్చి రొట్ట విత్తనాలు, అన్ని రకాల పంటల విత్తనాలు, సూక్ష్మ పోషకాలు, ఎరువులు, పురుగు మందులు 90% సబ్సిడీపై అందించాలన్నారు. దేవదాయ, ధర్మాదాయ సాగు భూముల వేలం పాటలను నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. గత సీజన్లో వర్షాభావం, తుపాను వల్ల నష్టపోయిన కౌలురైతులకు కౌలు రేట్లు తగ్గించి నామమాత్రపు ధరతో లీజుకు ఇవ్వాలని కోరారు.ఏలూరులో ధర్నా..ఖరీఫ్ సీజన్ ప్రారంభమైనందున సాగు సాయం కింద రూ.20 వేలు వెంటనే రైతులకు అందించాలంటూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో ఏలూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించాలని, పోలవరం నిర్మాణం వేగంగా చేపట్టాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు డేగా ప్రభాకర్ డిమాండ్ చేశారు. వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర పనిముట్లు కొనుగోలుపై 50 శాతం రాయితీ అందించాలన్నారు. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలని, కల్తీ విత్తనాలను అరికట్టాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు వెంటనే అందించాలని కోరుతూ అనకాపల్లి జిల్లా చోడవరం తహసీల్దార్కు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. సాయం అందకపోవడంతో రైతులు అధిక వడ్డీలకు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ రైతులకు సకాలంలో బ్యాంకు రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.జగన్నాథం కర్నూలులో డీఆర్ఓకు వినతిపత్రం అందచేశారు.తక్షణమే పెట్టుబడి సాయం ఇవ్వాలిసూపర్ సిక్స్లో ఇచ్చిన హామీ మేరకు రూ.20 వేల పెట్టుబడి సాయం పంపిణీని కూటమి ప్రభుత్వం తక్షణమే ఆచరణలో పెట్టాలి. ఎన్ని విడతల్లో జమ చేస్తారో స్పష్టత ఇవ్వాలి. ఈ మేరకు బడ్జెట్లో కేటాయింపులు జరపాలి. తక్షణమే తొలి విడత సాయం అందించి రైతులకు అండగా నిలవాలి. లేదంటే దశలవారీగా ఆందోళన చేస్తాం.–జి.ఈశ్వరయ్య, అధ్యక్షుడు, ఏపీ రైతు సంఘంప్రతీ కౌలు రైతుకూ సాయంసామాజిక వర్గాలతో సంబంధం లేకుండా ప్రతీ కౌలు రైతుకూ సాగు సాయం అందించాలి. గతంలో సీజన్కు ముందుగానే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సీసీఆర్సీ కార్డులు ఇచ్చారు. పంటసాగు హక్కుదారుల చట్టం 2019ని సవరించి స్వీయ ధ్రువీకరణతో ప్రతీ కౌలుదారుడికి సీసీఆర్సీ కార్డులివ్వాలి. సాగు సాయంతో పాటు సంక్షేమ ఫలాలన్నీ కౌలు రైతులందరికీ అందించేలా చర్యలు తీసుకోవాలి.–కె.కాటమయ్య, అధ్యక్షుడు, ఏపీ కౌలురైతు సంఘం -
యువనేతలు చంద్రబాబు వెన్నుపోటు
-
టీడీపీ దాష్టికాలు.. దారుణాలు.. ఏపీ డీజీపీకి వైఎస్సార్సీపీ లేఖ
సాక్షి, గుంటూరు: గత 15 రోజులుగా టీడీపీ నేతలు చేస్తున్న దారుణాలపై డీజీపీకి వైఎస్సార్సీపీ నేతలు లేఖ రాశారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులపై దాడులకు పాల్పడంతో పాటు ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని.. వీటిపై ఫిర్యాదులు చేస్తున్నా పోలీసులు చర్యలు తీసుకోవడంలేదు. మా ప్రాణాలకు హాని ఉందని చెప్తున్నా పోలీసులు పట్టించుకోవడంలేదంటూ డీజీపీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది.‘‘అంతేకాకుండా వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇవ్వాళ్టికి రాష్ట్రంలోని 14 చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల్లోకి చొరబడ్డారు. మా పార్టీ ఆస్తుల్లోకి అక్రమంగా ప్రవేశించి దౌర్జన్యాలకు పాల్పడి చట్టాన్ని ఉల్లంఘించారు. ఉద్రిక్తతలు రెచ్చగొట్టి, ఘర్షణలు రేపేందుకు ప్రయత్నించారు. టీడీపీ, జనసేన నాయకులు అక్రమంగా ప్రవేశించినా, బెదిరింపులకు దిగినా పోలీసులు ఎక్కడా వారిని నియంత్రించలేదు. సరికదా వారి అక్రమాలకు దన్నుగా నిలబడ్డారు.’’ అని లేఖలో వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు.‘‘రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులకు తావివ్వడం ద్వారా శాంతిభద్రతలను ప్రమాదంలో పడేశారని, వైఎస్సార్సీపీ పార్టీ కార్యాలయాలకు రక్షణ లేకుండాపోయిందని తెలియజేసుకుంటున్నాం. తక్షణమే దీనిపై చర్యలు తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. నిర్లిప్తంగా వ్యవహరించిన పోలీసు అధికారులపైనా శాఖాపరంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్ రెడ్డి కోరారు. -
ఇంటికి వస్తావా..రావా..? టీడీపీ కామాంధుడు
-
ఇది ప్రజాస్వామ్యమా?.. అరాచకమా?: వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు పనిచేస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడ్డారు. రామకృష్ణారెడ్డిని కోర్టుకు తీసుకెళ్తుంటే టీడీపీ నేత దాడి చేయడానికి ప్రయత్నించడమేంటి?. ఇటువంటి దాడులకు భయపడేది లేదని పిన్నెల్లిని ఓడించాలని టీడీపీ కుట్రలు చేసిందన్నారు. రామకృష్ణారెడ్డి కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాలనే టీడీపీ ప్లాన్.. అంటూ దుయ్యబట్టారు. ఫేక్ న్యూస్లతో వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ నేతలు ధ్వజమెత్తారు.ఏదోలా కక్షసాధింపు చేయాలనే.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపిన్నెళ్లి రామకృష్ణారెడ్డి స్వచ్చందగా పోలీసులకు సహకరించారు. మాచర్లలో సుదీర్ఘంగా గెలుస్తూ ఉన్న నాయకుడు. ఎన్నికలకు ముందు చంద్రబాబు భారీ ప్లాన్ వేశారు. పిన్నెళ్లిని ఓడించటానికి అనేక రకాలుగా ప్లాన్ వేశారు. పిన్నెళ్లి ఈవీఎంని పగులకొట్టినట్టుగా ఉన్న వీడియో లోకేష్ ట్విట్టర్లో పెట్టారు. దాన్ని చూసి కేసులు పెట్టి అరెస్టు చేశారు. అసలు ఆ వీడియోని పోలీసులో, ఈసీనో బయట పెట్టలేదు. ఒక పోలీసు అధికారిని కొట్టినట్టుగా తొమ్మిది రోజుల తర్వాత పిన్నెళ్లిపై కేసు పెట్టారు. 307 కింద మొత్తం రెండు కేసులలో బుక్ చేసారు.. ఏదోలా కక్షసాధింపు చేయాలనే పిన్నెళ్లిపై కేసులు పెట్టారు....ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల్లో తయారు చేసిన వార్తలను విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పిన్నెళ్లిని కోర్టులో హాజరు పరిచే సమయంలో శివ అనే వ్యక్తి వెళ్లి గొడవకు దిగారు. మాపై ఇంకా ఎన్ని కేసులు పెట్టినా ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉంటాం. 40 శాతం ఓటు షేర్ ఉన్న రాజకీయ పార్టీ వైఎస్సార్సీపీ. అవతల మూడు పార్టీలు కలిస్తే 60 శాతం ఓట్ షేర్ వస్తే, మా ఒక్క పార్టీకే 40 శాతం వచ్చింది. చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే పార్టీ ఆఫీసులు కడుతున్నాం హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ భవన్ సహా ఏపీలో ఉన్న టీడీపీ ఆఫీసులన్నీ చంద్రబాబు తెచ్చిన జీవో ప్రకారమే నిర్మాణం చేశారు. ఆ జీవో ప్రకారమే మా పార్టీ ఆఫీసుల నిర్మాణం కూడా జరుగుతోందివైఎస్ జగన్ ప్రజావేదికను కూల్చారన్న చంద్రబాబు.. అధికారంలోకి రాగానే వైఎస్సార్సీపీ ఆఫీసుని కూల్చారు. పచ్చి విధ్వంసకారుడు చంద్రబాబు. మా ఆఫీసుల నిర్మాణం అక్రమమైతే అధికారులు నోటీసులు ఇవ్వాలి. టీడీపీ నేతలకు మా ఆఫీసులతో ఏం పని?. వారు వెళ్లి మా భవనాలను కూల్చుతామని ప్రెస్ మీట్లు పెటడం ఏంటి?. ఇది ప్రజాస్వామ్యమా? అరాచక ప్రభుత్వమా? ప్రభుత్వం చేతిలో ఉందని అరాచకాలు చేస్తే ప్రజలు సహించరు. ఎల్లోమీడియా చేసే తప్పుడు ప్రచారాలను నమ్మవద్దుపిన్నెల్లిని కక్షపూరితంగా జైలులో పెట్టారు: కాసు మహేష్రెడ్డివైఎస్సార్సీపీ న్యాయ పోరాటం చేస్తుందని.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కక్షపూరితంగా జైలులో పెట్టారని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్రెడ్డి మండిపడ్డారు. టీడీపీ దాడులు చేస్తూ కొత్త సంప్రదాయానికి తెరలేపింది. టీడీపీ.. కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. పిన్నెల్లిని రామకృష్ణారెడ్డిని అరెస్టు చేయటం కోసమే టీడీపీ ప్రభుత్వం పని చేస్తున్నట్టు వ్యవహరించింది. అరెస్టు సమయంలో కూడా ఆయనపై దాడి చేసే ప్రయత్నం చేశారు. టీడీపీ వారు బుక్ చేసిన కేసులలో పిన్నెళ్లిని అరెస్టు చేశారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తాం. చేసిన అభివృద్ధి చెప్పుకుని మళ్ళీ ప్రజల్లోకి వెళ్తాం. వైఎస్సార్సీపీ ఆఫీసులన్నీ చంద్రబాబు హయాంలో తెచ్చిన జీవోల ప్రకారమే నిర్మాణాలు జరుగుతున్నాయి. చట్టపరంగా తప్పులుంటే న్యాయపోరాటం చేస్తాం. కానీ వైఎస్సార్సీపీ ఆఫీసుల్లోకి టీడీపీ వారు వెళ్లి ప్రెస్ మీట్లు పెట్టటం సబబు కాదు.టీడీపీ నేతలు చేయని అరాచకం లేదు: డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిపల్నాడులో టీడీపీ నేతలు చేయని అరాచకం లేదు. పురంధేశ్వరి చెప్పిన అధికారులను పల్నాడులో నియమించారు. మా వారిపై దాడులు జరుగుతున్నాయని ఎస్పీకి కాల్స్ చేసినా పట్టించుకోలేదు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి భార్య, కుమారునిపై దాడి జరిగితే కనీసం కేసు కూడా పెట్టలేదు. మాపై మాత్రం 307 సెక్షన్ల కింద కేసులు పెట్టారు. ఇలాంటి సవాళ్లు, కేసులను ఎదుర్కొంటాం. మా కార్యకర్తలను ఆదుకుంటాం. -
మీకు ఓట్లు వేసిన వారికే విత్తనాలు ఇస్తారా..?
