-
పంచాయతీ కార్మికుల కష్టానికి ఫలితం
సాక్షి, బాల్కొండ: పెంచిన వేతనాల అమలుకు జీవో జారీ కావడంతో గ్రామ పంచాయతీల్లోని కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లకు తమ కష్టానికి ఫలితం దక్కిందని అంటున్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు, వాటర్మెన్, ఎలక్ట్రీషియన్లకు ప్రతి నెలా రూ.8,500 వేతనం చెల్లించాలని నిర్ణయించిన ప్రభుత్వం ఎట్టకేలకు ఉత్తర్వులను జారీ చేసింది. మన ఊరు మన ప్రణాళిక అమలులో భాగంగా పంచాయతీ కార్మికుల వేతనాలను పెంచుతూ రెండు నెలల కిందనే నిర్ణయం తీసుకున్నా ఉత్తర్వులను మాత్రం నిన్న జారీ అయ్యాయి. దీంతో ఉమ్మడి జిల్లాలోని 1,057 పంచాయతీల్లో పని చేస్తున్న సుమారు 4,500 మంది కార్మికులకు ప్రయోజనం కలుగనుంది. పంచాయతీల్లో పని చేసే కార్మికులకు గతంలో అతి తక్కువగా వేతనాలను చెల్లించారు. పంచాయతీల్లో ఇంటి పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని కార్మికులకు వేతనాలను నిర్ణయించారు. అలా ఒక్కో పంచాయతీలో ఒక్కో విధంగా పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు అం దాయి. రూ.2వేల నుంచి రూ.4వేల లోపు వేతనం అందడంతో కార్మికులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. తమకు వేతనాలను పెంచాలని కార్మికులు డిమాండ్ చేస్తూ పలుమార్లు ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ప్రభుత్వం కార్మికులకు పలుమార్లు హామీ ఇచ్చినా వేతనాలను మాత్రం పెంచలేదు. అయితే తెలంగాణ ప్రభుత్వం మన ఊరు మన ప్రణాళిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంతో పాటు పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ఇందులో భాగంగా పంచాయతీ కార్మికులకు వేతనాలను పెంచుతు నిర్ణయం తీసుకుంది. అయితే కార్మికులకు వేతనాల చెల్లింపు భారాన్ని మాత్రం పంచాయతీలపైనే ప్రభుత్వం మోపింది. పంచాయతీల్లో ఆదాయం తక్కువగా ఉంటే కార్మికుల వేతనాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా వచ్చే నిధుల నుంచి వినియోగించుకునే వీలు ఉంది. కాగా కార్మికులకు పెంచిన వేతనాలను ఏ విధంగా చెల్లించాలని అనే విషయంపై ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేయాల్సి ఉంది. మార్గదర్శకాలు జారీ అయితేనే వేతనాల చెల్లింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తమకు ఏ విధంగానైనా పెంచిన వేతనాలను చెల్లిస్తే అదే పదివేలు అని కార్మికులు చెబుతున్నారు. కాగా పెంచిన వేతనాన్ని వెంటనే అమలులోకి తీసుకువచ్చి చెల్లింపులు జరుపాలని పలువురు కోరుతున్నారు. సుదీర్ఘ కాలంగా జరిపిన పోరాటంతోనే ప్రభుత్వం దిగివచ్చి వేతనాలు పెంచిందని కార్మిక నేతలు పేర్కొన్నారు. కార్మికుల సంబురాలు ఫోరాట ఫలితమే గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాల పెంపు జీవో విడుదల అయ్యిందని మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఐటీయూ కార్యాలయం ఎదుట సంబురాలు చేశారు. కార్మికులు బాణ సంచా కాల్చారు. స్వీట్లు పంచారు. ఈ సం దర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధానకార్యద ర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, సుదీర్ఘకాలంగా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులు వేతనా లు పెంచాలని ఆందోళనలు చేశారని అన్నా రు. సంఘం అ«ధ్యక్ష, కార్యదర్శులు కొక్కండ, అశోక్, నందు, సూరం రవి పాల్గొన్నారు. వేతనం ప్రతినెలా చెల్లించాలి రెండు నెలల కిందనే ప్రభుత్వం మాకు వేతనాలను పెంచింది. అయితే ఇప్పుడు జీవో జారీ అయ్యింది. మాకు రెండు నెలల నుంచి పెంచిన వేతనం అమలు చేయాలి. వేతనంను ప్రతి నెలా చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – గజ్జెల మధు, పారిశుద్ధ్య కార్మికుడు, ధర్మోరా -
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
-
హోంగార్డుల జీతాలు పెంచిన ఏపీ ప్రభుత్వం
సాక్షి, అమరావతి : సుదీర్ఘ పాదయాత్రలో తాను ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నారు. ఇప్పటికే రికార్డు స్థాయిలో ఉద్యోగాల నియామకం, ఆశా వర్కర్ల జీతాల పెంపు, ట్యాక్సీ, ఆటోలు నడుపుకొనే బడుగు జీవులకు ఆర్థిక సహాయం వంటి ఎన్నెన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ప్రభుత్వం.. తాజాగా హోంగార్డులకు శుభవార్త చెప్పింది. హోంగార్డుల జీతాన్ని రూ. 18 వేల నుంచి 21,300 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ క్రమంలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారంటూ సీఎం జగన్కు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు తమకు వేతనాన్ని పెంచారంటూ రాష్ట్ర పోలీసు సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాసరావు హర్షం వ్యక్తం చేశారు. -
ఆశావర్కర్లకు జీతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆశా వర్కర్లకు జీతం రూ. 10 వేలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. పెంచిన జీతం ఈ నెల నుంచే ఇవ్వాలని అందులో ఉంది. గతంలో వారికి మూడువేల రూపాయలే ఉండేది. ఇన్సెంటివ్గా రూ. 5600 వరకు చెల్లించే అవకాశం ఉన్నాచంద్రబాబు ప్రభుత్వం అమలు చేయలేదు. కేవలం రూ.3వేలే ఇన్సెంటివ్గా చెల్లించేలా సీలింగ్ విధించారు. దీని వల్ల గరిష్టంగా నెలకు రూ. 6వేలు మాత్రమే ఆశ వర్కర్లు పొందారు. దీంతో పాదయాత్రలో వారి కష్టాలను స్వయంగా విని వారికి న్యాయం చేస్తానని వై.ఎస్ జగన్ హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజా నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి వచ్చిన 60 రోజుల్లోనే తమకిచ్చిన హామీని నెరవేర్చడం పట్ల ఆశా వర్కర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
జీతాల పెంపు.. వారానికి మూడు రోజులు సెలవు
లండన్ : ఉద్యోగం అంటే వారానికి ఆరు రోజులు పని చేస్తే.. ఒక్క రోజు సెలవు దొరుకుతుంది. ఆ రోజు మిగతా పనులతో గడిచిపోతుంది. ఇక కుటుంబంతో తీరిగ్గా గడిపే సమయం ఎక్కడ. ఐటీ ఉద్యోగులకు, కార్పొరేట్ సంస్థల్లో పని చేసే వారికి మాత్రమే వారానికి రెండు రోజుల సెలవు దొరుకుతోంది. మిగతా వారంతా 6 రోజులు పని చేయాల్సిందే. అయితే ఈ విషయంలో బ్రిటన్ ఉద్యోగులు అత్యంత అదృష్టవంతులని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం నెలకు ఒక్క రోజు సెలవు కోసమే కష్టపడుతుంటే.. అక్కడ ఓ కంపెనీ ఏకంగా వారానికి మూడు రోజులు సెలవు ఇస్తోంది. ఇంగ్లండ్లోని ప్లైమౌత్లో ఉన్న పోర్ట్కలిస్ అనే లీగల్ కంపెనీ ఈ కొత్త రూల్ని తీసుకొచ్చింది. ఇక మీదట తన ఉద్యోగులు వారానికి నాలుగు రోజులు పని చేస్తే చాలంటుంది. ఇందుకు గాను జీతంలో ఎలాంటి కోతలు ఉండవని చెప్తుంది. ఈ విషయం గురించి కంపెనీ డైరెక్టర్ ట్రేవర్ వర్త్ మాట్లాడుతూ.. ‘ఉద్యోగులకు నాలుగు రోజుల పని దినాలు కల్పించడం వల్ల ఉత్పాదకత పెరుగుతుంది. సిబ్బందిలో మరింత ఉత్సాహం కలుగుతుంది. అలసట కూడా తగ్గిపోతుంద’ని తెలిపారు. ప్రాథమిక ఫలితాలను పరిశీలిస్తే తన ఉద్యోగులు గతంతో పోల్చితే చాలా ఆనందంగా ఉంటున్నారని, కస్టమర్లకు మెరుగైన సేవలు అందించగలుగుతున్నారని వెల్లడించారు. పనిదినాల కుదింపు ఆరోగ్యకరమైన విధానమని, దీనివల్ల పనితీరు ఎంతో మెరుగుపడుతుందని, ఉద్యోగుల్లో ఒత్తిడి కనిపించడం లేదని ట్రేవర్ తెలిపారు. మరో న్యూజిలాండ్ కంపెనీ ఈ పద్ధతి అనుసరించి 20 శాతం అదనపు ఉత్పాదకతను సాధించిందట. లాభాలు రావడమే కాకుండా, ఉద్యోగుల ఆరోగ్యం కూడా బాగా ఉంటోందట. దాంతో తాము కూడా ఇదే విధానాన్ని అమలు చేస్తున్నామని ట్రేవర్ తెలిపారు. -
కేంద్రం కానుక
