పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్‌ నిద్ర.. ఆగిన రైలు | Train Stopped When Gateman Fell Sleep After Drinking Alcohol In Kurnool Dstrict | Sakshi
Sakshi News home page

పూటుగా మద్యం తాగి గేట్‌మ్యాన్‌ నిద్ర.. ఆగిన రైలు

Published Mon, Nov 22 2021 1:57 PM | Last Updated on Mon, Nov 22 2021 1:57 PM

Train Stopped When Gateman Fell Sleep After Drinking Alcohol In Kurnool Dstrict - Sakshi

నంద్యాల రూరల్‌: కర్నూలు జిల్లా నంద్యాల సమీపంలోని ఊడుమాల్పురం రైల్వేగేట్‌ వద్ద కాపలా ఉన్న గేట్‌మ్యాన్‌ శ్రీనివాసులు అదివారం తన స్నేహితుడితో కలిసి మద్యం తాగి అదే గదిలో నిద్రపోయాడు. సాయంత్రం కర్నూలు–నంద్యాల డెమో రైలు సమీపానికి వచ్చినా గేట్‌ వేయలేదని గమనించిన లోకోపైలెట్‌ రైలును ఆపి హారన్‌ మోగించారు. స్థానికులు రూమ్‌లో ఉన్న గేట్‌మ్యాన్‌ను నిద్రలేపారు. గేట్‌ వేయడంతో డెమో రైలు నంద్యాలకు వెళ్లింది. ఈ సమాచారం అందిన రైల్వే ఉన్నతాధికారులు అక్కడికి వచ్చి గేట్‌మ్యాన్‌ను విచారించారు. అతడు మద్యం తాగాడని  తెలుసుకుని విధుల నుంచి తొలగించారు.
చదవండి: శభాష్‌ ఆర్టీసీ.. శభాష్‌ సజ్జనార్‌.. తెలంగాణ ఆర్టీసీపై కిన్నెర మొగులయ్య పాట, వైరల్‌   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement