-
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు.. బ్యాడ్ న్యూస్ చెప్పిన సత్య నాదెళ్ల
మైక్రోసాఫ్ట్ ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లారు సీఈవో సత్య నాదెళ్ల. ఈ ఏడాది జీతాల పెంపు ఉండబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఉద్యోగులకు సమాచారం అందించారు. ఇప్పటికే వేలాది ఉద్యోగాలకు కోత పెట్టిన ఈ టెక్ దిగ్గజం ఇప్పుడు ఉద్యోగుల జీతాల పెంపునకు కోత పెట్టింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో వర్చువల్ గర్ల్ఫ్రెండ్.. నెలకు రూ. 41 కోట్ల సంపాదన! ఓ వైపు లేఆఫ్స్ కొనసాగుతున్నప్పటికీ ఇటీవలి త్రైమాసికాల్లో మైక్రోసాఫ్ట్ మంచి లాభాలనే నమోదు చేస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ సారి జీతాల పెంపు కచ్చితంగా ఉంటుందని ఉద్యోగులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే ఈ ఏడాది జీతాల పెంపు ఉండదని సీఈవో సత్య నాదెళ్ల తేల్చి చెప్పేశారు. కోవిడ్ సంక్షోభంతో ఏర్పడిన ఆర్థిక అనిశ్చితి కారణంగా ఈ సంవత్సరం జీతాల పెంపు ఉండదని, ఈ అనిశ్చిత సమయాల్లో తమ వ్యాపారం, ఉద్యోగుల స్థిరత్వాన్ని నిర్ధారించుకోవాలని భావిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. జీతాల పెంపు లేనప్పటికీ బోనస్లు, స్టాక్ అవార్డుల ద్వారా ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. తమ ఉద్యోగులకు వృద్ధి, ఎదుగుదలకు అవకాశాలను కల్పించడానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. ఆన్లైన్ విక్రయాలపై దృష్టి సారించినట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న నేపథ్యంలో రిటైల్ స్టోర్లలోని వేలాది మంది ఉద్యోగులను తొలగించాలని యోచిస్తోందన్న వార్తలకు బలం చేకూరుతోంది. తొలగింపులు ఫుల్ టైమ్, పార్ట్ టైమ్ ఉద్యోగులందరిపైనా ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. మైక్రోసాఫ్ట్ జీతాల పెంపును స్తంభింపజేయడం టెక్ పరిశ్రమ ఎదుర్కొంటున్న సవాళ్లకు సంకేతం. ఇటీవలి కాలంలో లేఆఫ్స్, జీతాల పెంపు నిలిపివేత, వేతనాల తగ్గింపు వంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటున్న ఏకైక టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ మాత్రమే కాదు. జనవరిలో ఫేస్ బుక్ మాతృ సంస్థ మెటా 3,200 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. గూగుల్ కూడా నియామకాల వేగాన్ని తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఇదీ చదవండి: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఆకతాయి పని.. అరెస్ట్ చేసిన పోలీసులు -
టిమ్ కుక్ శాలరీ కట్ అయ్యింది..మరి నీ శాలరీ?
-
కాగ్నిజెంట్ ఉద్యోగులకు తీపి కబురు.. ఆరు నెలల ముందే జీతాల పెంపు
కాగ్నిజెంట్ తమ ఉద్యోగులకు షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపును అందిస్తోంది. 18 నెలల్లో ఇది మూడవ వేతన పెంపు. పెరుగుతున్న అట్రిషన్ కంపెనీకి తలనొప్పిగా మారింది. దీన్ని కట్టడి చేయడంలో భాగంగా కంపెనీ షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే వేతన పెంపు అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. 2022 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో అట్రిషన్ 35 శాతం నుంచి 25 శాతానికి తగ్గింది. (apple saket: యాపిల్ ఢిల్లీ స్టోర్ ఫస్ట్ లుక్.. అదిరిపోయింది!) వేతన పెంపునకు సంబంధించిన లెటర్లను ఉద్యోగులు ఈ వారంలో అందుకుంటారని కంపెనీ వారికి పంపిన ఈ-మెయిల్స్లో పేర్కొంది. సంవత్సరాంతపు పనితీరు సమీక్షలను అనుసరించి ఆరు నెలల ముందుగానే ఈ మెరిట్ పెంపును అందిస్తున్నామని, 18 నెలల్లో ఇది మూడో మెరిట్ పెరుగుదల అని కంపెనీ సీఈవో రవికుమార్ వివరించారు. జనవరిలో డైరెక్టర్లు అంతకంటే పైస్థాయివారికి ఇచ్చిన పెంపుతో కలిపి 3 లక్షల మందికి పైగా ఉద్యోగులు వేతన పెంపును అందుకుంటున్నారని తెలిపారు. అలాగే ఉద్యోగులకు నిరంతర శిక్షణ, నైపుణ్యం, వృత్తిపరమైన అభివృద్ధిలో కంపెనీ ఎప్పుడూ తోడ్పాటు అందిస్తుందని పేర్కొన్నారు. కాగా షెడ్యూల్ కంటే ఆరు నెలల ముందుగానే అమలు చేస్తున్న ఈ వేతన పెంపు కంపెనీ వన్-టైమ్ టూ-మెరిట్ సైకిల్ పెంపులో భాగం. ఈ వేతన పెంపును గత సంవత్సరమే ప్రకటించారు. 2022 అక్టోబర్లో, ఆపై 2023 ఏప్రిల్లో వేతన పెంపుదల ఉంటుందని కంపెనీ గతంలోనే పేర్కొంది. ఇదీ చదవండి: అపరిచితుడికి కిడ్నీ దానం.. అపర దాన కర్ణుడు ఈ బిలియనీర్.. -
ఐటీ ఉద్యోగులకు బ్యాడ్ న్యూస్.. ఇక పదేళ్లూ అంతంతే!
ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగులు ప్రస్తుతం గడ్డు పరిస్థతిని ఎదుర్కొంటున్నారు. రానున్న రోజుల్లో అయినా పరిస్థితులు మెరుగుపడతాయని ఆశా భావంతో ఉన్న ఉద్యోగులకు ఇప్పట్లో ఉపశమనం కనిపించేలా లేదు. జీతాల పెంపుపై ఎన్నో ఆశలు పెట్టుకున్న ఉద్యోగుల ఆశలపై నీళ్లు చల్లుతూ వచ్చే పదేళ్లు జీతాల పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుందని ఓ అధ్యయనం పేర్కొంటోంది. (రియల్మీ సి–55.. ఎంట్రీ లెవెల్ విభాగంలో సంచలనం!) ఆడిట్ అండ్ కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ అధ్యయనం ప్రకారం.. భారతీయ కంపెనీలలో జీతాల సగటు పెంపుదల 2022లో ఉన్న 9.4 శాతం నుంచి 2023లో 9.1 శాతానికి తగ్గుతుందని అంచనా. క్లయింట్ల ఖర్చుల కోతలను ఎదుర్కొంటున్న ఐటీ రంగం దశాబ్దంలో ఎన్నడూ లేనంత దారుణమైన పెంపుదలని చూడనుందని ఈ అధ్యయనం చెబుతోంది. అభివృద్ధి చెందిన దేశాల్లో మాంద్యం ప్రభావంతో ఐటీ పరిశ్రమలో అట్రీషన్ (ఉద్యోగుల తొలగింపు) రేటు గత ఏడాది 19.7 శాతం ఉండగా రానున్న రోజుల్లో మరింత పడిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (మోటరోలా జీ13 వచ్చేసింది.. ధర తక్కువే!) ఐటీ ప్రొడక్ట్ కంపెనీలు, డిజిటల్ ఇ-కామర్స్ కంపెనీల నేతృత్వంలో ఐటీ రంగం ఈ దశాబ్దంలో ఉద్యోగుల జీతాల్లో అత్యంత తక్కువ పెంపుదల ఉంటుందని అంచనా వేస్తున్నట్లు డెలాయిట్ ఇండియా భాగస్వామి ఆనందోరుప్ ఘోస్ తెలిపారు. మొండి ద్రవ్యోల్బణం, అధిక వడ్డీ రేట్, మందగిస్తున్న ఆర్థిక వ్యవస్థ ఈ సంవత్సరం ఐటీ కంపెనీలను మరింత పొదుపుగా ఉండేలా చేసే అవకాశం ఉంది. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని 2023లో ఇంక్రిమెంట్లు, అట్రిషన్ పరిమాణాలు క్షీణిస్తాయని భావిస్తున్నామన్నారు. గత సంవత్సాల్లో విపరీతంగా నియామకాలు చేపట్టిన ఐటీ కంపెనీలు ప్రస్తుతం క్లయింట్ల దగ్గర నుంచి ఆశించిన మేర ప్రాజెక్టులు లేకపోవడంతో ఒత్తిడిని ఎదుర్కొంటోంది. దీనికితోడు ప్రస్తుతం తలెత్తిన బ్యాంకింగ్ సంక్షోభం మరింత కుంగదీస్తోంది. ఇప్పటికే అనేక ఎంఎన్సీ కంపెనీలు పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. ఈ ప్రభావం భారతీయ టెక్ రంగంపై కూడా ఉంది. (మారుతీ సుజుకీ రికార్డ్.. విదేశాలకు 25 లక్షల కార్లు..) 25 రంగాల్లోని 300 కంపెనీల హెచ్ఆర్ హెడ్ల నుంచి డేటాను సేకరించి డెలాయిట్ ఈ అధ్యయనం చేపట్టింది. దీని ప్రకారం.. లైఫ్ సైన్సెస్, మాన్యుఫ్యాక్చరింగ్ రంగాలు 2023లో అత్యధిక ఇంక్రిమెంట్లను చూస్తాయి. గత ఏడాది 9.7 శాతం ఉన్న వాస్తవిక పెంపుతో పోలిస్తే రెండు రంగల్లోనూ 9.5 శాతం పెంపుదల ఉంటుందని అంచనా. -
ఉద్యోగులకు బంపరాఫర్!
