-
ఘనంగా శ్రీరామనవమి వేడుకలు
విజయవాడస్పోర్ట్స్: సాయుధ రిజర్వ్ పోలీస్ రామాలయంలో సీతారాముల కల్యాణ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా సతీసమేతంగా పట్టువస్త్రాలు ధరించి ఉత్సవ మూర్తులకు వైభవంగా కల్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు అధిరాజ్ సింగ్రాణా, కె.చక్రవర్తి, ఉదయరాణి, బి.రామకృష్ణ, ఏడీసీపీలు కృష్ణమూర్తినాయుడు, టి.కనకరాజు, కె.శ్రీహరిబాబు, కె.కోటేశ్వరరావు, ఏసీపీలు బి.పార్థసారథి, తేజేశ్వరరావు, కృష్ణంరాజు, డాక్టర్ స్రవంతిరాయ్, ప్రసాద్ , కమిషనరేట్ కార్యాలయ సిబ్బంది, పోలీస్ రామాలయం కమిటీ సభ్యులు, పోలీస్ అసోషియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. ‘108’లో పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం కంకిపాడు: జిల్లాలో పలుచోట్ల 108 వాహనాల్లో ఖాళీగా ఉన్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్, పైలెట్ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ హరీష్రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ పోస్టులకు జీఎన్ఎం, బీఎస్సీ, నర్సింగ్, బీఎస్సీ ఎంఎల్టీ, బీఎస్సీ మైక్రోబయాలజీ/బయోటెక్నాలజీ మొదలైన కోర్సులు చేసిన వారు అర్హులని పేర్కొన్నారు. హనుమాన్జంక్షన్, ఉంగుటూరు, నందివాడ, మచిలీపట్నం, పెనమలూరు, మొవ్వ, పమిడిముక్కల, కోడూరు, అవనిగడ్డ ప్రాంతాల్లో ఈఎంటీ ఖాళీలు ఉన్నాయని తెలిపారు. ఈ నెల 19న మచిలీపట్నం నోబుల్ కాలేజ్లో జరిగే ఇంటర్వ్యూలకు బయోడేటాతో హాజరుకావాలని సూచించారు. వివరాలకు 89191 97050, 98488 47042, 70931 23579 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో 108, తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల పోస్టులకు 10వ తరగతి పాసై, హెవీలైసెన్స్ కలిగి ఉండాలని, 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉండాలని తెలిపారు. ఈ నెల 19న ఎన్టీఆర్ జిల్లా భవానీపురం మార్కెట్యార్డు వద్ద నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని సూచించారు. పైలెట్ పోస్టులు గుడ్లవల్లేరు, పెడన, బంటుమిల్లి, కృత్తివెన్ను, పామర్రు, మొవ్వ ప్రాంతాల్లో ఖాళీలు ఉన్నాయని, మరిన్ని వివరాలకు 99630 06867 నంబర్ను సంప్రదించాలని సూచించారు. అగ్నిప్రమాదాల నియంత్రణపై అవగాహన హనుమాన్జంక్షన్ రూరల్: అగ్నిప్రమాదాల నివారణ, నియంత్రణపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హనుమాన్జంక్షన్ అగ్నిమాపక కేంద్రం అధికారి జీఆర్ మోహనరావు అన్నారు. అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకుని స్థానిక విజయవాడరోడ్డులోని భారత్ పెట్రోల్ బంక్లో బుధవారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. పెట్రోల్ బంక్లో అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నివారణ చర్యలను అక్కడ పని చేస్తున్న సిబ్బందికి వివరించారు. అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు నష్టం వాటిల్లకుండా తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలు, మంటలను అదుపు చేసే పద్ధతులను ప్రత్యక్షంగా ప్రదర్శనల ద్వారా వివరించారు. అనంతరం వీరవల్లిలోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలోనూ అగ్నిప్రమాదాల నియంత్రణపై అవగాహన నిర్వహించారు. కామాంధుడిపై కఠిన చర్యలు తీసుకోండి సాక్షి, అమరావతి: చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం మల్లనూరులో దివ్యాంగురాలిపై లైంగికదాడి చేసిన కామాంధుడు రమేష్పై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా కమిషన్ చైర్పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి ఆ జిల్లా ఎస్పీని ఆదేశించారు. ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్లు వెంకటలక్ష్మి తెలిపారు. బాలికకు మెరుగైన వైద్యసాయం అందించి ఐసీడీఎస్ వసతి గృహానికి తరలించాలని సూచించినట్లు చెప్పారు. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశా మని, మద్యం మత్తులో అతడు ఈ దురాగతానికి పాల్పడినట్లు గుర్తించామని ఎస్పీ చెప్పినట్లు తెలిపారు. బాధితురాలికి మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారని ఆమె చెప్పారు. -