-
పార్టీలకతీతంగా రైతులకు న్యాయం చేయండి: సీదిరి అప్పలరాజు
సాక్షి, శ్రీకాకుళం: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కూటమి సర్కార్ పనిచేయాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎన్నో అంచనాలతో కూటమికి ప్రజలు పట్టం కట్టారు. కూటమి సర్కార్పై ప్రజలు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయొద్దన్నారు.‘‘విత్తనాల పంపిణీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. పార్టీలకతీతంగా రైతన్నలకు న్యాయం చేయాలి. వైఎస్సార్సీపీ హయాంలో అన్ని వర్గాలకు న్యాయం జరిగింది’’ అని అప్పలరాజు చెప్పారు. -
పిన్నెల్లిపై దాడికి ప్రయత్నించిన టీడీపీ నేత కొమ్మెర శివ
-
పోలీసుల సమక్షంలోనే పిన్నెల్లిపై దాడికి యత్నం!
పల్నాడు, సాక్షి: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి టీడీపీ నేత దాడి నుంచి తృటిలో తప్పించుకున్నారు. బుధవారం రాత్రి మాచర్లలో పిన్నెల్లిని హాజరుపర్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందుకు కదలనివ్వకుండా టీడీపీ నేత కొమేర శివ అడ్డుగా నిలబడ్డారు. .. పిన్నెల్లిని అసభ్య పదజాలంతో దూషిస్తూ.. దాడికి యత్నించారు. దాడిని పసిగట్టిన పిన్నెల్లి ఆయన్ని పక్కకు నెట్టేసి.. మెజిస్ట్రేట్ ముందుకు వేగంగా వెళ్లారు. పోలీసుల సమక్షంలోనే శివ ఈ చేష్టలకు దిగడం గమనార్హం. ఇదిలా ఉంటే.. శివపైన అనేక కేసులు పెండింగ్లో ఉండడంతో పాటు పోలీసులు సస్పెక్ట్ షీట్ సైతం తెరిచారు. ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ హైకోర్టు డిస్మిస్ చేయడంతో.. పిన్నెల్లిని బుధవారం మధ్యాహ్నాం అదుపులోకి తీసుకున్నారు నరసరావుపేట పోలీసులు. ఆపై వైద్య పరీక్షల అనంతరం రాత్రి 10గం. టైంలో మాచర్ల మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. నాలుగు కేసులపై విచారణ చేసిన జడ్జి రెండు కేసులో రిమాండ్ విధించాడు. మరో రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చారు ఇక.. పిన్నెల్లిని కోర్టు దగ్గరికి తీసుకొచ్చిన టైంలో ఆయన ప్రత్యర్థి వర్గం బాణాసంచాలు పేల్చి పిన్నెల్లి వర్గీయుల్ని రెచ్చగొట్టే యత్నం చేసింది.ఇక.. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు నెల్లూరు సెంట్రల్ జైలుకి తరలించారు. ఈ సందర్భంగా జైలు బయట, మార్గంలో పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయనను సెంట్రల్ జైలు అధికారులు లోపలికి తీసుకెళ్లారు. -
టీడీపీ, ఎల్లో మీడియాకు తోపుదుర్తి కౌంటర్
-
అధికారం అండతో రెచ్చిపోతున్న టీడీపీ నాయకులు
-
వైఎస్సార్సీపీ ఆఫీసులపై ‘ఓవరాక్షన్’కు బ్రేకులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతకు ప్రభుత్వ పెద్దలు చేస్తున్న కుట్రలకు హైకోర్టు బ్రేకులు వేసింది. వైఎస్సార్ సీపీ కార్యాలయాల విషయంలో యథాతథస్థితి (స్టేటస్ కో)ని కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది. వైఎస్సార్సీపీ కార్యాలయాల భవనాల కూల్చివేతలపై పూర్తి వివరాలను కోర్టు ముందుంచాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. తాము చట్టానికి అనుగుణంగా వ్యవహరిస్తామని, కోర్టు ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరం లేదంటూ అడ్వొకేట్ జనరల్ కార్యాలయ న్యాయవాదులు పదే పదే చేసిన అభ్యర్థనను హైకోర్టు తోసిపుచ్చింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయం విషయంలో కూడా చట్టాన్ని అనుసరిస్తామంటూ కోర్టుకు స్పష్టమైన హామీ ఇచ్చి తెల్లారేసరికి పార్టీ కార్యాలయాన్ని కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు, చట్ట ప్రకారం నడుచుకుంటామన్న ప్రభుత్వ న్యాయవాదుల వాదనను విశ్వసించలేదు. యథాతథస్థితిని కొనసాగించాలన్న తన ఉత్తర్వులకే కట్టుబడింది.నోటీసులపై అత్యవసరంగా పిటిషన్లు..వివిధ జిల్లాల్లో తమ పార్టీ కార్యాలయాలను కూల్చివేసేందుకు అధికారులు జారీ చేసిన నోటీసులను సవాల్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. అధికారుల నోటీసులను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ ఆయా జిల్లాల వైఎస్సార్సీపీ అధ్యక్షులు వేర్వేరుగా హైకోర్టులో లంచ్మోషన్ రూపంలో అత్యవసరంగా 9 పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషనర్ల తరఫు న్యాయవాదుల్లో ఒకరైన సీనియర్ న్యాయవాది పాపెల్లుగారి వీరారెడ్డి వాదనలు వినిపిస్తూ.. అధికారుల చర్యలు ఏకపక్షంగా ఉన్నాయన్నారు. 2016లో నాటి టీడీపీ సర్కారు ఇచ్చిన జీవో ప్రకారమే వైఎస్సార్ సీపీ కార్యాలయ నిర్మాణం కోసం భూముల కేటాయింపు జరిగిందన్నారు. ఆ జీవో ప్రకారం భూమి స్వాధీనం చేసిన ఏడాది లోపు ఆ స్థలంలో పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని పూర్తి చేయడం తప్పనిసరన్నారు. లేనిపక్షంలో కేటాయించిన భూమిని తిరిగి వెనక్కి తీసుకోవచ్చన్నారు. పార్టీ కార్యాలయాల నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వాలంటూ దరఖాస్తు చేసుకున్నామని, అయితే అధికారులు నిర్ణీత వ్యవధిలోపు అనుమతులు ఇవ్వలేదన్నారు. దీంతో ఇలా నిర్ణీత వ్యవధిలోపు అనుమతులు ఇవ్వకుంటే, అనుమతులు ఇచ్చినట్లే భావించి పార్టీ కార్యాలయాల నిర్మాణాన్ని ప్రారంభించామన్నారు. క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్నాం..అనుమతులు తీసుకోలేదన్న కారణంతో పార్టీ కార్యాలయాలను ఎందుకు కూల్చివేయరాదో వివరణ ఇవ్వాలంటూ అధికారులు నోటీసులు ఇచ్చారని వీరారెడ్డి తెలిపారు. దానికి తాము సవివరంగా వివరణ ఇచ్చినా మరో అధికారి నోటీసులు ఇచ్చారన్నారు. దీన్నిబట్టి కూల్చివేతకు అధికారులు ఎంత తొందరపడుతున్నారో అర్థమవుతోందన్నారు. ఒకవేళ తమ నిర్మాణాలు అక్రమమే అనుకున్నప్పటికీ, వాటిని క్రమబద్ధీకరించే అధికారం చట్ట ప్రకారం మునిసిపల్ కమిషనర్కు ఉందని నివేదించారు. ఇవన్నీ చేయకుండా, ప్రక్రియను అనుసరించకుండా నేరుగా కూల్చివేతలకు పాల్పడరాదన్నారు. తాము క్రమబద్ధీకరణకు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపారు. కూల్చివేతలు సమస్యకు పరిష్కారం కాదని, అది కేవలం చివరి అంకం మాత్రమేనన్నారు. ఈ మధ్యలో చట్టం పలు ప్రత్యామ్నాయాలను చూపిందని నివేదించారు. తుది ఉత్తర్వులు జారీ చేసే ముందు కమిషనర్ మెదడు ఉపయోగించాల్సి ఉంటుందని, యాంత్రికంగా ఉత్తర్వులు జారీ చేయడానికి వీల్లేదన్నారు. తాము ఇచ్చిన వివరణను పరిగణలోకి తీసుకోకుండా కూల్చివేతల విషయంలో ముందుకెళ్లడానికి వీల్లేదన్నారు.చట్ట ప్రకారం నడుచుకుంటాం.. ఇచ్చింది షోకాజ్ నోటీసులేవాదనలు విన్న అనంతరం అధికారులు ఇతర ప్రొసీడింగ్స్ను కొనసాగించుకోవచ్చని, అయితే కూల్చివేతల విషయంలో యథాతథస్థితిని కొనసాగించాలని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే కేవలం ఆందోళనతోనే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారని, వీటికి విచారణార్హతే లేదని అడ్వొకేట్ జనరల్ కార్యాలయం తరపున హాజరైన న్యాయవాది కేఎం కృష్ణారెడ్డి పేర్కొన్నారు.కూల్చివేస్తామనేందుకు ఎలాంటి ఆధారాలను చూపలేదన్నారు. కూల్చివేతల విషయంలో తాము చట్ట ప్రకారం నడుచుకుంటామన్నారు. కోర్టు ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు. తాము ఇచ్చింది కేవలం షోకాజ్ నోటీసులు మాత్రమేనన్నారు. ఈ సమయంలో వీరారెడ్డి జోక్యం చేసుకుంటూ.. ఇలాగే చట్ట ప్రకారం నడుచుకుంటామంటూ వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయ భవనాన్ని తెల్లవారేసరికి కూల్చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు. వైఎస్సార్సీపీ తరఫు మరో న్యాయవాది వీఆర్ రెడ్డి కొవ్వూరి జోక్యం చేసుకుంటూ, కూల్చివేతల విషయంలో ఏమీ చేయబోమంటూ కృష్ణారెడ్డి చెప్పిన విషయాన్ని కోర్టుకి ఇచ్చిన హామీగా నమోదు చేయాలన్నారు. దీన్ని కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. తాను ఎలాంటి హామీ ఇవ్వడం లేదన్నారు. దీంతో న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ యథాతథస్థితి ఉత్తర్వులు ఇస్తానని పునరుద్ఘాటించారు. -
ఎన్జీ రంగా వర్సిటీలో రాజకీయ బదిలీలు
సాక్షి, అమరావతి: అధికారంలోకి వచ్చిన క్షణం నుంచే కక్షసాధింపు చర్యలకు తెగబడుతున్న టీడీపీ కూటమి ప్రభుత్వం.. చివరికి చదువుల నిలయాలైన విశ్వవిద్యాలయాల పైనా పడింది. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దే అధ్యాపకులు, జాతి గర్వించేలా పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలను కూడా రాజకీయాలకు బలి చేస్తోంది. విశ్వవిద్యాలయాలపై పెత్తనం చెలాయించేందుకు, కక్ష సాధింపు చర్యలకు అధికార కూటమి నేతలు బదిలీలకు తెరతీశారు. మరీ ముఖ్యంగా గడిచిన ఐదేళ్లుగా పరిశోధనలు, విస్తరణ కార్యక్రమాలతో జాతీయ స్థాయిలో అత్యుత్తమ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా గుర్తింపు పొందిన ఆచార్య ఎన్జీ రంగా విశ్వ విద్యాలయం (ఆంగ్రూ)లో కక్ష సాధింపు బదిలీలకు శ్రీకారం చుట్టారు. సాధారణంగా ఏటా 3 నుంచి 5 సంవత్సరాలు ఒక చోట పని చేసిన వారిని బదిలీ చేస్తుంటారు. ఇప్పుడు ఆంగ్రూలో సంబంధిత శాఖామంత్రి లోకేశ్ ఆదేశాల మేరకు అధికార టీడీపీ కీలక నేతల సిఫార్సులతో అడ్డగోలుగా బదిలీ చేస్తుండటం వివాదాస్పదమవుతోంది. ముఖ్యంగా ఒక సామాజిక వర్గం సిబ్బందే లక్ష్యంగా బదిలీలు జరుగుతున్నాయని, ఆ స్థానాల్లో కూటమి నేతలకు నచ్చిన వారికి పోస్టింగులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి.ఆంగ్రూ చరిత్రలోనే తొలిసారియూనివర్సిటీలో హెచ్వోడీలనే కాదు.. బోధన, బోధనేతర సిబ్బందిని కూడా నిబంధనలకు పాతరేసి మరీ ఇష్టానుసారం బదిలీ చేస్తుండటంపై సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. చివరికి పరిశోధన స్థానాలు, కృషి విజ్ఞాన కేంద్రాల్లో పనిచేస్తున్న శాస్త్రవేత్తలను కూడా వదిలి పెట్టలేదు. ఆఘమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసి రెండు వారాల్లోనే 102 మందిని బదిలీ చేశారు. ఇంత మందిని ఒకేసారి బదిలీ చేయడం ఆంగ్రూ చరిత్రలో ఇదే తొలిసారి అని వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకు 38 మంది ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 16 మంది అసోసియేట్ డీన్స్, అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్, 8 మంది అసోసియేట్ ప్రొఫెసర్లు, ఐదుగురు యూనివర్శిటీ ఆఫీసర్లు, ముగ్గురేసి చొప్పున అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు, సూపరింటెండెంట్లతో పాటు అసిస్టెంట్ రిజిస్ట్రార్, డిప్యూటీ రిజిస్ట్రార్లను కూడా బదిలీ చేశారు. మరికొంత మందిని బదిలీ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.నిబంధనలకు పాతరేసి..సర్వీస్ రూల్స్ను సైతం బేఖాతరు చేస్తూ కేవలం రాజకీయ ఒత్తిళ్లతోనే బదిలీలు చేస్తున్నారని అధ్యాపకులు వాపోతున్నారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నఫళంగా దూర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళా శాస్త్రవేత్తలు, అధికారుల కుటుంబ, ఆరోగ్య పరిస్థితులను సైతం పట్టించుకోకుండా బదిలీ చేస్తున్నారని వాపోతున్నారు. తిరుపతి ఎస్వీ అగ్రి కల్చరల్ కళాశాల, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో పనిచేస్తున్న 15 మంది అధ్యాపకులు, శాస్త్రవే త్తలను 300 నుంచి 500 కిలోమీటర్ల దూరం ఉన్న పరిశోధన కేంద్రాలు, కళాశాలలకు బదిలీ చేశారని, పైగా వెంటనే విధుల నుంచి రిలీవ్ చేసి బదిలీ చేసిన స్థానాలలో చేరాలని ఆదేశించారని తెలిపారు. గతంలో బదిలీ చేయాలని బతిమిలాడినా పట్టించుకోని వర్శిటీ ఉన్నతాధికారులు ఇప్పుడు ఎడాపెడా బదిలీలు చేస్తున్నారని సిబ్బంది వాపోతున్నారు. అధికార పార్టీ నేతలు వారికి అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకునేందుకు మౌఖికంగా ఆదేశించిన వెంటనే బదిలీ ఉత్తర్వులు జారీ చేస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా ఒక సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ బదిలీలు చేస్తున్నారని, ఆ స్థానాల్లో నేతలకు అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇప్పించుకుంటున్నారన్న విమర్శలు వస్తున్నాయి. శాస్త్రవేత్తలను ఇష్టానుసారం బదిలీ చేయడం వలన ఆ ప్రభావం పరిశోధనలపై పడుతుందని చెబుతున్నారు. పవిత్రమైన విద్యాలయాల్లో మితివీురిన రాజకీయజోక్యం సరికాదని విద్యా నిపుణులు హితవు పలుకుతున్నారు. -
గ్రీన్ఫీల్డ్ హైవే పనులపై టీడీపీ నేత దాదాగిరి
సాక్షి ప్రతినిధి, కడప: అధికారం వచ్చిందే తడవుగా టీడీపీ నేతలు పేట్రేగిపోతున్నారు. అభివృద్ధి పనుల్లోనూ అందినకాడికి దండుకుంటున్నారు. పనులు చేస్తోంది.. జాతీయ స్థాయి సంస్థలైనా సరే తమకేంటన్నట్టు చెలరేగుతున్నారు. తాజాగా వివిధ రాష్ట్రాల్లో కాంట్రాక్టు పనులు చేస్తున్న దిలీప్ దిల్కాన్ సంస్థకు తాజాగా ఇలాంటి దుస్థితే వైఎస్సార్ జిల్లాలో ఎదురైంది. టీడీపీ నాయకుల దాదాగిరితో రోడ్డు పనులు నిలిపేయాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కొడికొండ చెక్పోస్టు నుంచి విజయవాడకు గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డు మంజూరైంది. అందులో మూడు ప్యాకేజీల పనులు దిలీప్ దిల్కాన్ సంస్థకు దక్కాయి. మరో మూడు ప్యాకేజీలు మెగా కంపెనీకి లభించాయి. ఈ క్రమంలో వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలో రూ.700 కోట్లతో ఒక ప్యాకేజీ పనులను దిలీప్ దిల్కాన్ సంస్థ చేపట్టింది. ఇంతకాలం ఆ పనులు శరవేగంగా కొనసాగించారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న దౌర్జన్యకర పరిస్థితులు ఆ సంస్థకు కూడా ఎదురయ్యాయి. వేల్పుల గ్రామం వద్ద చేపడుతున్న పనుల వద్దకు వేముల మండలంలో క్రియాశీలకంగా వ్యవహరించే టీడీపీ నేత వెళ్లారు. పనులు నిలిపేయాలని, లేదంటే వెంటనే మీ జీఎంను వచ్చి కలవమని చెప్పండంటూ హుకుం జారీ చేశారు. దీంతో ఆ సంస్థ పర్సనల్ ఇన్చార్జి వచ్చి ఆ నాయకుడితో సమావేశమయ్యారు. ఈ మొత్తం వ్యవహారం మూడు రోజుల క్రితం నడిచినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నియోజకవర్గ టీడీపీ కీలక నాయకుడితో సదరు నేత ఫోన్లో మాట్లాడించారు. మీ పనులు సజావుగా కొనసాగాలంటే రూ.30 కోట్లు తనకు చెల్లించాలని ఆ కీలక నాయకుడు డిమాండ్ చేశారు. ‘ఎన్నికల్లో ఖర్చులు పెట్టుకున్నాం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తనకు రూ.30 కోట్లు చెల్లిస్తేనే పనులు కొనసాగుతాయి’ అని తేల్చిచెప్పారు. మూడు రోజుల్లోగా మీ నిర్ణయం ఏంటో చెప్పాలని వేముల మండల నాయకుడు సంస్థ ప్రతినిధిని హెచ్చరించాడు.పనులను నిలిపేయించిన టీడీపీ నేతలు..దిలీప్ దిల్కాన్ సంస్థకు చెందిన పనులను బుధవారం సాయంత్రం వేముల మండలం వేల్పుల గ్రామం వద్ద టీడీపీ నేతలు నిలిపేశారు. ప్రశ్నించిన సంస్థ ప్రతినిధులకు మీకు ఇచ్చిన గడువు ముగిసిందని, మీ నుంచి ఎలాంటి నిర్ణయం రాలేదు కాబట్టే పనులు నిలిపేస్తున్నామని దాదాగిరి చేశారు. తమకు రూ.30 కోట్లు ఇచ్చేవరకు పనులు చేపట్టవద్దని హెచ్చరించారు. జిల్లాలో ఇదివరకు ఇలాంటి ఘటన చక్రాయపేట కేంద్రంగా ఓ సంస్థకు ఉత్పన్నమైతే అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. కాంట్రాక్టు సంస్థలకు ఆటంకాలు లేకుండా సత్వర చర్యలు చేపట్టింది.బెదిరింపులతో టీడీపీ నేతల స్వైరవిహారం.. టీడీపీ అధికారంలోకి రావడం ఆలస్యం వ్యక్తుల ఆస్తులు, వ్యాపారాలను చేజిక్కించుకునేందుకు ఆ పార్టీ నేతలు బరితెగిస్తున్నారు. వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో ఓ వ్యాపారికి చెందిన రెండు మద్యం బార్లను తమకు అప్పగించాలని టీడీపీ నేతలు బెదిరించారు. అలాగే వేంపల్లె కేంద్రంగా పోటాపోటీగా పొక్లెయిన్లు పెట్టి టిప్పర్లతో ఇసుక తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లావ్యాప్తంగా టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నా అధికార యంత్రాంగం ప్రేక్షక పాత్ర పోషిస్తోంది.ఆయా వ్యక్తులకు చెందిన ప్రైవేటు స్థలాలను సైతం కబ్జా చేస్తున్నారు. కోర్టులో ఉన్న వ్యవహారాల్లో సైతం తలదూర్చి సొంతం చేసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు. పోలీసుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండా పోతోంది. మునుపెన్నడూ ఇలాంటి అధ్వాన పరిస్థితులు చూడలేదని పాతతరం టీడీపీ నాయకులు సైతం వాపోతుండటం గమనార్హం. -
అనగాని ఇలాకాలో ఆగని విధ్వంసం
సాక్షి ప్రతినిధి, బాపట్ల: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ఇలాకా రేపల్లెలో టీడీపీ నేతల విధ్వంసం పతాక స్థాయికి చేరింది. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడుతున్నారు. దొరికిన వారిని దొరికినట్లు విచక్షణారహితంగా చితక బాదుతున్నారు. ఊళ్లు వదలి వెళ్లిపోవాలని హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో ఉంటే అంతు చూస్తామని బెదిరిస్తున్నారు. అధికారం అండతో కూటమి నేతలు, ప్రధానంగా టీడీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయి దాడులకు తెగబడుతుండటంతో పలువురు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు ఇప్పటికే గ్రామాలు వదిలి వెళ్లారు. కొందరు స్వగ్రామాల్లోనే ఉంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బతుకు తున్నారు. ఏ సమయంలో టీడీపీ నాయకులు దాడి చేస్తారో తెలియక బెంబేలెత్తిపోతున్నారు. చెరుకుపల్లి, నిజాంపట్నం, నగరం మండలాల పరిధిలో ఈ తరహా దాడులు పెరిగాయి. విలేకరి ఇల్లు కూల్చివేత చెరుకుపల్లి మండలం కస్తూరివారిపేటలో బుధవారం ఉదయం టీడీపీ నేతలు గ్రామానికి చెందిన ఆంధ్రప్రభ విలేకరి యెనుముల వెంకటేశ్వరరావుకు చెందిన ఇంటిని కూల్చివేశారు. వెంకటేశ్వరరావు నాలుగేళ్ల క్రితం 4 సెంట్ల స్థలం కొనుగోలు చేసి ఇల్లు నిర్మించుకున్నారు. ఇటీవలే గృహప్రవేశం జరిగింది. బుధవారం ఉదయం టీడీపీ నేతలు జేసీబీతో వచ్చి ఆయన ఇంటిని కూల్చివేశారు.టీడీపీ ఓటు బ్యాంకు అధికంగా ఉన్న గ్రామంలో 225 ఓట్లు వైఎస్సార్సీపీకి రావడానికి విలేకరి వెంకటేశ్వరరావే కారణమని టీడీపీ నేతలు ఆగ్రహంతో ఉన్నారు. కౌంటింగ్ అనంతరం ఆయనను బెదిరించిన టీడీపీ నేతలు బుధవారం అతడి ఇంటిని కూల్చివేశారు. గ్రామకంఠం స్థలంలో వెంకటేశ్వరరావు ఇంటిని నిర్మించుకున్నారనేది టీడీపీ ఆరోపణ. అక్కడ దాదాపు 40 కుటుంబాలకు చెందిన వారు జీవనం సాగిస్తున్నారు. పూరిళ్ల స్థానంలో చాలామంది భవనాలు నిర్మించుకున్నారు. 30 సంవత్సరాలుగా విద్యుత్ బిల్లులు, పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. వెంకటేశ్వరావు మూడేళ్ల క్రితం వేరొకరి వద్ద 4 సెంట్ల స్థలం కొనుగోలుచేసి ఇంటిని నిర్మించుకున్నారు. తన ఇంటికి భార్య శ్యామల పేరున విద్యుత్ బిల్లు చెల్లిస్తున్నారు. గ్రామ పంచాయతీకి ఇంటిపన్ను చెల్లిస్తున్నారు. ఆక్రమణలు అనుకుంటే అధికారులు అందరిపై చర్యలు తీసుకోవాలి. చట్టవిరుద్ధంగా గృహాలు నిర్మించారనుకుంటే అందరికీ నోటీసులు జారీ చేయాలి. ఆ తర్వాత చట్టపరమైన చర్యలు చేపట్టాలి. కానీ.. టీడీపీ నేతలు జేసీబీతో వెంకటేశ్వరరావు ఇంటిని మాత్రమే కూల్చివేశారు. మంత్రి అనగాని సత్యప్రసాద్ నియోజకవర్గంలో ఇలాంటి చర్యలు సహేతుకం కాదని పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు విమర్శిస్తున్నారు. తన ఇంటిని టీడీపీ నేతలు కూల్చివేస్తున్న విషయాన్ని తెలిపేందుకు విలేకరి Ððవెంకటేశ్వరరావు ప్రయతి్నంచినా పోలీసులు స్పందించలేదు. వెంకటేశ్వరరావు ఇంటిని టీడీపీ నేతలు కూల్చడంపై జర్నలిస్ట్ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. -
ఎమ్మెల్యే సారూ.. ఇదేమి తీరు!