గద్వాల న్యూటౌన్/ గద్వాల అర్బన్: ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కేంద్ర ప్రభుత్వం వేతనాలు పెంచడంతో వారు సంతో షం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వీరికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్ మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద రూ.నాలుగు లక్షల వరకు బీమా సౌకర్యం వర్తిస్తుంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 1న ఆశా కార్యకర్తల వేతనం రూ.7,500కు పెంచింది. ఇందుకు సం బంధించిన జీఓ 509 సైతం జారీ చేసింది. దీనికితోడు తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం మరో రూ.1,500 పెంచుతున్నట్టు ప్రకటించింది. కాగా, గ్రామీణస్థాయిలో అమలు చేసే ఆరోగ్య సేవలకు ఆశా కార్యకర్తలకు ఎంతో అవినాభావ సంబంధం ఉంది. ప్రతి ఆరోగ్య కార్యక్రమం వీరి ద్వారానే ఆరంభమవుతుంది. జిల్లాలో ప్రతి వేయి జనాభాకు ఒకరు చొప్పున నియమితులయ్యారు. ప్రధానంగా మూడు రకాల సేవలు అందిస్తున్నారు. ఇందులో మొదటిది మాతా, శిశు సంరక్షణ సేవలు. అర్హులైన దంపతులను గుర్తించడం, వారి వివరాలు సేకరించడం.. కుటుంబ నియంత్రణ (తాత్కాలిక) పద్ధతులను తెలియజేయడం.. గర్భిణులను గుర్తించి రిజిస్ట్రేషన్ చేయించడం.. వారికి సేవలందించడం.. వైద్యులతో పరీక్షింపజేయడం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే కాన్పులు జరిపించుకునేలా చేయడం.. శిశువులకు ఇమ్యునైజేషన్ ఇప్పించడం.. తల్లీబిడ్డల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇక రెండో సేవల్లో భాగంగా సంక్రమిక వ్యాధులైన టీబీ, కుష్ఠు, మలేరియా తదితర వ్యాధిగ్రస్తులను గుర్తించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రా (పీహెచ్సీ) నికి తీసుకెళ్లి చికిత్సలు చేయించడం, వారు క్రమంతప్పకుండా మందులు వాడేలా చూస్తారు. దీంతోపాటు వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేస్తారు. మూడో విధుల్లో భాగంగా వైద్య, ఆరోగ్యశాఖ చేపట్టే అన్ని కార్యక్రమాల్లో వీరి పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. ఇన్ని పనులు చేస్తున్నా ఏడాదిన్నర క్రితం వరకు కేవలం రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేలు మాత్రమే పొందేవారు. దీంతో గౌరవ వేతనాలు పెంచాలంటూ అనేక రూపాల్లో ఉద్యమించారు. ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గత ఏడాది మే నుంచి రూ.ఆరు వేలకు పెంచింది. ఇది ఏమాత్రం సరిపోదని అప్పట్లో ఆశా కార్యకర్తలు విన్నవించారు. చివరకు ఈనెల 1న రూ.7,500కు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఈ వేతనాన్ని ఆశా కార్యకర్తలు అక్టోబర్ నుంచి తీసుకోనున్నారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వమూ రూ.1,500 పెంచడంతో నవంబర్ నుంచి రూ.తొమ్మిది వేలు అందుకోనున్నారు. 3 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో.. ఇక జిల్లాలో గద్వాల అర్బన్, మల్దకల్, మానవపాడు ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలోని 708 కేంద్రాలకుగాను 696మంది అంగన్వాడీ టీచర్లు, 691మంది ఆయాలు పని చేస్తున్నారు. ప్రస్తుతం అంగన్వాడీ టీచర్లకు రూ.10,500 వేతనం చెల్లిస్తుండగా ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.మూడు వేలు, రాష్ట్రం రూ.7,500 చెల్లిస్తున్నాయి. ఆయాలకు ఇస్తున్న రూ.ఆరు వేలలో కేంద్రం వాటా రూ.1,500, రాష్ట్రం రూ.4,500 చెల్లిస్తున్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం గౌరవ వేతనం వచ్చే నెల నుంచి టీచర్లకు రూ.1,500, ఆయాలకు రూ.750 పెంచడంతో నవంబర్ 1న టీచర్లు రూ.12వేలు, ఆయాలు రూ.7,500 తీసుకోనున్నారు. నిరాశలో అంగన్వాడీలు.. మరోవైపు పనికి తగ్గ వేతనం రావడం లేదని అంగన్వాడీ టీచర్లు, ఆయాలు వాపోతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి కనీస వేతనాల అమలు, పెన్షన్, రిటైర్మెంట్ తర్వాత పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించాలని, కేంద్రాల నిర్వహణను ప్రైవేట్, స్వచ్ఛంద సంస్థలకు అప్పగించొద్దని, జీఓ నం.19 రద్దు చేయాలని తదితర డిమాండ్లతో ఎన్నో ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఇదే విషయమై ఈనెల 5న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్దకు తరలివెళ్లి తమ వాణిని వినిపించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీ, రికార్డుల నిర్వహణ, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నామని, అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు, బీఎల్ఓలుగా ఎన్నికల విధులు నిర్వహిస్తున్నామని వారు చెబుతున్నారు. ఎంతో సంతోషంగా ఉంది మా వేతనాలను ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా రూ.1,500 పెంచు తూ నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. క్షేత్రస్థాయిలో వైద్యసేవలు అందిస్తున్న మమ్మల్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించడం హర్షదాయకం. – సునీత, జిల్లా ఉపాధ్యక్షురాలు, ఆశా కార్యకర్తల సంఘం కనీస వేతనాలు అమలు చేయాలి ఏ ప్రభుత్వ పథకం వచ్చినా లబ్ధిదారులకు చేరాలంటే మేమే ప్రచారం నిర్వహిం చాలి. ఎన్నికల విధుల్లోనూ మమ్మల్ని భాగస్వాములుగా చేస్తున్నారు. కానీ కనీస వేతనం దక్కడం లేదు. కేంద్ర ప్రభుత్వం రూ.750 నుంచి రూ.1,500 వరకు పెంచడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పటిౖMðనా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పెన్షన్ సౌకర్యం కల్పించాలి. – ఎమేలమ్మ, జిల్లా కార్యదర్శి, అంగన్వాడీ వర్కర్స్ ఎంప్లాయీస్ యూనియన్ -
ఆశా, అంగన్వాడీలకు కానుక
న్యూఢిల్లీ: లక్షలాది మంది ఆశా, అంగన్వాడి కార్యకర్తలకు ప్రధాని మోదీ తీపి కబురు అందించారు. అక్టోబర్ నుంచి వారి నెలవారీ గౌరవ వేతనాన్ని పెంచుతున్నట్లు ప్రకటించారు. ఆశా కార్యకర్తలను పలు సామాజిక భద్రతా పథకాల పరిధిలోకి తీసుకొస్తామని, ప్రధాన్మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రైమ్మినిస్టర్ సురక్షా బీమా యోజన కింద ఉచిత బీమా కల్పిస్తామని, ఏదైనా ప్రమాదానికి గురైతే వారికి రూ.4 లక్షల వరకు బీమా పరిహారం చెల్లిస్తామని చెప్పారు. ఆశా, ఏఎన్ఎం, అంగన్వాడీ కార్యకర్తలతో మోదీ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముచ్చటించారు. రూ.3 వేల గౌరవ వేతనం పొందుతున్న వారికి తాజా పెంపుతో ఇకపై రూ.4,500 లభిస్తుంది. అలాగే, రూ.2200గా ఉన్నవారి వేతనం రూ.3,500కు పెరగనుంది. అంగన్వాడీ సహాయకుల గౌరవ వేతనాన్ని రూ.1500 నుంచి రూ.2,500కు పెంచుతున్నట్లు మోదీ వెల్లడించారు. ఈ పెంపు అక్టోబర్ నుంచే అమల్లోకి రాబోతున్నా, నవంబర్ వేతనాల్లో ప్రతిబింబిస్తుందని, ఇది వారికి దీపావళి కానుక అని మోదీ అభివర్ణించారు. కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్(ఐసీడీఎస్–సీఏఎస్) ఉపయోగిస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులకు అదనంగా రూ.250–రూ.500 మధ్య ప్రోత్సాహకాలిస్తామని చెప్పారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తలకు కేంద్రం ప్రోత్సాహకాలు ప్రకటించడం సాధారణమే. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వేరుగా ప్రోత్సాహకాలిస్తాయి. దేశవ్యాప్తంగా సుమారు 14 లక్షల అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ఆరేళ్లలోపున్న చిన్నారులు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు సుమారు 10 లక్షల మంది దాకా ఈ కేంద్రాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. 