మతసామరస్యానికి ప్రతీక ఈద్ మిలాప్
లబ్బీపేట(విజయవాడతూర్పు): రంజాన్ తర్వాత మతసామరస్యానికి ప్రతీకగా ఈద్ మిలాప్ నిలుస్తుందని వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటు, తూర్పు అసెంబ్లీ అభ్యర్థులు కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్ అన్నారు. అల్ మునీర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఈద్మిలాప్ కార్యక్రమం ఘనంగా జరిగింది. మహాత్మాగాంధీ రోడ్డులోని శ్రీ శేషసాయి కల్యాణ మండపంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు మునీర్ అహ్మద్ షేక్ అధ్యక్షతన కార్యక్రమం జరిగింది. దీనిలో కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్, వెల్లంపల్లి శ్రీనివాస్, షేక్ ఆసిఫ్లతో పాటు, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ఖాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ నెలరోజుల పాటు ఎంతో నిష్టగా ఉపవాసాలు పాటించి జరుపుకునే పండుగ రంజాన్ అన్నారు. కులం, మతం, వర్గం, వర్ణం ప్రాంతాల కతీతంగా మానవులంతా ఒక్కటే అందరి దేవుడు ఒక్కడే అనే విశ్వజనీన సుహృద్భావం ఈద్మిలాప్ సందేశంగా పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని మతాలు, కులాలకు సమాన అవకాశాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కల్పిస్తూ పారదర్శక పాలన సాగిస్తున్నట్లు తెలిపారు. అందరికీ అన్ని వేళలా అండగా ఉంటామని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో మత పెద్దలు రఫీక్సాహేబ్, ముఫ్తీ యూసఫ్ సాహెబ్, మతీన్, ఫారూఖ్ సాహెబ్, ముఖ్తియార్, మహిందర్సింగ్ సహాని, నత్తా బాలస్వామి, కసగోని దుర్గారావుగౌడ్, పాల భాగ్యరాజ్లతో పాటు, పలువురు కార్పొరేటర్లు, మత పెద్దలు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ విజయవాడ పార్లమెంటు, తూర్పు అభ్యర్థులు కేశినేని శ్రీనివాస్, దేవినేని అవినాష్ -
దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలతో అర్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): వసంత నవరాత్రోత్సవాలలో భాగంగా 9వ రోజైన బధవారం ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మకు కనకాంబరాలు, గులాబీలతో అర్చన నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని లక్ష్మీ గణపతి విగ్రహం వద్ద అమ్మవారి ఉత్సవ మూర్తికి విశేష పుష్పార్చన నిర్వహించారు. తొలుత ఆలయ ఈవో కేఎస్ రామరావు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, ఏఈవో ఎన్. రమేష్బాబు, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, ఇతర అర్చకులు అమ్మవారి పుష్పార్చన నిమిత్తం సేకరించిన పుష్పాలతో ఆలయ ప్రాంగణంలో ఊరేగింపు నిర్వహించారు. రాజగోపురం వద్ద నుంచి ఊరేగింపుగా బయలుదేరిన ఆలయ అధికారులు, అర్చకులు ప్రధాన ఆలయంలోని అమ్మవారి మూలవిరాట్ను దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం వేదిక వద్ద ఆలయ అర్చకులు, వేద పండితులు అమ్మవారికి కనకాంబరాలు, గులాబీలు, చామంతి, మందార పుష్పాలు, మొరం, దవళంతో పుష్పార్చన నిర్వహించారు. పూజ అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ నిర్వహించారు. నేడు పూర్ణాహుతి.. వసంత నవరాత్రోత్సవాలు గురువారంతో ముగియనున్నాయి. గురువారం ఉదయం 10 గంటలకు మల్లేశ్వర స్వామి వారి ఆలయం సమీపంలోని యాగశాలలో పూర్ణాహుతి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం అమ్మవారికి అన్ని రకాల పుష్పాలతో అర్చన నిర్వహించనున్నారు. -
ఇక ఆంధ్రా రైతు బ్రాండ్!