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది దేశంలో సగటున ఉద్యోగుల జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ- కామర్స్, ప్రొఫెషనల్ సర్వీస్, ఐటీ విభాగాల్లో ఈ వేతనాల పెంపు ఉండనున్నట్లు ఓ నివేదిక వెలుగులోకి వచ్చింది. ‘ఫ్యూచర్ ఆఫ్ పే 2023’ రిపోర్ట్ ప్రకారం.. ఈ ఏడాది జీతాలు 10.2 శాతం పెరగనున్నట్లు తెలిపింది. గత ఏడాది పెరిగిన సగటు ఉద్యోగుల శాలరీలు 10.4 శాతంగా ఉన్నట్లు పేర్కొంది. 2022లో కంటే.. 2023లో జీత భత్యాలు తక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా బ్లూ కాలర్ ఉద్యోగాలైన మైనింగ్, ఎలక్ట్రసిటీ జనరేషన్, పవర్ పాంట్ల్ ఆపరేషన్స్, ఆయిల్ ఫీల్డ్ వర్క్, రీసైక్లింగ్, డ్రైవింగ్ వంటి ఉద్యోగుల జీతాలు తగ్గే అవకాశం ఉన్నట్లు నివేదించింది. జీతాలు పెరిగే రంగాలు ఇవే దేశంలో మొత్తం మూడు రంగాల్లో ఉద్యోగుల జీతాలు పెరిగే అవకాశం ఎక్కువ ఉన్నట్లు ఫ్యూచర్ ఆఫ్ పే 2023 రిపోర్ట్ హైలెట్ చేసింది. వాటిలో ఈ-కామర్స్ విభాగంలో 12.5శాతం, ప్రొఫెషనల్ సర్వీసులైన అకౌంటెంట్స్, డాక్టర్స్, న్యాయవాదులుగా పనిచేసే వారికి 11.9శాతం పెరగ్గా.. ఐటీ రంగంలో పనిచేసే ఉద్యోగుల జీతాలు 10.8 శాతం పెరిగే అవకాశం ఉన్నట్లు సర్వేలో తేలింది. -
WTW Report: పెరగనున్న జీతాలు.. ఆసియా-పసిఫిక్లో భారత్ టాప్!
ప్రపంచవ్యాప్తంగా లేఆఫ్స్ల ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ఉద్యోగులకు ఊరట కలిగించే ఓ సర్వే విడుదైంది. భారత్లో ఈ ఏడాది జీతాలు 10 శాతం మేర పెరగనున్నట్లు తాజాగా ఓ సర్వే పేర్కొంది. దాని ప్రకారం ఆసియా-పసిఫిక్ రీజియన్లో జీతాల పెరుగుదల భారత్లోనే అత్యధికం. ఇదే 2022లో మన దేశంలో జీతాల పెరుగుదల 9.8 శాతం నమోదైంది. గ్లోబల్ అడ్వయిజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్ సంస్థ డబ్ల్యూటీడబ్ల్యూ శాలరీ బడ్జెట్ ప్లానింగ్ పేరుతో ఓ సర్వే నిర్వహించింది. దాని ప్రకారం.. ఈ ఏడాదిలో చైనాలో 6 శాతం, వియత్నాంలో 8 శాతం, ఇండోనేషియాలో 7 శాతం, హాంకాంగ్లో 4 శాతం, సింగపూర్లో 4 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. కోవిడ్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జీతాల పెరుగుదల క్షీణించింది. తర్వాత క్రమంగా పుంజకుంది. 2019లో 9.9 శాతం ఉన్న వేతనాలు 2020లో 7.5 శాతం, 2021లో 8.5 శాతం పెరిగాయి. 2022లో 9.8 శాతం పెరిగాయి. ఏయే రంగాల్లో ఎంతెంత? ఫైనాన్షియల్ సర్వీసెస్, టెక్ మీడియా, గేమింగ్, ఫార్మాస్యూటికల్, బయోటెక్నాలజీ, కెమికల్స్, రిటైల్ రంగాలలో అత్యధికంగా 10 శాతం జీతాలు పెరుగుతాయని అంచనా. ఇక తయారీ రంగం, బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ రంగాలలో జీతాల పెంపు అంతంత మాత్రమే. చదవండి: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మరో ట్రావెల్ క్రెడిట్ కార్డ్! వ్యాపార అవకాశాలు, ఉద్యోగుల నిలుపుదల ప్రస్తుతం భారతదేశంలో జీతాల పెంపునకు ప్రధాన చోదకాలని డబ్ల్యూటీడబ్ల్యూ ఇండియా వద్ద వర్క్ అండ్ రివార్డ్స్ కన్సల్టింగ్ లీడర్గా ఉన్న రజుల్ మాథుర్ పేర్కొన్నారు. దాదాపు 80 శాతం భారతీయ కంపెనీలు రాబోయే ఈ ఏడాది వ్యాపార ఆదాయాన్ని మరింత పెంచుకునే ఆలోచనతో ఉన్నాయని నివేదిక పేర్కొంది. ఇదీ చదవండి: MG Motor: ఆ స్మార్ట్ ఈవీ పేరు ‘కామెట్’... రేసింగ్ విమానం స్ఫూర్తితో... -
హైదరాబాద్: మెరుపు సమ్మెపై మెట్రో యాజమాన్యం స్పందన
సాక్షి, హైదరాబాద్: జీతాల పెంపు పేరుతో మెట్రో కాంట్రాక్ట్ ఉద్యోగులు చేపట్టిన మెరుపు సమ్మెపై హైదరాబాద్ మెట్రో యాజమాన్యం స్పందించింది. ఈ మేరకు ధర్నాలో పాల్గొన్న వాళ్లపై చర్యలు తప్పవని మంగళవారం హెచ్చరించింది. ఐదేళ్లుగా తమ జీతాల్లో పెరుగుదల లేదని ఆరోపిస్తూ.. అమీర్పేట మెట్రో స్టేషన్ వద్ద కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులు బహిష్కరించి నిరసన చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే.. ఉద్యోగుల ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని మెట్రో యాజమాన్యం ప్రకటించింది. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని తెలిపింది. అలాగే.. ధర్నాలో పాల్గొన్న ఉద్యోగులపై చర్యలు కచ్చితంగా ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం రూ. 11 వేలుగా ఉన్న జీతాన్ని.. కనీస వేతనం కింద రూ. 18 వేలకు పెంచాలంటూ టికెటింగ్ ఉద్యోగులు విధుల్ని బహిష్కరించి నిరసన చేపట్టారు. రెడ్ లైన్(మియాపూర్-ఎల్బీనగర్) మధ్య టికెట్ కౌంటర్ల వద్ద సిబ్బంది కొరతతో క్యూ లో టికెట్ల కోసం ప్రయాణికులు అవస్తలు పడుతున్నారు. -
భారతీయ రైల్వే కీలక నిర్ణయం.. వారికి భారీగా పెరగనున్న జీతాలు
రైల్వే ఉద్యోగులకు శుభవార్త. సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనకు కేంద్రం నుంచి ఆమోదం లభించినట్లు రైల్వే బోర్డు ఛైర్మన్ వీకే త్రిపాఠి తెలిపారు. దీని ద్వారా దాదాపు 80 వేల మంది ఉద్యోగులకు రూ.2500-4000 వరకు జీతాలు పెరుగుతాయని చెప్పారు. ఈ నిర్ణయంతో రైల్వే శాఖపై అదనపు భారమేమీ పడదని త్రిపాఠి స్పష్టం చేశారు. ఇందుకు తగినట్లు ఇప్పటికే పలు కార్యక్రమాల ద్వారా రైల్వే శాఖ ఖర్చులు ఆదా చేస్తున్నట్లు వివరించారు. ఈ వేతనాల పెంపుతో ఉద్యోగ స్తబ్ధత ఎదుర్కొంటున్న వేల మంది రైల్వే సిబ్బంది గ్రూప్ ఏ అధికారులతో సమానంగా వేతనాలు పొందుతారని త్రిపాఠి వివరించారు. 80వేల మంది సూపర్వైజరీ స్థాయి ఉద్యోగులు హై పే గ్రేడ్కు అర్హులు అవుతారని చెప్పారు. సూపర్వైజరీ క్యాడర్ అప్గ్రేడేషన్కు సంబంధించిన డిమాండ్ 16 ఏళ్లుగా పెండింగ్లో ఉందని త్రిపాఠి వెల్లడించారు. తాజాగా నిర్ణయంతో 50 శాతం మంది లెవెల్7 ఉద్యోగులు లెవెల్ 8కు చేరుకునేందుకు మార్గం సుగమమైందని చెప్పారు. వేతనాల పెంపుతో స్టేషన్ మాస్టర్లు, టికెట్ చెకర్స్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు వంటి 40వేల మంది ఫీల్డ్ లెవెల్ వర్కర్లకు ప్రయోజనం చేకూరుతుందని త్రిపాఠి వివరించారు. చదవండి: ధైర్యముంటే భారత్ జోడో యాత్రను ఆపండి.. రాహుల్ గాంధీ ఛాలెంజ్ -
స్పైస్జెట్ సంచలనం: పైలట్లకు 20 శాతం జీతం పెంపు!
సాక్షి, ముంబై: కష్టాల్లో ఉన్న విమానయాన సంస్థ స్పైస్జెట్ పైలట్ల జీతాల విషయంలో దిగి వచ్చినట్టు కనిపిస్తోంది. బడ్జెట్ క్యారియర్ స్పైస్జెట్ అక్టోబర్ నుంచి పైలట్లకు 20శాతం జీతం పెంపును ప్రకటించిందని సీఎన్బీసీ గురువారం నివేదించింది. తమ వ్యాపారం మెరుగు పడుతున్న క్రమంలో కెప్టెన్లు , సీనియర్ ఫస్ట్ ఆఫీసర్లకు జీతం దాదాపు 20 శాతం పెరుగుతుందని కెప్టెన్ గుర్చరణ్ అరోరా తెలిపారు. ఖర్చులను తగ్గించుకునే పనిలో భాగంగా తాత్కాలిక చర్యగా జీతాలివ్వకుండానే సెప్టెంబరు 21 నుండి మూడు నెలల పాటు లీవ్ వితౌట్ పే కింద 80 మంది పైలట్లను సెలవుపై ఇంటికి పంపించిన సంగతి తెలిసిందే. స్పైస్జెట్ ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ECLGS) చెల్లింపులో మొదటి విడతగా సుమారు రూ. 125 కోట్లను గత వారం అందుకుంది. అయితే తాజా పెంపులో ఈ 80 మంది ఉన్నారా లేదా అనేది స్పష్టత లేదు. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు మరోవైపు ఏవియేషన్ సేఫ్టీ రెగ్యులేటర్ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) స్పైస్జెట్కు బుధవారం మరో షాక్ ఇచ్చింది. గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలన్న ఆంక్షలను మరో నెలపాటు పాడిగించింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. వేసవి షెడ్యూల్ ముగిసే వరకు (అక్టోబర్ 29, 2022) ఈ ఆంక్షలు కొనసాగుతాయని తన ఆర్డర్లో పేర్కొంది. విమానాలకు సంబంధించిన వరుస సంఘటనల కారణంగా ఈ ఏడాది జూలై 27న స్పైస్జెట్కు గరిష్టంగా 50 శాతం విమానాలను మాత్రమే నడపాలని ఆదేశించింది. ఈ గడువు సెప్టెంబరు 30తో ముగియనుంది. కాగా గురువారం నాటి మార్కెట్లోస్పైస్జెట్ షేరు 4 శాతం కుప్పకూలింది. ఈ ఏడాది ఏకంగా 40శాతం నష్టపోయింది. -
AP: వైద్య విధాన పరిషత్ సివిల్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలు పెంపు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో వైద్య విధాన పరిషత్ అసిస్టెంట్ సర్జన్ల వేతనాలను పెంచారు. ప్రస్తుతం ఉన్న రూ.53,000 నుంచి 85,000కి పెంచుతూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. చదవండి: (పప్పులో కాలేసిన పవన్ కళ్యాణ్!) -
శాలరీ ఇంక్రిమెంట్లు.. 2022లో మంచిరోజులు!
కరోనా టైంలో పూర్తిగా మునిగిన మార్కెట్, వ్యాపారాలు.. కాస్తో కూస్తో కొంతకాలంగా కుదుట పడుతూ వస్తున్నాయి. ఈ తరుణంలో పూర్తిగా కోలుకోవడానికి ఈ ఏడాది సహకరించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. తద్వారా కరోనా ముందు కంటే ఉన్న జీతాల పెంపును ఉద్యోగులు ఆశిస్తుండగా.. 2022లో అది జరగవచ్చనే చెప్తున్నాయి సర్వేలు. కోర్న్ ఫెర్రీ ఇండియా ఆనువల్ రివార్డ్స్ సర్వే ప్రకారం.. కరోనా టైం కంటే ముందున్న స్థితికి ఉద్యోగుల శాలరీ ఇంక్రిమెంట్ చేరవచ్చనే తేలింది. దేశవ్యాప్తంగా ఉన్న పలు చిన్నాచితకా, బడా కంపెనీల(ఎంఎన్సీలతో సహా)లో నిర్వహించిన సర్వేల ద్వారా ఈ వివరాల్ని సేకరించారు. గతంలో.. 2019లో యావరేజ్ పే హైక్ భారత్లో 9.25 శాతం ఉండగా.. 2021 ఏడాదికి అది 8.4కి పడిపోయింది కొవిడ్-19 ఎఫెక్ట్తో. అయితే కంపెనీల ఫీడ్బ్యాక్ అనంతరం 2022లో ఇది 9.4 శాతానికి చేరుకోవచ్చని ఈ సర్వే వెల్లడించింది. 2022 ఏడాదిలో వ్యాపారాలపై కరోనా ఎఫెక్ట్ అంతగా ఉండబోదని, పైగా కరోనాతో నష్టపోయిన పరిస్థితుల నుంచి ఈ ఏడాది కచ్చితంగా గట్టెక్కి తీరుతుందని వ్యాపార రంగం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ గాడినపడడానికి తోడ్పడడంతో పాటు 2020-21 ఆర్థిక సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను అందుకుంటుందన్న కొత్త ఉత్సాహాన్ని అందిస్తోంది. దాదాపు 40 శాతం ఉద్యోగులు తరలిపోతారనే నివేదికల నేపథ్యంలోనే పలు కంపెనీలు ఈ ఏడాది హైకుల విషయంలో కచ్చితత్వం పాటించాలని నిర్ణయించుకున్నాయట. పారిశ్రామిక నిపుణుల ప్రకారం.. ఇంక్రిమెంట్ల కోసం కేటాయించే బడ్జెట్ సాధారణంగా వ్యాపార తీరు, పారిశ్రామిక గణాంకాలు, బెంచ్మార్క్ ఫలితాల మీద ఆధారపడి ఉంటుంది. అందుకే ఈ ఏడాది సానుకూల ఫలితాల్ని ఆశిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ ఏడాది మంచి ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నైపుణ్యంగల ఉద్యోగుల ఎంపిక దిశగా అన్ని రంగాలు ముందుకెళ్లవచ్చని చెప్తున్నారు. అన్ని రంగాలు కోలుకోవడంతో పాటు గరిష్ఠంగా హైక్ శాతం.. టెక్ కంపెనీలు 10.5 శాతం ఇవ్వాలని అనుకుంటున్నాయని, లైఫ్ సైన్స్ 9.5 శాతం, సేవా, ఆటో, కెమికల్స్ రంగం 9.5 శాతం అంచనా వేస్తున్నట్లు సర్వేలు చెప్తున్నాయి. మిగతా రంగాల నుంచి 4 శాతానికి తక్కువ కాకుండా శాలరీ హైక్ల ఆలోచనలో ఉన్నట్లు పలు సర్వేలు చెప్తున్నాయి. అదే సమయంలో 786 కంపెనీలకుగానూ 60 శాతం కంపెనీలు.. మంత్లీ వైఫై అలవెన్స్లు, యుటిలిటీ బిల్లులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. 46 శాతం కంపెనీలు ఉద్యోగుల వెల్నెస్ బెనిఫిట్లు అందించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఇక మరో 10 శాతం కంపెనీలు ట్రావెల్ అలవెన్స్ను తగ్గించడమో లేదంటే పూర్తిగా రద్దు చేయాలనే యోచనలో ఉన్నాయని సీఎన్బీసీ ఒక కథనం ప్రచురించింది. -
పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల వేతనం పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్ల వేతనాన్ని పెంచుతూ నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జి.జయలక్ష్మి మంగళవారం మెమో జారీ చేశారు. వీరికి సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు చెల్లించేలా ఆదేశాలిచ్చారు. ప్రస్తుతం ఈ కాంట్రాక్టు అధ్యాపకులు రూ.35,120 పొందుతుండగా తాజా ఆదేశాల ప్రకారం అది రూ.40,270కి పెరగనుంది. ఈ వేతనాలు ఉత్తర్వులు వెలువడిన నాటినుంచి అమలులోకి వస్తాయని మెమోలో పొందుపరిచారు. దీనివల్ల 316 మంది కాంట్రాక్టు అధ్యాపకులకు మేలు జరగనుంది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన మినిమమ్ టైమ్ స్కేలు ప్రకారం వేతనాలు పెంచినందుకు పాలిటెక్నిక్ కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం మంగళవారం ఓ ప్రకటనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తాము ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సవరించిన ఎంటీఎస్ను అమలు చేసినందుకు మంత్రి గౌతమ్రెడ్డి, ఉన్నతాధికారులకు ధన్యవాదాలు తెలుపుతున్నామని సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గోవర్ధననాయుడు, బి.కృష్ణ పేర్కొన్నారు. -
మూడు నెలలుగా వేతనాల్లేవ్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీలు మూడు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. పెంచిన జీతం సంగతేమోకానీ, ఉన్న జీతమైనా నెలనెలా రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతాలు చేతికి అందేవి. దీంతో గత మూడు నెలలుగా ప్రతినెలా ఐదోతేదీ ఎప్పుడొస్తుందా.. అని ఎదురుచూడటం, ఆ తర్వాత ఉస్సూరమనడం అంగన్వాడీల వంతైంది. పెంచిన జీతాలకు సంబంధించిన ఫైల్ ఆర్థికశాఖ వద్ద అపరిష్కృతంగా ఉండటం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. వరుసగా మూడు నెలలు నిలిచిపోవడంతో గృహావసరాలు తీర్చుకోలేక తాము ఇబ్బందులు పడుతున్నామని అంగన్వాడీలు చెబుతున్నారు. కాస్త ఆలస్యమైనా వేతనాలను నెలవారీగా ఇవ్వాలని టీచర్లు, హెల్పర్ల సంఘాలు ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తున్నాయి. రాష్ట్రంలోని మొత్తం 149 ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో 35,700 అంగన్వాడీ కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో 31,711 ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు, 3.989 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. ప్రధాన అంగన్వాడీ కేంద్రాల్లో ఒక టీచర్, ఒక హెల్పర్ ఉండగా, మినీకేంద్రాల్లో ఒక టీచర్ మాత్రమే ఉంటారు. ఖాళీలు మినహాయిస్తే రాష్ట్రంలో 58 వేలమంది టీచర్లు, హెల్పర్లు విధులు నిర్వహిస్తున్నారు. కొత్తవేతనాల అమలుతో లింకు... ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలను ప్రభుత్వం పెంచింది. అంగన్వాడీ టీచర్కు రూ.10,500 నుంచి రూ.13,650, మినీ అంగన్వాడీ టీచర్, హెల్పర్కు రూ.6,000 నుంచి రూ.7,800కు పెంచగా, వీటిని జూలై నుంచి అమలు చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులను ఆగస్టులో జారీ చేసినప్పటికీ, ఇంకా అమల్లోకి రాలేదు. ఉత్తర్వులు వెలువడిన తర్వాత నుంచి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు వేతనాలు అందలేదని తెలుస్తోంది. కొత్త వేతనాల అమలుకు సాంకేతిక సమస్యలు తలెత్తాయని, అందువల్లే వేతనాల విడుదలలో జాప్యమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. సాంకేతిక సమస్యను అధిగమించి బకాయిలతోపాటు ప్రస్తుత వేతనాలను వచ్చే నెలలో ఒకేసారి విడుదల చేసే అవకాశం ఉందని రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
ఉద్యోగుల కోసం పోటీ పడుతున్న కంపెనీలు
దేశంలో ఆర్ధిక వృద్ది తిరిగి పెరగడంతో ప్రతిభ గల ఉద్యోగుల కోసం చాలా కంపెనీలు పోటీ పడుతున్నాయి. దీనికోసం కంపెనీలు బయట నుంచి వస్తున్న పోటీని తట్టుకోవడం కోసం తమ ఉద్యోగులకు భారీగా వేతనాన్ని పెంచడానికి సిద్ద పడుతున్నాయి. వేతన పెంపు విషయమై అయాన్ అనే సంస్థ 39 పరిశ్రమల్లో 1,300 సంస్థలతో 26వ వార్షిక వేతన పెంపు సర్వేను నిర్వహించిది. ఈ సర్వే ప్రకారం.. ఇండియా ఇంక్ 2022లో సగటున వేతనాన్ని 9.4 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ సూచిక బలమైన ఆర్ధిక రికవరీని సూచిస్తుంది. గత సంవత్సరం వేతన పెంపు కంటే 8.8 శాతం ఎక్కువ. (చదవండి: కరోనా చికిత్సకు ‘హెటెరో’ బూస్ట్) అయాన్ నివేదిక ప్రకారం.. దేశంలో వ్యాపార కార్యకలాపాలు వేగంగా తిరిగి పుంజుకుంటున్నాయి. 2022లో టెక్నాలజీ, ఈ-కామర్స్, ఐటీ ఆధారిత రంగాలలో అత్యధిక వేతన పెంపు ఉండే అవకాశం ఉంది. ఇంజనీరింగ్ సేవలు, శక్తి, ఆతిథ్యం వంటి రంగాలలో అతి తక్కువ పెంపు అనేది ఉండనుంది. ఇంకా, 98.9 శాతం కంపెనీలు ఏడాది క్రితం 97.5 శాతంతో పోలిస్తే 2022లో ఉద్యోగుల వేతనాన్ని పెంచాలని భావిస్తున్నట్లు సర్వేలో తేలింది. ఇది ఇలా ఉంటే ఎటువంటి వేతన పెంపు అమలు చేయని కంపెనీల సంఖ్య 2.5 శాతం నుంచి 1.1 శాతానికి తగ్గింది. చాలా మంది ఉద్యోగులు ఎక్కువ వేతనాన్ని ఆఫర్ చేసే సంస్థలో జాయిన్ అవ్వడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నట్లు ఈ సర్వేలో తేలింది. కరోనా మహమ్మరి తర్వాత డిజిటల్ టెక్నాలజీకి డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో చాలా కంపెనీలు అత్యుత్తమ మానవ వనరులకు ఎక్కువ జీతాన్ని అందించడానికి సిద్దపడుతున్నాయి. ఉత్తమ ప్రతిభ గల ఉద్యోగుల కోసం సంస్థలు తమ వ్యూహాలను రచిస్తున్నాయని సర్వేలో తేలింది. "అత్యధిక అట్రిషన్ రేటు గల రంగాలలో ఐటీ టెక్నాలజీ, ఈ-కామర్స్, ఆర్థిక సంస్థలు" ముందు వరుసలో ఉన్నాయని ఇటీవల రూపంక్ చౌదరి చెప్పారు. అలాగే ఆడిట్, పన్ను, చట్టపరమైన సేవలకు భారీ డిమాండ్ ఉన్నందున వృత్తిపరమైన సేవ రంగాలలో కూడా అధిక అట్రిషన్ రేటు ఉన్నట్లు ఆయన అన్నారు. -
తెలంగాణ అంగన్వాడీ టీచర్లకు గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: అంగన్వాడీ కార్యకర్తలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, సహాయ సిబ్బంది వేతనాలను 30 శాతం మేర పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.10,500 నుంచి రూ.13,650కి పెరగనుంది. అలాగే మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం రూ.6 వేల నుంచి రూ.7800కు పెంచుతున్నట్లు ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. అంగన్వాడీ టీచర్లకు పెరిగిన వేతనాలు జూలై నుంచి అమలు చేయనున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది. (చదవండి: కోర్టు తీర్పును టైప్ చేస్తున్న స్టెనోగ్రాఫర్.. అంతలోనే..) -
మెరుగుపడింది జీతాలే... జీవితాలు కాదా!?
పోలీసు శాఖనుండి మొదలుకొని గిడ్డంగుల్లో, జెన్కో, ఫైర్, ఆర్టీవో, ట్రాఫిక్, జైళ్ళు ఇలా ప్రతీశాఖలో విస్తరించి పనిచేస్తున్న ఏకైక సంస్థ హోంగార్డ్స్. 1946 డిసెంబర్ ఆరున బొంబాయి ప్రావెన్స్లో ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్ శాఖల్లో అదనపు సహయార్థం స్వచ్చంద సంస్థగా దీన్ని స్థాపించారు. తర్వాత 1962లో భారత్–చైనా యుద్ధ సమయంలో వీరిని పునర్వ్యవస్థీకరించారు. ఈ పరంపరలోనే వీరి సేవలు గమనించిన ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వాలం టరీ ప్రక్రియ కింద నియామకాలు చేపట్టాయి. ప్రస్తుతం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ఏర్పడిన తర్వాత వీరి జీతాల్లో మార్పులు వచ్చాయి గానీ జీవితాలు మరింత చీకట్లోకి నెట్టివేయబడ్డాయనే చెప్పుకొని తీరాలి. గత అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఆంధ్రప్రదేశ్లో రోజువారీ హోంగార్డుల జీతం రూ. 600 నుండి 710 రూపాయలకు పెంచగా తెలంగాణలో నెలకు 12 వేల నుండి 20 వేల రూపాయలకు పెంచడమే కాకుండా ప్రతీ ఏడాదీ రూ. 1,000 పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. ఇదెంతో ఆహ్వానించదగిన విషయం. కానీ, ఈ నిర్ణయంతోపాటు అంతకుముందున్న కారుణ్య నియామకాలను తొలగించడం పిడుగులాంటి వార్తనే. ఉద్యోగి సర్వీస్ కాలంలో మరణిస్తే, వైద్య కారణాలవలన ఉద్యోగం చేయలేని పరిస్థితి ఉద్యోగికి ఏర్పడిన నేపథ్యంలో కుటుంబ సభ్యులకు ఉద్యోగ నియమకాలను అమలు పరిచే అవకాశాన్ని హోంగార్డులకు తొలగించారు. దీనితో తెలంగాణలో పనిచేస్తున్న సుమారు 17,490 మంది హోంగార్డులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయింది. అయితే ఈ కారుణ్య నియామకాలను ఆంధ్రప్రదేశ్లో హోం గార్డ్స్కు అమలు పర్చడమనేది హర్షించదగిన విషయం. తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి 2019 తర్వాత హోంగార్డ్స్ జీతాలు పెంపుదల సందర్భంలో డబుల్ బెడ్రూం ఇంటి కలను సాకారం చేస్తానని చెప్పిన వాగ్దానం నేటికీ అలాగే ఉండిపోయింది. పోలీసులకు వర్తించే ఎటువంటి అలవెన్స్ వీరికి వర్తించవు. అనారోగ్యంతో బాధపడే క్షణాల్లో కూడ ఆరోగ్య భద్రత స్కీం వీరికి వర్తించకపోవడం, విధినిర్వహణలో చనిపోయినపుడు పోలీసులకు వర్తించే ఎక్స్గ్రేషియా హోంగార్డ్స్కు లేకపోవడం, పోలీసు శాఖలో కానిస్టేబుల్ వంటి ఉద్యోగులతో పోటీపడి విధినిర్వహణ చేస్తున్నప్పటికీ వీరికి అదనపు అలవెన్స్ లేకపోవడం, పైగా ఏధైనా పండుగ పబ్బానికి సెలవులు పెట్టుకునే సీఎల్(క్యాజువల్ లివ్) వెసులుబాటు లేకపోవడం, రోగమొస్తే మెడికల్ లీవ్ అవకాశం లేకపోవడం, హోంగార్డ్స్ ఏరోజు పనిచేస్తే ఆరోజుకే కూలీ చెల్లించే ధోరణిని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసుశాఖ అంటేనే డిసిప్లిన్ పేరుమీదుగా దర్జాగా సాగే వెట్టిచాకిరికి ప్రతిరూపంగా ఉంటుంది. హోంగార్డ్స్ ఉద్యోగ భద్రత లేని బానిసల్లాగే కుక్కిన పేనులాగా అధికారుల చేతిలో హింసపడాల్సిన దుస్థితి నెలకొని ఉంది. ఉన్నతాధికారుల ఆఫీసుల్లో, క్యాంపు కార్యాలయాల్లో, చివరికి వీరి ఇళ్ళలో పాకీ పనులకు, చివరకు సొంతపనులకు కూడ హోంగార్డులను వినియోగించే అధికారులు ఉండటం విచారకరం. ఇకపోతే మహిళ హోంగార్డ్స్ పరిస్థితి మరింత దారుణం. మహిళా హోంగార్డుల పట్ల మాతృత్వ విషయంలో కూడ వివక్ష చూపుతున్నారు. ప్రసూతి సెలవులు మహిళా పోలీసులకు జీతంతో కూడిన ఆరుమాసాల సెలవులైతే మహిళా హోంగార్డులకు మాత్రం మూడునెలల బాలింతగానే విధులకు హజరు కావాల్సిన దుస్థితి ఉన్నది. పైగా డెలివరీ సమయంలో ఎటువంటి భృతీ లభించే పరిస్థితి కూడ లేదు. ఇదికాక లైంగిక వేధింపులు షరామాములుగానే ఉంటాయనేది కాదనలేని విషయం!? ఇటీవల ఎస్ఐ స్థాయి మహిళా అధికారి ఉదంతమే ఇందుకు తిరుగులేని ఉదాహరణ. తెలంగాణ రాష్ట్రం వచ్చాక హోంగార్డులకు మెరుగుపడింది జీతాలే తప్ప జీవితాలు కావనేది చాలా స్పష్టంగా కన్పిస్తున్న యధార్థం. ముఖ్యంగా కారుణ్య నియమకాల విషయంలో కాఠిన్యంతో కాకుండా కరుణతో, మానవీయ కోణంలో తెలంగాణ ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకోవలసి ఉంది. అలాగే హోంగార్డుల వెట్టిచాకిరీని తొలగించి, ఇతర ఉద్యోగులకు మల్లే వీరికీ కనీస హక్కులను కల్పించడంపై మన ప్రభుత్వాలు యోచించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉన్నది. వరకుమార్ గుండెపంగు వ్యాసకర్త కథా రచయిత ‘ మొబైల్ : 99485 41711 -
ఐటీరంగంలో భారీ ఎత్తున ఉద్యోగాలు, లక్షల్లో వేతనాలు
కరోనా కారణంగా స్తబ్దుగా ఉన్న ఐటీ రంగం ఊపందుకుంది. ఐటీ రంగానికి చెందిన ఆరు విభాగాల్లో భారీ ఎత్తున ఉద్యోగుల అవసరం ఉందని సిబ్బంది సేవల సంస్థ ఎక్స్ఫెనో తెలిపింది. ఎక్స్ఫెనో తెలిపిన వివరాల ప్రకారం.. ఐటీ సెక్టార్లో ప్రాడక్ట్, సర్వీస్ విభాగాల్లో వేలల్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది. ఇండియన్ ఐటీ సర్వీసులు, స్టార్ట్ అప్లతో పాటు ఇతర ప్రాడక్ట్ బేస్డ్ కంపెనీలు ఉద్యోగుల్ని ఎంపిక చేసుకుంటున్నట్లు తెలిపింది. ఆరు విభాగాల్లో ముఖ్యంగా ఫుల్ స్టాక్ డెవలపర్స్, డేటా ఇంజనీర్లు, రియాక్ట్ నెగిటీవ్ డెవలపర్స్, డెవలపర్స్, బ్యాకెండ్ ఇంజినీర్స్, మెషిన్ లెర్నింగ్లో ప్రతిభావంతులైన ఉద్యోగుల్ని ఎంపిక చేసే పనిలో పడ్డాయని చెప్పింది. ఈ ఆరు విభాగాల్లో మొత్తం 70 వేలు, అంతేకంటే ఎక్కువ మంది ఉద్యోగుల అవసరం ఉందన్న ఎక్స్ఫెనో.. ఎవరైతో ఈ ఉద్యోగాల్లో రాణిస్తారో వారికి అనుభవాన్ని బట్ట 50నుంచి 60శాతం హైక్ ఇచ్చేందుకు కంపెనీలు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. గతేడాది ఇదే విభానికి చెందిన 3నుంచి 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఉద్యోగులకు 20-25 శాతం శాలరీల్ని హైక్ ఇచ్చాయి. కరోనా కారణంగా ప్రాడక్ట్, సర్వీస్ బేస్డ్ రంగాల్లో వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల, శాలరీల విషయంలో ఐటీ కంపెనీలు వెనకడుగు వేయడం లేదని ఎక్స్ఫెనోమ ప్రతినిధులు వెల్లడించారు. అంతేకాదు గతేడాది ప్రముఖ ఐటీ దిగ్గజం యాక్సెంచర్ 3వేల మంది ఉద్యోగుల్ని నియమించుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఉద్యోగుల అవసరం పెరిగి 18వేల నుంచి 32వేల మంది ఉద్యోగుల ఎంపిక చేసినట్లు యాక్సెంచర్ సీఈఓ జూలీస్వీట్ ఓ ప్రకటనలో తెలిపింది. కాబట్టి నిరుద్యోగులు ఈ ఆరురంగాల్లో నిష్ణాతులై ఉండాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. -
ఆందోళన బాటలో తెలంగాణ జూనియర్ డాక్టర్లు
-
జీతాలు పెంచకపోతే సమ్మె: జూనియర్ డాక్టర్లు
