-
పూటుగా మద్యం తాగి గేట్మ్యాన్ నిద్ర.. ఆగిన రైలు
నంద్యాల రూరల్: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్ వద్ద కాపలా ఉన్న గేట్మ్యాన్ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్ వేయలేదని గమనించిన లోకోపైలెట్ రైలును ఆపి హారన్ మోగించారు. స్థానికులు రూమ్లో ఉన్న గేట్మ్యాన్ను నిద్రలేపారు. గేట్ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్మ్యాన్ను విచారించారు. అతడు మద్యం తాగాడని తెలుసుకుని విధుల నుంచి తొలగించారు. చదవండి: శభాష్ ఆర్టీసీ.. శభాష్ సజ్జనార్.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్ -
వింత జబ్బు: 40 ఏళ్లుగా నిద్రపోని మహిళ
బీజింగ్: సాధారణంగా ఒక్కరోజు సరిగా నిద్రపోకపోతేనే ఆ ప్రభావం మన మీద చాలా దారుణంగా ఉంటుంది. రోజంతా చిరాకుగా... నిరుత్సాహంగా సాగుతుంది. అయితే ప్రస్తుతం చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. మారుతున్న పని వాతావారణం, సాంకేతికత మన శరీర పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో రాత్రి ఎంత సమయం గడిచినా ఓ పట్టాన నిద్రపట్టదు చాలా మందికి. మనకు వచ్చే చాలా అనారోగ్య సమస్యలకు ప్రధాన కారణం సరైన నిద్ర లేకపోవడం. ఇక నిద్రలేమితో బాధపడేవారు వైద్యులను సంప్రదించి.. చికిత్స తీసుకుని సమస్య నుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తుంటారు. కానీ ఇప్పుడు మీరు చదవబోయే ఈ వార్త ఇందుకు పూర్తిగా భిన్నమైనది. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ ఏకంగా 40 ఏళ్ల నుంచి నిద్ర పోవడం లేదు. ఎంత ప్రయత్నించినా ఆమెకు నిద్ర పట్టడం లేదట. నిద్రమాత్రలు వేసుకున్నప్పటికి ప్రయోజనం లేదని వాపోతుంది. ఆ వివరాలు.. చైనా హెనాన్ ప్రావిన్స్లో నివసించే లి జ్యానింగ్ అనే మహిళ(45) గత 40 ఏళ్లుగా ఇలా నిద్రలేమి సమస్యతో బాధపడుతుంది. ఈ వింత జబ్బు ఆమెని ఒక్క సెకను కూడా నిద్రపోనివ్వడం లేదట. తనకు 5-6 ఏళ్ల వయసు ఉన్నప్పుడు బాగా నిద్రపోయినట్లు గుర్తుందని.. ఆ తర్వాత ఈ వింత వ్యాధి బారిన పడటంతో ఇప్పటి వరకు ఒక్క క్షణం కూడా నిద్రపోలేదని తెలిపింది జ్యానింగ్. (చదవండి: నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది ) ఈ విషయాన్ని జ్యానింగ్ భర్త కూడా అంగీకరించాడు. పెళ్లైన నాటి నుంచి ఇప్పటివరకు జ్యానింగ్ నిద్రపోవడం తాను చూడలేదన్నాడు. రాత్రంతా మెలకువగా ఉండటంతో టైం పాస్ కోసం ఇంటి పనులు చేయడం, టీవీ చూస్తూ గడుపుతుందన్నాడు. ఇక ప్రారంభంలో భార్యను ఈ సమస్య నుంచి బయటపడేయడం కోసం జ్యానింగ్ భర్త నిద్ర మాత్రలు కూడా తీసుకువచ్చాడట. కానీ అవి కూడా ఆమె మీద పెద్దగా ప్రభావం చూపకపోవడంతో.. వాటిని వాడటం మానేసిందట. (చదవండి: రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!) ఈ వింత జబ్బు వల్ల జ్యానింగ్ తన గ్రామంలో చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా జ్యానింగ్ను టెస్ట్ చేయడం కోసం చాలా మంది రాత్రి పూట ఆమె ఇంటికి వచ్చి.. పేకాట ఆడుతూ ఉండేవారు. అలా ఆడుతూనే వారికి తెలియకుండా నిద్రలోకి జారుకునేవారు. కానీ జ్యానెంగ్ మాత్రం అలానే మెలకువగా ఉండేదట. సమస్య పరిష్కారం కోసం జ్యానెంగ్ ఎన్నో ఆస్పత్రులను సందర్శించింది.. ఎందరో వైద్యులను కలిసింది. కానీ ఆమె సమస్యకు మాత్రం పరిష్కారం లభించలేదు. (చదవండి: నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..) అయితే సాధారణంగా వారం రోజుల కంటే ఎక్కువ సమయం ఎవరు నిద్ర పోకుండా బతకలేరు. అలాంటిది జ్యానెంగ్ ఇన్నేళ్లు నిద్ర పోకుండా ఉంది అనే వార్తలను జనాలు పెద్దగా నమ్మడం లేదు. బహుశా ఆమెకు రాత్రి నిద్ర పట్టకపోవచ్చు.. పగటి పూట నిద్ర పోతుండవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. -
నిద్ర సరిగ్గా పట్టడం లేదా? ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది
ఈ మధ్యకాలంలో ఆన్ లైన్ చాటింగ్లు, బ్రౌజింగ్లు.. నిద్రను దోచుకుని, శరీరంలో ప్రతికూలమైన మార్పులు తెచ్చిపెడుతున్నాయి. నిద్రలేమితో ముఖం పాలిపోయి..కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడి.. ఎంతటి కళ గల ముఖమైనా డల్గా మారిపోతుంది. నిజానికి సరైన నిద్రే సౌందర్య రహస్యం అంటారు నిపుణులు. దానికి చక్కని బహుమతి..హ్యాండ్ హెల్డ్ స్లీప్ ఎయిడ్ ఇస్ట్రుమెంట్. కంటినిండా నిద్రను తెచ్చి..ముఖ వర్చస్సును పెంచుతుంది. చిత్రంలోని ఈ మైక్రో–కరెంట్ స్మార్ట్ హిప్నాసిస్ ఇస్ట్రుమెంట్..హైటెక్నాలజీతో రూపొందింది. ఈ పరికరం ప్రధానంగా తగినంత నిద్ర లేకుండా బాధపడేవారికి సహాయపడుతుంది. ఒత్తిడిని తగ్గించి మరీ నిద్రపుచ్చుతుంది. ఈ డివైజ్ని చేతితో పట్టుకుని, రిలాక్స్డ్గా కళ్లు మూసుకుంటే చాలు.. మెదడులోని కండరాలను ఉత్తేజపరచి.. కళ్ల మీద నిద్రను మోసుకొస్తుంది. ఇది సురక్షితమైనది.. తేలికైనది..పరిమాణంలో చిన్నది. పోర్టబుల్ మాత్రమే కాదు సులభంగా ఆపరేట్ చేసుకోవచ్చు. దీనిలో వర్కింగ్ మోడ్స్ ఉంటాయి. తక్కువ ఫ్రీక్వెన్సీకి డికంప్రెషన్ మోడ్, హై ఫ్రీక్వెన్సీకి ఎగ్జిటేషన్ మోడ్ నొక్కాలి. తీవ్రతను పెంచడానికి లేదా తగ్గించడానికి ప్లస్ మైనస్ బటన్ నొక్కాలి. ఈ స్లీప్ ఎయిడ్ పరికరాన్ని ఆఫీసులో ఇంట్లో, వ్యాపార పర్యటన ప్రాంతాల్లో ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. సుమారు 15 నిమిషాలు వాడితే.. తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలను కూడా నివారిస్తుంది. దీన్ని చేతికి బ్రేస్లెట్లా వేసుకునేందుకు వీలుగా ప్రత్యేకమైన బ్యాండ్ ఉంటుంది. ఆ పరికరాన్ని చేతికి పెట్టుకొని నిద్రపోతే తెల్లవారాక.. ఆ రోజు ఉల్లాసంగా.. ఉత్సాహంగా మొదలవుతుంది. దీని ధర సుమారు 30 డాలర్లు. అంటే సుమారు రూ. 2,200. -
డ్రైవింగ్ సీట్లో నిద్ర..రోడ్డు ప్రమాదాలపై అప్రమత్తం చేసే డివైజ్
ఎంత అప్రమత్తంగా ఉన్నా ప్రయాణాల్లో ఏ ప్రమాదం ఎటునుంచి మీదకొస్తుందో తెలియని రోజులివి. ఇక దూర ప్రాంతాలకు వెళ్తున్నప్పుడైతే.. డ్రైవింగ్ సీట్లో ఉన్న వాళ్లకు మరిన్ని జాగ్రత్తలు తప్పవు. స్మూత్గా దూసుకుపోయే కారు వంటి వాహనాల్లో నిద్ర ముంచుకొస్తుంటుంది. అప్పుడే రెప్పపాటు కాలంలో ఘోర ప్రమాదాలు జరిగిపోతుంటాయి. అలాంటి ప్రమాదాలను ముందుగానే గుర్తించి.. హెచ్చరించే పరికరమే చిత్రంలోని ఆటో సేఫ్ డివైజ్. విధుల్లో ఉన్నప్పుడు పూర్తిగా అప్రమత్తంగా ఉండాల్సిన వ్యక్తుల కోసం ఈ రిమైండర్ని రూపొందించారు. డ్రైవర్స్, రాత్రిపూట డ్యూటీ చెసే సెక్యూరిటీ గార్డ్స్, మెషిన్ ఆపరేటర్లు ఇలా ఎందరికో ఈ డివైజ్ ఉపయోగపడుతుంది. పోర్టబుల్ సైజుతో డిజైన్ చేసిన ఈ పరికరం.. ప్రాణాలను రక్షించే నిద్ర నిరోధక అలారమే అంటున్నారు నిపుణులు. ఎలక్ట్రానిక్ పొజిషన్ సెన్సార్ కలిగిన ఈ గాడ్జెట్ని.. చెవికి బ్లూటూత్ మాదిరి పెట్టుకుంటే సరిపోతుంది. వినియోగిస్తున్నవారు ఏమాత్రం నిద్ర మత్తులో తూగినా చెవిలో వైబ్రేషన్తో కూడిన అలారాన్ని మోగించి అలెర్ట్ చేస్తుంది. -
కరోనా వచ్చిన తర్వాత నిద్ర ఉండటం లేదా?.. ఇలా చేయండి!
నిద్ర మీద కరోనా దెబ్బ గట్టిగానే పడింది. అది దేహంలోని అన్ని కీలకమైన అవయవాలతో పాటు నిద్రపైనా ప్రభావం చూపింది. ‘కరోనాసామ్నియా’గా పిలిచే దీని ప్రభావం ఎలా ఉందో చూద్దాం... కరోనా వైరస్ సోకడం మొదలైన తొలిరోజుల నుంచి నేటివరకు అది అందరినీ ఆందోళనకు గురిచేసింది. సాధారణంగా మనం భయాందోళనలకూ, తీవ్రమైన ఉద్వేగానికీ లోనైనప్పుడు దాని ప్రభావం నిద్ర మీద పడుతుంది. నిద్ర అనేది మన సాధారణ ఆరోగ్యానికీ, వ్యాధి నిరోధకత సక్రమంగా పనిచేయడానికి అవసరమన్నది తెలిసిన విషయమే. కరోనా సోకి కోలుకున్న కొందరిలో నిద్ర పట్టడం ఓ సమస్యగా మారిపోయింది. ఫలితంగా అంతరాయాలతో కూడిన కొద్దిపాటి నిద్ర లేదా నిద్రలేమి పీడిస్తోంది. ఓ పక్క కరోనాసామ్నియాతో నిద్రలేమి. దాని కారణంగా రాత్రంతా మెలకువతో ఉండాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో రాత్రిపూట సమయం గడిపేందుకు చాలామంది తమ మొబైల్స్ లేదా కంప్యూటర్లను ఆశ్రయిస్తున్నారు. వాటిల్లో ఓటీటీ ద్వారా సినిమాలు చూడటం, కంప్యూటర్ గేమ్స్ ఆడటం చేస్తున్నారు. స్క్రీన్ ముందు గడిపే సమయం పెరగడంతో ‘ఎక్సెస్ స్క్రీన్ టైమ్’తో వచ్చే ఆరోగ్య సమస్యలు పెరుగుతున్నాయి. ఫలితంగా వృత్తి నిర్వహించే ప్రదేశాల్లో, ఆఫీసుల్లోనూ, ఇతరత్రా ఉపాధి / సంపాదన పొందే చోట్ల తగినంత సామర్థ్యం చూపలేక పనిలో నాణ్యత కుంటుపడుతోంది. దాంతో ‘వర్క్ రిలేటెడ్ స్ట్రెస్’ పెరుగుతోంది. పై అంశాల కారణంగా మనో వ్యాకులత, కుంగుబాటు (డిప్రెషన్) వంటివి కనిపిస్తున్నాయి. ఆ మానసికమైన సమస్యలు... వ్యక్తుల్లో తీవ్రమైన ఒత్తిడిని పెంచుతున్నాయి. ఒత్తిడి తీవ్రంగా ఉన్నప్పుడు ఎంతగానో నిద్రవస్తున్నట్లు అనిపించడం లేదా ఏ పనీ చేయలేనంత తీవ్రమైన అలసట కలగడం చాలా సాధారణం. దీన్నే ‘స్ట్రెస్ రిలేటెడ్ ఫెటీగ్’ అంటారు. నిద్ర ఎందుకంత ప్రధానం అంటే... నిద్ర అన్నది ఓ జీవసంబంధమైన (బయలాజికల్) ప్రక్రియ. ఇది శారీరక, మానసిక పరిస్థితులతో పాటు ఉద్వేగాలను అదుపులో ఉంచుతుంది. మన వ్యాధి నిరోధక శక్తి సామర్థ్యాలు మంచి నిద్రపైనే ఎక్కువగా ఆధారపడి ఉంటాయి. కంటి నిండా నిద్రపోయే వారిలోనే ‘వ్యాధితో పోరాడే శక్తి’ (డిఫెన్స్ మెకానిజమ్) చాలా సమర్థంగా ఉంటుంది. (మనం ఇచ్చే వ్యాక్సిన్లు కూడా మంచి నిద్ర ఉన్నవారిలోనే సమర్థంగా పనిచేస్తాయన్న విషయం కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది). మన మెదడు సమర్థంగా పనిచేయడానికి కూడా మంచి నిద్ర అవసరం. ఎందుకంటే... మన ఆలోచనా విధానాలు, నిర్ణయాలు తీసుకునే శక్తి, సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం, మనోభావాలు, చిరాకులు... ఇవన్నీ నిద్రపైనే ఆధారపడి ఉంటాయి. నిద్రలేమి కారణంగా వచ్చే డిప్రెషన్, యాంగ్సైటీ డిజార్డర్స్, బైపోలార్ డిజార్డర్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (పీటీఎస్డీ) వంటి అదనపు మానసిక సమస్యలు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. నిద్రలేమి కారణంగా కొందరు పొగాకు, వాటి ఇతర ఉత్పాదనలు, ఆల్కహాల్ వంటి వాటిని ఆశ్రయించడం ఇటు వ్యక్తిగత ఆరోగ్యానికీ, అటు సామాజిక సమస్యలకూ కారణమవుతోంది. కరోనా తగ్గాక నిద్రలేమితో వచ్చే సమస్యల్లో కొన్ని... బాధితుల దైనందిన వ్యవహారాల్లో క్రమబద్ధత లోపించడం. అన్ని టైమింగులూ దెబ్బతినడం (ఉదాహరణకు ఆఫీసులకు వెళ్లడం, అనేక సామాజిక కార్యకలాపాలకు హాజరుకావడం వంటివి). రాత్రి వేళ నిద్రలేమి...పగటివేళల్లో మందకొడితనం. నిద్రను ఆయా వేళల్లో నియంత్రించే ‘సర్కాడియన్ రిథమ్’ దెబ్బతినడం. కొన్ని అంశాలు నిద్ర సక్రమంగా పట్టేలా చూస్తాయి. వాటిని ‘జెయిట్గెబర్స్’ అంటారు (ఉదాహరణకు రాత్రి నిద్రవేళ వెలుగు చాలా తక్కువగా ఉండేలా చూసుకోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు ఒకింత తక్కువగా నిద్రకు అనువుగా ఉండటం). జెయిట్గెబర్స్కూ, నిద్రను కల్పించే సర్కాడియన్ రిథమ్కూ సమన్వయం లోపించింది. ఇది మరిన్ని నిద్ర సంబంధిత సమస్యలను తెచ్చిపెడుతోంది. ఈ సమగ్ర ప్రభావాల కారణంగా పనిగంటలు తగ్గుతున్నాయి. ఒకపక్క కోవిడ్ కారణంగా అసలే వృత్తులు దెబ్బతిన్నాయి. దీనికి తోడు ఇప్పుడీ ‘కరోనోసామ్నియా’ ఓ రుగ్మతలా ఉన్న కొద్దిపాటి ఉపాధి అవకాశాలనూ దెబ్బతీస్తోందని కొన్ని అధ్యయనాల్లో వెల్లడైంది. ఆరోగ్యకరమైన నిద్ర కోసం కొన్ని సూచనలు... నిద్ర పట్టినా లేకపోయినా... రోజూ మీ నిర్ణీతమైన నిద్రవేళకు పక్క మీదికి చేరండి. పక్క మీదికి వెళ్లే సమయానికి ఎలాంటి మానసిక ఒత్తిడీ లేకుండా జాగ్రత్తపడండి. సరిగ్గా నిద్రసమయానికి బాగా కడుపునిండుగా ఉండేలా భోజనం చేయకండి. రాత్రి ఒకింత తేలికపాటి ఆహారమే మేలు. రాత్రి భోజనానికీ, నిద్రకూ కాస్తంత వ్యవధి ఉండేలా జాగ్రత్తపడండి. నిద్రకు ముందర శరీరానికి ఒకింత ఎక్కువ శ్రమ కలిగించే ఎలాంటి వ్యాయామాలూ చేయకండి. నిద్రవేళకు చాలా ముందుగా తేలికపాటి వ్యాయామాలు మాత్రమే చేయండి. ఒకసారి పడక మీదకు చేరాక ఎంతగా నిద్రపట్టకపోయినా మొబైల్, కంప్యూటర్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండండి. మీ పడకగదిలోకి ఆఫీసు పనిని తీసుకురాకండి. ఎంతకీ నిద్రపట్టకపోతే రిలాక్సేషన్ ప్రక్రియలైన యోగా, ధ్యానం వంటి వాటిని చేయండి. ఇవన్నీ ఆచరించాక కూడా నిద్ర పట్టకపోయినా నిద్రమాత్రలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు. మీ డాక్టర్ను తప్పక సంప్రదించండి. . డాక్టర్ రమణ ప్రసాద్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మనాలజిస్ట్ చదవండి : పిల్లలకు ఇవి తినిపించండి... ఆస్తమాకు దూరంగా ఉంచండి -
రాత్రి బాగా పొద్దుపోయాక నిద్రపోతే.. ఈ సమస్యలు తప్పవు!