అన్నదాతకు తీరని కల ఒకటి ఉంది. తన పంటను నచ్చిన చోట.. నచ్చిన వారికి.. నచ్చిన ధరకు విక్రయించుకోవడం! దీనిని సుసాధ్యం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించింది. పండించిన పంటను ప్రీమియం ధరకు అమ్ముకునేందుకు వీలుగా గుడ్ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్(జీఏపీ) సర్టిఫికేషన్ను తీసుకొచ్చింది. మన దేశంలో ఇది అమలు చేస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశే కావడం విశేషం.సర్టిఫికెట్ల జారీ.. నాణ్యతా పరీక్షల అనంతరం ఈ పదహారు మంది రైతులు పండించిన ధాన్యం నమూనాలు ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ రెగ్యులేషన్–2011కి అనుగుణంగా ఉన్నట్లు తేల్చి రైతుల ఉత్పత్తులు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విక్రయానికి అనుకూలంగా ఉన్నట్లు నిర్ధారిస్తూ.. ఏపీఎస్ఓపీసీఏ పదహారు మంది రైతులకు సర్టిఫికెట్లను జారీ చేసింది. సర్టిఫికెట్లను పొందిన రైతులకు ప్రస్తుతం రబీ సీజన్లో కూడా శిక్షణ కొనసాగుతుంది. ఈ శిక్షణలో రైతుల ధాన్యం ఉత్పత్తులను క్వాలిటీ పరీక్షలు జరిపి సర్టిఫికెట్లను ఇచ్చేందుకు ఈ పదహారు మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసింది. జి.కొండూరు: ఆంధ్రప్రదేశ్ రైతులను గ్లోబల్ మార్కెట్లో నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయాన్ని తీసుకుని అమలు చేశారు. వైఎస్సార్ పొలంబడి పేరుతో సాధారణంగా నిర్వహించే అవగాహన కార్యక్రమాలతో పాటు మేలైన సేద్య పద్ధతులపై అవగాహన కల్పిస్తూనే.. ఆర్గానిక్ వ్యవసాయంపై సంపూర్ణ శిక్షణతో జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో నేరుగా రైతులే తమ ఆహార ధాన్యాలను విక్రయించే విధంగా ప్రణాళికను రూపొందించారు. ఈ ప్రణాళికలో భాగంగా ఎన్టీఆర్ జిల్లాలోని జి.కొండూరు మండల పరిధి కుంటముక్కల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి వైఎస్సార్ ఇండ్గ్యాప్(జీఏపీ) పొలంబడి పేరుతో 16మంది రైతులకు శిక్షణ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఆర్గానిక్ ప్రోడక్ట్ సర్టిఫికేషన్ అథారిటీ(ఏపీఎస్ఓపీసీఏ) ద్వారా స్కోప్ సర్టిఫికెట్లను సైతం అందజేశారు. శిక్షణ ఇలా.. వైఎస్సార్ ఇండ్ గ్యాప్ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు 2023–24 సంవత్సరానికి గానూ ఖరీఫ్, రబీ రెండు సీజన్లలో వరి పండించే కుంటముక్కల గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. అనంతరం ప్రేమధార ఫార్మర్ ప్రొడ్యూసింగ్ మ్యూచువల్లి ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్లో సభ్యులుగా ఉన్న పదహారు మంది రైతులను ఎంపిక చేశారు. ఈ పదహారు మంది రైతులు సాగు చేస్తున్న 61.65ఎకరాల భూమిలో శిక్షణ ప్రారంభించారు. వీటిపైనే శిక్షణ.. జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ యాంత్రీకరణ, నీటి యాజమాన్యం, సమగ్ర కలుపు నివారణ యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్యం, సమగ్ర సస్యరక్షణ యాజమాన్యం, పురుగు మందుల వినియోగం తగ్గించి సేంద్రియ పద్ధతిలో సాగు చేపట్టడం, సేంద్రియ ఎరువులు, పురుగు మందులు తయారు చేయడం, రైతులే తమ పొలాల్లో పర్యావరణ కారకాలపై అధ్యయనం చేసి సాధికారతను సాధించడం, వంటి అంశాలపై శిక్షణ ఇచ్చారు. కేంద్ర బృందాల పర్యవేక్షణ.. ఈ శిక్షణకు ఎంపిక చేసిన రైతులకు ఖరీఫ్ సీజన్లో 14వారాల చొప్పున ప్రతి శుక్రవారం ఇండ్ గ్యాప్ పొలంబడి శిక్షణ ఇచ్చారు. శిక్షణ కాలంలో రైతులు పండిస్తున్న వరి పైరుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సేంద్రియ ఉత్పత్తుల ధ్రువీకరణ అధారిటీ (ఏపీఎస్ఓపీసీఏ)కి చెందిన క్యాలిటీ మేనేజ్మెంట్ బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షించింది. పంట కాలం పూర్తయిన తర్వాత ధాన్యాన్ని పరీక్షలకు పంపింది. ఈ పరీక్షలలో పంట ఉత్పత్తులలో ఆర్సనిక్, కాడ్మియం, కాపర్, మెర్కురీ, టిన్ వంటి ఇన్ ఆర్గానిక్ అవశేషాలతో పాటు సూక్ష్మ విష పదార్థాలైన ఎప్లోటాక్సిన్స్, రసాయనిక అవశేషాలు కూడా లేనట్లు గుర్తించారు. ఆర్గానిక్ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు వైఎస్సార్ ‘గ్యాప్’ పొలంబడి గ్లోబల్ మార్కెటింగే లక్ష్యంగా అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ ఉమ్మడి కృష్ణా జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా కుంటముక్కలలో నిర్వహణ ఒక్కొక్క రైతుపై రూ.12వేలు ఖర్చు చేసిన రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యం, అధికాదాయమే లక్ష్యంరైతులకు సువర్ణావకాశం వైఎస్సార్ ఇండ్ గ్యాప్ పొలంబడి రైతులకు సువర్ణావకాశం. ఈ శిక్షణ కార్యక్రమం వల్ల రైతులు తమ ధాన్యాన్ని గ్లోబల్ మార్కెట్లో నేరుగా అమ్ముకునేలా వీలు కలుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చుతో గ్లోబల్ మార్కెటింగ్ సర్టిఫికెట్లు ఇవ్వడం గొప్ప నిర్ణయం. – ఎం. రాంకుమార్, వ్యవసాయాధికారి, జి.కొండూరు సేంద్రియమే మేలు సేంద్రీయ పద్ధతిలో సాగు చేసే విధానంపై 14వారాలు శిక్షణ ఇచ్చారు. నేను 7.70ఎకరాలలో ఎంటీయూ–1061 రకం వరిని సాగు చేశా. తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వచ్చాయి. మా పంటను ఇతర రాష్ట్రాలు, దేశాలకు అమ్ముకునేలా సర్టిఫికెట్లు కూడా ఇచ్చారు. – పామర్తి సాంబయ్య, రైతు, కుంటముక్కల గ్రామం -
మళ్లీ సీఎంగా జగన్మోహన్రెడ్డిని గెలిపించుకోవాలి
ఎలకుర్రు(పామర్రు): రానున్న ఎన్నికల్లో లంచాలు లేని ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. మండలంలోని ఎలకుర్రు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత పామర్రులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఎలకుర్రు గ్రామం బయలుదేరారు. ఎలకుర్రు, కొరిమెర్ల ప్రాకర్ల గ్రామాల్లో ఉదయం, నిమ్మలూరు, మలయప్పన్నపేట, కాపవరం, సప్తర్ఖాన్పాలెం, మల్లవరం, పరిశేపల్లి, పసుమర్రు గ్రామాల్లో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యేగా తనను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. పెత్తందార్లు పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. కార్యక్రమంలో పామర్రు, మొవ్వ ఎంపీపీలు దాసరి అశోక్కుమార్, కుందేటి ఇందిర, పామర్రు, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యులు కె. స్వరూపరాణి, జొన్నల రామ్మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, నాగమల్లేశ్వరరావు, కాకొల్లు రాజ్యలక్ష్మీ, నాయకులు కాకర్ల వెంకటేశ్వరరావు, పెయ్యల రాజు, ముప్పిడి సురేష్రెడ్డి, ఆరుమళ్ల శ్రీనాఽథ్రెడ్డి, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.పామర్రు ఎమ్మెల్యే అనిల్కుమార్ -
No Headline