సాక్షి, పార్వతీపురం మన్యం: పార్వతీపురం ఎమ్మెల్యేగా ఎన్నికైన టీడీపీకి చెందిన బోనెల విజయ్చంద్రకు స్వాగతం పేరుతో కూటమి శ్రేణులు చూపిన అత్యుత్సాహం ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసింది. బోనెల విజయ్చంద్ర అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నియోజకవర్గానికి బుధవారం చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్వాగతం పేరిట రహదారిపై టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు హడావుడి చేశారు. బొబ్బిలి దాటిన తర్వాత లచ్చయ్యపేట నుంచి పార్వతీపురం వచ్చే వరకు ఓపెన్ టాప్ వాహనంలో ఆయనను ఊరేగిస్తూ.. కార్లు, బైక్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. రా్రïÙ్టయ రహదారిపై ప్రతి గ్రామం వద్ద ఆయనకు స్థానిక నేతలు, కార్యకర్తలతో స్వాగత ఏర్పాట్లు చేయించి పెద్ద ఎత్తున బాణసంచా కాలుస్తూ హంగామా చేశారు. లచ్చయ్యపేట, అంటిపేట, కాశీపేట, చిన¿ోగిలి, సీతానగరం, మరిపివలస, నర్సిపురం.. ఇలా ఎక్కడికక్కడ రహదారులను బ్లాక్ చేయడంతో ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు, ఉద్యోగులు తీవ్ర అసహనానికి గురయ్యారు. ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గంలోకి ప్రవేశించిన ర్యాలీ.. మధ్యాహ్నం 12.30 వరకు కొనసాగింది. దీంతో అటు పార్వతీపురం నుంచి.. ఇటు బొబ్బిలి మీదుగా వెళ్లే వాహనాలు కిలోమీటర్ల మేర బారులుతీరాయి. రహదారి మధ్యలోనే వీరి ర్యాలీ సాగడం.. కనీసం అంబులెన్స్లు వెళ్లేందుకు కూడా దారి ఇవ్వలేదు. లచ్చయ్యపేట వద్ద ర్యాలీలో ఓ అంబులెన్స్ చిక్కుకుపోయింది. పార్వతీపురం ఆర్డీవో వాహనం కూడా చాలాసేపు ఈ ర్యాలీ కారణంగా రోడ్డుపై నిలిచిపోయింది. ఆ సమయంలో ఆర్డీవో హేమలత వాహనంలోనే ఉన్నారు. వాస్తవానికి బొబ్బిలి నుంచి పార్వతీపురం వెళ్లేందుకు అరగంట పడుతుంది. కానీ ఈ ర్యాలీలో చిక్కుకున్న ప్రయాణికులు మూడున్నర గంటలకుపైగా నరకయాతన అనుభవించారు. -
క్వారీలపై కూటమి నేతల జులుం
సాక్షి, అమరావతి: అధికార టీడీపీ కూటమి నేతల దౌర్జన్యపూరిత విధానాలతో రెండు వారాలుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో క్వారీల్లో మైనింగ్ నిలిచిపోయింది. దీంతో ప్రభుత్వానికి రాయల్టీ రూపంలో రావాల్సిన ఆదాయం నిల్చిపోవడంతో పాటు పలు పరిశ్రమలు, రవాణా రంగం ఇబ్బందుల్లో పడ్డాయి. ఇంకోపక్క టీడీపీ నేతలు పలు క్వారీల్లో అక్రమంగా మైనింగ్ చేసి సొమ్ము చేసుకుంటున్నారు. రాష్ట్రంలో మైనింగ్ కార్యకలాపాలను పర్యవేక్షించే డైరెక్టరేట్ కార్యాలయాన్నే 14 రోజులుగా మూసివేశారు. ఏపీ ఖనిజాభివృద్ధి సంస్థ కార్యాలయాన్ని సైతం తెరవకుండా సీజ్ చేశారు. ఏదో జరిగిపోయిందనే అనుమానంతో మైనింగ్ జరుగుతున్న క్వారీలను స్తంభింపజేయడంతోపాటు మైనింగ్ కార్యాలయాలను సైతం మూసివేసి అక్కడి అధికారులు, సిబ్బందిని వేధింపులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలు, టీడీపీ ముఖ్య నేతలు చెప్పినట్లు వినాలని అన్ని జిల్లాల మైనింగ్ డీడీలు, ఏడీలకు ఉన్నత స్థాయి నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. ఇంకో పక్క కూటమి అధికారంలోకి రాగానే టీడీపీ నేతలు రకరకాల కారణాలతో క్వారీలపై విరుచుకుపడ్డారు. వారు క్వారీల వద్దకు వెళ్లి తవ్వకాలు నిలిపివేశారు. తాము చెప్పే వరకు క్వారీయింగ్ చేయకూడదని, క్వారీలు పని చేయాలంటే ముందుగా తమ సంగతి తేల్చాలని స్పష్టం చేశారు. దీంతో పక్కాగా అనుమతులు ఉన్న క్వారీల్లోనూ మైనింగ్ నిలిచిపోయింది. గ్రానైట్, రోడ్ మెటల్, క్వార్జ్, సున్నపురాయి వంటి అనేక క్వారీల్లో తవ్వకాలు నిలిచిపోయాయి.శ్రీకాకుళం జిల్లాలో గ్రానైట్పై దెబ్బ శ్రీకాకుళం జిల్లా కీలక మంత్రి ఆదేశంతో గ్రానైట్ మైనింగ్ ఆగిపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు నుంచే అక్కడ పరిస్థితి మారిపోయింది. ఆ జిల్లాలో వందకు పైగా ఉన్న గ్రానైట్ క్వారీలను అప్పటికప్పుడే స్తంభింపజేశారు. మైనింగ్ ఏడీ ద్వారానే తమ లెక్క తేలే వరకూ వాటిలో మైనింగ్ జరగక్కూడదని స్పష్టం చేసినట్లు సమాచారం. గ్రానైట్ తవ్వకాలు నిలిచిపోవడంతో పాలిషింగ్ యూనిట్లకు ముడి సరుకు దొరక్క, అవి కూడా మూతపడుతున్నాయి. ఫలితంగా దాని ద్వారా ప్రభుత్వానికి వచ్చే కోట్ల రూపాయల రాయల్టీ కూడా ఆగిపోయింది. క్వారీలకు అనుబంధంగా పనిచేసే ట్రక్కులు, లారీలు, లాజిస్టిక్ వ్యాపారాలన్నీ ఇబ్బందుల్లో పడ్డాయి. రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించింది. వాటిల్లో పనిచేసే వేలాది మందికి కొద్ది రోజులుగా పని లేకుండాపోయింది. విశాఖ పోర్టు నుండి రోజుకు వంద నుండి రెండు వందల లారీల్లో గ్రానైట్ బ్లాక్స్, పాలిషింగ్ పలకలు ఎగుమతయ్యేవి. అవన్నీ ఇప్పుడు నిలిచిపోయాయి. అన్ని జిల్లాల్లోనూ స్థానికంగా ఉన్న క్వారీల యజమానులను టీడీపీ నేతలు బెదిరింపులకు గురి చేస్తున్నారు. స్థానిక నేతలు, ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడుకోవాలని చెబుతున్నారు. తమ వాటాల సంగతి తేలిన తర్వాతే క్వారీయింగ్ జరగనిస్తామని చెప్పడంతో భయపడిన క్వారీల యజమానులు పనులు ఆపేశారు. మైనింగ్ అధికారులు కూడా తాము ఏం చేయలేమని చేతులెత్తేస్తున్నారు. ఎక్కడైనా అధికారులు జోక్యం చేసుకుంటే వారిని కూడా బెదిరిస్తున్నారు. అనుమతి ఉన్న క్వారీల్లో తవ్వకాలు నిలిపివేయడం సరికాదని చెబుతున్నా వినడంలేదు.నిమ్మకూరులో యథేచ్ఛగా మట్టి తవ్వకాలుపలు ప్రాంతాల్లో టీడీపీ నేతలు యధేచ్చగా అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల వచ్చిన మరుసటి రోజు నుంచే ఎక్కడెక్కడ మైనింగ్కు అవకాశం ఉందో చూసి వెంటనే తవ్వకాలు మొదలుపెట్టేశారు. కృష్ణా జిల్లా నిమ్మకూరులో వారం రోజులుగా ఎటువంటి అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. ఇది మానవ వనరులు, ఐటీ శాఖ మంత్రి లోకేశ్ దత్తత గ్రామం. నిమ్మకూరులో కొందరు రైతుల నుంచి ముగ్గురు టీడీపీ నేతలు 10 ఎకరాలను కొనుగోలు చేసి తవ్వకాలు జరుపుతున్నారు. ఎన్వోసీ, మైనింగ్ అనుమతి వంటివి ఏవీ లేకుండానే పగలు, రాత్రి మట్టిని తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. రోజుకు సుమారు 500 లారీల్లో మట్టిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముతున్నారు. 20 టన్నుల లారీలో 30 నుంచి 35 టన్నుల మట్టిని నింపి ఏకంగా జాతీయ రహదారిపైనే తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేకుండాపోయాడు. -
టీడీపీ ఎంపీగారి బస్సులా.. అయితే ఓకే!