సాక్షి, హైదరాబాద్: కరోనా మహమ్మారి, లాక్డౌన్ తదితర కారణాల వల్ల ఏడాదిన్నర కాలం నుంచి వారి జీవన విధానాల్లో మార్పులు సంభవించాయి. దీంతో సరిగ్గా నిద్ర పోవట్లేదు. గతేడాది సుదీర్ఘ లాక్డౌన్ విధింపుతో మొదలైన సంప్రదాయ విరుద్ధ ఆహారం, నిద్ర, ఇతర అలవాట్లు శరీరంపై అనేక రూపాల్లో ప్రభావం చూపుతున్నాయి. కోవిడ్ ముందు నుంచీ ఇలాంటి జీవన విధానం అవలంబించిన వారున్నా.. ఇప్పుడు వారి సంఖ్య భారీగా పెరిగిందని చెబుతున్నారు. తాజాగా ఈ కోవలోకి యువత, స్కూల్, కాలేజీ పిల్లలు, ఇతర వర్గాల ఉద్యోగులు, ప్రజలు వచ్చి చేరారు. రాత్రి బాగా పొద్దుపోయాక నిద్ర పోవడం, మధ్యాహ్నం లేవడం వల్ల మన ‘జీవ గడియారం’లో పెనుమార్పులు చోటు చేసుకుంటాయని వైద్యులు, మానసిక నిపుణులు చెబుతున్నారు. దీంతో శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. బ్రిటన్లోని నార్త్ వెస్ట్రన్, సర్రే యూనివర్సిటీలు ఇటీవల జరిపిన పరిశీలన ప్రకారం.. రాత్రిళ్లు ఎక్కువ సమయం మెలకువ ఉండే వారిలో దీర్ఘకాలిక మధుమేహం, మానసిక సమస్యలు, నాడీ సంబంధ సమస్యలు, ఉదర కోశ, గుండె సంబంధిత వ్యాధులు పెరుగుతాయని వెల్లడైంది. నిద్రలేమి, సంబంధిత ఆరోగ్య సమస్యలు తదితర అంశాలపై సైకాలజిస్ట్ సి.వీరేందర్, సైకియాట్రిస్ట్ డా.నిషాంత్ వేమన వెలిబుచ్చిన అభిప్రాయాలు.. వారి మాటల్లోనే.. కారణాలు– జాగ్రత్తలు.. అధిక బరువు, ఊబకాయమున్న వారిలో నిద్రలేమి ఎక్కువగా ఉండే అవకాశం. లాక్డౌన్లో అధికంగా తినడం, వ్యాయామం లేకపోవడంతో బరువు పెరుగుదల నిద్రలేమికి కారణం కావొచ్చు. సరిగ్గా నిద్రపోని కారణంగా రోజంతా చురుగ్గా లేకపోవడం, దేనిపైనా దృష్టి కేంద్రీకరించలేరు. నిరాసక్తంగా ఉంటారు. దీన్ని అధిగమించేందుకు మితమైన ఆహారంతోపాటు ప్రాణాయామం, యోగా, తేలికపాటి వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. 30–60 ఏళ్ల మధ్య వయసున్న వారు రోజూ ఏడెనిమిది గంటలు నిద్రపోవాలి. నిద్రలేక ఆక్సిజన్ శాతం తగ్గినా, శ్వాస సరిగ్గా ఆడకపోయినా ఇబ్బందులొస్తాయి. నిద్ర లేమితో మెదడుకు సరిగా రక్తప్రసరణ జరగకపోవడంతో ఎప్పుడూ ఆందోళనగా ఉంటారు. ఈ కారణంగా ఏర్పడే మైక్రో అరొజల్స్ వల్ల గాఢ నిద్రలోకి వెళ్లినా కూడా నిద్ర పోయినట్లే అనిపించదు. రాత్రి సరిగ్గా నిద్రపోకపోవడం లేదా వేళాపాళా లేకుండా ఏ అర్ధరాత్రి దాటాకో నిద్రపోతే ఉదయం ఎప్పుడూ నిద్ర వస్తున్నట్టే ఉంటుంది. పగటిపూట నిద్ర ఆపుకొనేందుకు ఎక్కువగా సిగరెట్లు, కాఫీ, టీలు తాగడం కూడా డీహైడ్రేషన్కు దారితీస్తుంది. నిద్రపోవడానికి 2 గంటల ముందు వరకు మొబైళ్లు, ల్యాప్టాప్స్, టీవీలు ఇతర ఎల్రక్టానిక్ పరికరాలు ఉపయోగించొద్దు. సామాజిక మాధ్యమాల్లో గడిపే సమయం తగ్గించాలి. మనసుకు ఆహ్లాదాన్ని కలిగించే సంగీతం, పాటలు, ఇతర అభిరుచుల్లో నిమగ్నం కావాలి. శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది శరీర సహజ సిద్ధమైన వ్యవస్థ, జీవ గడియారానికి భిన్నంగా వ్యవహరించడం వల్ల జీవన ప్రక్రియలపై ఒత్తిడి పెరిగి రోగనిరోధకత ప్రభావితం అవుతుంది. దీంతో అర్ధరాత్రి దాటాక నిద్ర పోయి.. మధ్యాహ్నం సమయంలో నిద్ర లేచిన వారి శరీరాల్లో విషపూరిత రసాయనాలు విడుదలయ్యే అవకాశాలు ఎక్కువ. ఇదే పద్ధతిని దీర్ఘకాలం కొనసాగిస్తే జీవన ప్రక్రియలపై ప్రభావం చూపడమే కాకుండా మతిమరుపు, గుర్తుకు పెట్టుకునే తత్వం కోల్పోవడం, గుండెపోటు వంటి వాటి బారిన పడతారని వివిధ పరిశోధనల్లో గతంలోనే నిరూపితమైంది. ఇలా వేళ కాని వేళల్లో నిద్రించే విధానాల వల్ల శరీరం తీవ్ర ఒత్తిడికి గురవుతుంది. మారిన అలవాట్లు, నిద్ర సమయాలకు అనుగుణంగా శరీరాన్ని సిద్ధం చేసేందుకు మన శరీరం అదనంగా శ్రమించాల్సి వస్తుంది. మెదడులో నిద్రకు ఉపక్రమించేలా చేసేందుకు ఉత్పత్తి అయ్యే ‘మెలటోనిన్’అనే హార్మోన్ విడుదలలో కాస్త అయోమయం ఏర్పడుతుంది. దీంతో అది పూర్తిగా విఫలమై తీవ్ర భావోద్వేగాలకు గురి కావడం, ఆదుర్దా, ఆందోళన చెందడం జరుగుతుంది. మెలటోనిన్ హార్మోన్ను మెదడులోని పీనియల్ గ్రంథి విడుదల చేస్తుంది. చీకటి సమయాల్లో ఇది విడుదలై నిద్ర పోయేందుకు దోహదపడుతుంది. వెలుతురు ఉన్నప్పుడు విడుదల ఆగిపోయి మెలుకునేలా ఉంటుంది. – సి.వీరేందర్, సీనియర్ సైకాలజిస్ట్ ఆందోళన, డిప్రెషన్ పెరుగుతుంది రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం, మరుసటి రోజు బాగా పొద్దుపోయాక నిద్ర లేవడం శరీరంపై చెడు ప్రభావం చూపుతుంది. దీనివల్ల వివిధ పనులు చేసుకునే వారి ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. సరైన సమయంలో నిద్రపోతేనే మనలో ఏకాగ్రత పెరగడమే కాకుండా, జ్ఞాపకశక్తి, ధ్యాస సరిగా ఉండటంతో పాటు త్వరగా అలసిపోకుండా ఉంటాం. మేం ఇప్పటివరకు పరిశీలించిన కేసుల ప్రకారం.. సరైన సమయానికి నిద్రపోక పోవడం, నిద్రలేమి కారణంగా ఆందోళన, డిప్రెషన్, కోపం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దాదాపు ఏడాదిన్నరగా కోవిడ్ మహమ్మారి కారణంగా ఏర్పడిన పరిణామాలు, పరిస్థితుల కారణంగా యుక్త వయసు పిల్లలు, యువతరం రాత్రుళ్లు చాలా ఆలస్యంగా నిద్రపోవడం కారణంగా మరునాడు ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఆన్లైన్ క్లాసుల వల్ల మొక్కుబడిగా ల్యాప్టాప్.. ట్యాబ్, ఫోన్ ఆన్ చేసి మళ్లీ నిద్రలోకి జారుకోవడం లేదా చెప్పే పాఠాలపై దృష్టి పెట్టకపోవడం చేస్తున్నారు. రాత్రి సరైన నిద్రలేకపోవడంతో సమయానికి తిండి తినకపోవడం వల్ల ఉదర సంబంధిత, ఇతర ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. – డా. నిషాంత్ వేమన, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, సన్షైన్ ఆస్పత్రి -
నిద్ర పట్టడం లేదా..? ఇవి చేస్తే ఈజీగా..
రాత్రిళ్లు నిద్ర పట్టడం లేదా.. బెడ్పై అటు ఇటు దొర్లుతున్నా కళ్లు మూసుకోవడం లేదా..? అయితే ఈ టిప్స్ పాటించండి.. ఎంచక్కా నిద్రపోండి. పడుకునే ముందు నాటు ఆవునెయ్యి గోరువెచ్చగా చేసుకొని ముక్కు రంధ్రాల్లో రెండు చుక్కలు వేసుకోవాలి. గసగసాలను దోరగా వేయించి పల్చని బట్టలో వేసుకుని నిద్రించే ముందు వాసన పీలుస్తూ ఉండాలి. చేతివేళ్లతో లేదా దువ్వెనతో తలవెంట్రుకలను మృదువుగా దువ్వుకుంటూ ఉండాలి. చేతులతో అరికాళ్లను మెల్లమెల్లగా మర్దన చేసుకోవాలి. రాత్రి పడుకునేముందు అరికాళ్లకు ఆముదం లేదా నువ్వుల నూనె, లేదా కొబ్బరి నూనెతో మర్దన చేయాలి. రాత్రి పూట కాసిని గోరువెచ్చని పాలు తాగాలి. నిద్ర పోవడానికి రెండు గంటల ముందు నుంచి మొబైల్ ఫోన్ చూడటం మానేయాలి. అంతేకాదు, రాత్రిళ్లు తల పక్కన మొబైల్ పెట్టుకుంటే రేడియేషన్ ప్రభావం వల్ల కూడా సరిగా నిద్ర రాదు. కాబట్టి మొబైల్ను దూరంగా పెట్టడం మంచిది. రోజూ రాత్రి పడుకునే ముందు కొద్దిసేపు కళ్లు మూసుకుని ధ్యానం చేయాలి లేదా ఏవైనా సుందర దృశ్యాలను ఊహించుకోవాలి. ఓంకారం లేదా మృదువైన లలిత సంగీతాన్ని పెట్టుకొని ప్రశాంతంగా కళ్లు మూసుకుని శ్వాస మీద ధ్యాస పెడితే తొందరగా నిద్ర పడుతుంది. -
బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే..
బ్యాంకాక్ : దొంగతనానికి పోయిన ఓ దొంగ అక్కడి వస్తువులు ఎత్తుకుపోవటం మానేసి ఏసీ వేసుకుని మంచంపై హాయిగా నిద్రపోయాడు. చివరకు పోలీసులకు చిక్కి జైలు పాలయ్యాడు. ఈ వింత, నవ్వు తెప్పించే ఘటన థాయ్లాండ్లో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.. థాయ్లాండ్లోని ఫెట్చబూన్ ప్రావిన్స్కు చెందిన అతిట్ కిన్ కుంతుబ్ అనే 22 ఏళ్ల యువకుడు మార్చి 22వ తేదీన అక్కడి ఓ ఆఫీసర్ ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. అప్పటికే బాగా అలసిపోయిన అతడు కాసేపు విశ్రాంతి తీసుకోవాలని భావించాడు. వెంటనే ఆఫీసర్ కూతురి బెడ్రూంలోని ఏసీ ఆన్ చేసి మంచంపై నిద్రపోయాడు. అయితే గాఢ నిద్రలోకి వెళ్లిపోయాడు. ఉదయం ఆఫీసర్ ఇంటికి వచ్చాడు. కూతురి బెడ్రూంలోని ఏపీ ఆన్ చేసి ఉండటంతో లోపలికి వెళ్లాడు. మంచంపై ఎవరో ముసుగు తన్ని పడుకుని ఉన్నారు. ఊరికి వెళ్లిన కూతురు ఏమైనా వచ్చిందా అనుకున్నాడు. దుప్పటి తెరిచి చూసి షాక్ అయ్యాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు‘‘ బాబు! నిద్రపోయింది చాలు ఇక పైకిలే’’ అంటూ దొంగను నిద్ర లేపారు. నిద్రలోంచి కళ్లు తెరిచిన అతను ఎదురుగా పోలీసులను చూసి కంగుతిన్నాడు. ‘అరే! పాడు నిద్ర ఎంత పని చేసింది’ అనుకుంటూ ఆలోచనల్లో ఉండగానే పోలీసులు అతడి చేతులకు బేడీలు వేసి తీసుకుపోయారు. చదవండి, చదివించండి : అయ్యో పాపం! క్యాబిన్లో ఇరుక్కుపోయి ఆర్తనాదాలు.. -
నిద్రపోతున్న మహిళను చనిపోయిందనుకుని..