సాక్షి, హైదరాబాద్: గతంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వెంటనే 15 శాతం జీతాలు పెంచాలంటూ జూనియర్ డాక్టర్లు ప్రభుత్వానికి లేఖ రాశారు. 10 శాతం ఇన్సెంటివ్ వెంటనే చెల్లించాలని జూడాల డిమాండ్ చేశారు. 2 వారాల్లో సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెకు దిగుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కోవిడ్ డ్యూటీలు చేసే హెల్త్ కేర్ వర్కర్స్ వైరస్ బారిన పడితే.. నిమ్స్లో వైద్యం అందించేలా జీఓ అమలు చేయాలని జూడాలు డిమాండ్ చేశారు. అంతేకాక కరోనాతో మృతి చెందిన వారికి పరిహారం ఇవ్వాలని కోరారు. చదవండి: వైద్యుల రక్షణకు ఎస్పీఎఫ్! -
టీఆర్ఎస్ ఎదురుదాడి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతన సవరణ (పీఆర్సీ) వంటి అంశాల్లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్.. ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి పట్టభద్రుల కోటా ఎన్నికల్లో ప్రతి విమర్శలకు సిద్ధమవుతోంది. తెలం గాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గడిచిన ఆరున్నరేళ్లలో యువత, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ, వేతనాల పెంపు వంటి అంశాలపై రోజుకో నివేదిక విడుదల చేయడం ద్వారా విపక్షాల విమర్శలకు చెక్ పెట్టాలని భావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన, వేతనాల పెంపు వంటి అంశాలు పట్టభద్రుల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కీలకం కానుండటంతో ఆయా అంశాలకు సంబంధించిన గణాంకాలను ఎన్నికల ప్రచార ఎజెండాగా మార్చుకోవాలని నిర్ణయిం చింది. ఇందులో భాగంగానే 2014 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 1.32 లక్షల ప్రభుత్వ ఉద్యో గాలు భర్తీ చేశామని, దీనిపై ఎవరికైనా సందేహాలు ఉంటే చర్చకు సిద్ధమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు రెండు రోజుల క్రితం నిర్వహించిన మీడియా సమావేశంలో సవాల్ చేశారు. దీనిపై చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్, బీజేపీ నుంచి ప్రతిస్పందన రావడంతో 1.32 లక్షల ఉద్యోగాల కల్పనకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వ విభాగాలవారీగా విడుదల చేసిన కేటీఆర్... సందేహాలుంటే సంబంధిత విభాగాల్లో సరిచూసుకోవాలని సూచించారు. కాంగ్రెస్, బీజేపీపాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై శ్వేతపత్రం, ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తా మంటూ గతంలో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు, ప్రభుత్వరంగ సంస్థలను నిర్వహించలేమనే ప్రధాని ప్రకటనలు తదితరాలపై టీఆర్ఎస్ అటు మీడియా, ఇటు సోషల్ మీడియాలో ఎదురుదాడి చేస్తోంది. ప్రచారాస్త్రంగా వేతనాల పెంపు... వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) సిఫార్సులపై విమర్శలతోపాటు వేతన సవరణపై ప్రభుత్వ ప్రకటనలో జాప్యంపై ప్రభుత్వ ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తి పట్టభద్రుల ఎన్నికలపై ప్రభావం చూపకుండా టీఆర్ఎస్ జాగ్రత్తలు తీసుకుంటోంది. తమది ఎంప్లాయీ ఫ్రెండ్లీ ప్రభుత్వమని ప్రకటించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్... తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగులతో తమకున్న అనుబంధాన్ని మరోమారు తెరమీదకు తెచ్చారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారం చేపట్టిన తర్వాత అత్యధికంగా 43 శాతం ఫిట్మెంట్ ప్రకటించిన విషయాన్ని గుర్తుచేయడంతోపాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న చిరుద్యోగులకు వేతనాలు సవరించిన తీరుపై తాజాగా గణాంకాలు విడుదల చేశారు. అంగన్వాడీ కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బంది, హోంగార్డులు, జీహెచ్ఎంసీ కార్మికులు తదితరులతో సీఎం స్వయంగా భేటీ కావడంతోపాటు వేతనాలు పెంచిన విషయాన్ని ఎన్నికల ప్రచారంలో గుర్తుచేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. చిరుద్యోగుల జీతాలను రెట్టింపు చేయడంతోపాటు ప్రతి నెలా వేతనాలు అందేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేయడాన్ని ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాలని టీఆర్ఎస్ భావిస్తోంది. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ఓట్లను కూడా దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వేతనాలు రెట్టింపు చేసిన విషయాన్ని ఎన్నికల ప్రచారాంశాల్లో చేర్చాలని పార్టీ నిర్ణయించింది. హోంగార్డుల నుంచి పారిశుద్ధ్య కార్మికుల దాకా... రాష్ట్ర ఆవిర్భావానికి పూర్వం రూ. 9 వేలుగా ఉన్న హోంగార్డుల వేతనం ప్రస్తుతం రూ. 23,250కి చేరగా, 108 సిబ్బందికి రూ. 4 వేలు చొప్పున పెరిగింది. వీఆర్ఏలకు రూ. 10,500, వీఏఓలకు రూ. 5 వేలు, కాంట్రాక్టు లెక్చరర్లకు రూ. 37,100 వేతనాలు ఇస్తున్న విషయాన్ని తాజా నివేదికలో టీఆర్ఎస్ పేర్కొంది. వీరితోపాటు ప్రధానంగా అటెండర్లు, ఉపాధి హామీ ఉద్యోగులు, సెర్ప్, ఆశా వర్కర్లు, అర్చకులు, సీఆర్టీలు, పీఈటీలు, ఏఎన్ఎంలు తదితరులకు ఆరున్నరేళ్లలో వేతనాలు పెంచిన తీరును గణాంకాలతో సహా ప్రసంగాలు, కరపత్రాలు, సామాజిక మాధ్యమాల ద్వారా ఓటర్లకు వివరించాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. దీంతోపాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగాల కల్పనకు సంబంధించి పారిశ్రామిక, ఐటీ రంగాల్లో పెరిగిన ఉద్యోగ అవకాశాలపైనా గణాంకాలను విడుదల చేయాలని టీఆర్ఎస్ భావిస్తోంది. -