12,83,707 అంగన్వాడి కార్యకర్తలు, 10,50,564 సహాయకులు వారికి సేవలందిస్తున్నారు. దేశవ్యాప్తంగా సుమారు 10 లక్షల మంది ఆశా కార్యకర్తలు పనిచేస్తున్నారు. ‘ఆయుష్మాన్ భారత్’ తొలి లబ్ధిదారు కరిష్మ.. నవజాత శిశువుల ఆరోగ్యం, పోషణ ప్రమాణాల పరిరక్షణలో ఆశా, అంగన్వాడీ కార్యకర్తలు ముఖ్య పాత్ర పోషిస్తున్నారని మోదీ కొనియాడారు. ఈ నెల 23న జార్ఖండ్లో ప్రారంభించబోతున్న ప్రతిష్టాత్మక ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం ఆయుష్మాన్ భారత్ లబ్ధిదారులను గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని తెలిపారు. హరియాణాలోని కర్నాల్ జిల్లాలో ఇటీవల జన్మించిన కరిష్మ అనే చిన్నారి ఈ పథకంలో తొలి లబ్ధిదారు అని వెల్లడించారు. రక్తహీనత సంబంధిత వ్యాధులను మూడు రెట్లు తగ్గించేందుకు రెట్టింపు ప్రయత్నాలు అవసరమని పిలుపునిచ్చారు. ‘పోషన్ అభియాన్’ లక్ష్యసాధన దిశగా సాంకేతికత సాయంతో వినూత్న పద్ధతుల్లో సేవలందిస్తున్న కార్యకర్తలను మోదీ ప్రశంసించారు. సెప్టెంబర్ మాసాన్ని పోషణకే అంకితం చేస్తున్నామని, గరిష్ట పోషణ ప్రయోజనాలను వివరిస్తూ ఇంటింటికీ ప్రచారం చేపట్టాలని సూచించారు. ఆశా, అంగన్వాడీ కార్యకర్తల వేతన పెంపుపై మహిళా, శిశు సంక్షేమ అభివృద్ధి మంత్రి మేనకా గాంధీ హర్షం వ్యక్తం చేశారు. పని సంస్కృతిని మార్చేశాం న్యూఢిల్లీ: యువత ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం కొత్త పని సంస్కృతిని తీసుకొచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. అణగారిన వర్గాల్లో విశ్వాసం నింపేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని తెలిపారు. వ్యవసాయం, ఆర్థికం, సాంకేతికత సహా అన్ని రంగాల్లో దేశం పురోగమిస్తోందని చెప్పారు. షికాగోలో స్వామి వివేకానంద ప్రసంగించి 125 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కోయంబత్తూరులోని శ్రీరామకృష్ణ మఠం మంగళవారం నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. ‘యువత ఆకాంక్షలు, ఆశయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పని సంస్కృతిలో మార్పులు చేసింది. ఈ సంగతిని గుర్తించి నైపుణ్యాభివృద్ధికే ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేశాం. వినూత్న ఆలోచనలు, అంకుర పరిశ్రమలకు స్టార్టప్ ఇండియా చక్కని వేదికైంది’ అని అన్నారు. -
రెండో రోజూ స్తంభించిన బ్యాంకింగ్ సేవలు
న్యూఢిల్లీ: స్వల్ప వేతనాల పెంపును నిరసిస్తూ బ్యాంకు ఉద్యోగులు తలపెట్టిన రెండు రోజుల సమ్మె గురువారంతో ముగిసింది. దాదాపు 10 లక్షల మంది పైగా ఉద్యోగులు సమ్మెలో పాల్గొనడంతో రెండో రోజున కూడా బ్యాంకింగ్ సేవలు స్తంభించాయి. డిపాజిట్లు, ఫిక్సిడ్ డిపాజిట్లు, ప్రభుత్వ ట్రెజరీ.. మనీ మార్కెట్ లావాదేవీలపై ప్రతికూల ప్రభావం పడటంతో పాటు దేశవ్యాప్తంగా పలు చోట్ల ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు దర్శనమిచ్చాయి. సమ్మె ముగియడంతో శుక్రవారం నుంచి బ్యాంకింగ్ కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థాయికి రానున్నాయి. సమ్మె కాలంలో చెక్కుల క్లియరింగ్ మినహా.. హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ, యాక్సిస్ వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కార్యకలాపాలు యథాప్రకారంగానే కొనసాగాయి. బ్యాంకుల యాజమాన్యాల అసోసియేషన్ ఐబీఏ ఈసారి రెండు శాతమే వేతనాల పెంపును ప్రతిపాదించడాన్ని నిరసిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగులు యూనియన్లు బుధ, గురువారాల్లో రెండు రోజుల సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్, చెన్నై, ముంబై, ఢిల్లీ, లక్నో, గౌహతి మొదలైన ప్రాంతాలన్ని చోట్లా ఉద్యోగులు పాల్గొనడంతో సమ్మె ’విజయవంతం’ అయిందని సమ్మెకు పిలుపునిచ్చిన యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంకింగ్ యూనియన్స్ (యూఎఫ్బీయూ) పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు, పాత తరం ప్రైవేట్ బ్యాంకులు, విదేశీ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు సంబంధించి 80 లక్షల పైచిలుకు చెక్కుల క్లియరింగ్ నిల్చిపోయిందని తెలిపింది. దేశవ్యాప్తంగా అన్ని శాఖలూ మూతబడ్డాయని ఆలిండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ హర్వీందర్ సింగ్ తెలిపారు. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు వంటి ప్రైవేట్ బ్యాంకుల్లో కూడా కొన్ని చోట్ల తమ యూనియన్లలో సభ్యత్వం గల ఉద్యోగులు ఉన్నారని, వారు సైతం సమ్మెలో పాల్గొన్నారని సింగ్ వివరించారు. దాదాపు 9 బ్యాంకు ఉద్యోగుల యూనియన్లు.. యూఎఫ్బీయూలో భాగంగా ఉన్నాయి. మొత్తం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులకు దేశవ్యాప్తంగా 85,000 పైచిలుకు శాఖలు ఉన్నాయి. -
వర్సిటీ కాంట్రాక్టు లెక్చరర్లకు భారీగా వేతనాలు
సాక్షి, హైదరాబాద్ : విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్టైమ్ లెక్చరర్ల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం స్థిరీకరించింది. వేతన స్థిరీకరణ, ఉద్యోగ భద్రత అంశంపై కాంట్రాక్టు, పార్ట్టైమ్ లెక్చరర్లు కొన్నేళ్లుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. విధులు బహిష్కరించి దీర్ఘకాలిక సమ్మె సైతం చేపట్టారు. దీంతో స్పందించిన ఉన్నత విద్యాశాఖ.. గతేడాది రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేసింది. విస్తృతంగా అధ్యయనం చేసిన ఆ కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వగా.. తాజాగా వేతన స్థిరీకరణ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో దాదాపు 1,562 మంది కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు. వీరితోపాటు పలువురు పార్ట్టైమ్ లెక్చరర్లుగా పనిచేస్తున్నారు. వారందరికీ సీనియారిటీ ప్రాతిపదికన వేర్వేరుగా గౌరవ వేతనాలను నిర్ణయించారు. కాంట్రాక్టు లెక్చరర్లకు గౌరవమిది: యూటీఏసీటీఎస్ యూనివర్సిటీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకుల వేతన పెంపుపై యూనివర్సిటీస్ టీచర్స్ అసోసియేషన్ కాంట్రాక్ట్–తెలంగాణ స్టేట్ (యూటీఏసీటీఎస్) హర్షం ప్రకటించింది. వేతనాల పెంపుతో కాంట్రాక్టు, పార్ట్టైమ్ అధ్యాపకుల గౌరవం పెరిగిందని పేర్కొంటూ.. అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు ఏ.పరశురామ్, బి.నిరంజన్ ఒక ప్రకటన విడుదల చేశారు. వేతనాలను స్థిరీకరించినందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరికి కృతజ్ఞతలు తెలిపారు. కాంట్రాక్టు అధ్యాపకులకు.. ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా(ఇంజనీరింగ్ స్ట్రీమ్) లేని అధ్యాపకులకు నెలకు రూ.21,600 ఇస్తుండగా.. ఈ వేతనాలను 75శాతం పెంచాలని ప్రత్యేక కమిటీ సిఫార్సు చేసింది. దీంతో వేతనం రూ.37,800కు పెరగనుంది. నెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఫార్మా (ఇంజనీరింగ్ స్ట్రీమ్) అర్హత ఉన్న అధ్యాపకులకు ప్రస్తుతం నెలకు రూ.24,840 చొప్పున ఇస్తుండగా.. 75 శాతం పెంపుతో రూ.43,470 చొప్పున చెల్లిస్తారు. ఈ అర్హతలు ఉన్న/లేని లెక్చరర్లందరికీ కూడా అదనంగా సర్వీసు, సీనియారిటీ ఆధారంగా ఏడాదికి 3 శాతం చొప్పున పెంపు ఉంటుంది. అంటే అర్హతలు లేని వారికి ఏడాది సర్వీసుతో రూ.38,930 వేతనం అందుతుంది. అర్హతలున్న వారికి ఏడాది సర్వీసుతో రూ.44,700 వేతనం వస్తుంది. ఇలా ఏటా సీనియారిటీ పెరిగిన కొద్దీ వేతనం పెరుగుతుంది. ఇక అదనపు అర్హతలున్న అధ్యాపకులకు ఏటా ఒకసారి రూ.3 వేలు చొప్పున అందజేస్తారు. పార్ట్టైమ్ అధ్యాపకులకు.. ఇక ఉస్మానియా వర్సిటీలో పనిచేస్తున్న పార్ట్టైమ్ అధ్యాపకుల్లో నెట్, సెట్, స్లెట్, పీహెచ్డీ లేదా ఎంటెక్, ఎంఈ, ఎంఫార్మా లేనివారికి ప్రస్తుతం థియరీ క్లాసుకు రూ.475 చొప్పున, గంట పాటు ప్రాక్టికల్ క్లాసుకు రూ.220 చొప్పున గౌరవ వేతనంగా ఇస్తున్నారు. కమిటీ ప్రతిపాదనల మేరకు.. థియరీ క్లాసుకు రూ.600 చొప్పున, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.300 చొప్పున ఇవ్వనున్నారు. అదే అర్హతలున్న పార్ట్టైమ్ అధ్యాపకులకు థియరీ క్లాసుకు రూ.700, గంట ప్రాక్టికల్ క్లాసుకు రూ.350 చొప్పున అందజేస్తారు. -
కాగ్నిజెంట్ ‘కీ’ ఎగ్జిక్యూటివ్ల వేతన పెంపు కేవలం...