ఎయిర్ పోర్టు లాన్లో ప్రశాంతంగా నిద్రపోతున్న మహిళను చనిపోయిందని భావించి సెక్కూరిటీ సిబ్బందికి ఫోన్ చేశాడు ఓ వ్యక్తి. దీంతో ఆమె నిద్ర అక్కడి ప్రయాణికులను భయాందోళనలకు గురిచేసింది. వివరాల్లోకి వెళితే.. లారా అనే టిక్ టాక్ యూజర్ ఎయిర్ పోర్టు ట్రావెలింగ్కు సంబంధించిన తన అనుభవాలను వీడియోలు చేసి తన టిక్ టాక్ ఖాతాలో పోస్ట్ చేస్తుంటారు. కొన్నేళ్ల క్రితం తనకు ఎదురైన ఓ అనుభవాన్నితాజాగా వీడియో తీసి పోస్ట్ చేశారామె. ఆ వీడియోలో.. ‘‘ఊబర్ లాంటి క్యాబ్ సర్వీసులు లేని సమయం అది. నేను తెల్లవారుజామున 4 గంటలకు లోకల్ బస్లో ఎయిర్ పోర్టుకు వెళ్లాను. 5.30 గంటల ప్రాంతంలో ఎయిర్పోర్టులోకి చేరుకున్నాను. నా ఫ్లైట్ 7 గంటలకు ఉంది. బాగా ఎక్కువ ఖాళీ సమయం ఉండే సరికి అక్కడే లాన్లో పడుకున్నాను. ఎక్కువ సేపు కదలకుండా పడుకునే సరికి.. నా పక్కనున్న వ్యక్తి నేను చనిపోయాననుకున్నాడు. వెంటనే సెక్కూరిటీని అక్కడికి పిలిచాడు. కొంతమంది జనం చుట్టూ చేరారు. నా కేమైందో అని ఆదుర్ధుగా చూస్తున్నారు. సెక్కూరిటీ వాళ్లు నన్ను తట్టి లేపారు. పైకి లేచాను. అక్కడి వాళ్లంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నారు’’ అని చెప్పుకొచ్చింది. చదవండి : ఫ్రిజ్లో ఎలా కూర్చున్నాడబ్బా?! పూనమ్ అందాల విందు.. అదిరిన కాజల్ పరువాలు -
మంచి నిద్రతో గుండెపోటు దూరం
నిద్రకూ గుండెపోటు నివారణకూ సంబంధం ఉంది. నిద్రకు సంబంధించిన కొన్ని జాగ్రత్తల తో గుండెపోటును ఇలా నివారించుకోవచ్చు. ►మరీ తక్కువ నిద్రపోవడం గుండెకు మంచిది కాదు. మరీ ఎక్కువ నిద్రపోవడం డిప్రెషన్కు సూచిక. ►మధ్యాహ్నం పూట తీసే చిన్న నిద్ర గుండెకూ, మెదడుకూ మంచిది. భోజనం తర్వాత ఓ చిన్న కునుకు తీయడం వల్ల మీ సామర్థ్యం, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. ►తక్కువ నిద్రపోయేవారిలో రక్తపోటు పెరిగే అవకాశాలు ఎక్కువ. తగినంత నిద్రపోయేవారితో పోలిస్తే తక్కువ నిద్రపోయేవారు 70 శాతం ఎక్కువగా జబ్బుపడతారు. ►నిద్రలేమి ఉండేవారిలో మిగతావారితో పోలిస్తే కనీసం 25% మెదడు సామర్థ్యం తక్కువ ఉంటుంది. ►నిద్రలేకపోవడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల నిద్ర అవసరం. -
నిద్రపోతూ రూ.10 లక్షలు గెలుచుకోండి!
న్యూఢిల్లీ : రోజూ పొద్దెక్కే వరకు నిద్రపోతున్న మనల్ని ‘‘ బొట్టు సంపాదన లేదు.. దమ్మిడి ఆదాయం లేదు’’ అని ఇంట్లో పెద్దోలు తిట్టినపుడు.. నిద్రలేవటానికి బాధపడి.. కష్టంగా కళ్లు తెరిచి, ఒళ్లు విరిచి పైకి లేచి.. ‘‘ అరే! నిద్రపోవటానికి కూడా ఎవరైనా డబ్బులిస్తే బాగుండు. హాయిగా నిద్రపోతూ డబ్బులు సంపాదించవచ్చు’’ అనుకుని ఉంటాం. అలాంటి వారి కోసమే ఓ అద్భుతమైన అవకాశం వచ్చింది. 100 రోజుల పాటు రోజూ 9 గంటలు హాయిగా నిద్రపోతే 10 లక్షల రూపాయలు మీ సొంతం అవుతాయి. మీరు చేయాల్సిందల్లా ‘‘ వేక్ ఫిట్ వారి బ్యాచ్ 2021-22 స్లీప్ ఇంటర్న్షిప్లో పాల్గొనటమే.. నిద్రపోతూ కూడా డబ్బులు సంపాదించాలనుకునేవారి కోసం ఇదో అత్యున్నతమైన ఉపాది అవకాశం. ఈ ఇంటర్న్షిప్లో పాల్గొనే వారు 100 రోజుల పాటు ప్రతి రోజూ 9 గంటలు ఎలాంటి ఆటంకం లేకుండా, హాయిగా నిద్రపోవాలి. మొదట ఈ ఇంటర్న్షిప్కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అత్యుత్తమంగా నిద్రపోయే కొంతమందిని ఎంపిక చేసి 100 రోజుల ఇంటర్న్షిప్కు అర్హుల్ని చేస్తారు. ఎంపికైన ప్రతీ ఒక్కరికి లక్ష రూపాయలు అందుతాయి. గెలిచినవారికి మాత్రమే 10 లక్షల రూపాయలు సొంతం అవుతాయి. మీరు ఈ ఇంటర్న్షిప్లో భాగం కావాలనుకుంటే https://wakefit.co/sleepintern/ను సందర్శించండి. ఒకటికి రెండు సార్లు పూర్తి వివరాలు.. టర్మ్స్ అండ్ కండీషన్స్ చదివి కాంపిటీషన్కు దరఖాస్తు చేసుకోండి. -
2021లో బాగుండాలంటే.. ఈ 5 మార్చుకోండి!
2020 ప్రతి ఒక్కరి జీవితాల మీద ఎంతో ప్రభావాన్ని చూపించింది. ఊహించని మార్పులు తీసుకొచ్చింది. వేడుకలు దూరమయ్యాయి... ఇళ్లు ఆఫీసయ్యింది. సినిమాలు లేవు.. షికార్లు లేవు. మన జీవిన విధానంలో కూడా ఎన్నో మార్పులు వచ్చాయి. చాలా వరకు బయటి తిండి తగ్గించాము. ఇంటి భోజనానికి అందులోనూ.. ఆరోగ్యకరమైన ఆహారానికి ఎక్కువ ప్రాధాన్యత పెరిగింది. ఇవి మంచి విషయాలైతే.. లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితం కావడం.. చాలా కంపెనీలు ఉద్యోగుల్ని తొలగించడం వంటి సంఘటనలతో ఒత్తిడి, ఆందోళన పెరిగాయి. చాలా మందిలో మానసిక కుంగుబాటు ఎక్కువయ్యింది. మరి కొద్ది రోజుల్లో 2020కి ముగింపు పలకబోతున్నాం. ఇక 2021లో మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ఈ ఐదు అలవాట్లను తప్పక మార్చుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. అవేంటో చూడండి.. మీలో కూడా ఈ లక్షణాలు ఉంటే మార్చుకుని వచ్చే ఏడాదిని సంతోషంగా గడపండి... ఫీలింగ్స్ని అణిచవేసుకుంటున్నాం.. దాదాపు ఈ ఏడాది ప్రతి ఒక్కరు ఈ పరిస్థితిని అనుభవించారు. మన ఎమోషన్స్ని కావాలని ఇగ్నోర్ చేసే పరిస్థితులను 2020లో ఎదుర్కొన్నాం. అయితే ఇలా ఫీలింగ్స్ని అణిచివేసుకోవడం మంచిదేనా అంటే.. కాదని అంటున్నారు నిపుణులు. అవసరానికి తగ్గట్లు ప్రస్తుతం మన భావాల్ని అణచివేసుకుంటూ పోతే భవిష్యత్తులో అది మన మానసిక ఆరోగ్యం మీద తీవ్ర ప్రభావం చూపుతుంది అంటున్నారు. ఫీలింగ్స్ని అణిచి వేసుకోవడం వల్ల మనల్ని మనం తక్కువ అంచనా వేసుకోవడమే కాక మైగ్రేన్, హై బీపీ వంటి అనారోగ్యాల బారిన పడతామంటున్నారు. ఈ క్రమంలో డ్రగ్స్, ఆల్కహాల్ వంటి చెడు వ్యసనాలకు బానిసవుతామని హెచ్చరిస్తున్నారు. కనుక దగ్గరి వాళ్లతో మన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవడం.. లేదంటే ఓ పేపర్ మీద రాసుకుని.. ఆ పరిస్థితుల గురించి మనకు మనమే విశ్లేషించుకోవడం బెటర్ అంటున్నారు నిపుణులు. ఇవేవి కాదంటే థెరపిస్ట్ని కలవమని సూచిస్తున్నారు. (చదవండి: న్యూ ఇయర్ నిర్ణయాలు కొనసాగాలంటే) అధిక ఒత్తిడి భరిస్తున్నాం.. మనం ఎదుర్కొనే సగం అనారోగ్యాలకి మూల కారణం ఒత్తిడికి గురవ్వడం. ఆందోళనని బయటకు వెళ్లడించడం ఎంతో మంచిది. ఇక మన బుర్రలో నడిచే విషయాల గురించి పట్టించుకోకపోతే.. వాటిని విశ్లేషించి ఓ కొలిక్కి రాకపోతే.. ఒత్తిడి పీక్స్కి వెళ్తుంది. దాంతో మన మెదడు కార్టిసాల్ అనే ఒక స్టెరాయిడ్ హార్మోన్ విడుదల చేస్తుంది. సాధారణంగా కార్టిసాల్ పని ఏంటంటే ఇది మన జీవక్రియ రోగనిరోధక ప్రతిస్పందనతో సహా శరీరమంతా విస్తృతమైన ప్రక్రియలను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ ఎక్కువ మొత్తంలో విడుదల అయితే.. ఇది మెదడు పని తీరును అడ్డుకుంటుంది. దాంతో రోజువారి జీవిన విధానం పూర్తిగా దెబ్బ తింటుంది. కనుక ఒత్తిడి లేవల్స్ పెరిగినప్పుడు తప్పకుండా బ్రేక్ తీసుకొండి. దాన్ని జయించడానికి ప్రతిరోజు యోగా, ధ్యానం చేయడం అలవాటు చేసుకొండి. తీవ్రమైన ఆలోచనల నుంచి బయటపడేందుకు మీ మనసుకు నచ్చే పనులు చేయడం మంచిది అంటున్నారు నిపుణులు. తగినంత నిద్ర పోవడం లేదు... దురదృష్టవశాత్తు.. గత కొద్దేళ్లుగా మన నిద్ర అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. ఇది అనారోగ్యకరమైన పద్ధతి అని తెలిసినప్పటికి మార్చుకోలేకపోతున్నాం. మంచి మానసిక ఆరోగ్యం కోసం ప్రతిరోజూ ఎనిమిది గంటల నిద్ర పొందడం చాలా ముఖ్యం. వాస్తవానికి, ది స్లీప్ హెల్త్ ఫౌండేషన్ చేసిన పరిశోధనలో 60 నుంచి 90 శాతం మంది రోగులు నిద్రలేమితో బాధపడుతున్నా వారే అని తెలిపింది. ఒక్క రోజు సరిగా నిద్రపోకపోతేనే.. ఆ రోజంతా ఏదోలా ఉంటుంది. గందరగోళంగా అనిపిస్తుంది. ఈ అలవాటు ఇలానే కొనసాగితే.. ఇది దీర్ఘకాలంలో మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక రాబోయే సంవత్సరంలో నిద్రకు ప్రాధాన్యతనివ్వండి. మీరు బాగా విశ్రాంతి తీసుకోకపోతే, మీ మనస్సు సరిగా పనిచేయదు, ఇది అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది. (చదవండి: ఆనందారోగ్యాలకు పది సూత్రాలు) తగినంత వ్యాయామం లేదు.. మన శారీరక ఆరోగ్యానికి వ్యాయామం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. అయితే ఇది మన మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుందని మీకు తెలుసా. ఎక్సర్సైజ్ విషయంలో 2020 మమ్మల్ని మరింత బద్దకస్తులుగా మార్చింది. లేచిన దగ్గర నుంచి చాలా మంది మొబైల్ స్క్రీన్లు, కంప్యూటర్లకు అతుక్కుపోయారు. సామాజిక దూరం కారణంగా వ్యాయమాన్ని నిర్లక్ష్యం చేశాము. ఇక రాబోయే సంవత్సరంలో ఈ అలవాటును తప్పక మార్చాల్సిందే. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది ఎండార్ఫిన్లను విడుదల చేయడంలో సహాయపడుతుంది. మనకు మంచి అనుభూతిని కలిగిస్తుంది. మయోక్లినిక్ విడుదల చేసిన ఒక కథనం ప్రకారం, వ్యాయామం “ఫీల్-గుడ్ ఎండార్ఫిన్లు, సహజ గంజాయి లాంటి మెదడు రసాయనాలు (ఎండోజెనస్ కానబినాయిడ్స్), ఇతర సహజ మెదడు రసాయనాలను విడుదల చేస్తుంది. ఇవి మనల్ని మానసికంగా సంతోషంగా ఉంచుతాయి”. జిమ్కు వెళ్లడం మరి కొద్ది రోజులు వీలుపడక పోవచ్చు. కానీ వాకింగ్ చేయడం ఒకే కదా. ప్రయత్నించండి.. 21 రోజుల తర్వాత ఎలా ఉందో పరిశీలించండి. 24 గంటలు సోషల్ మీడియానే లోకం.. 2020 మనల్ని సోషల్ మీడియాకు మరింత బానిసల్ని చేసింది. లాక్డౌన్ కారణంగా చాలా రోజుల పాలు అందరూ ఇళ్లకే పరిమితం కావడంతో ఏం చేయాలో పాలుపోక స్క్రోలింగ్ చేయడం, సెల్ఫీలు పోస్ట్ చేయడం, రోజంతా మీమ్స్ను సర్చ్ చేయడం వంటివి చేస్తూ టైం పాస్ చేశారు. సోషల్ ప్లాట్ఫామ్లపై కొంత సమయం గడపడం మంచిదే. కానీ ప్రతి ఐదు నిమిషాలకోసారి ఎఫ్బీ, ఇన్స్టాగ్రామ్ను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలనే కోరిక ఉంటే, మీ సమస్య తీవ్రమైనట్లే. ఇది మీ మానసిక ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. మొబైల్కే అతుక్కపోవడం వల్ల శారీరక ఆతోగ్యం కూడా దెబ్బతింటుంది. కష్టమైనా సరే ఈ ఏడాది సోషల్ మీడియా వాడకాన్ని తగ్గిద్దాం అని నిర్ణయం తీసుకొండి. ఆ సమయాన్ని మీలోని సృజనాత్మకతకు మెరుగులు దిద్దుకునేందుకు.. కుటుంబంతో గడిపేందుకు.. ఇష్టమైన వ్యాపకాలను కొనసాగించడానికి వినియోగించండి. ఆ తర్వాత మీరే అద్భుతః అంటారు. (చదవండి: మోదీ ఎలా యాక్టివ్గా ఉంటున్నారు ?) -
కోపంగా ఉన్నారా.. ఈ సమస్య ఉన్నట్లే
న్యూఢిల్లీ: మన శరీర నిర్మాణ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే వేళకు నిద్రిపోవడం ఎంతో అవసరం. ఎన్ని కోట్లున్న నిద్ర కరువయితే జీవితం వ్యర్థం అనే విషయం అందరికి తెలిసిందే. ప్రస్తుత పోటీ ప్రపంచంలో నిద్ర కరువయి, చాలా మంది సతమవుతున్నారు. కాగా ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల నుంచి 9గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అని డాక్టర్ శ్రేయా గుప్తా చెబుతున్నారు. ఆమె నిద్ర అవసరాన్ని వివరించారు. మనం నాణ్యమైన నిద్ర పోగలితే హార్మోన్లు, గుండె, మెదడు తదితర అవయవాలలో రోగనిరోధక శక్తి పెరిగి మరుసటి రోజు ఉత్సాహంగా ఉంటామని డాక్టర్ చెబుతున్నారు. కాగా ఏకారణంతోనైన సరియైన నిద్ర పోనప్పుడు విపరీతమైన కోపం, ఓపిక లేకపోవడం, భావోద్వేగ నియంత్రణ కోల్పోవడం తదితర చెడు సంఘటనలు జరిగే అవకాశం ఉంది. నిద్ర సరిగ్గా లేకపోతే మెదడులో కీలకంగా ఉన్న ‘అమిగ్డాలా’ అనే రసాయన పనితనం మందగిస్తుందని ఇటీవలే జర్నల్ ఆఫ్ రీసెర్చ్ తెలిపింది. కోపానికి, నిద్రకు సంబంధం ఉన్నట్లు ఆధారాలతో నిరూపించింది. నిద్ర సమస్యలను అధిగమించాలంటే పౌష్టికాహారం, వ్యాయాయం, మానసిక ప్రశాంతత మూడు కచ్చితంగా పాటించాలని డాక్టర్ ప్రజలకు సూచిస్తున్నారు. -
జూమ్ క్లాస్లో ఈ పిల్లాడేం చేశాడో తెలుసా?