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్న్యూస్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. వేతనాల పెంపుతోపాటు ఉద్యోగ విరమణ వయసు పెంపు, పదోన్నతులు ఇవ్వడం, అవసరమైన బదిలీలు చేయడం, సరళతరమైన సర్వీసు నిబంధనలు రూపొందించడం, రిటైర్ అయ్యే రోజే ఉద్యోగులకు అన్ని రకాల ప్రయోజనాలు అందించి గౌరవంగా వీడ్కోలు పలకడం, కారుణ్య నియామకాలన్నింటినీ చేపట్టడం వంటి ఉద్యోగ సంబంధ అంశాలన్నింటినీ ఫిబ్రవరిలోగా సంపూర్ణంగా పరిష్కరించనున్నట్లు ప్రకటించారు. అన్నిశాఖల్లో ఖాళీలను గుర్తించి ఫిబ్రవరి నుంచి ఉద్యోగ నియామకాల ప్రక్రియ చేపడతామని తెలిపారు. పదవీ విరమణ వయసు పెంచుతామని టీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉద్ఘాటించారు. ఈ అంశాలన్నింటిపై అధ్యయనం చేయడానికి, ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపడానికి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధ్యక్షుడిగా ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, నీటిపారుదలశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సభ్యులుగా త్రిసభ్య కమిటీని సీఎం నియమించారు. ‘కమిటీ జనవరి మొదటి వారంలో వేతన సవరణ సంఘం నుంచి అందనున్న నివేదికను అధ్యయనం చేస్తుంది. రెండోవారంలో ఉద్యోగ సంఘాలతో సమావేశమవుతుంది. వేతన సవరణ ఎంత చేయాలి? ఉద్యోగుల పదవీ విరమణ వయసు ఎంతకు పెంచాలి? సర్వీసు నిబంధనలు ఎలా రూపొందించాలి? పదోన్నతులకు అనుసరించాల్సిన మార్గమేమిటి? జోనల్ విధానంలో ప్రస్తుతం ఉన్న న్యాయపరమైన చిక్కులను అధిగమించే వ్యూహమేమిటి? తదితర అంశాలపై ప్రభుత్వానికి సూచనలు చేస్తుంది. అనంతరం కేబినెట్ సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది’అని సీఎంఓ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. చదవండి: (హమ్మయ్య.. ఎల్ఆర్ఎస్ ఉపశమనం) ఎవరెవరికి పెరుగుతాయంటే.. ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, వర్క్ చార్జుడ్, డెయిలీ వేజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైమ్ కాంటింజెంట్, కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్, సెర్ప్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీ వర్కర్లు, ఆశ వర్కర్లు, విద్యావలంటీర్లు, గౌరవ వేతనాలు అందుకుంటున్నవారు, పెన్షనర్లు ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాల పెంపు చేస్తామని సీఎం ప్రకటించారు. తెలంగాణలో అన్నిరకాల ఉద్యోగులు, పెన్షనర్లు కలిపి 9,36,976 మంది ఉంటారని, అందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని స్పష్టంచేశారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు తక్కువ వేతనాలున్న ఆర్టీసీ ఉద్యోగులకు కూడా జీతాలు పెంచాలని నిర్ణయించినట్లు తెలిపారు. అవసరమైతే వేతనాల పెంపుతో ఆర్టీసీపై పడే భారాన్ని ప్రభుత్వం భరిస్తుందని సీఎం ప్రకటించారు. పరిమితులకు లోబడి.. ప్రభుత్వానికి ఉన్న ఆర్థిక పరిమితుల మేర సర్కారుకు సేవలందించే అన్నిరకాల ఉద్యోగులకు కచ్చితంగా ఎంతో కొంత వేతనాలు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. ‘రైతుల కోసం, పేదల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఉద్యోగుల సంక్షేమం కోసం కూడా ఎన్నో చర్యలు తీసుకుంటోంది. తెలంగాణ ఏర్పడిన వెంటనే 42 శాతం ఫిట్మెంట్తో వేతనాలు పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లతోపాటు అన్ని ప్రభుత్వరంగ సంస్థలు, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు, తక్కువ వేతనాలతో పనిచేస్తున్న ఉద్యోగులతోపాటు మున్సిపల్, గ్రామ పంచాయతీ సిబ్బందికి వేతనాలు పెంచింది. ఇప్పుడు మరోసారి వీరందరికీ వేతనాలు పెంచాల్సిన అవసరం ఉంది’అని సీఎం పేర్కొన్నారు. చదవండి: (ఆరు నెలల్లో ‘సింగరేణి’ ఖాళీల భర్తీ: ఎన్.శ్రీధర్) రెండు నెలల్లో మొత్తం పూర్తికావాలి.. ‘సమైక్య రాష్ట్రంలో ఉద్యోగుల ప్రతి అంశం చిక్కుముడిగా ఉండేది. ఏది ముట్టుకున్నా పంచాయితీ, కోర్టు కేసులే ఉండేవి. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా కొనసాగాయి. ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసి, ఎన్నోసార్లు సంప్రదింపులు జరిపి, న్యాయ వివాదాలను పరిష్కరించుకొని ఇప్పుడిప్పుడే అన్ని విషయాల్లో స్పష్టతకు వస్తోంది. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యం లేకుండా విధులు నిర్వర్తించే సౌలభ్యం కల్పించడానికి మార్గం సుగమమైంది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఉద్యోగులకు సంబంధించిన అంశాలన్నింటినీ పరిష్కరించాలి. జనవరి, ఫిబ్రవరి మాసాల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కావాలి. మార్చి నుంచి ఉద్యోగులంతా అన్నిరకాల సమస్యల నుంచి శాశ్వతంగా విముక్తి కావాలి’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులను ఆదేశించారు. వెంటనే పదోన్నతులు ఇవ్వాలి.. ‘ఏపీతో వివాదం కారణంగా పోలీసు, రెవెన్యూ తదితర శాఖల్లో పదోన్నతులు ఇవ్వడం సాధ్యం కాలేదు. ఇప్పుడు ఆ గొడవలన్నీ పరిష్కారమయ్యాయి. అందువల్ల వెంటనే అన్ని శాఖల్లో పదోన్నతులు ఇవ్వాలి. అన్ని శాఖల్లో వెంటనే డీపీసీలు నియమించాలి. పదోన్నతులు ఇవ్వగా ఖాళీ అయిన పోస్టులను త్వరగా భర్తీ చేయాలి. శాఖలవారీగా ఖాళీలను గుర్తించి ఫిబ్రవరిలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ ప్రారంభించాలి’అని సీఎం సూచించారు. ‘ప్రతి ఉద్యోగి తాను ఉద్యోగంలో చేరిన నాడే తాను ఏ సమయానికి పదోన్నతి పొందుతాడో తెలిసి ఉండాలి. రిటైర్ అయ్యే నాటికి ఏ స్థాయికి వెళతాడో స్పష్టత ఉండాలి. దీనికి అనుగుణంగా చాలా సరళమైన రీతిలో ఉద్యోగుల సర్వీసు రూల్స్ రూపొందించాలి. పదోన్నతుల కోసం ఎవరివద్దా పైరవీ చేసే దుస్థితి ఉండొద్దు. ఏ ఆఫీసుకూ తిరిగే అవసరం రావొద్దు. సమయానికి ఉద్యోగికి రావల్సిన ప్రమోషన్ ఆర్డర్ వచ్చి తీరాలి. ఉద్యోగులకు తమ కెరీర్ విషయంలో అంతా స్పష్టత ఉండే విధంగా సర్వీస్ రూల్స్ ఉండాలి. ఆయా శాఖల్లో శాఖాధిపతులు ఉద్యోగుల సంక్షేమాన్ని కచ్చితంగా పట్టించుకోవాలి’అని ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. రిటైరైన రోజే అన్ని బెనిఫిట్స్... ‘ఉద్యోగులు దాదాపు 35 ఏళ్లు ప్రభుత్వం, ప్రజల కోసం విధులు నిర్వర్తిస్తారు. అలాంటి ఉద్యోగులకు చాలా గౌరవంగా వీడ్కోలు పలకాల్సిన అవసరం, బాధ్యత ఉంటుంది. నాలుగో తరగతి ఉద్యోగి నుంచి శాఖాధిపతి వరకు ఎవరైనా సరే ఉద్యోగ విరమణ పొందితే వారికి ఆ కార్యాలయంలోనే ఘనంగా సన్మానం జరపాలి. ప్రభుత్వ వాహనంలోనే ఇంటికి తీసుకెళ్లి గౌరవంగా వీడ్కోలు పలకాలి. ఉద్యోగ విరమణ చేసిన రోజే రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ అందించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ల కోసం రిటైర్డు ఉద్యోగులు కార్యాలయాల చుట్టూ తిరిగే దురవస్థ తెలంగాణలో ఉండవద్దు’అని ముఖ్యమంత్రి తేల్చిచెప్పారు. సత్వరమే కారుణ్య నియామకాలు ‘ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉద్యోగ అవకాశం కల్పించే కారుణ్య నియామకాల విషయంలో జాప్యం జరగడం అత్యంత విషాదకరం. దుఃఖంలో ఉన్న కుటుంబం ఉద్యోగం కోసం కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం పడొద్దు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో వెంటనే కారుణ్య నియామకాల ప్రక్రియను పూర్తి చేయాలి’అని కేసీఆర్ ఆదేశించారు. -
విప్రో ఉద్యోగులకు గుడ్న్యూస్!