ఐటీ దిగ్గజం కాగ్నిజెంట్ తన కీలక ఎగ్జిక్యూటివ్లకు వేతన పెంపును కేవలం సింగిల్-డిజిట్లోనే చేపట్టింది. కాగ్నిజెంట్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఫ్రాన్సిస్కో డి సౌజాతో పాటు మిగతా ఇద్దరు టాప్ ఎగ్జిక్యూటివ్లు - అధ్యక్షుడు రాజీవ్ మెహతా, చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ కరేన్ మెక్లౌగ్లిన్ వేతనాలను 2017లో కేవలం 3 శాతం నుంచి 8 శాతం మధ్యలోనే పెంచినట్టు వెల్లడైంది. మార్కెట్ ట్రెండ్లను పరిగణలోకి తీసుకున్న కాగ్నిజెంట్ ఈ మేరకు మాత్రమే వేతన పెంపును చేపట్టింది. ప్రత్యక్ష పరిహారాల్లో డి సౌజా పరిహారాలు మొత్తంగా 3 శాతం పెరిగాయి. 2017లో ఈయన పరిహారాలు 12.23 మిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 3 శాతం మాత్రమే పెరిగాయి. ఇక మెహతా పరంగా చూసుకుంటే, ఆయన 2016 సెప్టెంబర్లో అధ్యక్షుడిగా ప్రమోషన్ పొందినప్పుడు 14 శాతం పెంపు చేపట్టారు. అనంతరం 2017లో మొత్తంగా ప్రత్యక్ష పరిహారాల్లో కేవలం 3 శాతం పెంపును మాత్రమే ఆయన పొందినట్టు తెలిసింది. ఆయన వార్షిక పనితీరు పరంగా ఇచ్చే స్టాక్ యూనిట్లు, నియంత్రిత స్టాక్ యూనిట్లు 2016 నుంచి 3 శాతం, 4 శాతం చొప్పున పెరిగాయి. మెక్లౌగ్లిన్ కూడా మొత్తంగా 2017లో తన ప్రత్యక్ష పరిహారాల్లో 8 శాతం పెంపును పొందారు. అయితే 2016లో ఆమెకు బేస్ శాలరీ, వార్షిక నగదు ప్రోత్సహాకాల్లో 17 శాతం పెంపు ఉంది. ఆమె పీఎస్యూ, ఆర్ఎస్యూ గ్రాంట్లు 5 శాతం, 6 శాతం చొప్పున ఉన్నాయి. 2017, 2016లలో కంపెనీ పనితీరు పరంగా ఎగ్జిక్యూటివ్ల పరిహారాల పెంపును చేపట్టామని కంపెనీ చెప్పింది. పరిశ్రమ అంచనాలు, కంపెనీ లక్ష్యాలు, ఎగ్జిక్యూటివ్ల పనితీరు, బాధ్యత, ఎగ్జిక్యూటివ్ టాలెంట్ మార్కెట్ వంటి అన్నీ అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు పేర్కొంది. -
భారత క్రికెటర్ల జీతాలు భారీగా పెంపు!
సాక్షి, స్పోర్ట్స్ : టీమిండియా క్రికెటర్ల పంట పండనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) త్వరలోనే ఆటగాళ్లకు శుభవార్త తెలపనుంది. బీసీసీఐ బోర్డు పరిధిలో ఆడుతున్న వారందరి జీతాలు భారీగా పెరగనున్నాయి. భారత పురుషుల, మహిళల జట్టుతో పాటు దేశవాళి, అండర్-19 క్రికెటర్ల జీతాలు పెరగనున్నాయని బీసీసీఐ అధికారి ఒకరు ఓ జాతీయ చానెల్కు తెలిపారు. దీనికి సంబందించిన ప్రక్రియ దాదాపు పూర్తైందని.. సుప్రీం కోర్టు నియమిత పాలకుల కమిటీతో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆ అధికారి వెల్లడించారు. ఇక భారత పురుషుల జట్టు శ్రీలంక పర్యటనకు ముందే సుమారు 25 మంది క్రికెటర్లను ఏ,బీ, సీ మూడు కేటగిరీలుగా విభజించి వార్షిక కాంట్రాక్టులు అమలు చేయనున్నారు. జీతాల పెంపునకు ఆర్థిక కమిటీ ఆమోదం తెలుపడమే తరువాయి ఐపీఎల్ కన్నా ముందే ఆటగాళ్లకు కాంట్రాక్టులను ఇవ్వాలని బీసీసీఐ యోచిస్తోంది. ఏడాదికి గ్రేడ్-ఏ క్రికెటర్లకు దాదాపుగా రూ.12కోట్లు, బి-గ్రేడ్ రూ.8 కోట్లు, సీ-గ్రేడ్ నాలుగు కోట్లు ఇవ్వనున్నట్లు ఆ అధికారి వెల్లడించారు. ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ఆటగాళ్లకు ఏ స్థాయి గ్రేడ్ ఇవ్వాలనేదాన్ని నిర్ణయిస్తుంది. ఆటగాళ్ల జీతాలు పెంచాలని గతంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ, మహేంద్రసింగ్ ధోనీ, కోచ్ రవిశాస్త్రిలు బీసీసీఐ,పాలకుల కమిటీతో చర్చించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం గ్రేడ్ ఏ ఆటగాళ్లు రూ.2 కోట్లు, గ్రేడ్ బీ రూ.1 కోటి, గ్రేడ్ సీ ఆటగాళ్లకు రూ.50 లక్షల వార్షిక వేతనం పొందుతున్నారు. -
చాకిరి పోస్టు
‘‘అందరికీ నువ్వు ఆప్త బంధువు. అందరికీ నువ్వు వార్తనందిస్తావు. నీ కథనం మాత్రం నీటిలోనే మథనం. ఇన్ని ఇళ్లు తిరిగినా నీ గుండెబరువు దింపుకోవడానికి ఒక్క గడపా లేదు.’’ అంటూ అభ్యుదయ కవి దేవరకొండ బాలగంగాధర తిలక్ ‘అమృతం కురిసిన రాత్రి’ కవితా సంపుటిలో పోస్టుమన్ దీనస్థితిని తెలియజేశారు. ఈ విషయాన్ని ఆయన అర శతాబ్దం కిందటే కవిత రూపంలో వివరించారు. అయితే.. ఇప్పటికీ తపాలా ఉద్యోగుల జీవితాల్లో వెలుగు లేదు. చాలీచాలని వేతనాలతో అవస్థ పడుతున్నారు. కర్నూలు (ఓల్డ్సిటీ): గ్రామీణ తపాలా ఉద్యోగులను గ్రామీణ డాక్ సేవక్స్ (జీడీఎస్లు) అని కూడా పిలుస్తారు. వీరు ఏళ్ల తరబడి అనేక అవస్థలు పడుతూ విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తరాలు, పార్శిళ్ల బట్వాడా, పొదుపు సభ్యులను చేర్పించడం, డిపాజిట్ల పెంపు, బీమా పాలసీలు చేయించడం వంటి పనులు చేస్తున్నారు. అయినా వీరికి వేతన భరోసా లేదు. పోస్టుమాస్టర్ స్థాయి ఉద్యోగికి కూడా నెలకు రూ.10 వేల వేతనం మించడం లేదు. జీడీఎస్లు రోజుకు మూడు నుంచి ఐదు గంటలు మాత్రమే సేవలు అందిస్తారని భావించిన ప్రభుత్వం.. గతంలో ఆ పని గంటలకు మాత్రమే వేతనం నిర్ణయించింది. నెలకు రూ. 2,265 వేతనంతో పాటు డీఏ రూ.6,000 అందజేస్తోంది. ఉద్యోగ విరమణ తర్వాత పింఛన్ ఇవ్వడం లేదు. పిల్లలకు విద్య, వైద్యం వంటి సౌకర్యాలు వర్తించడం లేదు. ఈ ఉద్యోగుల విధి విధానాలు, వేతనాలు తదితర అంశాలపై ఉన్నతాధికారులతో నియమించిన ఓ కమిటీ ప్రతి ఐదేళ్లకొకసారి అధ్యయనం చేసి.. నివేదికను ప్రభుత్వానికి అందజేస్తుంది. అయితే..అందులోని అంశాలు అమలు కావడం లేదు. జిల్లాలో 902 మంది ఉద్యోగులు.. జిల్లాలో జీడీఎస్ పరిధిలో బ్రాంచ్ పోస్టుమాస్టర్లు 442 మంది ఉన్నారు. అలాగే మెయిల్ కొరియర్లు 170, మెయిల్ డెలివర్స్ 268, ఇతర విభాగాల్లో 22 మంది పనిచేస్తున్నారు. మొత్తం 902 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. అన్ని ప్రభుత్వ శాఖల్లో అదనపు పనికి అదనపు వేతనం వంటి నిబంధనలు అమలవుతున్నా.. తపాలా శాఖలో మాత్రం లేదు. పేమెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా జీడీఎస్ల పాత్ర ఉంటుందని అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన అనేక పథకాలను ప్రజల్లోకి తీసుకెళుతున్నా.. గ్రామీణ డాక్ సేవక్లను మాత్రం పట్టించుకోవడం లేదు. గతంలో కంటే పనిగంటలు పెరిగాయి. అందుకు తగ్గ ప్రతిఫలం మాత్రం దక్కడం లేదు. అమలు కాని కమలేశ్ చంద్ర కమిటీ సిఫారసులు దేశంలోని 2.70 లక్షల మంది జీడీఎస్ల వేతనాల పెంపు కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమలేశ్ చంద్ర కమిటీ సిఫారసులు అమలుకావడం లేదు. కమిటీ నివేదిక వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదు. ప్రభుత్వాల నిర్లక్ష్యం: గ్రామీణ డాక్ సేవక్ల పట్ల ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. కమిటీలు చేసే సిఫారసులను కూడా అమలు చేయడంలేదు. 