కరోనా అన్నింటినీ మార్చేసింది. తినే తిండినీ, మనిషి నడతను, నడవడికను పూర్తిగా మార్చివేసింది. ఆఫీసు గదుల్లో కంప్యూటర్తో కుస్తీ పట్టేవాళ్లు ఇప్పుడు ఇంట్లోనే పని చేస్తున్నారు. ఒక ఇంట్లోనే ఉన్నా కూడా ఒకరి మొహాలు మరొకరు చూసుకోవడమే గగనమైపోయిన నగరవాసులు ఇప్పుడు ఇంటిల్లిపాది కలిసి ముచ్చట్లాడుతూ భోజనం చేస్తున్నారు. ఇక ఈ సమయానికల్లా మొదలవాల్సిన పాఠశాలలు, కాలేజీలు మాత్రం ఇంకా మూతపడే ఉన్నాయి. కానీ ఆన్లైన్లో మాత్రం పిల్లలకు క్లాసులు జరుగుతున్నాయి. (‘యాపిల్’లో లోపం కనిపెట్టి.. జాక్పాట్!) ఈ నేపథ్యంలో నిద్రిస్తే లేపే స్నేహితుడు లేక, నిద్రను ఆపుకోలేక ఓ బుడ్డోడు జూమ్లో నిర్వహించిన క్లాసులోనే నిద్రపోయాడు. ఎంతలా అంటే కుర్చీనే పరుపుగా భావిస్తూ వెల్లకిలా పడుకుండిపోయాడు. అయితే అటువైపు టీచర్ మాత్రం 40 నిమిషాలు పాఠాలు చెప్తూనే ఉంది. ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కారణం ప్రస్తుతం ఇది అందరి జీవనానికి నిదర్శనంగా కనిపిస్తోంది. నిద్రను మించిన పని లేదంటూ అనేకమంది బెడ్డుకే పరిమితమవుతూ మరింత బద్ధకస్తులవుతున్నారు. 2020 మొత్తం ఇలాగే గడిచిపోయేలా ఉందని కామెంట్లు చేస్తున్నారు. (మూగజీవిని చితకబాది సెల్ఫీలు తీశారు..) -
మనం నిద్రిస్తే కరోనా కూడా నిద్రిస్తుందట!
కరాచీ: ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచ దేశాలను కుదిపేస్తోంది. తొలుత భారత్లో నమోదైన కేసుల సంఖ్య లాక్డౌన్ సడలింపులతో విపరీతంగా పెరిగిపోయింది. అటు పొరుగు దేశమైన పాకిస్తాన్ కరోనాను ఎదుర్కోలేక పతనమవుతున్న ఆర్థిక వ్యవస్థతో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలో అక్కడ ఓ రాజకీయ నాయకుడు వైరస్పై విచిత్ర వ్యాఖ్యలు చేశారు. "నువ్వు ఎంతసేపు పడుకుంటే కరోనా అంతసేపు నిద్రిస్తుంది. మనం చనిపోతే కరోనా చనిపోతుంది. అంతే.. " (పాకిస్తాన్ మాజీ ప్రధానికి కరోనా పాజిటివ్) "నిద్రించే సమయంలో వైరస్ ఎలాంటి హాని చేయదు. పైగా వైరస్ వ్యాప్తిని నిరోధించడానికి ఎక్కువ గంటలు నిద్రపోవాలని వైద్యులు సూచిస్తున్నారు" అంటూ పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీ సభ్యుడు ఫజల్ ఉర్ రెహ్మాన్ పేర్కొన్నారు.. ఈ వీడియోను పాక్ జర్నలిస్టు నైలా ఇనాయత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్గా మారింది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. "అవును, ఈ మాటలు వింటే కరోనా నిజంగానే చనిపోతుంది" అంటూ కామెంట్లు చేస్తున్నారు. "ఇంతకీ పరిష్కారం ఏంటంటారు? ఇప్పుడు మనం నిద్రపోవాలా? చచ్చిపోవాలా?" అని వ్యంగ్యంగా ప్రశ్నించారు. (రూ. 75 వేలకు ఆర్మీ సమాచారం అమ్మేశారు!) -
కరోనా నిరోధక శక్తికి ‘నిద్ర’ ముఖ్యం
న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోనా వైరస్ బారిన పడకుండా ఉండేందుకు వ్యాక్సిన్గానీ, పడితే ప్రాణాలను కాపాడేందుకు తగిన మందులుగానీ ఇంతవరకు అందుబాటులో లేవు. కనుక పడకుండా ఉండేందుకు పరిశుభ్రత ఎలా ఏకైక మార్గమో, పడితే మన శరీరంలోని రోగ నిరోధక శక్తియే మనల్ని కాపాడాలి. మనలో రోగ నిరోధక శక్తి పెరగాలంటే అన్ని విటమిన్లకు సంబంధించిన పండ్లు, కూరగాయలు తినాలని మన వైద్యులు చెబుతూ వస్తున్నారు. కానీ ఎన్నితిన్నా వేళకు సరైన నిద్ర లేకపోతే రోగ నిరోధక శక్తి శక్తివంతంగా పని చేయదట. ఈ విషయాన్ని అమెరికాలోని జాతీయ ఆరోగ్య సంస్థ ఇటీవల ఓ అంతర్జాతీయ సమావేశాన్ని ఏర్పాటు చేసి మరీ చెప్పింది. మన శరీరమంతా బయటి నుంచి దాడిచేసే మైక్రోబ్స్ను ఎదుర్కొనేలా నిర్మాణమై ఉంది. అణువులతో కూడా మన శరీరంపైనుండే చర్మం భిగించినట్లుగా ఉండి శరీరంలోకి బ్యాక్టీరియా, వైరస్ లాంటి మైక్రోబ్స్ను చొరపడకుండా అడ్డుకుంటుంది. అందుకు అనువుగా చర్మం వెలుపలి పొరలో ‘డెడ్ సెల్స్’ ఉంటాయి. కనుక కళ్లు, ముక్కు, నోరు ద్వారా మైక్రోబ్స్ శరీరంలోకి చొరబడేందుకు ప్రయత్నిస్తాయి. కళ్లలో ఓ దశ వరకు యాంటీసెప్టిక్ కన్నీళ్లు మైక్రోబ్స్ను అడ్డుకుంటాయి. ముక్కు, కాలేయంలో ఏర్పడే శ్లేష్మం కూడా వాటికి ఓ దశ వరకు అడ్డుకుంటాయి. కాలేయంలో తయారయ్యే శ్లేష్మం ముక్కు ద్వారా తుమ్ముల రూపంలో బయటకు వేగంగా వస్తుంది. శ్లేష్మం తుంపర్ల ద్వారా మైక్రోబ్స్ మన శరీరం నుంచి బయటకు వస్తాయి. ఈ ప్రక్రియను కూడా తట్టుకొని కొన్ని వైరస్లు మన శరీర జన్యువుల్లోకి ప్రవేశిస్తాయి. వాటిని మన రక్తంలోని యాంటీ బాడీస్ (రోగ నిరోధక శక్తి) గుర్తించి చంపేస్తాయి. మొట్టమొదటగా ‘బి–లింపోసైట్స్’గా పిలిచే కొన్ని తెల్ల రక్త కణాల గుంపు మైక్రోబ్స్ను ఎదుర్కొనేందుకు యాంటీ బాడీస్ సృష్టికి సంకేతాలు పంపిస్తాయి. అప్పుడు టీ–సెల్స్గా పిలిచే రక్తంలోకి మరికొన్ని తెల్ల రక్తకణాలు వైరస్ మీద దాడి చేస్తాయి. రసాయనిక సంకేతాలు పంపడం ద్వారా ఇవి మైక్రోబ్స్ను నాశనం చే స్తాయి. మైక్రోబ్స్ను ఎదుర్కోవడంలో భాగంగా అభివృద్ధి చెందిన యాంటీ బాడీస్ రక్తంలోని ప్లాస్మాలో కొన్ని సంవత్సరాలపాటు మనుగడ సాగిస్తాయి. యాంటీ బాడీస్ వల్ల నాశనం కాకుండా బతికే మైక్రోబ్స్ వల్లనే అంటురోగాలు వస్తాయి. (ఈ ఏడాది చివరికల్లా టీకా!) చర్మం దగ్గరి నుంచి రక్తంలోని యాంటీ బాడీస్ వరకు అన్ని రోగ లేదా మైక్రోబ్స్ నిరోధక వ్యవస్థలు సక్రమంగా పని చేయాలంటే జీవ గడియారం (బయాలోజికల్ క్లాక్) సరిగ్గా పని చేయాలని, అందులో నిద్ర అతి ముఖ్యమైనదని అమెరికా జాతీయ ఆరోగ్య సంస్థ నిపుణులు తెలియజేశారు. ఏ వేళకు తినాలి, ఏ వేళకు నిద్రపోవాలి, ఏ వేళకు నిద్ర లేవలనే ప్రక్రియలను నిర్దేశించేదే జీవ గడియారం. ఈ జీవ గడియారం సక్రమంగా నడవాలన్నదే నిద్రనే ముఖ్యం. (చైనా కంటే ముందే ఆ దేశంలో కరోనా వైరస్!?) -
మంచి అలారం శబ్దం ఏదంటే...
మెల్బోర్న్ : గణ గణమని గంటకొట్టినట్లు అలారమ్ మోగినా, బీప్....బీప్ మని శబ్దం చేసినా నిద్ర నుంచి మేల్కోవచ్చు. వాటి శబ్దాలకు లేచిన వారు విసుక్కుంటూనో, గొనుక్కుంటూనో అలారమ్ ఆపేసి మళ్లీ పడుకుంటారు. లేదా అలారం మూగబోయేదాకా ముసుగు తన్ని పడుకుంటారు. అదే మనకిష్టమైన శ్రావ్యమైన పాటనో, సంగీతాన్నో అలారంగా పెట్టుకుంటే త్వరగా లేచి పోతాం. చురుగ్గా కూడా ఉంటాం. దీనికి కారణాలు కనుగొనేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలోని ‘రాయల్ మెల్బోర్న్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ’ పరిశోధకులు 50 మంది పై అధ్యయనం చేసి రహస్యాన్ని ఛేదించారు. ఇష్టంలేని అలారమ్ శబ్దాన్ని విన్నప్పుడు నిద్రలో ఉన్న మనుషుల మెదడు గందరగోళానికి గురవుతుందట. అదే శ్రావ్యమైన పాటను విన్నప్పుడు మెదడు ఎలాంటి గందరగోళానికి గురికాకుండా మెల్లగా ఆ పాటను వినడం కోసం మనల్ని చేతనావస్థలోకి తీసుకొస్తుందని ఆ అధ్యయనంలో పాల్గొన్న అసోసియేట్ ప్రొఫెసర్ ఆండ్రియాన్ డయ్యర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. పని ఒత్తిడి కారణంగా ఇష్టంలేని అలారం శబ్దానికి తప్పనిసరై లేచినా ఆ రోజు పని చేస్తున్నంత సేపు చీకాకుగానే ఉంటుందట. అదే ఇష్టమైన శబ్దానికి నిద్ర లేచినట్లయితే పనులను కూడా చురుగ్గా చేసుకుపోతామట. ఇదంతా మెదడు మాయని ఆయన చెప్పారు. ఇష్టమైన పాటలు వింటూ మెల్లగా నిద్రలోకి జారుకోవడం అందరికి తెలిసిందే. అలాగే మనకిష్టమైన పాటను అలారంగా పెట్టుకుంటే మెల్లగా నిద్రలేస్తాం, చురుగ్గా ఉంటాం. -
నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్కు రండి
ఆ బాలిక పేరు మానస. నిండా 13 ఏళ్లు కూడా లేవు. ఆమెకు ఆరోగ్య సమస్యలేమీ లేవు. కానీ.. ఎంత ప్రయత్నించినా నిద్ర రాదు. చాలామంది డాక్టర్లకు చూపించారు. నిద్ర మత్తు ఆవహించే మందుల్ని కూడా ఇచ్చారు. అయినా ప్రయోజనం లేకపోయింది. ఎవరో చెబితే.. తల్లిదండ్రులు ఆమెను గుంటూరులోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి న్యూరాలజీ విభాగంలో చూపించగా.. అక్కడి స్లీప్ ల్యాబ్లో రాత్రంతా ఉంచి పరీక్షలు చేశారు. చదువుల ఒత్తిడి వల్లే బాలిక నిద్రపోవటం లేదనే విషయాన్ని వైద్యులు నిర్థారించి.. కంటి నిద్ర రావటానికి వీలుగా తగిన సూచనలిచ్చారు. వినటానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది ముమ్మాటికీ నిజం. గుంటూరు (మెడికల్) సాధారణంగా వయసు మీరిన వారికి నిద్ర పట్టదని అనుకుంటారు. కానీ.. చిన్న పిల్లలూ, యువకులు సైతం నిద్రలేమితో బాధపడుతున్నారు. ఆధునిక జీవన శైలి, స్మార్ట్ ఫోన్స్ యుగంలో ప్రతి ఒక్కరూ కాలంతో పరుగులు తీస్తుండటం వల్ల పాఠశాల విద్యార్థి మొదలుకుని పెద్దవారి వరకు అనేక మంది నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని.. లేనిపక్షంలో అనేక అనర్థాలు తలెత్తుతాయని వైద్య నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల నడుమ నిద్రలేమి సమస్యతో బాధపడుతున్న ఎందరికో పరిష్కారాన్ని చూపిస్తోంది గుంటూరులోని ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి (జీజీహెచ్). తొలి ఆస్పత్రిగా రికార్డు ‘మీకు నిద్ర పట్టడం లేదా.. అయితే గుంటూరు జీజీహెచ్కు రండి’ అని ఆహ్వానిస్తున్నారు అక్కడి వైద్యులు. నిద్ర పట్టకపోవటానికి గల కారణాలను వైద్య పరీక్షల ద్వారా తెలుసుకుని హాయిగా నిద్రపోయేందుకు అవసరమైన వైద్యాన్ని జీజీహెచ్ డాక్టర్లు అందిస్తున్నారు. ఇక్కడి న్యూరాలజీ వైద్య విభాగంలో నిద్ర ప్రయోగ శాల (స్లీప్ ల్యాబ్)ను దాతల సాయంతో ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్లీప్ ల్యాబ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి రికార్డు సృష్టించింది. నాట్కో ఫార్మా కంపెనీ చైర్మన్ నన్నపనేని వెంకయ్యచౌదరి ఇక్కడి ల్యాబ్కు అవసరమైన వైద్య పరికరాల కొనుగోలుకు రూ.20 లక్షల ఆర్థిక సాయం చేశారు. నిద్ర సమస్యలకు చెక్ పెట్టొచ్చు తగినంత నిద్ర లేకపోతే ఏకాగ్రత లోపించడం, సకాలంలో నిర్ణయం తీసుకోలేకపోవడం, నిరాశ, నిస్సత్తువ, నీరసం, విసుగు, తలనొప్పి, ఇతర రుగ్మతలు తలెత్తుతాయి. నిద్రలేమితో బాధపడేవారు శారీరక, మానసిక పటుత్వాన్ని కోల్పోతారు. ఉద్విగ్నతలకు లోనవుతారు. మనిషి రోజుకు కనీసం 8 గంటలు నిద్రపోని పక్షంలో పై రుగ్మతలతో పాటు గుండెపోటు సైతం వచ్చే అవకాశాలు ఉన్నట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాఫీ, టీ ఎక్కువగా తీసుకునే వారిలో కూడా నిద్రపట్టదు. ఊబకాయంతో ఉన్నవారు సైతం రాత్రిళ్లు నిద్రపట్టక గురక సమస్యతో నిద్రాభంగమై ఇబ్బంది పడతారని, నిద్రలో నడవడం, నిద్రలోనే సైకిల్ తొక్కినట్లు కాళ్లు కదిలించడం, ఫిట్స్ రావడం వల్ల నిద్రపోవటానికి భయపడతారని వైద్యులు వివరిస్తున్నారు. రుగ్మతల నిర్ధారణకు స్లీప్ల్యాబ్ ఈ రుగ్మతలు రావడానికి గల కారణాలు నిర్ధారించేందుకు స్లీప్ ల్యాబ్ ఉపయోగపడుతుంది. కొంతమంది రాత్రివేళలో నిద్రపోకుండా, పగటి పూట నిద్రిస్తుంటారు. దీనివల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ అనేకం ఉంటాయి. ఎలాంటి సమయాల్లో నిద్రపోవాలి, నిద్ర పోకపోతే ఎలాంటి అనర్థాలు తలెత్తుతాయనే విషయాలను స్లీప్ డిజార్డర్తో బాధపడేవారికి స్లీప్ ల్యాబ్లో వైద్య పరీక్షలు చేసి వివరిస్తున్నారు. నిద్రపట్టకపోవడానికి గల కారణాలు తెలుసుకోవడం ద్వారా సమస్యను త్వరితగతిన సులభంగా నయం చేయవచ్చని, అందుకోసం స్లీప్ ల్యాబ్ ఎంతగానో ఉపయోగపడుతుందని గుంటూరు జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి తెలిపారు. పరీక్షల విధానం ఇలా.. ఒక్కో వ్యక్తికి వైద్య పరీక్ష చేసేందుకు సుమారు 8 గంటలకు పైగా సమయం పడుతుంది. ► సుమారు 30 నుంచి 40 వరకు వైర్లను శరీరంలోని వివిధ భాగాలకు అతికిస్తారు. ► రాత్రి వేళల్లో సహజ సిద్ధంగా నిద్రించే సమయంలో ఈ పరీక్ష నిర్వహించటం ద్వారా కచ్చితమైన ఫలితాలు వస్తాయి. ► ఇక్కడి ల్యాబ్లో రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు పరీక్షలు చేస్తారు. – ఆస్పత్రి ఓపీ విభాగంలో మంగళ, గురు, శనివారం న్యూరాలజీ విభాగానికి వచ్చిన వారికి నిద్ర సమస్యలు ఉంటే స్లీప్ల్యాబ్లో పరీక్ష చేసి చికిత్స అందిస్తారు. ► వైద్య పరీక్షలు చేసే సమయంలో ప్రత్యేక శిక్షణ పొందిన న్యూరో టెక్నీషియన్తో పాటు ఒక డాక్టర్, రోగి అటెండెంట్ ఉంటారు. ► నిద్ర సమస్యలపై పరిశోధన చేసేందుకు ఒక పీజీ డాక్టర్ను ప్రత్యేకంగా నియమించారు. రెండేళ్లుగా ఉచిత పరీక్షలు స్లీప్ల్యాబ్ను 2017 జూలైలో ప్రారంభిం చినా వైద్య పరీక్షలు మాత్రం 2018 జనవరి నుంచి చేస్తున్నాం. 2018లో 47 మందికి, 2019 లో 40 మందికి స్లీప్ ల్యాబ్లో పరీక్షలు చేసి వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించాం. నిద్ర సమస్యలతో వచ్చే వారిలో మగవారే ఎక్కువగా ఉంటున్నారు. 13 ఏళ్ల నుంచి 20 ఏళ్లలోపు వారు కూడా నిద్ర సమస్యలతో బాధపడుతూ చికిత్స కోసం రావటం ఆందోళన కలిగిస్తోంది. ఎక్కువగా 40 ఏళ్ల నుంచి 60 ఏళ్ల వారు నిద్రలేమి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రాష్ట్రంలో కేవలం గుంటూరు జీజీహెచ్లో మాత్రమే నిద్రలేమి సమస్యలను నిర్ధారించే పాలిసోనోగ్రఫీ (పీసీజీ) పరీక్ష చేస్తున్నాం. సుమారు రూ.25 వేలు ఖర్చయ్యే ఈ పరీక్షను న్యూరాలజీ విభాగంలో ఉచితంగా చేస్తున్నాం. – డాక్టర్ నాగార్జునకొండ సుందరాచారి, విభాగాధిపతి, న్యూరాలజీ వైద్యం -
నాణ్యమైన నిద్రతోనే మెదడు హెల్దీ
మనకు కేవలం నాలుగు గంటల నిద్ర సరిపోతుందని కొందరు చెబుతుంటారు. ‘మత్తు వదలరా... నిద్దుర మత్తు వదలరా’ అని సినిమా పాట వినిపిస్తూ... చాలాసేపు నిద్రపోవడం బద్దకస్తుల లక్షణమనీ, అది తమోగుణం అని హితవు చెబుతుంటారు. కానీ ప్రతి ఒక్కరికీ కనీసం ఏడు గంటల సంతృప్తికరమైన, నాణ్యమైన నిద్ర అవసరం అంటున్నారు సింగపూర్ పరిశోధకలు,. అక్కడి డ్యూక్–ఎన్యూఎస్ గ్రాడ్యుయేట్ స్కూల్కు చెందిన పరిశోధకులు... కొందరు ఎంపిక చేసిన వ్యక్తుల మీద కొన్ని న్యూరోసైకలాజికల్ పరీక్షలు నిర్వహించారు. ఎమ్మారై బ్రెయిన్ స్కాన్లు తీశారు. ఆ ఎంపిక చేసిన వ్యక్తుల నిద్రపోయే సమయాన్నీ, నిద్ర నాణ్యతను రెండేళ్ల పాటు పరీక్షించాక కొన్ని విషయాలను తెలుసుకున్నారు. అదేమిటంటే... సాధారణంగా అందరిలోనూ వయసు పెరుగుతున్న కొద్దీ కొద్దీ మెదడు శక్తి క్షీణిస్తూ ఉంటుంది. అయితే ఏడు గంటల పాటు నాణ్యమైన నిద్రను అనుభవించేవారిలో ఇలా క్షీణించే ప్రక్రియ చాలా ఆలస్యంగా జరుగుతుంటుందనీ, దాంతో వారి మెదడు యవ్వనంలో ఉన్నప్పటిలాగే చాలాకాలం పాటు ఉంటుందని తేల్చారు. ఒకవేళ తగినంత నిద్రలేకపోతే వయసు పైబడకముందే మెదడుకు ఏజింగ్ ప్రక్రియ త్వరత్వరగా జరిగి మెదడుకు వృద్ధాప్యం కాస్త త్వరత్వరగా వస్తుందని హెచ్చరించారు. ఈ పరిశోధన ఫలితాలు ‘స్లీప్’ అనే మెడికల్ జర్నల్లోనూ ప్రచురితమయ్యాయి. -
ఆలస్యపు నిద్రతో అనారోగ్యం!
న్యూయార్క్: ఆలస్యం.. అమృతం.. విషం.. అంటారు. అయితే నిద్రపోయే విషయంలో ఆలస్యం అమృతం కానేకాదని.. కచ్చితంగా విషమేనని అంటోంది తాజా అధ్యయనం. ప్రత్యేకించి టీనేజ్ అమ్మాయిల బరువు పెరుగుదల విషయంలో ఇది అక్షరాలా నిజమని పేర్కొంది. ఆలస్యంగా నిద్రపోయే అమ్మాయిల్లో బరువు పెరిగే ప్రమాదం అధికమని తేల్చి చెప్పింది. న్యూయార్క్లో జరిపిన ఈ అధ్యయన ఫలితాలు ఇటీవల జామా పీడియాట్రిక్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా 11 నుంచి 16 ఏళ్లలోపు వయసున్న 418 మంది బాలికలు, 386 మంది మగపిల్లలను ప్రశ్నించారు. నిద్రకు సంబంధించిన అలవాట్లను రికార్డు చేసే ఎలక్ట్రానిక్ పరికరాన్ని పిల్లల చేతి మణికట్టుపై అధ్యయన కాలంలో ధరించారని అమెరికాలోని ఆరోగ్య సంస్థ కైసర్ పర్మనెంట్ పరిశోధకులు తెలిపారు. అనంతరం డ్యూయల్ ఎక్స్రే అబ్సార్ప్షియోమెట్రీ విధానాన్ని ఉపయోగించి పిల్లల శరీరంలోని కొవ్వు నిష్పత్తిని కొలిచారు. అదేవిధంగా పిల్లల నడుము పరిమాణాన్ని రికార్డు చేశారు. వీటితో పిల్లల సోషల్ మీడియా వాడటం వల్ల వారంపాటు నిద్రపోయే సమయంలోనూ, వారాంతాల్లో నిద్రపోయే సమయంలోనూ తేడాని సైతం గమనించారు. వారం రోజుల్లో కన్నా, వారాంతంలో ఆలస్యంగా నిద్రిసున్న వారిలో సామాజిక మాద్యమాల వాడకం వల్ల వచ్చే బద్ధకం (సోషల్ జెట్లాగ్) ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ప్రధానంగా ఆలస్యంగా నిద్రకు ఉపక్రమించే యుక్తవయసు బాలికల నడుము చుట్టుకొలతలు 0.58 సెంటీమీటర్లు అధికంగా ఉన్నాయని, వారి శరీరంలో 0.16 కిలోగ్రాముల కొవ్వుపెరిగినట్లు అధ్యయనంలో తేలింది. గంట గంటకీ పెరిగే కొవ్వు.. ప్రతి గంట సోషల్ జెట్లాగ్ కారణంగా యుక్తవయసు బాలికల్లో 1.19 సెంటీమీటర్ల మేర నడుము కొలత, శరీరంలోని కొవ్వు 0.45 కిలోగ్రాములు పెరుగుతున్నట్టు వెల్లడైంది. బరువు పెరుగుదలకు కారణమయ్యే ఇతర అంశాలైన నిద్రించే సమయం, తీసుకునే ఆహారం, శారీరక శ్రమ, టీవీ చూసే సమయం తదితర అంశాలను వేరుచేసినప్పటికీ నడుము కొలతల్లోనూ, కొవ్వు శాతంలోనూ తేడా అలాగే కొనసాగినట్లు తేలింది. అయితే అబ్బాయిల్లో సైతం కొన్ని తేడాలు గమనించినప్పటికీ అవి అంతగా చెప్పుకోదగినవి కావని వెల్లడించింది. అందుకే నిర్దిష్టంగా నిద్రపోవడం వల్ల బాల్యంలోనూ, యవ్వనంలోనూ వచ్చే స్థూలకాయాన్ని నివారించవచ్చని అధ్యయనకారులు సూచిస్తున్నారు. -
నిద్ర అలవాట్లలో తేడా వస్తే...
వేళకింత తిని.. పడుకోవాలని పెద్దలు అంటూంటే.. వారిదంతా చాదస్తం అని యువతరం కొట్టిపారేస్తూంటుంది. కానీ.. బ్రైగమ్ అండ్ విమన్స్ హాస్పిటల్ శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనం ప్రకారం.. నిద్ర అలవాట్లలో వచ్చే తేడాలు ఊబకాయం, హైపర్ టెన్షన్లతోపాటు మధుమేహం వంటి జీర్ణక్రియ సంబంధిత సమస్యలకూ కారణమవుతోందని తెలియడం చూస్తే మాత్రం పెద్దలమాట చద్దిమూట అనుకోవాల్సిందే. ఒక్కోరోజు ఒక్కో సమయంలో నిద్రపోయే వారితో పాటు.. నిద్రపోయే సమయంలో కూడా తేడాలు ఉండేవారు 2000 మందిని పరిశీలించిన తరువాత తాము ఈ అంచనాకు వచ్చామని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త తియాన్వీ హువాంగ్ తెలిపారు. ఆరేళ్లపాటు జరిపిన పరిశీలనల తరువాత ఈ తేడాలు ఎక్కువగా ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. అయితే ఈ అధ్యయనంలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయని.. కొంతమంది శాస్త్రవేత్తలు అంటున్నారు. అధ్యయనంలో పాల్గొన్న వారి నిద్ర అలవాట్ల గురించి వారిని ప్రశ్నించి తెలుసుకోవడం ఇందులో ఒకటని.. ఆక్టీ గ్రాఫ్ వంటి వాచీలను వాడటం ద్వారా వారంలో వారు ఎంత సమయం నిద్రపోతున్నారో తెలుసుకున్నారని వీరు విమర్శిస్తున్నారు. వీటి ఆధారంగా వారి నిద్ర అలవాట్లలో వచ్చిన తేడాలు ఏమిటన్నది నిర్దిష్టంగా తెలియదని చెప్పారు. -
బ్యాంకులో ఓ రోజు
ఉదయం ఏడు గంటలు అవుతోంది. కనురెప్పలు తెరుచుకోవడం లేదు, ఇంకా కాసేపు నిద్ర పోతే బావుంటుంది అనిపించినా లేవక తప్పని పరిస్థితి. ఇంతలో సెల్ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చిన శబ్దం గుయ్మని వినిపించసాగింది. బద్ధకంగా మెసేజ్ చూశాడు. నిద్ర మత్తు వదిలిపోయింది. ఏజీయం నుండి సందేహానికి తావు లేని సందేశం. బడ్జెట్ నెగటివ్ నుండి పాజిటివ్కి రాక పోతే ఈ నెల ఆఖరులోగా బదిలీకి సిద్ధంగా ఉండమని. ఈ పది రోజుల్లోగా ఏ మాయో, మంత్రమో జరిగితే తప్ప అది అసాధ్యం. గబగబా బ్రష్ చేసి వచ్చేసరికి కాఫీ పట్టుకుని శ్రీమతి నిలబడివుంది. కప్పు అందుకున్నాడు. ‘రాత్రంతా నడుము నొప్పితో నిద్ర లేదండీ...ఈ రోజు అయినా డాక్టర్ దగ్గరకు వెళ్లకపోతే ఇక భరించలేను’ అంది. ‘సాయంకాలం అపాయింట్ మెంట్ తీసుకుంటాను’ చెప్పాడు. ‘తీసుకున్నాను, కానీ మీరు ఎన్నింటికి వస్తారో?’ ‘నేను డైరెక్ట్ గా క్లినిక్ కి వస్తాను’ చెప్పాడు. ఈ లోగా ఇంకో ఫోన్ కాల్. గబగబా మాట్లాడి బాత్రూం లోకి వెళ్ళాడు. ఓ కస్టమర్ తన హౌసింగ్ లోన్ ఎప్పటికి అవుతుందని అడిగాడు. స్నానం ముగించి వచ్చేసరికి మరో మెసేజ్.మొండి బకాయిల గురించి మీ మొండి వైఖరి మారకపోతే దండన తీవ్రంగా ఉంటుందని ఓ తీర్మానం. ఏం టిఫిన్ తిన్నాడో ఎలా తిన్నాడో తెలియదు, బయలుదేరిపోయాడు. బ్యాంకుకి వెళ్లి సిస్టమ్స్ ఆన్ చేసాడు. చక్రం గిర్రున తిరుగుతోంది... కనెక్టివిటీ ప్రాబ్లెమ్. ఫోన్ చేస్తే గంట కనీసం పడుతుందని శుభవార్త. కౌంటర్లలో సిబ్బంది హాయిగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ‘సర్, అర్జంట్ గా కాష్ కావాలి’ కస్టమర్ అభ్యర్ధన. కనెక్టివిటీ వచ్ఛేవరకు వేచి వుండమంటే ‘నా చెక్ ఉంచుకుని కాష్ ఇచ్చేయండి’ అంటూ కస్టమర్ విన్నపం మరియు సలహా. క్యాషియర్ కి చెబితే, ‘అదెలా అవుతుంది..అతని అకౌంట్లో బాలన్స్ వుందో లేదో... అంతగా అయితే మీరే ఇచ్చేయండి’ కనీసపు మొహమాటం కరువు. ఇవన్నీ రొటీన్లో మామూలే. ఈలోగా ఏటీఎంలో కాష్ లేదని, కనెక్టివిటీ వస్తేగాని కాష్ రాదని ప్రశ్న ప్లస్ జవాబు?! ఇంతలో లోన్ సెల్ నుండి డీవియేషన్ అప్రూవ్ అయితే గాని హౌసింగ్ లోన్ క్లియర్ కాదని, అర్జంట్ గా రమ్మనమని పిలుపు. సింగల్ బ్రాంచ్ బీఎంకి ఇదెలా సాధ్యం అవుతుందో ఎవరికి చెప్పినా అర్ధం కాదు, ప్రయోజనం లేదు. జోనల్ ఆఫీస్ నుండి కాల్. సీజీమ్ ఎల్లుండి వస్తున్నారు. ఇన్సూరెన్స్ మీ వంతు పది లక్షలు చేయాలి. (నేనేమైనా ఇన్సూరెన్స్ ఏజెంట్ నా?!) ‘నేను సింగల్ బ్రాంచ్ బీ ఎం నండీ... పది కష్టం’ అంటే ‘మీరెంత కష్ట పడుతున్నారో అందరికీ తెలుసు... చిన్న బ్రాంచ్లలో ఏం పని ఉంటుంది, కనీసం ఇది అయినా చెయ్యండి’సెల్ ఫోన్ పక్కన పెట్టి తలెత్తి చూస్తే ఎదురుగా ఓ పెద్దాయన.