సాక్షి, అమరావతి: ఆయనో టీడీపీ ఎంపీ. ఉమ్మడి గుంటూరు జిల్లాలో విద్యా సంస్థల టైకూన్గా గుర్తింపు పొందారు. అంతకంటే అర్హత ఏముంటుందని రవాణా శాఖ అధికారులు భావించారు. అందుకే ఆయన విద్యా సంస్థకు చెందిన వాహనాలను నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాల కోసం విద్యార్థుల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం 2023లో చేసిన మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఏమాత్రం పాటించకపోయినా సరే నిరభ్యంతరంగా రిజిస్ట్రేషన్లు చేసేస్తూ స్వామి భక్తి ప్రదర్శిస్తున్నారు. విద్యార్థుల భద్రతతో ముడిపడిన వ్యవహారం అయినప్పటికీ ఎంపీ ఒత్తిడికి తలొగ్గి ఆయన చెప్పినట్లు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మోటారు వాహనాల చట్టం ఏం చెబుతోందంటే..విద్యా సంస్థల బస్సుల్లో భద్రతా ప్రమాణాలను నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం 2023లో ప్రత్యేక చట్టం రూపొందించింది. ప్రధానంగా అగ్ని ప్రమాదాలు సంభవించకుండా ఉండేందుకు.. పొరపాటున అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టేందుకు స్పష్టమైన విధివిధానాలను నిర్దేశించింది. ఫైర్ డిటెక్షన్, అలార్మ్ సిస్టం, ఫైర్ సప్రెషన్ సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టంలకు సంబంధించిన పరికరాలు, ఉపకరణాలు కచ్చితంగా ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.రూల్స్, గీల్స్ ఏమీలేవు..ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదేళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్న ఆయన కుటుంబం దశాబ్దాలుగా ఉన్నత విద్యా సంస్థలను నిర్వహిస్తోంది. ఆ విద్యా సంస్థ కోసం ఇటీవల కొత్తగా 50 బస్సులను కొనుగోలు చేశారు. అందుకోసం చెన్నై నుంచి వాహనాల ఛాసీస్లను కొనుగోలు చేసి బస్సుల బాడీ బిల్డింగ్ పనులు చేయించారు. కానీ కేంద్ర ప్రభుత్వం చేసిన మోటారు వాహనాల చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. అగ్నిమాపక పరికరాలు, ఉపకరణాలు ఏర్పాటు చేయలేదు. కానీ తమ విద్యా సంస్థల ట్రస్ట్ తరఫున కొనుగోలు చేసిన ఆ బస్సులను రిజిస్ట్రేషన్ చేయాలని రవాణా శాఖ అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక పరికరాలు పొందుపరచలేదని కొందరు అధికారులు చెప్పినా సరే ఆ ప్రజాప్రతినిధి పట్టించుకోలేదు. ‘మా బస్సులను రిజిస్ట్రేషన్ చేయండి.. మిగిలిన విషయాలు ఎత్తొద్దు.. 40 ఏళ్లుగా ఈ వ్యాపారంలో ఉన్నాం.. మాకు కొత్తగా రూల్స్ చెప్పొద్దు’ అని ఆయన గదమాయించారు. దాంతో రవాణా శాఖ అధికారులు గప్చుప్గా ఆ విద్యా సంస్థ బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసేస్తున్నారు. గడిచిన రెండు రోజుల్లో 17 బస్సులకు రిజిస్ట్రేషన్లు చేసినట్టు సమాచారం. మిగిలిన బస్సులకు కూడా త్వరగా రిజిస్ట్రేషన్లు చేసేయడానికి అధికారులు దస్త్రాలు వేగంగా కదుపుతున్నారని తెలిసింది. -
సీనియర్లు, కూటమి శ్రేణులకు అడుగడుగునా అవమానం..
సాక్షి, టాస్క్ఫోర్స్: సీఎం చంద్రబాబు పర్యటనలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆధిపత్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రిని సీనియర్ నేతలు కలిసేందుకు సైతం ఆంక్షలు విధించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక కార్యకర్తలనైతే తన నిరంకుశ వైఖరితో అడుగడుగునా అవమానించారని పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. ఎమ్మెల్యేల ఆత్మగౌరవానికి భంగం వాటిల్లేలా వ్యవహరించారని మండిపడుతున్నాయి. ఆయన అనుమతి లేనిదే సీఎం సమీపంలోకి సైతం వెళ్లలేని పరిస్థితిని కల్పించారని ఆవేదన చెందుతున్నాయి. చివరకు పోలీసులు.. ఉన్నతాధికారులను తన కనుసన్నల్లోనే నడిపించారని ఆరోపిస్తున్నాయి. అభిమానంతో అధినేతను కలవాలని వస్తే ఇదెక్కడి పెత్తనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం కుప్పం నియోజకవర్గానికి విచ్చేశారు. ఇక అప్పటి నుంచి మొత్తం పర్యటన ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కనుసన్నల్లోనే సాగడం టీడీపీ శ్రేణులను అసంతృప్తికి గురిచేసింది. ఎవరైనా ముఖ్యమంత్రిని కలవాలంటే ఎమ్మెల్సీ చెప్పాలి. అది ఎమ్మెల్యే అయినా.. సీనియర్, టీడీపీ, జనసేన నేతలైనా సరే. ఆయన చెప్పకపోతే సీఎంని కలిసే అవకాశమే లేదు.అలా ఒకరోజంతా ఓపికగా వేచి చూసిన కూటమి నేతలు, కార్యకర్తలు సహనం నశించి బుధవారం ఉదయం ఆందోళనకు దిగారు. పరిస్థితి చేయిదాటుతోందని గ్రహించిన ఎమ్మెల్సీ శ్రీకాంత్ ఎట్టకేలకు సీఎం చంద్రబాబుని కలిసేందుకు అవకాశం కల్పించారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేల్లో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. ఈ పరిస్థితి వచ్చేది కాదని కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు చర్చించుకోవడం కనిపించింది.ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబు మొదటి సారిగా తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పానికి వచ్చారు. మంగళవారం కుప్పానికి చేరుకున్న చంద్రబాబు.. బుధవారం సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికారిక, పార్టీ కార్యక్రమాలకు హాజరైన చంద్రబాబుని కలిసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా.. అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి కూడా కూటమి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ముఖ్యమంత్రిని కలవొచ్చని ఆశగా కుప్పానికి చేరుకున్న వారికి నిరాశే ఎదురైంది.అడ్డంకులు.. అవమానాలు!ఎమ్మెల్యేల నుంచి.. సీనియర్ నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో సీఎం చంద్రబాబుని కలిసేందుకు ప్రయత్నించారు. అయితే వారికి అడుగడుగునా అడ్డంకులు, అవమానాలే ఎదురైనట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేశారు. సీఎం అంటే సెక్యూరిటీ సహజమే అయినా.. ఎమ్మెల్యే అయితే పెద్దగా తనిఖీలు లేకుండా నేరుగా పంపేస్తుంటారు. అలాంటిది కుప్పంలో ఎమ్మెల్యేలకు చేదు అనుభవమే ఎదురైంది.తాను ఎమ్మెల్యేని చెబుతున్నా.. పోలీసులు పట్టించుకోలేదని, పంపేందుకు ససేమిరా అన్నారని తెలిపారు. ఐడీ కార్డు ఉందా? మీరు ఎమ్మెల్యేనేనా? రుజువు ఏంటి? అంటూ సవాలక్ష ప్రశ్నలతో తీవ్ర అవమానాలకు గురిచేసినట్లు చెబుతున్నారు. ‘సీఎంని కలవాలంటే.. ఎమ్మెల్సీ శ్రీకాంత్ నుంచి ఫోన్ చేయించండి లేదా చెప్పించండి’ అంటూ సమాధానం ఎదురైందంటున్నారు. సరే శ్రీకాంత్తో చెప్పిద్దాం అంటే ఆయన అందుబాటులో లేకపోవడం, ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో అనేక మంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు.పోలీసులే కాకుండా.. అధికారులు సైతం ఎమ్మెల్సీ కనుసన్నల్లో నడిచినట్లు వివరించారు. ఎమ్మెల్యే అనే గౌరవం కూడా లేకుండా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే స్థానిక నాయకులకు కూడా సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం లేకుండా పోయినట్లు ప్రచారం జరుగుతోంది. స్థానిక నాయకులందరినీ ఎమ్మెల్సీ శ్రీకాంత్ దూరం పెట్టారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.జిల్లాకు మంత్రి పదవి ఇవ్వకపోవడం లోటే..వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు మంత్రి వర్గంలో పెద్దపీట వేశారు. ఏకంగా ముగ్గురికి మంత్రి పదవులు ఇవ్వడంతో పాటు ప్రభుత్వ విప్ పదవి సైతం ఇచ్చారు. జిల్లాపై తనకున్న అభిమానం చాటుకున్నారు. అయితే ఇప్పుడు అదే స్థాయిలో ఎమ్మెల్యేలు గెలిచి కూటమి ప్రభుత్వం ఏర్పడినా.. జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నా మంత్రి వర్గంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా చోటు కల్పించకపోవడంపై జిల్లా వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.ఒక్కరికై నా మంత్రి పదవి ఇచ్చి ఉంటే.. నాయకులు, కార్యకర్తల పరిస్థితి ఇలా ఉండేది కాదనే అభిప్రాయపడుతున్నారు. సీఎం చంద్రబాబు తన సొంత జిల్లా ఎమ్మెల్యేలకే న్యాయం చేయకపోతే ఎలా? అని ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.ఆందోళనతో దిగొచ్చినా ప్రయోజనం శూన్యం!కూటమి ప్రభుత్వం ఏర్పాటు కావడం.. సీఎం కుప్పానికి రావడంతో పలువురు టీడీపీ, బీజేపీ, జనసేననేతలు చంద్రబాబుని కలిసేందుకు ఉత్సాహం చూపించారు. మంగళవారం ఉదయం నుంచి వేచి ఉన్న వారికి బుధవారం కూడా చంద్రబాబుని కలిసే అవకాశం రాలేదు.ఈ క్రమంలో ముఖ్యమంత్రిని కలవాలని ఎమ్మెల్సీ శ్రీకాంత్తోపాటు పోలీసులను ప్రాధేయపడినా ప్రయోజనం లేకపోవడంతో ఆగ్రహించిన కూటమి శ్రేణులు ఆందోళనకు దిగాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ శ్రీకాంత్ వారిని లోనికి పంపించమని పోలీసులను ఆదేశించారు. అయితే లోపలికి వెళ్లినా.. కొందరికి మాత్రమే సీఎం చంద్రబాబుని కలిసే అవకాశం దొరికిందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేశారు. -
మేయర్ కర్చీకి ఫోర్జరీ బూచి..