25 ఏళ్లుగా కటారుకొండలో ఉద్యోగం చేస్తున్నా. పని ఎక్కువైంది. ఎనిమిది గంటలు పనిచేస్తున్నప్పటికీ రూ.12 వేల వేతనం కూడా రావడం లేదు. కుటుంబ పోషణకు అవస్థ పడుతున్నా. -కాంతారెడ్డి, బ్రాంచ్ పోస్టుమాస్టర్ కనికరించని పాలకులు: కమిటీలు చేసిన సిఫారసులను పాలకులు పట్టించుకోవడం లేదు. తపాలా వ్యవస్థ, ప్రభుత్వ పథకాల అమలు గ్రామీణ డాక్ సేవక్లపై ఆధారపడి ఉన్నాయి. నన్నూరు బీపీఎంగా ఉండి..శాఖా ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా. కనీసం మా జీవన స్థితిగతులను పాలకులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం. - రాధ, గ్రామీణ డాక్ సేవక్ పేరుకే ఉద్యోగులం: ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి. - ఎ.ఆల్ఫ్రెడ్, జీడీఎస్ ప్యాకర్ పేరుకే ఉద్యోగులం: ముప్ఫై ఏళ్లుగా గ్రామీణ డాక్ సేవక్గా పనిచేస్తున్నా. ప్రస్తుతం నెలకు రూ.8 వేల వేతనం వస్తోంది. షుగర్, బీపీ వంటి ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. ఒకసారి హార్ట్ స్ట్రోక్ కూడా వచ్చింది. ఇటీవలే పక్షవాతానికి గురయ్యా. ఇంగ్లిష్ వైద్యానికి డబ్బుల్లేక నంద్యాల సమీపంలో పసరు వైద్యం చేయించుకున్నా. మాకు వైద్యం కూడా ఉచితంగా అందని దుస్థితి. - ఎ.ఆల్ఫ్రెడ్, జీడీఎస్ ప్యాకర్ -
ఎమ్మెల్యేల వేతనాలు పెంపు, జనం ఫైర్
చెన్నై: తమిళనాడు ఎమ్మెల్యేల వేతనాలు భారీగా పెరిగాయి. శాసనసభ్యుల నెలవారీ వేతనం రూ.55 వేల నుంచి లక్షా 5 వేల రూపాయలకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. శాసనసభ్యుల స్థానిక సంస్థల అభివృద్ధి నిధులను రూ. 2 కోట్ల నుంచి రెండున్నర కోట్లకు పెంచినట్టు ఆయన ప్రకటించారు. ఎమ్మెల్యేల వేతనాల పెంపుపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. కనీస మద్దతు ధర కోసం రైతులు రోడ్డక్కినా ప్రభుత్వం పట్టించుకోదు గానీ.. ఎమ్మెల్యేల వేతనాలు మాత్రం పెంచిందని జనం మండిపడుతున్నారు. మరోవైపు తమ సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తమిళ రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈరోజు రైతుల ఆందోళనలో కాంగ్రెస్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నారు. అన్నదాతలకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు పెంపు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లకు శుభవార్త. ఇన్నాళ్లు జీతాల పెంపుకోసం వారు చేసిన పోరాటాలకు ప్రతిఫలం లభించింది. వారి జీతాలు రూ.10వేల వరకూ పెరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు రూ. 27 వేల నుంచి రూ. 37,100కు పెంచుతూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 3,687 మంది కాంట్రాక్టు లెక్చరర్లకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పెంపు ద్వారా ప్రభుత్వంపై ప్రతీ ఏటా రూ. 37 కోట్లకు పైగా అదనపు భారం పడనుంది. వేతనాల పెంపుపై శాసనమండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్రెడ్డి స్పందిస్తూ.. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్ల జీతాలను 2015 పీఆర్సీ స్కేల్కు అనుగుణంగా పెంచడం చాలాగొప్ప విషయం. సీఎం కేసీఆర్ మానవతా దృక్పథం వల్లే ఇది సాధ్యమైందన్నారు. -
కష్టకాలంలో విప్రో ఉద్యోగులకు తీపికబురు
ఓ వైపు ఐటీ పరిశ్రమ గడ్డు పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో వ్యయాలు తగ్గించుకోవడానికి ఉద్యోగాల కోతను చేపడుతూ, వేతనాల ఇంక్రిమెంట్లను కంపెనీలు వాయిదావేస్తుంటాయి. కానీ టెక్ దిగ్గజం విప్రో తన ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పెంచిన వేతనాలు ఈ నెల 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించింది.'' సగటున, ఆఫ్ షోర్ ఉద్యోగులకు మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని చెప్పింది. అదేవిధంగా ఆన్ సైట్ ఉద్యోగులకు వారి వారి భౌగోళిక ప్రాంతాల బట్టి తక్కువ స్థాయి నుంచి మిడ్-సింగిల్ అంకెలలో ఇంక్రిమెంట్ ఉంటుందని పేర్కొంది. మంచి ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు వారి పరిహారాలను భారీగా పెంచుతూ రివార్డు ఇవ్వనున్నట్టు తెలిపింది. గతేడాది విప్రో ఆఫ్ షోర్ ఉద్యోగులకు సగటున 9.5 శాతం వేతనాన్ని పెంచింది. ఆన్ సైట్ ఉద్యోగులకు 2 శాతం పెంపు చేపట్టింది. కానీ 2016-17 ఆర్థిక ఫలితాలను ప్రకటించిన విప్రో వార్షికంగా ఈ కంపెనీ 4.7 శాతం మేర పడిపోయిందని తెలిపింది. నాలుగో త్రైమాసికంలో ఐటీ సర్వీసుల రెవెన్యూలూ కూడా స్వల్పంగా పడిపోయాయి. సోమవారం తెలిసిన వివరాల్లో కంపెనీ చైర్మన్ అజిమ్ ప్రేమ్ జీ వేతనం కూడా భారీగా తగ్గినట్టు తెలిసింది. ఎలాంటి కమిషన్లను 2016-17లో అజిమ్ ప్రేమ్ అందుకోలేదు. మొత్తంగా ప్రేమ్ జీ వేతనం ముందటి ఆర్థిక సంవత్సరం కంటే 63 శాతం తగ్గి, రూ.79 లక్షలను మాత్రమే పొందారు. మరో టెక్ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు వేతనాల ఇంక్రిమెంట్లను జూలై 1వరకు వాయిదావేస్తున్నట్టు అంతకముందే పేర్కొంది. -
వేతన పెంపు జూలై నుంచి..: ఇన్ఫీ