\ ‘నా పెన్షన్ రాలేదు’ ‘లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చారా?’ ‘గుర్తు లేదు’ ‘ఉండండి... చూసి చెబుతా....సిస్టమ్స్ ఇంకా రాలేదు, కూర్చోండి’ ‘ఎంతసేపు ఉండాలి’ ‘గంట పడుతుందని అన్నారు...చెప్పలేము’ ఇంతలో ఫోన్ మ్రోగింది. అటునుండి సీఎం అడ్మిన్ ‘సిస్టమ్ సస్పెన్స్ లో నాలుగు ఎంట్రీలు అర్జెంట్గా రివర్స్ చెయ్యండి... అసలు ఉదయం రాగానే వాటిని చూసి ఈ పాటికి క్లియర్ చెయ్యాలి, మేము పనిగట్టుకుని చెబితే కానీ చేయరా..’ ‘ఇక్కడ కనెక్టివిటీ ప్రాబ్లెమ్ సర్! ఇంకా రెస్టోర్ కాలేదు’ ‘రాగానే వెంటనే రివర్స్ చేసేయండి... నేను మళ్ళా రిమైండ్ చెయ్యను’ హుకుం జారీ అయ్యింది. ఇంతలో మెసెంజర్ వచ్చి ‘సర్ వచ్చింది’ చెప్పాడు. ‘ఎవరు?’ ‘అదే సర్...కంప్యూటర్లు... పని చేస్తున్నాయట’ హమ్మయ్య... సిస్టమ్స్ వచ్చేసాయి. హడావుడి ప్రారంభమయ్యింది. జనాల తోపులాట. గబగబా బీఓడీ చేసి, కాష్ తీయడానికి పరుగెత్తాడు. ‘సర్! మన సుబ్బరాజు అబ్బాయికి జలుబు చేసింది. ఈ రోజు సెలవు పెట్టాడు’ కాష్ ఇన్ఛార్జ్ చల్లగా కబురు చెప్పాడు. ‘సుబ్బరాజు కౌంటర్ కూడా చెయ్యాలి, గోల్డ్ లోన్కి ఇద్దరు రెడీగా వున్నారు. అది మీరు చూసుకోండి’ నిర్భయంగా, నిర్మొహమాటంగా చెప్పేశాడు కాష్ ఇన్ఛార్జ్. చిరాకు, టెన్షన్ తో ఛాంబర్లోకి వచ్చి కూర్చున్నాడు. ‘టీ చల్లరిపోతోంది..తాగండి’ అంది రమణమ్మ. కప్పు అందుకున్నాడు. జనాలు సీరియస్గా చూస్తున్నారు. ‘మా పని చేయకుండా నువ్వు టీ తాగుతూ కూర్చుంటావా?’ అని అందరిలోనూ ఒకటే ఫీలింగ్ సూటిగా బాణంలా తగులుతోంది. అబ్బ...పంచదార పానకం... ఎన్ని సార్లు చెప్పినా మరిచిపోయాను ఈ రోజుకి తాగేయండి’ అంటుంది. ఈ దెబ్బతో షుగర్ లెవెల్ నాలుగొందలు దాటి కిడ్నీలు డాం గ్యారెంటీ.పాసింగ్ ప్రారంభించాడు చకచకా. ఓ గంట ఏకధాటిగా అదే పని మీద ఉంటే కొంత జనాలు కదిలారు \మంగళ సూత్రాలు పట్టుకుని కట్టడానికి రెడీ అన్నట్టు ఓ పెద్దాయన ఎదురుగా కూర్చున్నాడు గోల్డ్ లోన్కి.‘వీటికి లోన్ ఇవ్వడం కుదరదు...ఆ నల్లపూసలు తీసేయాలి. ఆ సూత్రాల వెనక ఆ లక్క ఉండకూడదు’ చెప్పాడు.‘అయ్యా...ఎంత ఎమర్జెన్సీ కాకపోతే ఇలా మా ఆవిడ పుస్తెలు తెస్తాను... మీరు అదితీసేయండి ఇది ఉండకూడదు అంటే ఎలాగ చెప్పండి’‘రూల్స్ ఒప్పు కోవండీ...’ అంటూ ఓ పావుగంట సేపు వివరంగా చెప్పి ఒప్పించేసరికి తలప్రాణం కాళ్ళలోకి వచ్చిందిఇంతలో లోకల్ హెడ్ ఆఫీస్ నుండి ...ట్రేడింగ్ అకౌంట్లో కొంత అమౌంట్ లీన్ లో ఉందనీ, అది లిఫ్ట్ చేయడం కుదరదని చెప్పినందుకు గాను కస్టమర్ అంబుడ్స్మెన్కు వెళ్తున్నాడని...దీనికి మీ సమాధానం ఏమిటని ఘాటుగా ఫోన్ వచ్చింది.ట్రేడింగ్ అకౌంట్ ఆపరేట్ చేసేది కస్టమర్, అతడు షేర్స్ కొనేటప్పుడు అవసరమైన అమౌంట్ లీన్లో పెట్టుకునేది అతడే...షేర్స్ అలాట్ కానప్పుడు ఆ లీన్ లిఫ్ట్ చేసేది కస్టమరే తప్ప బ్రాంచ్ మేనేజర్ కి ఎటువంటి ప్రమేయం ఉండదని వివరించేసరికి...‘అదంతా మాకు తెలియదు, కస్టమర్ని పిలిపించి అతనిచేత దగ్గరుండి లీన్ లిఫ్ట్ చేయించి ప్రాబ్లెమ్ లేకుండా చూసుకోండి’ అని ఫోన్ కట్ చేసేసారు.ఒక్కసారి నీరసంగా అనిపించి అలా సీట్లో వెనక్కి వాలి మంచి నీళ్ళు కోసం బాటిల్ అందుకుంటే అది ఖాళీ.బెల్ కొట్టాడు. రమణమ్మ వచ్చింది. బొటన వేలితో సైగ చేసాడు. బాటిల్ పట్టుకుని వెళ్ళి మంచి నీళ్ళు తెచ్చింది.ఓ గుక్కెడు తాగుదామనే సరికి కేకలు వినిపించాయి.చెక్ క్లియరింగ్కి నాలుగు రోజులా? అరుస్తున్నాడు ఓ కస్టమర్ హాల్లో.మంచి నీళ్ళు తాగి కౌంటర్ దగ్గరకు వెళ్లి విషయాన్ని తెలుసుకుని ‘అయ్యా! మీరు చెక్ లక్ష్మి వారం సాయంకాలం డ్రాప్ బాక్స్ లో వేశారు. అది శుక్రవారం ఉదయం వెళ్ళింది. శనివారం నాన్ క్లియిరింగ్ డే, ఆదివారం సెలవు కనుక ఈ రోజు సోమవారం సాయంకాలానికి మీ అకౌంట్లో పడుతుంది’ అని వివరంగా చెప్పాడు.‘మరి,ఈ మాత్రం దానికి ఇరవై నాలుగు గంటల్లో క్లియిరింగ్ అని బోర్డ్ పెట్టడం దేనికి?’ఏం సమాధానం చెబుతాడు?అదే సమయానికి ‘దొంగ నోటు’ అని కౌంటర్లో కాష్ ఇన్చార్జ్ చెప్పడం,‘అది నిన్న మీరే ఇచ్చారు’ అని కస్టమర్ దబాయించడం....ఆ వాదనకి అంతం ఆఖరికి పోలీస్ కంప్లయింట్ ఇస్తాననే వరకు వచ్చి అప్పటికి కాస్తా సద్దు మణిగింది.లంచ్ టైం అవ్వడంతో ఇంట్రవెల్ దొరికింది.ఈరోజు నడుం నొప్పి కారణంగా శ్రీమతి కేరెజీ కట్టలేదనే విషయం గుర్తొచ్చింది. రమణమ్మకు టిఫిన్ తెమ్మనమని చెప్పాడు.బాంక్ ఎదురుగా ఓ పాక హోటల్ నుండి రాళ్ల లాంటి రెండు గారెలు తెచ్చింది. ఒకటి తింటే చాలు ఆకలి చచ్చి కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్కి బైపాస్ తప్పదేమో? సీనియర్ కొలీగ్ ఒకాయన గుర్తుకు వచ్చాడు. నలభై ఏళ్లకే పాపం....ఆలోచనలకు భంగం కలిగిస్తూ మెసెంజర్ వచ్చి,‘సర్, ఆక్వా కంపెనీ మూర్తి గారికి పది లక్షలు కాష్ అర్జంట్ గా కావాలిట’ అని చెప్పాడు.‘మన దగ్గర ఎంత ఉందో కనుక్కో’‘అంతా కలిపి నాలుగు మించదట, చెప్పారు’‘సరే పద..వస్తున్నా’ సగం తినగా మిగిలిన గారె వదిలి పెట్టి లేచాడు.సింగల్ బ్రాంచ్ లిమిట్ పది లక్షలు. ఈ రోజు ఇండెంట్ పెడితేరేపటికి గాని రాదు.మెయిన్ బ్రాంచ్కి ఫోన్ చేసి రిక్వెస్ట్ చేస్తే, చెక్ ఎటెస్టు చేసి కస్టమర్ని పంపిస్తే ఇస్తామన్నారు.అదే విషయం ఆ మూర్తిగారికి చెబితే, ‘మీరు తెప్పించలేరా?మేమే వెళ్ళాలా?’ అంటూ ఒకటే విసుగు ప్రకటించి ఆఖరికి వెళ్లారు.సాయంకాలం నాలుగు అవ్వడంతో పబ్లిక్ ట్రాన్జాక్షన్స్ క్లోజ్ చేసి తాను చేయాల్సిన తదితర పనులు చేయసాగాడు.కాష్ బాలన్స్ అవ్వగానే, ‘రండి సర్, సేఫ్ క్లోజ్ చేద్దామని పిలుపు.ఆ తరువాత గుడ్ నైట్.ఒక్కడే మిగిలిపోయాడు.సస్పెన్స్ ఎంట్రీలు రివర్స్ చెయ్యాలంటే స్టాఫ్ ఉండాలి. వాళ్లు ఫీడ్ చేసాక గాని తను ఆథరైస్ చెయ్యడం కుదరదు. ఏం సమాధానం ఎలా చెబుతాడు?సరిగ్గా అదే సమయానికి సీఎం అడ్మిన్ నుండి ఫోన్ వచ్చింది.‘ఇంకా రివర్స్ చేయలేదా? ఎట్టి పరిస్థితుల్లోనూ సిస్టం సస్పెన్స్ జీరో చెయ్యకుండా ఇంటికి వెళ్లే ప్రసక్తి లేదు’ఐదు దాటింది...స్టాఫ్ వెళ్లిపోయారు...రేపు చేస్తాను...అని చెప్పటానికి కూడా గొంతు పెగలలేదు.తన మిత్రుడికి ఫోన్ చేశాడు.వాడు పక్క బ్రాంచి మేనేజర్. ‘ఒరేయ్...రోలు పోయి మద్దెలతో మొరపెట్టుకున్నట్టుగా ఉంది. ఉదయం నాకు అరగంట సేపు ఆపకుండా వాయించారు. మెమో ఇస్తామన్నారు’దేనికి?’ అడిగాడు.‘బ్రాంచికి బిజినెస్ లేదని? చుట్టూ ఉన్నవి పట్టా లేని భూములు. హౌసింగ్ లోన్లు ఎలా వస్తాయి? జనాలు దిగువ మధ్యతరగతి వాళ్ళు. బంగారం మీద లోన్లు ఇమ్మంటారు. ఏరియాలో ఉద్యోగస్తులే లేరు. పెర్సనల్ లోన్ లిమ్మంటారు.బ్రాంచ్ షిఫ్ట్ చేద్దామంటే నన్నే షిఫ్ట్ చేస్తామన్నారు. పైగా నా వాక్ స్వతంత్రానికి మెమో అంటున్నారు. నిద్ర మాత్రలు మింగేద్దామని అనుకుంటుండగా నువ్వు ఫోన్ చేశావ్’‘అటువంటి ఆలోచనలు చెయ్యకురా...ఎట్టి పరిస్థితులలోనూ అలా చెయ్యకూడదు...ఒత్తిడికి చిత్తు కాకూడదు. ఆ ఒత్తిడిని పుత్తడిగా మార్చుకోవాలి’‘పుత్తడిగా మారితే అప్పుడు గోల్డ్లోన్ ఇవ్వొచ్చూ అంటావ్...సరి సరి’ఇంతలో సెల్ఫోన్లు గుయ్ మని శబ్దం చేశాయి.‘ఏదో మెసేజ్ వచ్చినట్టు ఉంది’ అంటూ ఇద్దరూ ఫోన్ పెట్టేసారు.ఆదివారం ఉదయం పది గంటలకు మీటింగ్.ఈ వారాంతపు సెలవు గోవిందా ?ఇంతలో మరో కాల్ ...‘హలో’ అన్నాడు.‘నేనురా...గోపీని’ తన మిత్రుడు.‘ఏరా... ఏంటి సంగతి!’‘చాలా హాపీ రా....ఈ రోజే నేను నా ఉద్యోగానికి రాజీనామా సమర్పించాను’ఒక్క క్షణం గుండె లయ తప్పి కొట్టుకుంది.‘అదేంటిరా..అంత సడన్ గా ఎవరికీ చెప్పకుండా నిర్ణయం తీసుకున్నావ్? ఇంకా పదేళ్లు సర్వీస్ ఉంది’‘పదేళ్లు ఈ టెన్షన్స్తో వుంటామో లేదో....వున్నా రోగాలతో, మందులతో బ్రతకాలి, ఎందుకొచ్చిన బ్రతుకని’గోపీ మాటలు నిజమే అనిపించాయి.ఉదయం లేచిన దగ్గర నుండి కుటుంబం గురించి గాని, పిల్లల గురించి గాని ఆలోచించడం అటు ఉంచితే కనీసం ఓ ఐదు నిముషాలు మాట్లాడటం కూడా జరగదు. ఇరవై నాలుగు గంటలూ బ్యాంకుతోనేఅయిపోతోంది.మిత్రులూ, బంధువులు సరేసరి పూర్తిగా మరిచిపోయారు.సోషల్ లైఫ్ అనేది లేకుండా పోయింది.ఇంతలో మరో ఫోన్ కాల్, ఓ రెండు మెసేజ్ లు వచ్చాయి. వాటికి తగు సమాధానాలు ఇచ్చి భార్యకు కు ఫోన్ చేసాడు.‘క్లినిక్ కి వస్తున్నాను’ చెప్పాడు.ఆవిడ చాలా ఆశ్చర్యంగా ‘నిజంగా’ అంది.వెంటనే చకచకా బయలుదేరిపోయాడు.డాక్టర్ చెక్ అప్, ఎక్స రే తీయడం, మందులు కొనుక్కొని బైటకు వచ్చేసరికి రాత్రి పది గంటలు దాటింది. ఇప్పుడిక ఇంటికి వెళ్లి ఏం తింటామని మంచి హోటల్ కెళ్ళి చక్కని పదహారణాల తెలుగు భోజనం తిని,చివరలో గడ్డ పెరుగు వేసుకుని ఆవకాయతో రెండు ముద్దలు తిన్నాక తృప్తిగా అనిపించింది.భర్త నిదానం చూసి ‘రేపు బాంక్ లేదా?’ అంది.సరిగ్గా అప్పుడే సెల్ ఫోన్ గుయ్ మంది.మెసేజ్ చూశాడు...బ్రాంచ్ ఇన్స్పెక్ట్ చేయడానికి ఉదయం ఏడు గంటలకు ఆడిటర్ వస్తున్నట్టుగా ఓ వార్త. ∙పక్కి శివప్రసాదరావు -
నిద్రపట్టడం లేదు... సలహా ఇవ్వండి