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ కుర్చీకి టీడీపీ నేతలు ఎసరు పెట్టారు. వైఎస్సార్సీపీ నుంచి మేయర్గా ఎన్నికైన ఆ గిరిజన మహిళను ఆ పదవి నుంచి బలవంతంగా రాజీనామా చేయించేందుకు కుట్రలు, కుయుక్తులు ప్రారంభించారు. మేయర్ దంపతులను వైఎస్సార్సీపీకి రాజీనామా చేసే విధంగా వారిని ఫోర్జరీ బూచితో బెదిరించి.. రెండు వారాలుగా మానసిక క్షోభకు గురి చేస్తున్నారు.ఈ వ్యవహారంపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో తమకు అనుకూలమైన సోషల్ మీడియా ద్వారా మేయర్ భర్త పాత్రపై విస్తృత ప్రచారం చేస్తూ పరిస్థితులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఇదంతా కార్పొరేషన్లో పెత్తనం కోసమే అనే ప్రచారం జరుగుతోంది.నెల్లూరు నగరపాలక సంస్థ హోదాను సంతరించుకున్న తర్వాత మొదటి సారిగా ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళకు రిజర్వేషన్ కల్పిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెద్ద పీట వేసింది. కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ నుంచి నెల్లూరు 12 డివిజన్ కార్పొరేటర్గా ఎన్నికై న పోట్లూరి స్రవంతిని మేయర్ను చేసింది. అయితే రాష్ట్రం, జిల్లాలో అధికార మార్పిడి జరగడంతో టీడీపీ ప్రభుత్వ నేతలు నగరపాలక సంస్థలో పెత్తనం కోసం రాజకీయ కుట్రకు తెర తీశారు. మేయర్ పదవిలో ఉన్న గిరిజన మహిళను టార్గెట్ చేసి ఆమె భర్త జయవర్ధన్ తన భార్య అధికారాన్ని అడ్డం పెట్టుకుని కార్పొరేషన్ కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు తెరపైకి తెచ్చారు.వైఎస్సార్సీపీలో ఉన్న మేయర్ దంపతులను టీడీపీలోకి చేర్చుకునేందుకు టీడీపీ నేతలు కుయుక్తులు పన్నడంతో భయపడిపోయిన వారు పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. మీడియా సముఖంగానే నెల్లూరు రూరల్ ప్రజాప్రతినిధిని శరణు వేడుతూ, క్షమాపణలు అడిగారు. దీన్ని బట్టి టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలు చేశారని అర్థమవుతోంది. మేయర్ దంపతులపై టీడీపీ నేతలు కుట్రలు చేస్తున్నారనే ప్రచారం జరగడంతో తాజాగా మరో కొత్త వ్యూహాన్ని రచించారు.డిప్యూటీ మేయర్తోనే..నగరపాలక సంస్థ కమిషనర్ సంతకం ఫోర్జరీ వ్యవహారంలో మేయర్ దంపతుల ప్రమేయం ఉందని బూచిగా చూపి ఆమెతో తన పదవికి రాజీనామా చేయించే కుట్రలు పన్నుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోది. రెండు వారాలుగా గిరిజన మహిళను మానసిక క్షోభకు గురి చేస్తున్న టీడీపీ నేతలు త్వరలోనే మేయర్ సీటును ఖాళీ చేయించి.. డిప్యూటీ మేయర్ను ఇన్చార్జి మేయర్ స్థానంలో కూర్చొబెట్టి తమ పెత్తనం సాగించే ప్రయత్నాలు మమ్మురం చేశారని కార్పొరేషన్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. మేయర్ తన పదవికి రాజీనామా చేసే విధంగా విచారణలో ఉన్న ఫోర్జరీ వ్యవహారాన్ని తమకు అనుకూల సోషల్ మీడియాలో మేయర్ భర్త ప్రమేయం ఉన్నట్లుగా చిలువలు పలువలుగా ప్రచారం చేస్తున్నారు.గతంలో వైఎస్సార్సీపీ నుంచి మేయర్గా ఎన్నికై .. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన అబ్దుల్ అజీజ్ హయాంలో జరిగిన తప్పులను ప్రస్తుత మేయర్ స్రవంతి భర్తకు ముడిపెట్టి భయపట్టే కుట్రలు జరుగుతున్నాయి. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి మార్ట్గేజ్లో ఉన్న భవనాలను విడుదల చేయించి దాదాపు రూ.15 కోట్ల మేర కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారనేది ప్రధాన ఆరోపణ.వాస్తవంగా కార్పొరేషన్ పాలన వ్యవహారాలు అన్ని కూడా ఆన్లైన్లోనే జరుగుతాయి. మార్జ్గేజ్లో ఉన్న భవనాలను రిలీజ్ వ్యవహారం కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఈ విధానం ఎక్కడా మాన్యువల్గా జరగలేదు. గతంలో టీడీపీ హయాంలో బీపీఎస్ ద్వారా దరఖాస్తు చేసుకున్న వారికే మాన్యువల్గా చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే కార్పొరేషన్లో కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఏ సంబంధం లేని ఓ న్యాయవాది ద్వారా ఫిర్యాదు చేయించడం, ఆ ఫిర్యాదుపై ప్రాథమిక విచారణ జరగకుండానే సోషల్ మీడియాలో నలుగురు వైఎస్సార్సీపీ నేతలకు ఉచ్చు అంటూ పోస్ట్లు పెట్టించడం చూస్తే ఇదంతా రాజకీయ కుట్రలో భాగమనే చర్చ జరుగుతోంది.కేవలం కార్పొరేషన్పై పెత్తనం కోసం టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్తో మేయర్ దంపతులతో వైఎస్సార్సీపీకి రాజీనామా చేసేలా ప్రయత్నించి సక్సెస్ అయ్యారు. ఇదీ చాలదన్నట్లు ఇంకా వారిపై ఒత్తిడి పెంచి మేయర్ పదవి నుంచి దించేసే కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తున్నారు.నోరు విప్పని మంత్రి నారాయణ..రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా నారాయణ తన శాఖ పరిధిలో ఉన్న నగరపాలక సంస్థలో రెండు వారాలుగా ఫోర్జరీ వివాదం నడుస్తోంది. ఆ శాఖ మంత్రిగా ఉన్న నారాయణ ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు నోరు విప్పకపోవడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. కొందరు టీడీపీ ప్రజాప్రతినిధుల మైండ్ గేమ్ అర్థం చేసుకున్న నారాయణ ఈ వ్యవహారంలో తలదూర్చడానికి సందేహిస్తున్నారా? లేక ఆ మైండ్గేమ్లో ఆయన పాత్ర ఉందా? అనే అనుమానాలపై చర్చ నడుస్తోంది.మీడియా ముందుకు రాని కమిషనర్..రెండు వారాలుగా కార్పొరేషన్లో కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి కార్పొరేషన్ ఆదాయానికి గండి కొట్టారనే ప్రచారంపై ప్రాథమిక విచారణలో కూడా నిజమేనని తేలింది. ఈ వ్యవహారాన్ని విజిలెన్స్కు అప్పగించారు. నలుగురు టౌన్ప్లానింగ్ అధికారులు, ఉద్యోగులను సస్పెండ్ చేశారు. అయితే కార్పొరేషన్లో ఏం జరుగుతుందనే విషయంపై కమిషనర్ మీడియా ముఖంగా ఎందుకు వెల్లడించలేదనే ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతున్నాయి.నిజంగా తన సంతకం ఫోర్జరీ జరిగి ఉంటే ఫోరెన్స్కు పంపారా? అలా ఎందుకు చేయలేదు. కేవలం అధికారులను బలి చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఫోర్జరీ వ్యవహరం నిజమైతే వాస్తవాలు బయట పెట్టేందుకు కమిషనర్ ఎందుకు జంకుతున్నారని రాజకీయ వర్గాలతో పాటు నగర ప్రజలు కూడా నిలదీస్తున్నారు. ఈ వ్యవహారం అంతా రాజకీయ కోణంగా ఉండడంతోనే మీడియా ముందుకు వచ్చే సాహసం చేయలేదనే చర్చ జరుగుతోంది. -
ఏపీలో ‘పక్కదారి’ పాలన షురూ!
ఏపీ శాసనసభ ఎన్నికలకు ముందు ఎవరైనా టీడీపీ వారిని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కలిసి ఇచ్చిన హామీలు ఎలా ఆచరణ సాధ్యం? అని ప్రశ్నిస్తే వారు ఠకీమని ఒక సమాధానం ఇచ్చేవారు. మా నాయకుడు అంత తెలివితక్కువవాడు కాదు. అవేమీ అమలు చేసేది ఉండదు. అవసరమైనవి, సాధ్యమైనవి మాత్రమే చేస్తారు అని చెప్పేవారు. మరి అది మోసం కాదా అని ప్రశ్నిస్తే, ఆ సంగతి తర్వాత, ముందు అధికారం రావాలి కదా! అని అనేవారు. సరిగ్గా అదే పంధాలో చంద్రబాబు ప్రభుత్వం ముందుకు వెళుతున్నట్లుగా ఉంది. కాకపోతే ఈసారి ఆయనకు పవన్ కల్యాణ్ కూడా తోడయ్యారు.ఇంతకాలం వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన వ్యవస్థలను మార్పు లేదా ఖతం చేసే దారిలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ఉన్నారనిపిస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ల వ్యవస్థలు ఎంతో పేరు తెచ్చి పెట్టాయి. ప్రజల అవసరాలను తీర్చడానికి, గడప వద్దకే పాలనను తీసుకువెళ్లడానికి అవి ఉపయోగపడ్డాయి. ఇప్పుడు ఆ వ్యవస్థలను యధాతధంగా కొనసాగించడం టీడీపీ, జనసేన, బీజేపీల కూటమికి అంత ఇష్టం ఉండదు. అందుకే కీలకమైన ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్లు కనిపిస్తుంది.ప్రతి నెల మొదటి తేదీన వృద్దాప్య పెన్షన్ లు వలంటీర్ల ద్వారా కాకుండా గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా లబ్దిదారుల ఇళ్లవద్ద పంపిణీ చేయాలని మంత్రివర్గం తీర్మానించింది. ఎన్నికల సమయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు వలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తామని, వారికి ఇచ్చే గౌరవ వేతనం ఐదువేల నుంచి పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు. చంద్రబాబు అయితే మరో అడుగు ముందుకు వేసి వలంటీర్లకు గౌరవవేతనంతో పాటు ఇళ్లవద్దే ఉండి నెలకు ఏభైవేల రూపాయల వరకు సంపాదించుకునేలా తాను చేస్తానని చెప్పేవారు. కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన పది రోజులలోనే వలంటీర్లను వారి విధుల నుంచి పక్కనబెట్టడం విశేషం. దీంతో వీరి మనుగడ కొనసాగుతుందా? లేదా? అన్న చర్చ జరుగుతోంది.ఏపీలో తొలుత రెండున్నర లక్షల మంది వలంటీర్లు ఉండేవారు. ఎన్నికల సమయంలో నిమ్మగడ్డ రమేష్ రూపేణ వలంటీర్ల వ్యవస్థను కొంత డిస్టర్బ్ చేయడంలో టీడీపీ సఫలం అయింది. వారి ద్వారా పెన్షన్ లు పంపిణీ కాకుండా ఎన్నికల సంఘం నుంచి ఆదేశాలు తెప్పించగలిగారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఏర్పడడంతో ఎన్నికల కమిషన్ కూటమికి పూర్తిగా సహకరించిందన్న సంగతి తెలిసిందే. ఎన్నికల సంఘం నిర్ణయం తర్వాత సుమారు ఎనభై వేల మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. అయినా ఇప్పటికీ సుమారు లక్షన్నర మందివరకు వలంటీర్లు కొనసాగుతున్నారు. ఆ వలంటీర్లను వాడుకుంటూ, వలంటీర్లు లేనిచోట సచివాలయ సిబ్బందితో పెన్షన్ లు పంపిణీ చేస్తామని చెప్పి ఉంటే ఎవరికి సందేహం వచ్చేది కాదు.వలంటీర్లపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి పార్ధసారథి చెప్పడం విశేషం. అంటే ఇందులో కొత్తగా తీసుకోవలసిన నిర్ణయం ఏమి ఉంటుంది? వలంటీర్ల వ్యవస్థను ఉంచాలా? వద్దా? అన్నదానిపైనే ప్రభుత్వం ఆలోచిస్తుండాలి. ఒకప్పుడు ఈ వలంటీర్లను ఉద్దేశించి చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. వారిని ఒక రకంగా అవమానించేలా మాట్లాడారు. సంఘ వ్యతిరేక శక్తులతో పోల్చారు. కానీ ఎన్నికల టైమ్ కు వలంటీర్లను వ్యతిరేకించడం వల్ల తమకు నష్టం వస్తుందని అనుమానించి, వెంటనే ప్లేట్ మార్చి వారికి పదివేల రూపాయల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని, వ్యవస్థను కొనసాగిస్తామని ప్రకటించారు. ఎన్నికల మానిఫెస్టోలో కూడా ఇదే వాగ్దానం చేశారు. కానీ ఇప్పుడు వలంటీర్లను సస్పెన్స్ లో పెట్టారు.