న్యూఢిల్లీ: దేశీ రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ తాజాగా ఉద్యోగుల వేతన పెంపును జూలైకి వాయిదా వేసింది. సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ విషయంలో జీతాల పెంపు మరింత ఆలస్యం కావొచ్చని తెలిపింది. కంపెనీ అమెరికా వంటి కీలక మార్కెట్లలో వీసా సంబంధిత సమస్యలను ఎదుర్కోవడం సహా పలు ప్రతికూల పరిస్థితులతో సతమతమౌతుండటం దీనికి కారణంగా కనిపిస్తోంది. ఇన్ఫోసిస్ సాధారణంగా ఏప్రిల్ నుంచి ఇంక్రిమెంట్లను ఇవ్వడం ప్రారంభిస్తుంది. ఈ ఏడాది మాత్రం వేతన పెంపును తర్వాతి త్రైమాసికం అంటే జూలైకి వాయిదా వేసింది. ఇన్ఫోసిస్లో రెండు లక్షలకు పైగా ఉద్యోగులున్నారు. జాబ్ లెవెల్ 5, దీని కన్నా దిగువ స్థాయి ఉద్యోగులకు వేతన సమీక్ష జులై నుంచి ఉంటుందని ఇన్ఫోసిస్ సీఓఓ యూబీ ప్రవీణ్ రావు ఉద్యోగులకు రాసిన ఈ–మెయిల్లో తెలిపారు. ఇతర స్థాయిల్లోని ఉద్యోగులకు వేతన సమీక్ష తర్వాతి త్రైమాసికాల నుంచి ఉంటుందని పేర్కొన్నారు. ఉద్యోగాల కోత అంశాన్ని ప్రస్తావిస్తూ.. పనితీరు ఆధారంగా తొలగింపు ఉంటుందని తెలిపారు. భారీ ఉద్వాసనలు ఉండవు..: నాస్కామ్ నాస్కామ్ ఉద్యోగాల తొలగింపు భయాలను తగ్గించడానికి ఐటీ పరిశ్రమ సమాఖ్య నాస్కామ్ ప్రయత్నిస్తోంది. పరిశ్రమలో భారీ ఉద్యోగాల కోత ఉండదని పేర్కొంది. ఉద్యోగుల పునర్వ్యవస్థీకరణ అనేది సర్వసాధారణమని, ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంటుందని తెలిపింది. అధిక సంఖ్యలో ఉద్యోగుల తొలగింపు వార్తలు తప్పని పేర్కొంది. పనితీరు మదింపు ప్రక్రియలు కంపెనీల్లో ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని తెలిపింది. -
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
-
ఆశా వర్కర్ల జీతం రూ.6వేలుకు పెంపు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లతో సమావేశం అయ్యారు. ప్రగతి భవన్లో జరిగిన ఈ సమావేశంలో ఆయన ఆశా వర్కర్ల జీతం నెలకు రూ.6వేలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. అలాగే మరోసారి కూడా జీతం పెంచనున్నామని, వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్ల జీతాల పెంపుపై ప్రత్యేకంగా దృష్టి పెడతామని తెలిపారు. అలాగే ఖాళీగా ఉన్న 1200 ఏఎన్ఎమ్ పోస్టుల భర్తీలో ఆశా వర్కర్లకు తొలి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. అంతేకాకుండా అంగన్వాడి వర్కర్లతో సమానంగా ఆశా వర్కర్లకు జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఏడాదికి ఆరున్నర లక్షల ప్రసవాలు జరిగితే, అందులో కేవలం రెండున్నర లక్షలు మాత్రమే ఆస్పత్రిలో జరుగుతున్నాయన్నారు. గ్రామ ఆరోగ్య పరిరక్షణ బాధ్యత ఆశా వర్కర్లదేనని, వారి పని ఏంటనేది త్వరలోనే కార్యచరణ రూపొందిస్తామన్నారు. ప్రజలు కూడా ఆశా వర్కర్లను వెటకారం చేసే పరిస్థితి మారాలని సీఎం సూచించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50శాతం జీతాలు పెంపు
అమరావతి: ఆంధ్రప్రదేశ్ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు తీపి కబురు అందించింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు 50 శాతం జీతాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏప్రిల్ నుంచి పెంచిన జీతాలు అమల్లోకి రానున్నాయి. ఈ సందర్భంగా మంత్రులు కామినేని శ్రీనివాస్, కాల్వ శ్రీనివాసులు మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించమని, కాంట్రాక్ట్ ఉద్యోగులను ఆయా శాఖలు రెన్యువల్ చేస్తాయన్నారు. అయితే కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి భవిష్యత్లో ఆర్థిక శాఖ అనుమతి తప్పనిసరి అని వారు తెలిపారు. -
ఇన్ఫీలో మళ్లీ జీతాల రగడ!
⇒ కంపెనీ టాప్ ఎగ్జిక్యూటివ్లకు భారీగా వేతనాల పెంపు ఘోరం ⇒ కింది స్థాయి ఉద్యోగులు త్యాగాలు చేయాలా...? ⇒ ఇలా అయితే వారిలో విశ్వాసం సన్నగిల్లుతుంది ⇒ ఇన్ఫోసిస్ విధానాలను తప్పుబట్టిన నారాయణమూర్తి, బాలకృష్ణన్ ⇒ మరోసారి వ్యవస్థాపకులకు, యాజమన్యానికి మధ్య రాజుకున్న వివాదం బెంగళూరు: ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులు, కంపెనీ యాజమాన్యానికి మధ్య మరోసారి వివాదం రగులుకుంది. సీవోవో ప్రవీణ్రావు పారితోషికాన్ని భారీగా పెంచుతూ చేసిన ప్రతిపాదనకు కంపెనీ వాటాదారులు తాజాగా ఆమోదం తెలిపారు. దీంతో మరోసారి ఈ అంశంపై మాటల యుద్ధం మొదలైంది. వేతనాల విషయంలో కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో ఉన్నత ఉద్యోగులకు పారితోషికాలు భారీగా పెంచడం ఏవిధంగా సమంజసమని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకులైన ఎన్ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. చాలా వరకు కింది స్థాయి ఉద్యోగులకు 6 నుంచి 8 శాతం మేర వేతనాలు పెంచుతూ టాప్ ఎగ్జిక్యూటివ్లకు 60 నుంచి 70 శాతం పెంచడం అనైతికమన్నారు. దీనివల్ల కంపెనీ నాయకత్వం, బోర్డుపై కింది స్థాయి ఉద్యోగుల్లో నమ్మకం పోతుందని నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఇన్ఫోసిస్ మరో సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఎఫ్వో వి.బాలకృష్ణన్ కూడా నారాయణమూర్తికి మద్దతుగా స్వరం కలిపారు. కింది స్థాయి ఉద్యోగులను త్యాగాలు చేయాలని కోరుతూ అదే సమయంలో పై స్థాయి ఉద్యోగుల వేతనాలను 40–50 శాతం పెంచడం అన్నది ఏ యాజమాన్యానికైనా ఘోరమైన విషయమని విమర్శించారు. ఇన్ఫోసిస్లో పాలనాపరంగా అత్యున్నత ప్రమాణాలు, విలువలతో ఏర్పాటు చేసిన వ్యవస్థను ప్రస్తుత నాయకత్వం నాశనం చేస్తోందని మండిపడ్డారు. ఇన్ఫోసిస్ చైర్మన్ ఆర్.