హోమియో కౌన్సెలింగ్స్ నా వయసు 33 ఏళ్లు. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను. ప్రతి రెండు వారాలకు ఒకసారి షిఫ్ట్ మారుతుంది. ఈ మధ్యే డే–షిఫ్ట్ కు మారాను. అయినా రాత్రివేళ సరిగా నిద్రపట్టడం లేదు. నా సమస్యకు పరిష్కారం చెప్పండి. – ఎమ్. నవీన్, హైదరాబాద్ మనిషికి గాలి, నీరు, తిండి లాగే నిద్ర కూడా చాలా అవసరం. నిద్ర కరువైతే కళ్లలో కళాకాంతులు తగ్గుతాయి. ఉత్సాహం తగ్గుతుంది. అలసట, ఆందోళన మాత్రమే గాక అనేక ఆరోగ్య సమస్యలకు నిద్రలేమి కారణమవుతుంది. శారీరక, మానసిక సమస్యలు తప్పవు. నిద్రలోకి జారుకోలేకపోవడం, ఒకవేళ నిద్రపట్టినా తెల్లవారుజామున నిద్రలేవడం, రాత్రిళ్లు మళ్లీ మళ్లీ మెలకువ రావడం, ప్రశాంతమైన నిద్రలేకపోవడం నిద్రలేమి సమస్యకు సంబంధించిన ఒకటి రెండు లక్షణాలు. అయితే ఇవి అన్నీ గాని... కొన్ని గాని ఉండటాన్ని వైద్యపరిభాషలో ఇన్సామ్నియా (నిద్రలేమి)గా చెప్పవచ్చు. నిద్రలేమి శారీరక సామర్థ్యాన్ని దెబ్బతీస్తుంది. ఆలోచన గమనాన్ని నియంత్రిస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. కారణాలు : ∙మానసిక ఒత్తిడి, ఆందోళన ∙శారీరకంగా వచ్చే మార్పులు ∙చికాకులు ∙చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం ∙దీర్ఘకాలిక వ్యాధులు ∙వంశపారంపర్యం ∙అంతులేని ఆలోచనలు లక్షణాలు: ∙నిద్రలోకి జారుకునేందుకు కష్టపడిపోవడం ∙నిద్రపట్టినా మధ్య మధ్య మెలకువ వస్తూ ఉండటం, నాణ్యమైన నిద్ర లోపించడం ∙తెల్లవారుజామున మెలకువ వచ్చాక మళ్లీ నిద్రపట్టకపోవడం ∙నిద్రలేచిన తర్వాత విశ్రాంతిగా అనిపించకపోవడం నిర్ధారణ పరీక్షలు : రక్తపరీక్షలు, పాలీసామ్నోగ్రామ్ (పీఎస్జీ) చికిత్స: హోమియోలో నిద్రలేమి సమస్యకు మంచి చికిత్స అందుబాటులో ఉంది. నక్స్వామికా, ఓపియమ్, బెల్లడోనా, ఆర్సినిక్ ఆల్బమ్ వంటి మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి. పాసీఫ్లోరా 20 – 25 చుక్కలు అరకప్పు నీళ్లలో కలుపుకుని తాగితే గాఢంగా నిద్రపడుతుంది. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా, ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ గౌట్ సమస్యకు పరిష్కారం ఉందా? నా వయసు 43 ఏళ్లు. కొన్నాళ్లుగా కాలి బొటనవేలు వాచింది. సలపరంతో కూడిన తీవ్రమైన నొప్పి వస్తోంది. డాక్టర్గారు గౌట్ అని చెప్పారు. ఎన్ని మందులు వాడినా ఉపశమనం కనిపించడం లేదు. నా సమస్యకు హోమియోలో పరిష్కారం ఉందా? – ఆర్. కళ్యాణ్, గుంటూరు గౌట్ అనేది ఒక రకం కీళ్లవ్యాధి. మన శరీరంలో ‘యూరిక్ యాసిడ్’ జీవక్రియలు సరిగా లేనందున ఈ వ్యాధి వస్తుంది. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థాల విచ్ఛిన్నంలో భాగంగా యూరిక్ యాసిడ్ ఏర్పడుతుంది. అది రక్తంలో ఉండాల్సిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటే కీళ్లలోకి చేరుతుంది. అప్పుడు కీళ్లు వాచిపోయి, కదలికలు కష్టంగా మారతాయి. ఈ పరిస్థితిని ‘గౌట్’ అంటారు. కారణాలు: సాధారణంగా రక్తంలోని యూరిక్ యాసిడ్ మూత్రం ద్వారా విసర్జితమవుతుంది. ఒకవేళ శరీరంలో యూరిక్ యాసిడ్ ఉత్పత్తి పెరిగినా లేదా దాని విసర్జన సరిగా జరగకపోయినా అది రక్తంలోనే నిలిచిపోయి గౌట్కు దారితీస్తుంది. ∙ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే ఆహారం (ఉదా: మాంసం, గుడ్లు, చేపలు) వంటి ఆహారం ఎక్కువగా తీసుకునేవారిలో ఇది అధికం. ∙అధిక బరువు, వయసు పెరగడం, వంశపారంపర్యంగా రావడం కూడా కొన్ని కారణాలు. లక్షణాలు: ∙తీవ్రతను బట్టి ఈ వ్యాధి లక్షణాలు చాలా ఆకస్మికంగా కనిపిస్తాయి. ∙చాలామందిలో ఇది కాలి బొటనవేలితో ప్రారంభమవుతుంది. ∙మొదట్లో ఈ వ్యాధి కాలి బొటన వేలికి మాత్రమే పరిమితమైనప్పటికీ క్రమేపీ మోకాళ్లు, మడమలు, మోచేతులు, మణికట్టు, వేళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ∙ఈ సమస్యను నిర్లక్ష్యం చేసి సరైన చికిత్స తీసుకోకపోతే మరింత తీవ్రతరమై కీళ్లను పూర్తిగా దెబ్బతీస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఉంది. నివారణ / జాగ్రత్తలు : మాంసకృత్తులను బాగా తగ్గించాలి. మాంసాహారంలో ప్యూరిన్స్ ఎక్కువగా ఉండే గొర్రె, మేక, బీఫ్ వంటివి తీసుకోకూడదు. అలాగే మాంసాహారంలోని లివర్, కిడ్నీ, ఎముక మూలుగ, పేగుల వంటివి తినకూడదు. శాకాహారంలో పాలకూర, క్యాబేజీ, క్యాలీఫ్లవర్, చిక్కుళ్లు, వివిధ రకాల బీన్స్, పుట్టగొడుగుల వంటివి తీసుకోకూడదు. మద్యపానం పూర్తిగా మానివేయాలి. చికిత్స: హోమియో వైద్యవిధానం ద్వారా అందించే అధునాతనమైన కాన్స్టిట్యూషన్ చికిత్స ద్వారా గౌట్ వ్యాధిని శాశ్వతంగా నయం చేయడం సాధ్యమవుతుంది. డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్, సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్, హైదరాబాద్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటున్నారు... నా వయసు 62 ఏళ్లు. నాకు రెండు చేతుల్లోని కీళ్లు నొప్పిగా ఉండటంతోబాటు కీళ్లవద్ద ఎర్రగా మారాయి. నాకు తగిన సలహా ఇవ్వండి. – డి. మాలకొండారావు, ఒంగోలు మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీరు రుమటాయిడ్ ఆర్థరైటిస్తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే తన వ్యాధి నిరోధక శక్తి తన పట్ల ప్రతికూలంగా పనిచేయడం. సాధారణంగా యాభైఏళ్లు పైబడిన వాళ్లలో ఈ నొప్పులు మొదలవుతాయి.ఈ వ్యాధి ఉన్న వారిలో లక్షణాల తీవ్రతలో చాలా రకాల మార్పులు కన్పిపిస్తుంటాయి. వ్యాధి యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు అలసట, ఆకలి లేకపోవడం, లోగ్రేడ్ జ్వరం, కీళ్ళలో, కండరాల్లో నొప్పులు, కీళ్లను సరిగ్గా కదపలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సాధారణంగా కీళ్లనొప్పులు ఉదయాన్నే లేవగానే అత్యధికంగా ఉండి కొద్దిగా శరీరం కదిలించిన తర్వాత అదుపులో ఉంటాయి. సాధారణంగా చేతుల్లో కాళ్లలో రెండు వైపులా ఒకేకీళ్ళు ప్రభావితమవుతాయి. కీళ్లు ఎర్రగా, వేడిగా మారి విపరీతమైన నొప్పితో బాధిస్తాయి. వ్యాధి దీర్ఘకాలంగా మారినప్పుడు కీళ్లలోని మృదులాస్తి, ఎముకలు దెబ్బతినడం వలన వేళ్ళు వంకర్లు పోవడం పూర్తిగా కదలికలు ఆగిపోవడం వంటి సమస్యలు తలెత్తుతాయి. వీటినే ‘డిఫార్మిటీస్’ అంటారు.రుమటాయిడ్ ఆర్థరైటిస్ని నిర్ధారించడానికి ఏ ఒక్క పరీక్ష సరిపోదు. రక్తపరీక్షలతో పాటు ఇతర వైద్య పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. ఆటో ఇమ్యూన్ సమస్యలలో చికిత్స చెయ్యడానికి హోమియోపతిలో మయాజ్మాటిక్ ప్రిస్క్రిప్షన్ ఇస్తారు. సాధారణంగా వాడే పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్ వల్ల నొప్పి నుండి తాత్కాలికంగా ఉపశమనం లభించడం లేదా కొన్నిసార్లు అస్సలు ప్రభావమే లేకపోవడం జరుగుతుంది. పైగా ఈ మందుల వలన డిఫార్మిటీస్ని నివారించలేం. హోమియోపతి మందుల ద్వారా ఈ వ్యాధిని పూర్తిగానియంత్రించి నొప్పులను పూర్తిగా తగ్గించడం మాత్రమే కాకుండా డిఫార్మిటీలు రాకుండా నివారించవచ్చు. డాక్టర్ టి.కిరణ్ కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
నిద్ర... పరీక్షకు రక్ష!
నిద్రపోవడం అంటే... మెదడుకు శక్తినివ్వడమే.పరీక్షల సమయంలో అయితే... జ్ఞాపకశక్తినివ్వడమే.చదివింది మెదడు మననం చేసుకోవడానికి, స్థిరపరచుకోవడానికిరాత్రి నిద్రే కాదు... మధ్యాహ్నపు చిన్న కునుకు కూడా మేలు చేస్తుందని వైద్యులు అంటున్నారు.ఆ వివరాలను మెలకువతో మెళకువగాతెలుసుకోండి. ప్రస్తుతం పరీక్షల సీజన్ నడుస్తోంది. పదోతరగతి, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరూ తమ పరీక్షల కోసం పుస్తకాలతో కుస్తీపడుతున్నారు. అంతకు ముందు పెద్దగా చదవని పిల్లలు సైతం పరీక్షలు అనగానే రాత్రంతా నిద్రమానేసి చదువుతుంటారు. రాత్రిళ్లు చాలా ఆలస్యంగా పడుకోవడం, మళ్లీ పొద్దున్నే త్వరగా లేవడం లాంటి చర్యలతో తమ నిద్ర సమయాన్ని కుదించుకుంటారు. దాంతో మామూలుగా నిద్ర పోయే వ్యవధి కంటే చాలా తక్కువగా నిద్రపోతుంటారు. పరీక్షల సమయంలో ఇలా చేయడం ఎంత వరకు సబబు? పరీక్షల్లో చదవడానికి నిద్ర ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ సమయంలో నిద్ర తగ్గడం మంచిదేనా? నిద్రనూ, చదువునూ సమన్వయపరుచుకుంటూ పరీక్షల సమయంలో ఎలా చదవాలి? ఇలాంటి అనేక అంశాలపై అవగాహన కలిగించేందుకు ఉపయోగపడేదే ఈ కథనం. పిల్లల్లో నిద్ర చాలా ప్రధానం. అందునా చిన్నపిల్లలతో పాటు, ఇప్పుడు పరీక్షలకు చదువుతున్న టీనేజ్లో ఉండే పిల్లలకూ తగినంత సేపు నిద్రపోవడం చాలా ముఖ్యం. ఒక్కొక్కరూ సరిగ్గా నిర్ణీతంగా ఇంత సమయం నిద్రపోవాలని చెప్పలేకపోయినప్పటికీ, మర్నాడు నిద్ర లేచాక తమకు అలసటగా ఉండటం, నిస్సత్తువగా లేదా నీరసంగా ఉండటం, మాటిమాటికీ చికాకు కలగకుండా ఉండటానికి ఎంత నిద్ర అవసరమో అంతసేపు నిద్రపోవాల్సిందే. పరీక్షలప్పుడు కూడా అంతే నిద్ర అవసరం. కాకపోతే పరీక్షల పేరిట పిల్లలు తాము అంతకు ముందు చదువుతున్న అంశాలను బ్రష్ అప్ చేసుకోడానికి ఒక గంట, గంటన్నర కేటాయించి, ఆ మేరకు మాత్రమే మెలకువతో ఉండటం మంచిది. ఏదో ఒక రోజు నిద్ర తగ్గితే పర్లేదుగానీ... అలా కాకుండా... రోజులో తాము నిద్రపోయే మొత్తం వ్యవధిలో రెండు గంటలకు మించి నిద్ర తగ్గడం అంత మంచిది కాదని ఎన్నో అధ్యయనాలు చెబుతున్నాయి. పిల్లల్లో నిద్రపోతున్నప్పుడు ఏం జరుగుతుందంటే... పిల్లల్లో నిద్ర సమయంలో ఎన్నో కీలకమైన జీవక్రియలు జరుగుతుంటాయి. దాంతో నిద్ర వారికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. టీనేజ్లో ఉండే పిల్లల్లో అప్పుడప్పుడే యుక్తవయసులోకి వస్తుండటంతో వారిలో ఎన్నో రకాల హార్మోన్లు స్రవిస్తుంటాయి. ఈ హార్మోన్ల సమతౌల్యతకు నిద్ర బాగా దోహదం చేస్తుంది. నిద్రలేమితో హార్మోన్ల సమతౌల్యత దెబ్బతింటుంది. దాంతో సాధారణ ఆరోగ్యం దెబ్బతినడం, రోగనిరోధక శక్తి లోపించడం జరుగుతుంది. అందుకే పిల్లల్లో నిద్ర సమస్యలు వస్తే, అవి పెద్దయ్యాక కూడా వారి సాధారణ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. రిపేర్ల ప్రక్రియ అంతా నిద్రలోనే : మనం నిద్రపోతున్న సమయంలో మన శరీరం తన ఒంట్లో అవసరమైన అన్ని రిపేర్లనూ చేపడుతుంది. అంటే మనం తగినంత నిద్రపోకుండా ఉంటే మనలోని రోజువారీ పనులు లేదా జీయక్రియల్లో దెబ్బతిన్న అంశాల రిపేర్లు అంత సమర్థంగా జరగవన్నమాట. నిద్రపోతేనే ఎత్తు పెరిగేది: పిల్లల్లో ఎత్తు పెరిగేందుకు దోహదం చేసే హార్మోన్ నిద్రలోనే స్రవిస్తుంది. కాబట్టి పిల్లలు కంటి నిండా నిద్రపోతేనే బాగా ఎత్తు పెరగగలరు. ఒక వయసు దాటాక ఇదే గ్రోత్ హార్మోన్ కండరాలనూ బలపడేలా చేస్తుంది. అవి బలిష్టంగా అయ్యేలా చేస్తుంది. ఎముకలను గట్టిపరుస్తుంది. ఇక పరీక్షలు రాసే మన పిల్లలంతా ఎదిగే వయసులో ఉండేవారే. ఏదో ఒకరోజో, రెండు రోజులో కాసేపు నిద్ర పోకపోతే దాని వల్ల జరిగే నష్టం పెద్దగా ఉండకపోవచ్చు. కానీ పరీక్షలు సాధారణంగా రెండు లేదా మూడు వారాల పాటు జరుగుతుంటాయి. అంతకాలం నిద్రకు దూరం కావడం అంటే మన ఎదుగుదలనూ మనమే చేజేతులారా దెబ్బతీసుకున్నట్టే. చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి : పరీక్షల సమయంలో మనం చదివింది జ్ఞాపకం ఉంచుకోడానికి నిద్ర ఎంతగా దోహదం చేస్తుందో చూద్దాం. మనలో జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియ రెండు రకాలుగా జరుగుతుంది. మొదటిదాన్ని షార్ట్ టర్మ్ మెమరీ అంటారు. మనం ఏదైనా చదవగానే మనకు అర్థమైనదంతా తిరిగి చెప్పాలంటే చెప్పగలం. కానీ కొంతకాలం తర్వాత దాన్ని మరచిపోవచ్చు. మళ్లీ చదివితే తప్ప అది గుర్తు రాదు. ఏదైనా చదివింది చాలాకాలం గుర్తుండాలంటే అది జ్ఞాపకం పెట్టుకునే ప్రక్రియలో రెండోదైన శాశ్వత జ్ఞాపకం (లాంగ్ టర్మ్ మెమరీ)లోకి