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల నిర్వహణలో కీలకమైన నామినేషన్ల ప్రక్రియకు పూర్తిస్థాయిలో సమాయత్తమైనట్లు ఎన్టీఆర్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఆర్వో కార్యాలయాల్లో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈనెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఎన్నికల మీడియా కేంద్రంలో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో కలెక్టర్ ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్తో కలిసి మాట్లాడారు. ఏప్రిల్ 18వ తేదీ ఉదయం 11 గంటలలోపు ఆర్వోల సంతకంతో తెలుగు, ఇంగ్లిష్లో నామినేషన్లకు సంబంధించి ఫారం–1 పబ్లిక్ నోటీస్ జారీ చేస్తామన్నారు. దీన్ని జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయిలోని ముఖ్యమైన కార్యాలయాల్లో పబ్లిష్ చేయనున్నట్లు వివరించారు. అవగాహన కార్యక్రమం.. నామినేషన్ల దాఖలుపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించినట్లు కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. నామినేషన్ల సమర్పణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు సంబంధిత ఫారాల గురించి అవగాహన కల్పించినట్లు చెప్పారు. ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా మిగిలిన అన్ని రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు సంబంధించి అవగాహన కల్పించేందుకు పార్లమెంటు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలలో హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. సెక్యూరిటీ డిపాజిట్.. అభ్యర్థితో కలుపుకొని గరిష్టంగా అయిదుగురికి మాత్రమే ఆర్వో చాంబర్లోకి అనుమతి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. ఆర్వో కార్యాలయం బయట, లోపల కూడా సీసీటీవీలు ఏర్పాటు చేశామని.. వీడియోగ్రఫీ చేస్తామని చెప్పారు. ఒక అభ్యర్థి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉందన్నారు. రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి అభ్యర్థులు నామినేషన్లను ఫైల్ చేయడం కుదరదని స్పష్టం చేశారు. పార్లమెంటరీ నియోజకవర్గానికి పోటీ చేసే అభ్యర్థి రూ. 25 వేలు, అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీచేసే అభ్యర్థి రూ. 10 వేలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉంటుందని.. అభ్యర్థులు ఎస్సీ, ఎస్టీలకు చెందిన వారైతే 50 శాతం మేర మొత్తాన్ని సెక్యూరిటీ డిపాజిట్ చేస్తే సరిపోతుందన్నారు. ఎక్కడికక్కడే స్వీకరణ.. విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి నామినేషన్లను కలెక్టర్ కార్యాలయంలో స్వీకరించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. అదే విధంగా తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి అక్కడి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారన్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గానికి సంబంధించి పశ్చిమ తహసీల్దార్ కార్యాలయంలో.. విజయవాడ సెంట్రల్కు సంబంధించి వీఎంసీ కార్యాలయంలో, విజయవాడ తూర్పునకు సంబంధించి సబ్ కలెక్టర్ కార్యాలయంలోనూ, మైలవరం నియోజకవర్గానికి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో, నందిగామకు సంబంధించి ఆర్డీఓ కార్యాలయం, నందిగామలోనూ, జగ్గయ్యపేటకు సంబంధించి అక్కడి తహసీల్దార్ కార్యాలయంలో నామినేషన్లు స్వీకరిస్తారని కలెక్టర్ వివరించారు. -
వైభవంగా శ్రీరామచంద్రుని శోభాయాత్ర
విజయవాడకల్చరల్: శ్రీ రామనవమి సందర్భంగా శ్రీరామ శోభాయాత్ర సమితి ఆధ్వర్యంలో దుర్గాపురంలోని బీఆర్టీఎస్ రోడ్డులో నిర్వహించిన బైక్ ర్యాలీ వైభవంగా సాగింది. తాళ్లాయపాలెం శైవ పీఠాధిపతి శివస్వామి ర్యాలీని ప్రారంభించారు. శారదా కళాశాలలోని ఆదిశంకరా మార్గ్లో ప్రారంభమైన శోభాయాత్ర, సంగీత కళాశాల, బీఆర్టీఎస్ రోడ్డు, సత్యనారాయణ పురం, ఏలూరు రోడ్డు మీదుగా సాగింది. జై శ్రీరాం అంటూ వందలాది మంది శోభాయాత్రలో పాల్గొన్నారు. శోభాయాత్ర కన్వీనర్ నాగలింగం శివాజీ మాట్లాడుతూ.. 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం వల్ల భవ్య రామమందిరం నిర్మాణం సాధ్యమైందని తెలిపారు. -