శేషసాయి తన బాధ్యతల నుంచి వైదొలగాలని, ప్రమాణాల పరిరక్షణకు గాను బోర్డును తిరిగి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బాలకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ప్రవీణ్రావుకు వార్షికంగా అన్ని రకాల పరిహారాలు కలిపి రూ.8.5 కోట్లు చెల్లించాలని ఇన్ఫోసిస్ బోర్డు గతంలో నిర్ణయం తీసుకుంది. కాగా, కంపెనీ బోర్డుకు, వ్యవస్థాపకుల మధ్య మాటల వివాదం ఇదే మొదటి సారి కాదు. రెండు నెలల క్రితం కంపెనీ సీఈవో విశాల్ సిక్కాతోపాటు నాడు ఉద్యోగులుగా ఉన్న రాజీవ్ బన్సాల్, డేవిడ్ కెన్నడీలకు భారీగా వేతనాలను పెంచడంతో అప్పుడు కూడా కంపెనీ వ్యవస్థాపకులు తప్పుబట్టారు. కంపెనీలో ప్రమోటర్లకు 13 శాతం వాటా ఉంది. నిజమే.. సహేతుకంగా లేదు నారాయణమూర్తి అభ్యంతరాలను ఇన్ఫోసిస్ బోర్డు మాజీ డైరెక్టర్ టీవీ మోహన్దాస్ పాయ్ కూడా సమర్థించారు. సీవోవో యూబీ ప్రవీణ్రావు వేతన పెంపు సహేతుకంగా లేదన్నారు. వేతన పెంపు అద్భుతంగా ఉందని, కానీ ఆయన పనితీరు మాత్రం అలా లేదన్నారు. ఇన్ఫోసిస్ బోర్డు తప్పుదోవ పట్టిందని, గతంలో సీఈవో విశాల్ సిక్కాకు అసమంజసంగా పారితోషికం పెంచారని, దీనివల్ల ఇతర ఎగ్జిక్యూటివ్లు సైతం అధిక వేతనాన్ని ఆశించారని పేర్కొన్నారు. మూర్తితో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నానని, పారితోషికాలకు సంబంధించి మనకంటూ విధానాలు ఉన్నాయని, అమెరికా విధానాలను అనుసరించరాదని, ఇన్ఫోసిస్ అమెరికా కంపెనీ కాదన్నారు. ఐటీ పరిశ్రమలో ప్రారంభ స్థాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్ల వేతనాలు గత ఏడేళ్లుగా పెరగలేదని, ఈ దృష్ట్యా ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్ల వేతనాలను పెంచుకోవడం పూర్తిగా తప్పుడు చర్యగా పేర్కొన్నారు. పెంపు సరైనదే: ఇన్ఫోసిస్ కంపెనీ సీవోవో ప్రవీణ్రావుకు పారితోషికాన్ని పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని ఇన్ఫోసిస్ సమర్థించుకుంది. వాస్తవిక పెంపు 1.4 శాతమేనని పేర్కొంది. ‘‘నగదు విధానంలో చెల్లించే మొత్తం రూ.5.2 కోట్ల నుంచి 4.6 కోట్లకు తగ్గింది. అదే సమయంలో పనితీరు ఆధారితంగా చెల్లించే మొత్తం 45 శాతం నుంచి 63 శాతానికి పెరిగింది. రావుకు కేటాయించిన స్టాక్స్ (ఈఎస్వో)ను పొందేందుకు వేచి ఉండే నాలుగేళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే పెంపు కేవలం 1.4 శాతంగానే ఉంటుంది’’ అని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి వ్యాఖ్యలను ఫీడ్బ్యాక్గా తీసుకుంటామని, కంపెనీ దీర్ఘకాలిక ప్రయోజనాల దృష్ట్యా భాగస్వాములతో కలసి పనిచేస్తామని తెలిపింది. -
వీఆర్ఏల వేతనం పెంపు
- రూ.10,500కు పెంచాలని సీఎం కేసీఆర్ నిర్ణయం - ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి - స్వగ్రామాల్లో డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు - రెగ్యులర్ నియామకాల్లో 30 శాతం రిజర్వేషన్ - రాష్ట్రంలోని 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం సాక్షి, హైదరాబాద్: వారసత్వంగా పనిచేస్తున్న విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ల (వీఆర్ఏ)పై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు వరాలు కురిపించారు. వీఆర్ఏల వేతనాలను 64.61 శాతం పెంచనున్నట్లు సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రకటించారు. దీంతో ప్రస్తుతం నెలకు రూ.6,500గా ఉన్న వీఆర్ఏల వేతనం రూ.10,500కు పెరగనుంది. అదనంగా రూ.200 తెలంగాణ రాష్ట్ర సాధన ఇంక్రిమెంట్ను కూడా ఇవ్వనున్నారు. మొత్తంగా ఒక్కో వీఆర్ఏ వేతనం రూ.4,200 చొప్పున పెరుగుతుంది. ఏప్రిల్ 1 నుంచి పెంచిన వేతనాలు అమలులోకి వస్తాయి. గ్రామాల్లో నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు చేస్తున్నందున ప్రతీ వారసత్వ వీఆర్ఏకు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. తమ స్వగ్రామంలో ఇల్లు కట్టివ్వాలని, వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. వీఆర్వో, అటెండర్, డ్రైవర్ తదితర ఉద్యోగాల నియామకాల్లో 30 శాతం ఉద్యోగాలు వీరికి రిజర్వు చేయనున్నట్లు ప్రకటించారు. వెట్టి తదితర పేర్లతో పిలుస్తున్న వారందరినీ ఇకపై గౌరవంగా వీఆర్ఏలు అని సంబోధించాలని సీఎం ఆదేశించారు. ఈ నిర్ణయాలతో రాష్ట్రంలో వారసత్వంగా పనిచేస్తున్న 19,345 మంది వీఆర్ఏలకు ప్రయోజనం చేకూరుతుంది. వీఆర్ఏ ప్రతినిధులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్రెడ్డి, చందూలాల్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. వీఆర్ఏ(డైరెక్ట్ రిక్రూటీస్) సంఘం అధ్యక్షుడు వింజమూరి ఈశ్వర్, ప్రధాన కార్యదర్శి అంబాల శ్రీధర్, మహిళా విభాగం అధ్యక్షురాలు బాలామణి, వీఆర్ఏ(డిపెండెంట్స్) సంఘం రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎల్లన్న, రాజయ్య, కార్మిక సంఘం నాయకులు జి.రాంబాబుయాదవ్, పి.నారాయణ తదితరులు సీఎంతో చర్చలు జరిపారు. ఒకటో తారీఖున వేతనం.. ‘ప్రభుత్వానికి ఆర్థికంగా భారమైనప్పటికీ గ్రామస్థాయిలో అందుబాటులో ఉండి వీఆర్ఏలు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా జీతాలను పెంచుతాం. ప్రతి నెలా ఒకటో తారీఖున మిగతా ప్రభుత్వ ఉద్యోగులకు అందుతున్నట్లే వీరికీ వేతనం అందాలి. వీఆర్ఏలకు గౌరవం కూడా పెరగాలి. వెట్టి, మస్కూరి, కావల్ కార్, కాన్ దార్ తదితర పేర్లతో వీరిని పిలుస్తున్నారు. ఇకపై అలా పిలవవద్దు. ఏ పని చేసే వారైనా సరే వీఆర్ఏ అని మాత్రమే పిలవాలి. పెరిగిన జీతం, ప్రభుత్వం ఇచ్చే ఇల్లు, పిలిచే పిలుపుతో వీఆర్ఏల ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం పెంచాలనేదే ప్రభుత్వ లక్ష్యం..’అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. డైరెక్ట్ రిక్రూటీల రెగ్యులరైజ్.. పబ్లిక్ సర్వీస్ పరీక్ష రాసి వీఆర్ఏలుగా పని చేస్తున్న వారందరినీ రెగ్యులరైజ్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ‘కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాలు ఏర్పాటు చేయడం వల్ల చాలా పోస్టులు అవసరమవుతాయి. ఇంకా ప్రభుత్వంలో ఖాళీలను కూడా గుర్తించాలి. వీరందరినీ రెగ్యులర్ చేయాలి’అని సీఎం అన్నారు. వెంటనే విధివిధానాలు తయారు చేయాలని టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంజీ గోపాల్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ నిర్ణయంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా పరీక్ష రాసి ఉద్యోగం పొందినప్పటికీ.. తక్కువ వేతనంతో పని చేస్తున్న 2,900 మంది డెరెక్ట్ రిక్రూట్ వీఆర్ఏలకు లబ్ధి చేకూరుతుంది. -
జీతాల పెంపు అంతంత మాత్రమేనట!