వెళ్లాలి. ఇలా మనం గుర్తుపెట్టుకోవాలనుకున్న అంశం... షార్ట్ టర్మ్ మెమరీ నుంచి లాంగ్ టర్మ్ మెమరీలోకి వెళ్లే ప్రక్రియ నిద్రలోనే జరుగుతుంది. అందుకే పరీక్షల కారణంగా రాత్రిపూట ఏదైనా చదువుకోవాలనుకుంటే ఆ వ్యవధి రాత్రి ఒక గంట ఆలస్యంగా పడుకోవడమో, ఉదయం ఒక గంట ముందుగా నిద్రలేచి ఆ సమయాన్ని చదువుకు వాడకోవడమో మంచిది. అంతకు మించి నిద్రను దూరం చేసుకోవడం పిల్లలకు మంచిది కాదు. నిద్రపోకుండా చదివితే కీడే ఎక్కువ : నిద్రపోకుండా చదువుకోవడం ఎందుకు మంచిది కాదో చెప్పడానికి ఎన్నో అధ్యయనాలున్నాయి. పరీక్షల పేరుతో నిద్రపోకుండా ఉండటం వల్ల జరిగే అనర్థాల్లో కొన్ని ఇవి... నేర్చుకునే శక్తి తగ్గుతుంది : íపిల్లలు కంటినిండా నిద్రపోకపోతే వారిలో నేర్చుకునే శక్తి మందగిస్తుంది. అంతేకాదు... వారి ఏకాగ్రత సైతం తగ్గుతుంది. చురుకుదనం లోపిస్తుంది. ఏదైనా అంశం మీద దృష్టి కేంద్రీకరించే శక్తి, రీజనింగ్ పవర్, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు బాగా తగ్గుతాయి. పిల్లలు మందకొడిగా అయిపోతారు. పరీక్షల సమయంలో పైన పేర్కొన్న అంశాలు ఎంత అవసరమో తెలియంది కాదు. అందుకే చదువుకునే సమయం కాస్త తగ్గినా పర్లేదుగానీ... చిన్నారుల నిద్ర సమయం మాత్రం తగ్గనివ్వకూడదు. పిల్లల మూడ్స్కు అంతరాయం : నిద్రలేమితో బాధపడేవారి పిల్లల మూడ్స్ తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. కొద్దిపాటి అంశాలకే తీవ్రంగా స్పందించడం, చిన్న చిన్న అంశాలకే చికాకు పడటం వంటి ఎక్స్ట్రీమ్ మూడ్స్ ప్రదర్శిస్తుంటారు. అదే బాగా నిద్రపోయిన వారు కాస్త స్థిమితంగా ఉంటారని అధ్యయనవేత్తలు తెలుసుకున్నారు. పిల్లలు పరీక్షలు బాగా రాయడానికి వాళ్ల మూడ్స్ కూడా బాగుండటం చాలా అవసరమన్నది తెలిసిందే కదా. పదాల కోసం తడుముకోవడం : ఇక నిద్ర కోసం జరిగిన మరో పరిశోధనలో వెల్లడైన వివరాలివి... క్రితం రాత్రి నిద్రలేమితో బాధపడ్డవారూ, కంటినిండా నిద్రపోయిన వారు... ఇలా రెండు విభాగాలను తీసుకొని ఒక అధ్యయనం నిర్వహించారు. నిద్రలేమితో బాధపడ్డవారు సరిగా కమ్యూనికేట్ చేయలేకపోయినట్లు, ఏదైనా రంగులను గుర్తించి, వాటికి అనుగుణంగా స్పందించడంలో కొద్దిగా ఆలస్యం జరిగినట్లు, మాట్లాడే సమయంలో పదాల కోసం తడుముకున్నట్లు తెలుస్తోంది. అదే బాగా నిద్రపోయిన వారిలో ఈ సమస్య ఎదురుకాలేదు. పైగా నిద్రలేమితో ఉన్న వారిలో తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నట్లు కూడా అధ్యయనవేత్తలు గుర్తించారు. పరీక్షల కోసం తయారయ్యే పిల్లలకు పదసంపద (వకాబ్యులరీ) ఎంత అవసరమో మనకు తెలియంది కాదు. చదివిన అంశాలను పరీక్షల్లో రాసే సమయంలో వారికి పదాలు (వకాబ్యులరీ) వెంట వెంటనే తడుతూ ఉండాలి. అలా తట్టాలంటే మంచి నిద్ర ఉండాల్సిందే. ఒకటీ రెండూ కాకుండా... ఈ విషయాలన్నీ నిద్ర గురించి వివిధ ప్రతిష్ఠాత్మక సంస్థలు జరిపిన దాదాపు 70 అధ్యయనాల్లోనూ ఇదే తేలింది. పరీక్షల సమయంలో నిద్ర మానేసి చదవడం అంత శ్రేయస్కరం కాదని ఇటు పిల్లలూ, అటు పెద్దలూ గుర్తించాలి. పరీక్షల సమయంలో నిద్రను సమన్వయించుకోవడానికి ఈ కథనంలో పేర్కొన్న జాగ్రత్తలను తీసుకుంటూ కనీసం ఎనిమిది గంటలు నిద్రపోండి. మిగతా పదహారు గంటలు చదువుకోసం కేటాయించవచ్చు. అలా కుదరకపోతే మీ రాత్రి నిద్రను ఆరుగంటల కంటే ఎట్టిపరిస్థితుల్లో తగ్గనివ్వవద్దు. అది మీ చదువుకు మేలు చేకూర్చకపోగా... మీకు (పిల్లలకు) కలిగే నష్టమే ఎక్కువ అని గుర్తుంచుకోండి. పరీక్షల సమయంలో మీ పడక, నిద్ర ఎలా ఉండాలంటే... చదివే ప్రదేశం ప్రకాశవంతంగా ఉండాలి: కొంతమంది పిల్లలు చదివేదానిపై బాగా దృష్టి కేంద్రీకరించడం కోసం టేబుల్ లైట్ మాత్రమే వేసి, గదంతా చీకటిగా ఉంచుతారు. చదువు ఒంటబట్టడానికి ఈ తరహా వాతావరణం సరికాదు. మీరు చదివే గదంతా వెలుతురు పరచుకుని ఉన్నప్పుడే చదువు బాగా మనసుకెక్కుతుందని గుర్తుంచుకోండి. పడక దీనికి భిన్నంగా ఉండాలి. మీరు పడుకునే చోట మసక వెలుతురుండాలి. మీరు చదివే గది దేదీప్యమానంగా ఉండాలి. మీ పడక పడుకోవడం కోసమే: కొంతమంది పిల్లలు పడకపై పడుకొని చదువుతుంటారు. నిజానికి కూర్చొని చదవడమే మంచిది. బెడ్పై చదవడం, ల్యాప్టాప్ బ్రౌజింగ్ చేయడం, సెల్ఫోన్ చూసుకోవడం.. ఇలాంటి పనులేవీ చేయకండి. చదవడం అన్నది డెస్క్ దగ్గర. పడుకోవడం మాత్రమే బెడ్ మీద. పడకగది చీకటిగా ఉంటేనే మెదడులో మెలటోనిన్ అనే రసాయనం స్రవిస్తుంది. నిద్రపట్టడానికి ఈ రసాయనమే దోహదపడుతుంది. నిద్రకు రెండు గంటల ముందే భోజనం : మీరు పరీక్షలకు చదువుతున్నా లేదా మామూలు సమయంలోనైనా... మీరు పడకకు ఉపక్రమించడానికి కనీసం రెండు గంటల ముందే భోజనం చేయడం మంచి అలవాటు. ఇలా కుదరకపోతే కనీసం గంట ముందన్నా భోజనం పూర్తి చేయండి. హెవీ మీల్ తినేసి, అప్పుడు మీరు చదువుకోడానికి కూర్చున్నా అది కునికిపాట్లకు దారితీస్తుంది తప్ప ఏకాగ్రత కుదరదు. రోజూ అదే వేళకు... ‘అర్లీ టు బెడ్.. అర్లీ టు రైజ్’ అని వాడుక. అంటే పెందలాడే పడుకొని, పెందలాడే నిద్రలేవడం మంచి అలవాటని అర్థం. పరీక్షలున్నా లేకపోయినా... వేరే పనులున్నా... సెలవుల సమయమైనా, హాలిడే ఉన్నా ఈ అలవాటు తప్పనివారిలో ఏకాగ్రత, చదివింది అర్థం చేసుకునే శక్తి ఎక్కువ అని అనేక అధ్యయనాల్లో తేలింది. నీళ్లు ఎక్కువగా తాగండి : సాధారణంగా మనల్ని ఆరోగ్యంగా ఉంచుకోడానికి రోజులో కనీసం మూడు నుంచి నాలుగు లీటర్ల నీళ్లు తాగడం మంచి అలవాటన్నది తెలిసిందే. అయితే పరీక్షల సమయంలో, బాగా చదివే సమయంలో నీళ్లు ఎక్కువగా తాగే అలవాటు పిల్లల్ని మరింత చురుగ్గా ఉండేలా చేస్తుంది. శరీరంలోని మిగతా అవయవాలతో పాటు మెదడుకూ మంచి హైడ్రేషన్ ఉండటం వల్ల చదివింది గుర్తుంచుకునే శక్తి పెరుగుతుంది. మరిన్ని సార్లు మూత్రవిసర్జనకు లేవాల్సిరావడం కూడా వారిని చురుగ్గా ఉండేలా చేస్తుంది. మధ్యాహ్నం పూట ఓ పవర్ న్యాప్ : పరీక్షలకు చదివే సమయంలో రాత్రి నిద్రపోని పిల్లలు మధ్యాహ్నం పూట ఒక అరగంట సేపు నిద్రపోవడం మంచిది.ఈ పవర్న్యాప్ వారిలో మరింత శక్తిని పెంచుతుంది. అయితే ఈ పగటి నిద్ర కేవలం అరగంటకు మాత్రమే పరిమితం కావాలి. మరీ ఎక్కువసేపు నిద్రపోతే అది రాత్రి మళ్లీ నిద్రలేమికి దారితీయవచ్చు. దాంతో మర్నాడు పగటిపూట మందకొడిగా, చికాకుగా, నిస్సత్తువగా ఉండవచ్చు. అందుకే పవర్న్యాప్ అన్నది కేవలం చదివే పవర్ను పెంచేలా ఉండాలి. అది అరగంటకు మించకూడదు. రాత్రి కష్టమైన టాపిక్స్ చదవవద్దు : మీకు కష్టం అనిపించినవీ, కఠినమైనవీ రాత్రిపూట చదవకండి. కేవలం మననం చేసుకునేవీ, మనసులో గుర్తుండిపోయేలా చేసుకునేందుకు చదివేవి మాత్రమే రాత్రిపూట చదవండి. ఒక్కోసారి అలా చదివే సమయంలో అది రాత్రి నిద్రలేమికి దారితీయవచ్చు. కాబట్టి కఠినమైనవీ, టఫ్ సబ్జెక్టులను పగటివేళే చదవండి. లెక్కలూ... రీజనింగ్ కోసం నిద్ర అవసరం ఎంతంటే... విక్టోరియా (ఆస్ట్రేలియా)లోని ప్రవుుఖ పిల్లల పరిశోధన సంస్థ ‘వుర్డోక్ చిల్డ్రెన్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్’కు చెందిన ఓ అధ్యయన బృందం 4500 వుంది పిల్లలపై ఓ అధ్యయనం నిర్వహించింది. ఈ అధ్యయనంలో నిద్రసమస్యలు ఉన్న పిల్లల కంటే... రాత్రి బాగా నిద్రపోయిన పిల్లలు క్లాస్రూమ్లో మిగతా పిల్లలు తవు టీచర్లతో వ్యవహరించేటప్పుడూ, లెక్కలు చేసేటప్పుడూ మెరుగ్గా వ్యవహరిస్తున్నట్లు తేలింది. అంటే రీజనింగ్తో వ్యవహారాలను సమర్థంగా నెరపడానికీ, మ్యాథ్స్ బాగా చేయడానికి కూడా కంటినిండా నిద్రపోవడం అన్నది బాగా ఉపకరిస్తుంది. ‘‘నిద్ర సవుస్యలు ఉన్న పిల్లల్లో ఏదైనా ఆరోగ్య సవుస్య వస్తే– అది తగ్గే తీరు, కోలుకునే వ్యవధి వంటివి మిగతా పిల్లల కంటే కాస్తంత తక్కువే. అదేగానీ పిల్లలకు సరిపోయినంత నిద్ర ఉంటే వాళ్లలో దృష్టి కేంద్రీకరణ శక్తి (కాన్సస్ట్రేషన్) కూడా ఎక్కువ. అంతేకాదు– సవుస్యలను పరిష్కరించే (ప్రాబ్లమ్ సాల్వింగ్) శక్తి కూడా అధికం. పైగా వర్క్లోడ్ తీసుకునే సావుర్థ్యం కూడా పెరుగుతుంది’’ అన్నది ఈ అధ్యయన బృందానికి నేతృత్వం వహించిన జాన్ క్వాష్ చెబుతున్న మాట. డాక్టర్ రమణ ప్రసాద్ కన్సల్టెంట్ స్లీప్ స్పెషలిస్ట్ అండ్ పల్మునాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ -
నిద్రపోయే దిక్కుల్లో... ఈస్ట్ బెస్ట్... నార్త్ వరస్ట్
ఉత్తరం వైపు తల పెట్టుకుని పడుకోవడం మంచిది కాదని పురాణాలు చెబుతున్నాయి. పరిశోధనలూ నిరూపిస్తున్నాయి. మనం తలపెట్టుకునే దిశను బట్టి దాని ప్రభావం మన నిద్రమీద, తద్వారా శరీరం మీదా పడుతుందని ఆధునిక పరిశోధకులు కూడా చెబుతున్నారు. మనం పడుకునే భంగిమ సరిగా లేకపోతే అది ఆరోగ్యంపై దుష్ప్రభావం చూపుతుందని కూడా పరిశోధనలు పేర్కొంటున్నాయి. అన్నింటికన్నా తూర్పు దిక్కున తల పెట్టుకుని పడుకుంటే చాలా మంచిదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిక్కున తల పెట్టుకుని పడుకుంటే ఏ ఫలితం ఉంటుందో చూద్దాం.. తూర్పుదిక్కున తలపెట్టుకుని పడుకుంటే జ్ఞాపకశక్తి పెరుగుతుందట. ప్రత్యుత్పత్తి సామర్థ్యం మెరుగుపడుతుందట. సానుకూల ఆలోచనలు వస్తుంటాయట. తూర్పు తర్వాత దక్షిణానికి పెద్ద పీట వేశారు పెద్దలు. దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకునేవారికి ఆయుష్షు వృద్ధి అవుతుందట. పని చేసే శక్తి కూడా పెరుగుతుందట. ఆ తర్వాత పడమటి దిక్కు. అది అంత మంచిది కాదట. పడమటి దిక్కుగా తల పెట్టుకుని పడుకునేవారిలో అనవసర ఆందోళన, మానసిక ఒత్తిడి పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందట. ఇక ఉత్తర దిక్కు సంగతి సరేసరి. ఉత్తరం వైపు తలపెట్టుకుని పడుకుంటే జీవన కాలం తరిగిపోతుందట. రక్తపోటు, నిద్రలేమి, ప్రతికూల ఆలోచనలు వస్తుంటాయట. గుండెపోటు, పక్షవాతం, హెమరేజ్, పార్కిన్సన్, ఆలై్జమర్స్ వంటివి తలెత్తే ప్రమాదం ఉందట. మన భూమిలో గురుత్వాకర్షణశక్తి ఉత్తర దక్షిణాలుగా ఇమిడి ఉంటుంది. మనమూ అలానే నిద్రపోయామంటే ఉత్తర దక్షిణాల్లో ఇమిడి ఉన్న ఆ శక్తి తరంగాలు మన మెదడులో దాగి వున్న శక్తిమంతమైన విద్యుత్ తరంగాలని తగ్గించి వేస్తాయి. దానివలన అనేక ఆరోగ్య, మానసిక సమస్యలు వస్తాయి. రక్త ప్రసరణ వ్యవస్థలో చాలా మార్పు వస్తుంది. మెదడులో లోపాలు తల ఎత్తుతాయి. అలా కాకుండా తూర్పు, దక్షిణ దిక్కులలో తల ఉంచి నిద్రిస్తే మెదడు సుఖవంత స్థానంలో ఉండి లోపాలు ఏమైనా ఉన్నా సర్దుకుంటాయి. రక్తప్రసరణ సరిగా జరిగి శరీరానికి నూతన ఉత్తేజం వస్తుందని ఆయుర్వేద, జ్యోతిష పండితుల దగ్గరనుంచి ఆధునిక పరిశోధకుల వరకూ చెబుతున్నారు.