వలంటీర్ల వ్యవస్థ వల్ల ప్రజలకు ఉపయోగం లేదని అనుకుంటే, అదే విషయాన్ని ఎన్నికల ప్రచారంలో చెప్పి ఉండవచ్చు. అలా చేయలేదు. పైగా వారిపట్ల సానుకూలంగా మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఉన్న వలంటీర్లను మార్చుతారేమోనన్న ప్రచారం జరిగేది. ప్రస్తుతం ఉన్నవారు వైఎస్సార్సీపీకి అనుకూలమైన వారన్నది టీడీపీ భావన. వీరికి బదులు టీడీపీకి సంబంధించినవారిని నియమించుకోవాలన్న ఆలోచన చేయవచ్చని అనుకున్నారు. కానీ అందుకువిరుద్ధంగా ఆ వ్యవస్థపైనే అనుమానాలు సృష్టించారు. వైఎస్సార్సీపీకి ఎన్నికలలో వలంటీర్ల వ్యవస్థ వల్ల రాజకీయంగా ఉపయోగం జరగలేదన్న అభిప్రాయం ఏర్పడింది.ఈ నేపథ్యంలో టీడీపీలో కూడా పునరాలోచన ఏర్పడి ఉండవచ్చని అంటున్నారు. ఇదే సమయంలో సచివాలయాల సిబ్బందితో ఇళ్ల వద్ద పెన్షన్ లు పంపిణీ చేయించడం కూడా కొంత వివాదాస్పదం కావచ్చు. తమకు కొత్త బాధ్యత పెడుతున్నారన్న అసంతృప్తి ఏర్పడవచ్చు. అయినా ప్రభుత్వం వారిపైనే ఒత్తిడి పెడుతున్నదంటే ఈ వ్యవస్థలో ఇంకా పలుమార్పులు తీసుకురావాలని ఆలోచిస్తుండవచ్చనిపిస్తుంది. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మార్కు పాలన కనిపించకూడదని కూటమి నేతలు భావిస్తుండవచ్చు. సచివాలయాల సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి వారికి అవసరమైన పౌరసేవలు అందిస్తుంటారు. వలంటీర్లు ప్రజల నుంచి ఆయా దరఖాస్తులు తీసుకుని స్కీములలో చేర్చడం, వారికి కావల్సిన సర్టిఫికెట్లను సమకూర్చడం తదితర సేవలు అందించేవారు. ఇప్పుడు వీటన్నిటిని నిలుపుదల చేస్తే ఈ వలంటీర్లకు, సచివాలయాల సిబ్బందికి పని ఉండదు.ప్రస్తుతానికి సచివాలయాల సిబ్బందికి డిప్రమోషన్ ఇచ్చిన రీతిలో వారినే లబ్దిదారుల ఇళ్లచుట్టూ తిప్పాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఇష్టం లేనివారు ఉద్యోగాలు మానుకుంటారు. లేదా, భవిష్యత్తులో వేరే రకంగా వాడుకునే ఉద్దేశంతో ఈ బాధ్యత అప్పగించి ఉండవచ్చు. చంద్రబాబు ప్రభుత్వం ఈ నిర్ణయం చేయడంతో మానిఫెస్టోలో చెప్పినవాటికి భిన్నంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వస్తాయి. అందుకే ఇప్పటికిప్పుడు ఒక నిర్ణయం తీసుకోకుండా, అంతా పరిశీలనలో ఉందని చెప్పవచ్చు. ప్రజాభిప్రాయం తీసుకుంటున్నామని తెలపవచ్చు. అలాగే అభిప్రాయాలు సేకరించామని, ప్రజలకు వలంటీర్లవల్ల ఉపయోగం లేదని, పేర్కొనవచ్చు. వలంటీర్ల వ్యవస్థను ఒకవేళ తొలగిస్తే రెండున్నర లక్షల మంది ప్రస్తుతం ఏదో రూపంలో పొందుతున్న ఉపాధిని కోల్పోయినట్లు అవుతుంది. దానిని కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏదైనా కొత్త నిర్ణయం చేస్తుందా? అనేది చూడాలి.అలాగే.. ఇన్నివేల సచివాలయాల అవసరం లేదని, సిబ్బందిని వేరే రూపంలో వినియోగించుకోవచ్చని ఏమైనా ఆలోచన జరుగుతుందా అన్న సందేహం కూడా ఉంది.చంద్రబాబు నాయుడుకు ప్రజలలో ఉన్న అభిప్రాయానికి తగినట్లుగానే మాట మార్చుతారా అనే ప్రశ్న వస్తోంది. విశేషం ఏమిటంటే వలంటీర్లకు పదివేల రూపాయల వేతనం ఇస్తారని ఎన్నికల ప్రచారంలో హోరెత్తించిన ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి టీడీపీ మీడియా ఇప్పుడు క్యాబినెట్ నిర్ణయానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా జాగ్రత్తపడడం కూడా గమనించదగ్గ అంశమే. అదే ఇలాంటి నిర్ణయం ఏదైనా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చేస్తే.. ఈ మీడియా పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసేవి. కానీ చంద్రబాబు ప్రభుత్వం ఏమి చేసినా సమర్థించే మీడియా కనుక వలంటీర్ల వ్యవస్థపై చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు మాట తప్పారని ఎక్కడా ఒక్క మాట రాయలేదు. పైగా క్యాబినెట్ కీలక హామీలను నెరవేర్చిందని హెడింగ్ లు పెట్టి మరీ జనాన్ని మోసం చేసే ప్రయత్నం చేశాయి.చంద్రబాబు చేసిన తొలి ఐదు సంతకాలనే క్యాబినెట్ లో తీర్మానం చేశారు. మెగా డీఎస్సీ, వృద్దుల పెన్షన్ నాలుగువేల రూపాయలు చేయడం తప్ప మిగిలినవాటికి పెద్ద ప్రాధాన్యత లేదు. లేని టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు తీర్మానం చేయడం మరో ప్రత్యేకత. టీడీపీ మీడియాకు ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు ప్రకటించిన సూపర్ సిక్స్ వాగ్దానాలు కీలకమైనవిగా కనిపించడం లేదు. స్కూళ్లు తెరిచిన ఈ టైమ్ లో తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలందరికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చేసిన వాగ్దానం ప్రస్తావనే లేదు.ప్రతి మహిళకు నెలకు పదిహేను వందల రూపాయలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ప్రతి రైతుకు ఏటా ఇరవైవేల రూపాయల ఆర్దిక సాయం, నిరుద్యోగ భృతి మూడు వేల రూపాయలు, ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు వంటి పలు హామీలు ఎప్పుడు అమలు చేసేది క్యాబినెట్ లో చర్చించలేదు. అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆ ఏడాది కాలానికి అమలు చేయవలసిన స్కీముల గురించి మంత్రివర్గంలో చర్చించి షెడ్యూల్ ఖరారు చేసేవారు. ఇప్పుడు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల ప్రభుత్వం ఆ పని చేయకపోగా, ఒక్కో హామీని ఏ రకంగా ఎగవేయాలా అనేదానిపై దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తుంది. దానిని పక్కదారి పట్టించడానికి వీలుగా గత ప్రభుత్వంపై శ్వేతపత్రాలు విడుదల చేసే కథను నడపడానికి ప్రభుత్వం సిద్దమైందని అనుకోవచ్చు.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
వచ్చిరాగానే 2000 కోట్ల అప్పు మొదలైన చంద్రన్న అప్పులు
-
పచ్చ బిల్డింగ్లపై పేర్ని నాని పంచులు
-
18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా
న్యూఢిల్లీ, సాక్షి: లోక్సభ స్పీకర్ ఎవరనేదానిపై ఉత్కంఠకు తెరపడింది. బుధవారం ఉదయం జరిగిన ఎన్నికలో.. 18వ లోక్సభ స్పీకర్గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. ఎన్డీయే అభ్యర్థి ఓం బిర్లా పేరును ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదించగా.. వరుసగా మంత్రులు ఆ ప్రతిపాదనను బలపరిచారు. అటు ఇండియా కూటమి తరపున కె.సురేశ్ పేరును శివసేన (యూబీటీ) ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానం తీసుకొచ్చారు. దీన్ని పలువురు విపక్ష ఎంపీలు బలపర్చారు. అనంతరం మూజువాణీ విధానంలో ఓటింగ్ చేపట్టా.. ఇందులో ఓం బిర్లా విజేతగా నిలిచినట్లు ప్రొటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ ప్రకటించారు.విపక్ష కూటమి ఓటింగ్కు పట్టుబట్టకపోవడంతో.. ఓం బిర్లా ఎన్నిక సుగమమైంది. ఓం బిర్లా ఎన్నికపై ప్రధాని మోదీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పరస్పర కరచలనం ద్వారా అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరితో పాటు పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు దగ్గరుండి ఓం బిర్లాను స్పీకర్ చెయిర్లో కూర్చోబెట్టారు. #WATCH | BJP MP Om Birla occupies the Chair of Lok Sabha Speaker after being elected as the Speaker of the 18th Lok Sabha.Prime Minister Narendra Modi, LoP Rahul Gandhi and Parliamentary Affairs Minister Kiren Rijiju accompany him to the Chair. pic.twitter.com/zVU0G4yl0d— ANI (@ANI) June 26, 2024ప్రధాని మోదీ మాట్లాడుతూ.. సభను నడిపించడంలో స్పీకర్ పాత్ర ఎంతో కీలకం. కొత్తగా ఎన్నికైన ఎంపీలకు స్పీకర్ స్ఫూర్తిగా నిలుస్తారు. గత ఐదేళ్లుగా విజయవంతంగా సభను నడిపించారు. ఓం బిర్లా చరిత్ర సృష్టించారు. 17వ లోక్సభను నిర్వహించడంలో ఆయన పాత్ర అమోఘం. ఆయన నేతృత్వంలోనే కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టాం. జీ-20 సమ్మిట్ ఆయన సలహాలు, సూచనలు అవసరం. మరో ఐదేళ్లు కూడా సభను విజయవంతంగా నడిపిస్తారని ఆశిస్తున్నా. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. సభలో విపక్షాల సభ్యులు చర్చించేందుకు అవకాశం ఇవ్వలి. మా గొంతు నొక్కితే సభ సజావుగా నిర్వహించినట్లు కాదు. ప్రజల గొంతుక ఎంత సమర్థవంతంగా వినిపించామన్నదే ముఖ్యం. ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ అభినందనలులోక్ సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్ఆర్సీపీ అభినందనలు తెలిపింది. లోక్సభ పక్ష నేత మిథున్రెడ్డి మాట్లాడుతూ.. ‘‘గడిచిన లోక్సభను ఓం బిర్లా ఎంతో హుందాగా నడిపారు. ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు మాట్లాడే అవకాశం ఇచ్చారు.అదే తరహాలో ఈసారి కూడా విజయవంతంగా సభను నడపాలి’’ అని ఆకాంక్షించారు. ఇక.. రెండోసారి స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అభినందనలు తెలిపారు. విజయవంతంగా స్పీకర్ పదవి నిర్వహించాలని కోరారాయన. స్పీకర్గా ఓం బిర్లా ట్రాక్ రికార్డు.. లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగడం 48ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. బుధవారం జరిగిన ఎన్నిక ప్రక్రియలో ఇండియా కూటమి అభ్యర్థి సురేష్పై ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా(61) రాజస్థాన్లోని కోటా నుంచి మూడోసార్లు ఎంపీగా గెలిచారు. 2014లో ఎన్నికైన ఆయన లోక్సభలో 86శాతం హాజరును నమోదు చేసుకున్నారు. 671 ప్రశ్నలడిగారు. 2019లో గెలిచాక అనూహ్యంగా స్పీకర్ పదవి చేపట్టారు. ఇప్పుడు.. తొలి నుంచి జరుగుతున్న ప్రచారం నడుమే రెండోసారి స్పీకర్ పదవి చేపట్టబోతున్నారు. లోక్సభ స్పీకర్ పదవిని వరుసగా రెండుసార్లు చేపట్టిన ఐదో వ్యక్తి ఓం బిర్లా. ఆయనకంటే ముందు ఎం.ఎ.అయ్యంగార్, జి.ఎస్.ధిల్లాన్, బలరాం ఝాఖడ్, జి.ఎం.సి.బాలయోగి వరసగా రెండు విడతలు ఈ పదవికి ఎన్నికయ్యారు. వీరిలో బలరాం ఝాఖడ్ ఒక్కరే పదేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేశారు. -
కప్పం కడితేనే ‘కింగ్ ఫిషర్’!