న్యూఢిల్లీ: వేతనాలు పెంపుపై ఆశపడే ఉద్యోగులకు షాకింగ్ న్యూస్. ఆశించిన రీతిలో ఉద్యోగుల వేతనాల వృద్ధి వచ్చే ఏడాది ఉండదని గణాంకాలు చెబుతున్నాయి. ఈ ఏడాదితో పోలిస్తే 2017లో వేతనాల వృద్ధి తగ్గుతుందని పేర్కొంటున్నాయి. ఈ ఏడాది 10.3 శాతంగా ఉన్న కనీస వేతన వృద్ధి వచ్చే ఏడాది 10 శాతంగానే ఉంటుందని తాజా రిపోర్టు పేర్కొంది. కార్న్ ఫెర్రీ హే గ్రూప్ 2017 వేతన అంచనాల గణాంకాల్లో ఈ విషయం తెలిసింది. భారతీయులు వేతన వృద్ధి 2017లో 10 శాతంగా ఉంటుందని, ఆఖరికి ఉద్యోగుల చేతిలోకి వచ్చే వాస్తవ వేతన పెంపు 4.8 శాతంగానే ఉంటుందని అంచనావేస్తున్నట్టు కార్న్ ఫెర్రీ హే గ్రూప్ తమ రిపోర్టులో వెల్లడించింది. ద్రవ్యోల్బణం తగ్గిన నేపథ్యంలో ఉద్యోగులకు ఆశించిన స్థాయిలో జీతం పెరగదని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా దేశాలతో పోలిస్తే భారత్లో మెరుగైన వేతనాల పెంపు ఉందని రిపోర్టు చెప్పింది. వచ్చే రెండు సంవత్సరాల్లో 9.5-10.5 శాతంలోనే జీతాలు పెరుగుతాయని అంచనావేస్తున్నామని కార్న్ ఫెర్రీ హే గ్రూప్ దేశీయ మేనేజర్ అమీర్ హలీమ్ పేర్కొన్నారు. ఆసియా పరంగా చూసుకుంటే గతేడాది కంటే 0.3 శాతం తక్కువగా వేతనాల పెరుగుదల 6.1 శాతంగానే ఉంటుందని చెప్పారు. ఇదే సమయంలో వాస్తవ జీతాల పెంపు 4.3 శాతంగా ఉంటుందని వివరించారు. వాస్తవ వేతన పెరుగుదల ఎక్కువగా వియత్నాం(7.2శాతం), థాయ్లాండ్(5.6శాతం), ఇండోనేషియా(4.9శాతం)లో ఉంటుందన్నారు. మొత్తం 110 దేశాల్లో 25వేల సంస్థల్లో 20 మిలియన్ జాబ్ హోల్డర్స్ డేటా ఆధారంగా ఈ జీతాల పెంపు డేటాను విడుదల చేశామని హే గ్రూప్ పేర్కొంది. -
భారీగా పెరిగిన ఎంపీల వేతనాలు
న్యూఢిల్లీ : పార్లమెంట్ సభ్యులకు శుభవార్త. ఎంపీల వేతనాలు 100 శాతం పెంపుకు ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంవో) ఆమోదం తెలిపింది. దీంతో పార్లమెంట్ సభ్యులకు ప్రస్తుతమున్న వేతనం రూ.50 వేల నుంచి రెండింతలు పెరిగి లక్ష రూపాయలకు చేరుకుంది. కేవలం వేతనాలను మాత్రమే కాక, అలవెన్స్లను కూడా పీఎంవో సమీక్షించింది. పీఎంవో ఆమోదంతో మొత్తంగా పార్లమెంట్ సభ్యులు అందుకునే వేతనాలు నెలకు రూ.1,90,000 నుంచి రూ.2,80,000 కు ఎగిశాయి. ఈ వేతన ప్రతిపాదనను బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్ అధినేతగా పార్లమెంట్ సభ్యుల వేతన, అలవెన్స్ జాయింట్ కమిటీ రూపొందించింది. అంతకముందు ఎంపీల వేతన పెంపుకు ప్రధాని మోదీ ఓ ప్రత్యేక కమిషన్ను ఏర్పాటుచేశారు. కానీ పార్లమెంట్ సభ్యుల నుంచి వచ్చిన ఒత్తిడి క్రమంలో ఈ కమిషన్ను మోదీ రద్దుచేశారు. పార్లమెంట్ సభ్యుల అలవెన్స్ చూసుకుంటే, ప్రతినెలా వారికి ఇచ్చే నియోజకవర్గ భత్యం రూ.45,000 ల నుంచి రూ.90,000కు పెరిగింది. సెక్రటరీ సహాయం, కార్యాలయ భత్యం కింద నెలకు రూ. 90,000ను పార్లమెంట్ సభ్యులు అందుకోనున్నారు. అదేవిధంగా రాష్ట్రపతి వేతనాన్ని కూడా రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి వేతనంతో పాటు గవర్నర్ వేతనాన్ని కూడా రూ.1.10 లక్షల నుంచి రూ.2.5 లక్షలకు పెంచనున్నారు. -
జీతాల తీపికబురు వస్తే.. కొత్తకారు!
న్యూఢిల్లీ : జీతాల పెంపుపై నేడు(బుధవారం) కేంద్రప్రభుత్వం ప్రకటించబోయే తీపికబురు కార్ల, గృహాల అమ్మకాల వృద్ధికి దోహదం చేస్తుందట. పెట్టుబడులను ప్రోత్సహించి, ఆర్థిక వ్యవస్థను మరింత పుంజుకునేలా చేస్తుందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇటీవల నెలల్లో అస్థిరంగా నమోదవుతూ వస్తున్న పారిశ్రామిక ఉత్పత్తికి ఆశాజనకంగా మారుతుందని పేర్కొంటున్నాయి. మార్చి నెలతో పోలిస్తే ఏప్రిల్ నెలలో పారిశ్రామిక వృద్ధి నిరాశజనకమైన ఫలితాలనే నమోదుచేసింది. తయారీ, నాన్ డ్యూరబుల్ స్తబ్థుగా ఉండిపోయింది. ఈ పెంపుతో ఉద్యోగుల ఖర్చులు పెరిగి, ఆర్థిక పునరుజ్జీవనానికి సాయపడుతుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. ప్రభుత్వం వెలువరించే తీపికబురు వినియోగదారుల డిమాండ్ ను చారిత్రాత్మకంగా ముందుకు తీసుకెళ్తుందని నోమురా బ్రోకింగ్ అండ్ రీసెర్చ్ సంస్థ అంచనావేస్తోంది. జీతాల సమగ్రపెంపుతో వినియోగదారుల ఖర్చు అమాంతం పెరిగిపోతుందని వెల్లడిస్తోంది. కార్లు, టీవీలర్లు, గృహాలు ఎక్కువగా కొంటారని అంచనావేస్తోంది. కాగా 2008లో చేపట్టిన ఆరవ వేతన సంఘ సిపారసుల వేతనాలు పెంపుతో కూడా కార్లు, గృహాలు కొనడానికే ఉద్యోగులు ఎక్కువగా మొగ్గుచూపారని తన రిపోర్టులో పేర్కొంది. 2008-09లో ప్యాసెంజర్ల వెహికిల్స్ దాదాపు 20 శాతం పెరిగాయని, తర్వాతి ఏడాది 22 శాతం పెరిగాయని వెల్లడించింది. ఈ దాదాపు 48 లక్షల మంది కేంద్రప్రభుత్వ ఉద్యోగులకు, 55 లక్షల పెన్షనర్లకు ఈ జీతాల పెంపు నిర్ణయం అమల్లోకి రానుంది. 7వ వేతన సంఘ సిపారసులపై ప్రభుత్వం నేడు తుది ప్రకటన వెలువరించనుంది. -
అధికార, విపక్షాలు ఒక్కటైన వేళ!
కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేతో పాటు.. ప్రతిపక్షంలో ఉన్న యూపీఏ, ఇతర పార్టీలు అన్నీ ఒక్క అంశం మీద ఏకాభిప్రాయానికి వచ్చాయి. మహిళా బిల్లు, జీఎస్టీ లాంటి అంశాలపై జుట్లు పట్టుకుని కొట్టుకునే ఈ పార్టీలు అన్నీ.. ఒకే మాట మీద నిలబడ్డాయి. ఏ విషయంలోనో తెలుసా.. ఎంపీల జీతాలు పెంచుకునే విషయంలో. వేతనాలు, ఇతర అలవెన్సులు అన్నింటినీ రెట్టింపు చేసుకోడానికి అందరూ మద్దతు పలికారు. ఈ బిల్లు పార్లమెంటు తదుపరి సమావేశాలలో ఆమోదం పొందే అవకాశం ఉంది. ఎంపీల జీతాలను ఇప్పుడున్న రూ. 50 వేల నుంచి లక్షకు పెంచాలని, అలాగే నియోజవర్గాల అలవెన్సును కూడా రూ. 45వేల నుంచి రూ. 90వేలకు పెంచాలని పార్లమెంటరీ కమిటీ ఒకటి సూచించింది. ఈ ప్రతిపాదనలు ఆమోదం పొందితే.. ఎంపీలకు ప్రతి నెలా ఇప్పుడు వస్తున్న రూ. 1.40 లక్షలకు బదులు రూ. 2.80 లక్షలు వస్తుంది. బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఈ కమిటీ.. పింఛన్లను 75 శాతం పెంచాలని, జీతాల సవరణ కూడా ఎప్పటికప్పుడు ఆటోమేటిక్గా జరగాలని సూచించింది. ఎంపీల జీతాలు ఇంతకుముందు ఆరేళ్ల క్రితం పెరిగాయి. పెంపు విషయమై కేబినెట్ నోట్ ఒకదాన్ని అన్ని మంత్రిత్వశాఖలకు పంపారు. అయితే జీతాల పెంపుపై కమిటీ ఇచ్చిన నివేదికను మీడియా ఒత్తిడి వల్ల ఎవరికీ చెప్పకుండా తొక్కేశారని సమాజ్వాదీ పార్టీ ఎంపీ నరేష్ అగర్వాల్ రాజ్యసభలో మండిపడ్డారు. ఎంపీల సత్ప్రవర్తన కారణంగా వాళ్లకు జీతాలు పెరగాల్సిందేనని, చాలామంది ఎంపీలు ఇది కోరుకుంటున్నా, భయంతో బయటకు మాట్లాడలేకపోతున్నారని అన్నారు. ఈ జీతంతో మూడు ఇళ్లు నిర్వహించాలంటే అసాధ్యం అవుతోందని చెప్పారు. ద్రవ్యోల్బణం ప్రభావం అందరిమీదా పడుతోందని, ఎంపీలు కూడా ఇబ్బంది పడుతున్నారని.. అందువల్ల జీతాల పెంపు విషయంలో నరేష్ అగర్వాల్ను తాను సమర్థిస్తానని రాజ్యసభలో విపక్ష నేత గులాం నబీ ఆజాద్ అన్నారు.