బెంగళూరు, సాక్షి: సాఫ్ట్వేర్ సేవల దేశీ దిగ్గజం విప్రో.. 2021 జనవరి 1 నుంచి అర్హతగల ఉద్యోగులకు వేతన పెంపును చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా జూనియర్ విభాగం(బీ3 కంటే తక్కువ)లో జీతాలను పెంచనున్నట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అంతేకాకుండా మధ్యస్థాయి విభాగం(సీ1 కంటే పైన)లోనూ వేతన పెంపును పరిశీలిస్తున్నట్లు తెలియజేసింది. అర్హతగల జూనియర్ ఉద్యోగులకు వచ్చే నెల 1 నుంచి పెంపు ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే సీ1 కేటగిరీలో 2021 జూన్ 1 నుంచి పెంపును అమలు చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నట్లు వెల్లడించింది. విప్రోలో బీ3 బ్యాండ్లోనే అధిక శాతం ఉద్యోగులున్నట్లు పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. కంపెనీకున్న 1.8 లక్షల మంది ఉద్యోగులలో బీ3 వాటా 80 శాతంగా పేర్కొంటున్నారు. ఇతర వివరాలు ఇలా.. బీ3కి ప్రమోషన్లు సంబంధిత వర్గాల అంచనాల ప్రకారం విప్రోలో అర్హతగల ఆఫ్షోర్ ఉద్యోగులకు 6-8 శాతం స్థాయిలో వేతన పెంపు ఉండవచ్చు. ఆన్సైట్ సిబ్బందికి 3-4 శాతం స్థాయిలో జీతాలు పెరిగే వీలుంది. కాగా.. ఇటీవల ప్రపంచ దేశాలను వణికిస్తున్న కోవిడ్-19 నేపథ్యంలో ఐటీ కంపెనీలు అప్రైజల్ సైకిల్కు సంబంధించి పునరాలోచనలో పడినట్లు విశ్లేషకులు తెలియజేశారు. సాధారణంగా విప్రో జూన్ నుంచి ఇంక్రిమెంట్లను అమలు చేస్తుందని, అయితే సీ1 బ్యాండ్ ఉద్యోగులు ఒక పెంపును మిస్ అయినట్లు తెలియజేశారు. అయితే సంక్షోభ కాలంలోనూ తమ ఉద్యోగులు ప్రస్తావించదగ్గ పనితీరును చూపినట్లు విప్రో పేర్కొంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3(అక్టోబర్- డిసెంబర్), క్యూ4(జనవరి-మార్చి)లలో బిజినెస్ మెట్రిక్స్ ఆధారంగా ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ పే అమలు చేయనున్నట్లు విప్రో తెలియజేసింది. ఇప్పటికే జులై- సెప్టెంబర్ కాలానికి చెల్లింపులు పూర్తయినట్లు పేర్కొంది. బీ3 బ్యాండ్ వరకూ అత్యుత్తమ పనితీరు కనబరిచిన ఉద్యోగులకు డిసెంబర్ 1 నుంచి ప్రమోషన్లు ఇచ్చినట్లు విప్రో తెలియజేసింది. తద్వారా దాదాపు 7,000 మంది ఉద్యోగులు లబ్ది పొందినట్లు పేర్కొంది. ఇది గత మూడేళ్లలోనే అత్యధికమని తెలియజేసింది. కొత్త సీఐవో కంపెనీకి 25 ఏళ్లపాటు సర్వీసులు అందించిన రోహిత్ అడ్లఖా సీఐవో పదవి నుంచి తప్పుకున్నట్లు విప్రో వెల్లడించింది. దీంతో కొత్త సీఐవోను ఎంపిక చేసేటంతవరకూ ప్రెసిడెంట్, సీవోవో బీఎం భానుమూర్తి ఆ బాధ్యతలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. రోహిత్ ఇప్పటివరకూ చీఫ్ డిజిటల్ ఆఫీసర్, ఏఐ ప్లాట్ఫామ్స్కు హెడ్గా సైతం బాధ్యతలు నిర్వహించినట్లు తెలియజేసింది. -
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు శుభవార్త
సాక్షి,ముంబై: దేశీయ రెండో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల సంస్థ ఇన్ఫోసిస్ తన ఉద్యోగులకు శుభవార్త అందించింది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అన్నిస్థాయిలలో జీతాల పెంపు, పదోన్నతులు కల్పిస్తున్నట్టు తెలిపింది. అలాగే జూనియర్లకు ఇన్సెంటివ్ లను అందజేయనున్నట్టు ప్రకటించింది. బుధవారం ప్రకటించిన త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తాజా నిర్ణయంతో 2.40 లక్షలకు పైగా ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. (ఫలితాల్లో అదరగొట్టిన ఇన్ఫీ) రెండవ త్రైమాసికంలో ప్రత్యేక ప్రోత్సాహంతో పాటు 100 శాతం వేరియబుల్ పే కూడా అందిస్తామని ఇన్ఫోసిస్ తెలిపింది. జూనియర్ ఉద్యోగులకు క్యూ 3 లో ఒకసారి ప్రత్యేక ప్రోత్సాహాన్ని చెల్లిస్తామని ఇన్ఫోసిస్ సీఎండీ సలీల్ పరేఖ్ వర్చువల్ బ్రీఫింగ్ సందర్భంగా వెల్లడించారు. ఈ సందర్భంగా ఉద్యోగుల నిబద్ధత అద్వితీయం అంటూ ప్రశంసలు కురిపించారు. జీతాల పెంపు ప్రక్రియ, 2021 జనవరి 1నుండి అమలులోకి వస్తుందన్నారు. గత త్రైమాసికంలో ప్రమోషన్లను నిలిపివేసామని, కానీ ఇపుడు అన్ని స్థాయిల్లోనూ పదోన్నతులు కల్పిస్తామన్నారు. జీతాల పెంపు మునుపటి సంవత్సరాల మాదిరిగానే ఉంటుందని ఇన్ఫీ సీఓఓ ప్రవీణరావు తెలిపారు. గత ఏడాది, భారతదేశంలో ఇన్ఫోసిస్ సగటు వేతనాల పెంపు 6 శాతంగా ఉంది. 2020 సెప్టెంబర్ త్రైమాసికం చివరినాటికి 2,40,208 మంది ఉద్యోగులను కలిగి ఉంది. కాగా కరోనా సంక్షోభం, వ్యాపారంలో మందగమనం నేపథ్యంలో ప్రమోషన్లు, జీతాల పెంపును నిలిపివేస్తున్నట్లు ఇన్ఫోసిస్ గతంలో ప్రకటించింది. -
జీతం పెంచలేదన్న పగతో..
చంఢీఘడ్ : జీతం పెంచలేదని, నలుగురి ముందు అవమానించాడన్న కోపంతో దొంగతనం నాటకం ఆడి యజమానిపై పగ తీర్చుకోవాలనుకున్నాడు ఓ వ్యక్తి. అయితే నాటకం రక్తికట్టక చివరకు జైలు పాలయ్యాడు. ఈ సంఘటన హర్యానాలోని ఫరీదాబాద్లో ఆదివారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఫరీదాబాద్కు చెందిన దీక్షిత్ అనే వ్యక్తి అక్కడి ఓ కన్స్ట్రక్షన్ కంపెనీలో చాలా కాలం నుంచి పనిచేస్తున్నాడు. అయితే అతడి యజమాని జీతం పెంచకపోగా కొన్నిరోజుల క్రితం దీక్షిత్ను నలుగురి ముందు అవమానించాడు. దీంతో ఆగ్రహానికి గురైన అతడు యజమానిపై పగతో రగిలిపోయాడు. ఎలాగైనా అతడ్ని దెబ్బతీయాలని నిర్ణయించకున్నాడు. ( ఆన్లైన్లో శృంగారం పేరుతో..) ఓ రోజు యజమాని కంపెనీకి చెందిన 10 లక్షల రూపాయల డబ్బులు తీసుకువచ్చే పనిని దీక్షిత్కు అప్పజెప్పాడు. ఇదే సరైన సమయం అని భావించిన అతడు దొంగతనం నాటకానికి తెర తీశాడు. డబ్బులు తీసుకువస్తూ ఉండగా ఇద్దరు దొంగలు తనను దోచేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విచారణ సందర్భంగా దీక్షిత్ గడియకో మాట మాట్లాడుతుండటంతో పోలీసులకు అనుమానం వచ్చింది. గట్టిగా విచారించటంతో దీక్షిత్ నేరం ఒప్పుకున్నాడు. -
గాంధీ నర్సులకు వేతనాల పెంపు!
సాక్షి, హైదరాబాద్: గాంధీ ఆస్పత్రిలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న నర్సులకు త్వరలో వేతనాలు పెరగనున్నాయి. ప్రస్తుతం వారికి ప్రతి నెలా రూ. 17,500 చొప్పున జీతం ఇస్తుండగా, ఆ మొత్తాన్ని రూ.25వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆదివారం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఉన్నతాధికారుల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం గాంధీ ఆస్పత్రిలో 212 మంది ఔట్సోర్సింగ్ నర్సులు పనిచేస్తున్నారు. జీవో 14 ప్రకారం ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ అయిన వీరందరికీ రూ.17,500 జీతం ఇస్తున్నా రు. అయితే ఇటీవల కోవిడ్–19 చికిత్స కోసం ని యమితులైన నర్సులకు రూ.25 వేలు చెల్లిస్తున్నా రు. తాము ఎప్పట్నుంచో పనిచేస్తున్నా తక్కువ జీతమివ్వడం ఏంటని ఆందోళన వ్యక్తం చేస్తూ ఇటీవల వైద్య విద్యా సంచాలకుడి కార్యాలయం వద్ద ఔట్సోర్సింగ్ నర్సులు వరుసగా 3 రోజులు ధర్నా చేశారు. దీంతో డీఎంఈ డాక్టర్ రమేశ్రెడ్డి వారి జీతాల పెంపు అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో జీతాలు పెంచాలని ప్ర భుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే పెరిగిన జీతాలు ఇన్సెంటివ్ రూపంలో ఇచ్చే అవకాశాలు న్నాయి. జీవో 14 ప్రకారం రాష్ట్రవ్యాప్తంగా చాలా మంది ఔట్సోర్సింగ్ పద్ధతిలో నియమితులయ్యారు. వారంతా కూడా తమకు వేతనాలు పెంచాలని డిమాండ్ చేసే అవకాశం ఉండటంతో పెంచిన వేతనాల ను ఇన్సెంటివ్ రూపంలో ఇస్తే ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ఇన్సెంటివ్గా వేతనంతో పాటు ఇన్ పేషెంట్ వద్ద సేవలందించే స్టాఫ్ నర్సులకు రోజుకు రూ.300–500 మధ్యలో ఇవ్వనున్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారికంగా సమాచారం రాలేదు. కరోనా విధుల్లో ఉన్నవారికి షిఫ్టుల వారీగా డ్యూటీలు వేస్తున్నారు. వరుసగా 5 రోజులు పనిచేస్తే మరో 5 రోజులు సెలవిస్తున్నారు. ప్రస్తుతం వైరస్ భయంతో కొంతమంది నర్సులు విధులకు హాజరుకావడం లేదు. కొంతమంది ఉద్యోగాలకు రాజీనామా కూడా చేశారు. బయట నర్సులకు 12 గంటల డ్యూటీలకే రూ.3–4 వేల వరకు ఇస్తున్నారు. అందుకే కోవిడ్ సేవలందిస్తున్న గాంధీ ఆస్పత్రిలోని ఔట్సోర్సింగ్ నర్సులకు ఈ మేరకు వేతనాలు పెంచాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.