సాక్షి, అమరావతి: ‘మాకు లాభం ఉంటేనే లారీలు కదులుతాయి’.. ‘మాకు కప్పం కడితేనే కింగ్ ఫిషర్ బీరు మార్కెట్లోకి వస్తుంది.. లేదంటే అంతే సంగతులు’ అని పారిశ్రామికవేత్తలకు హెచ్చరికలు జారీ చేస్తోంది.. టీడీపీ కూటమి ముఠా. డీల్ సెట్ కాకపోతే కంపెనీలోకి ఒక్క లారీని రానివ్వం.. పోనివ్వం అని తెగేసి చెబుతోంది. దీంతో కింగ్ ఫిషర్ బీరును ఉత్పత్తి చేసే యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) కంపెనీ అధికార పార్టీ దాష్టీకానికి బెంబేలెత్తుతోంది. శ్రీకాకుళం జిల్లాలో పారిశ్రామికవేత్తలను హడలెత్తిస్తున్న ఈ సిండికేట్ను ఎచ్చెర్ల బీజేపీ ఎమ్మెల్యే నడికుదిటి ఈశ్వరరావు వర్గం తెరముందు నడుపుతుంటే.. తెర వెనుక వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు వర్గం చక్రం తిప్పుతోంది. నెలకు రూ.1.50 కోట్లు చొప్పున ఏడాదికి రూ.18 కోట్లు తమకు కప్పం కింద కట్టాలని కంపెనీకి కూటమి ప్రజాప్రతినిధులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇందుకు యునైటెడ్ బ్రూవరీస్ సిద్ధంగా లేకపోవడంతో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తి మొదలుకావడం లేదు.అడుగడుగునా అడ్డుపడుతున్న టీడీపీ కూటమి ముఠా..శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం బంటుపల్లిలో ఉన్న యునైటెడ్ బ్రూవరీస్ (యూబీ) బీర్ కంపెనీ ఉంది. తమ ఫ్యాక్టరీలో కింగ్ ఫిషర్ బీరు ఉత్పత్తిని ప్రారంభించేందుకు ఆ కంపెనీ చేస్తున్న యత్నాలకు అడుగడుగునా టీడీపీ కూటమి ముఠా అడ్డు పడుతోంది. ముడి సరుకును ఫ్యాక్టరీకి తీసుకువచ్చి, ఉత్పత్తి చేసిన సరుకును ఫ్యాక్టరీ నుంచి బయటకు తీసుకువెళ్లే ఒక్కో లారీకి రూ.వేయి చొప్పున కప్పం చెల్లించాలని ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం కరాఖండీగా తేల్చిచెప్పిందనే విషయం సంచలనం సృష్టించింది. ఎందుకంటే లోడింగ్, అన్ లోడింగ్ కోసం రోజుకు సగటున 500 లారీలు వస్తాయి.. ఆ లెక్కన రోజుకు రూ.5 లక్షల చొప్పున నెలకు రూ.1.50 కోట్ల వరకు కప్పంగా అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు చెల్లించాల్సి ఉంటుంది. ఏడాదికి ఈ మొత్తం 18 కోట్లు. అంత భారీ మొత్తం కప్పంగా చెల్లించలేమని కంపెనీ ప్రతినిధులు చెప్పడంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయులు ఏకంగా ఆ ఫ్యాక్టరీపై దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. కంపెనీ ఆస్తులను ధ్వంసం చేయడమేకాకుండా కంపెనీలో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందిపై దాడి చేసి భయోత్పాతం సృష్టించారు.దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు మొదట పట్టించుకోలేదు. కేంద్ర హోం శాఖకు నివేదించడంతో ఢిల్లీ నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. దీంతో పోలీసులు ఒక రోజు తరువాత కేసు నమోదు చేశారు. మరోవైపు కంపెనీ ఉద్యోగులపై ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయించడం గమనార్హం. ఈ క్రమంలో శ్రీకాకుళం జిల్లాకే చెందిన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు జోక్యం చేసుకుని కప్పం కట్టేలా డీల్ సెట్ చేసినట్టు సమాచారం. ఆయన ఆదేశాలతో కంపెనీ ప్రతినిధులు ఎమ్మెల్యే ఈశ్వరరావుతో రాజీ చర్చలు కూడా జరిపారు. తాము అడిగినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు కప్పం కడితేనే బీర్ ఉత్పత్తి ప్రారంభించకోవచ్చని ఎమ్మెల్యే వర్గం కంపెనీకి తేల్చిచెప్పింది. కంపెనీ యాజమాన్యం ససేమిరా.. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం డిమాండ్ చేసినట్టుగా నెలకు రూ.1.50 కోట్లు వరకు కప్పంగా చెల్లించేందుకు యూబీ కంపెనీ యాజమాన్యం ససేమిరా అన్నట్టు సమాచారం. బంటుమల్లిలోని ఒక్క యూనిట్కే ఏడాదికి ఏకంగా రూ.18 కోట్లు అధికార పార్టీ ప్రజాప్రతినిధులకు మామూళ్లుగా ఇవ్వడం తలకుమించిన భారంగా ఆ కంపెనీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో రూపంలో కొంత మొత్తం అయితేనే ఇవ్వగలమని చెప్పినట్టు సమాచారం. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గం భగ్గుమంది. ఫ్యాక్టరీలోని బీరు ఉత్పత్తికి అడ్డుపడుతోంది. రెండు రోజులుగా ఫ్యాక్టరీకి లారీలు వస్తున్నా అందులోని ముడి సరుకును అన్లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా ఇప్పటికే ఉత్పత్తి చేసిన బీరును మార్కెట్లోకి పంపేందుకు లారీల్లోకి లోడింగ్ చేయనీయడం లేదు. అంతేకాకుండా కళాసీలెవరూ పనిలోకి రావడానికి వీల్లేదని ఎమ్మెల్యే వర్గం ఆల్టిమేటం జారీ చేసింది. ఎమ్మెల్యే వర్గం గుప్పిట్లోనే కళాసీల సంఘం ప్రతినిధులు ఉండటం గమనార్హం. ఎమ్మెల్యే ఈశ్వరరావు వర్గీయుల దాష్టీకంతోయూబీ ఫ్యాక్టరీ ముందు భారీ సంఖ్యలో లారీలు బారులు తీరి ఉన్నాయి. ఎమ్మెల్యే వర్గం హెచ్చరికలకు భయపడి ఎవరూ ముడి సరుకును అన్లోడింగ్ చేయడం లేదు. దాంతో యూబీ ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి నిలిచిపోయింది. మరోవైపు ఉత్పత్తి కోసం తెప్పించిన ముడి సరుకు సైతం లారీల్లోనే మగ్గిపోతోంది. ముడి సరుకు పాడైపోతే తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని కంపెనీ ప్రతినిధులు ఆందోళన చెందుతున్నారు.డ్రామాను అదరగొడుతున్న అచ్చెన్నఈ వ్యవహారంలో వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు డబుల్ గేమ్ ఆడుతుండటం గమనార్హం. కంపెనీ ప్రతినిధులు తమ సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఈశ్వరరావుతో మాట్లాడినట్టు అచ్చెన్నాయుడు కథ నడిపించారు. తాను చెబుతున్నా కళాసీలు వినడం లేదని చెప్పి ఎమ్మెల్యే ఈశ్వరరావు తప్పించుకున్నారు. అయితే మంత్రి అచ్చెన్న, ఎమ్మెల్యే ఈశ్వరావు పక్కా పన్నాగంతోనే ఈ వ్యవహారాన్ని ఉద్దేశపూర్వకంగా సాగదీస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఫ్యాక్టరీలో బీరు ఉత్పత్తి కొన్ని రోజుల పాటు నిలిచిపోతే యాజమాన్యం తప్పనిసరిగా తమ కాళ్లబేరానికి వస్తుందనేదే ఇద్దరు నేతల ఉద్దేశమని అంటున్నారు. అదే అదనుగా భారీగా కప్పం డిమాండ్ చేసి సాధించుకోవచ్చని కుట్రపన్నారు. పారిశ్రామికవేత్తల ఆందోళన..అధికారంలోకి వచ్చీ రావడంతోనే కూటమి నేతల బెదిరింపులతో పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పారిశ్రామికవేత్తల పట్ల ప్రభుత్వ వైఖరిపై వారిలో ఆవేదన వ్యక్తమవుతోంది. కానీ ప్రభుత్వ పెద్దలు మాత్రం తమ పంతం వీడటం లేదు. యూబీ కంపెనీ ఉదంతం ద్వారా రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు స్పష్టమైన సందేశం ఇవ్వాలన్నదే కూటమి ప్రభుత్వ ఉద్దేశంగా ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము డిమాండ్ చేసినంత కప్పం కడితేనే రాష్ట్రంలో ఏ కంపెనీ అయినా మనుగుడ సాగిస్తుంది.. లేదంటే ఆ కంపెనీ మూత పడాల్సిందేనని స్పష్టం చేస్తోంది.