కౌంటింగ్ కేంద్రం పరిశీలన
కోనేరుసెంటర్: సాధారణ ఎన్నికల సందర్భంగా కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తున్న ఎన్నికల కౌంటింగ్ కేంద్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పోలింగ్ అనంతరం కృష్ణా విశ్వవిద్యాలయానికి ఈవీఎంల తరలింపు, కౌంటింగ్ కేంద్రంలో సెగ్మెంట్ల వారీగా కేటాయించిన స్ట్రాంగ్ రూముల్లో భద్రపరిచే విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. కౌంటింగ్ కేంద్రానికి ఈవీఎంలతో వచ్చే వాహనాలకు పార్కింగ్ ప్రాంత చదును పనులను పరిశీలించారు. కృష్ణా విశ్వవిద్యాలయ భవనాలకు నలువైపులా ఏర్పరచిన మార్గాలకు వాహనాలు చేరేలా చదును చేయాలని సిబ్బందికి సూచించారు. నియోజకవర్గాల వారీగా మార్గ సూచికలు (సైనేజ్ బోర్డులు) ఏర్పాటు చేయాలని చెప్పారు. విశ్వవిద్యాలయం చుట్టూ నిర్మిస్తున్న ప్రహరీ పనులను మరింత వేగంగా చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్వో కె. చంద్రశేఖరరావు, డ్వామా పీడీ జీవీ సూర్యనారాయణ, సర్వే ఏడీ మనీషా త్రిపాఠి, పీఆర్ ఈఈ శ్రీనివాసరావు, కృష్ణా విశ్వవిద్యాలయ ప్రిన్సిపాల్ సుందరకృష్ణ, తదితరులు ఉన్నారు. ఎన్నికల అధికారులకు కలెక్టర్ బాలాజీ పలు సూచనలు బందోబస్తు ఏర్పాట్లపై ఆదేశాలు -
గుర్తుతెలియని మృతదేహం లభ్యం
ఇబ్రహీంపట్నం: ఎన్టీటీపీఎస్ కూలింగ్ కెనాల్ల్లో గుర్తుతెలియని మృతదేహం పోలీసులకు లభించింది. స్టేజ్–2 గేటు వద్ద మృతదేహాన్ని గుర్తించిన సంస్థ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి.రాంబాబు బుధవా రం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఎస్ఐ బి.అనూష ఘటన స్థలంలో మృతదేహాన్ని స్వాధీ నం చేసుకున్నారు. మృతుని ఎత్తు ఐదు అడుగులు, వయస్సు సుమారు 35–40ఏళ్ల మధ్య ఉంటుంది. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వివరాలు తెలిసిన వారు ఎస్హెచ్వో 94406 27084, ఎస్ఐ 93906 81266 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ కోరారు. కృష్ణా నదిలో.. చందర్లపాడు (నందిగామ): కృష్ణానదిలో గుర్తుతెలియ ని ఓ మహిళ మృతదేహాన్ని బుధవారం చందర్లపాడు పోలీసులు గుర్తించారు. ఎస్సై ఆర్.ధర్మరాజు తెలిపిన వివరాల ప్రకారం చందర్లపాడు మండలం రామన్నపే ట గ్రామ సమీపంలోని కృష్ణా నదిలో ఉన్న పంపింగ్ స్కీం వద్ద నీటిలో పూర్తిగా నాని పోయి ఉన్న మృతదేహాన్ని స్కీం వద్ద పని చేసే సిబ్బంది గుర్తించారు. వెంటనే చందర్లపాడు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు మృతదే హం కృష్ణా నదిలో ఎగువ ప్రాంతంనుంచి కొట్టుకు వ చ్చినట్లుగా గుర్తించారు. మృతురాలి వయసు సుమా రు 35నుంచి 45 సంవత్సరాలు ఉంటాయన్నారు. మృతురాలి శరీరంపై నీలిరంగు చీర, జాకెట్తోపాటు ఎర్ర గాజులు ఉన్నట్లు తెలిపారు. మృతదేహం నీటిలో పూర్తి గా నాని పోయిందన్నారు. కేసు నమోదు చేసి అన్ని పోలీస్స్టేషన్లకు సమాచారమిచ్చినట్లు ఎస్సై తెలిపారు. -
No Headline
నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థులు పార్టీ ప్రచారం పై పూర్తి స్థాయిలో దృష్టి సారించనున్నారు. ఇప్పటికే ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు, గడపగడపకు మన ప్రభుత్వంతో పాటు నియోజకవర్గంలో పార్టీ పిలుపు ఇచ్చిన పలు కార్యక్రమాల ద్వారా నియోజకవర్గాన్ని రెండు, మూడు సార్లు చుట్టేశారు. ప్రతి గడపను సందర్శించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను, వ్యక్తిగతంగా ఐదేళ్లలో తమ కుటుంబాలకు జరిగిన ఆర్థిక లబ్ధిని వివరించారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలో ఉన్నారు. సిద్ధం సభలు, మేమంతా సిద్ధం బస్సు యాత్ర కార్యక్రమాలు మరింత జోష్ నింపాయి. దీంతో రెట్టించిన ఉత్సాహంతో అభ్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు. టీడీపీ అభ్యర్థులు తమ పాలనలో చేసిన అవినీతి, జన్మభూమి కమిటీల దాష్టీకాలను ప్రజలు గుర్తు చేసుకొంటూ, అభ్యర్థులకు సహకరించడం లేదు. వీరి ప్రచారాలకు స్పందన కరువు అవుతోంది. కార్యకర్తల్లోనూ నైరాశ్యం ఆవహిస్తోంది. దీంతో టీడీపీ అభ్యర్థులు తలలు పట్టుకొంటున్నారు. -
చంద్రబాబు మాటలు నమ్మరు
వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావురామవరప్పాడు: చంద్రబాబు దొంగ మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే స్థితిలో లేరని వైఎస్సార్ సీపీ బందరు ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖరరావు చెప్పారు. రామవరప్పాడులో బుధవారం మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి సింహాద్రి చంద్రశేఖర్తో కలిసి గన్నవరం ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రశేఖరరావు మాట్లాడుతూ ఇప్పటికే ఎన్నో అమలు కాని హామీలిచ్చి చంద్రబాబు మోసం చేసిన విషయాన్ని ప్రజలు మరిచి పోలేదన్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణే జగన్ను రెండోసారి ముఖ్యమంత్రిని చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తోక పార్టీల కుట్ర రాజకీయం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక తోక పార్టీలన్నీ కుట్రరాజకీయాలు చేస్తున్నాయని తమ విలువైన ఓట్ల ద్వారా వారికి బుద్ధి చెప్పి తరిమి కొట్టాలని వైఎస్సార్ సీపీ గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీమోహన్ అన్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న జగన్పై ఉద్దేశపూర్వకంగా హత్యాయత్నం చేయించడం దుర్మార్గ చర్య అన్నారు. సంక్షేమమే అజెండాగా జగన్ ప్రజల మధ్యే పర్యటిస్తున్నారన్నారు. జగనన్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు విజయం చేకూరుస్తాయన్నారు. సీఎం జగన్కు ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని, తమ రెండు ఓట్లను ఫ్యాను గుర్తుపై వేసి అఖండ విజయం చేకూరుస్తారన్న నమ్మకం ఉందని పేర్కొన్నారు. గ్రామంలోని ఒకటో వార్డు సభ్యురాలు బర్రె దేవుడమ్మతో పాటు పలు కుటుంబాలు వంశీమోహన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వారిని సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువా కప్పారు. కార్యక్రమంలో గొల్లపూడి మార్కెట్యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోటేశ్వరరావు, ఎంపీపీ చెన్ను ప్రసన్నకుమారి, జెడ్పీటీసీ సభ్యుడు సువర్ణరాజు, నియోజకవర్గ ఎలక్షన్ ఇన్చార్జి ఆర్.వెంకటేశ్వరరావు, పార్టీ రూరల్ మండల అధ్యక్షుడు శీలం రంగారావు, గ్రామ సర్పంచి వరి శ్రీదేవి, పలు గ్రామాల సర్పంచ్లు, సొసైటీ చైర్మన్లు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. -
ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. ఈ నెల 18న నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వివిధ అంశాలపై కలెక్టరేట్లోని తన చాంబర్లో సోమవారం వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా కావాలని సూచించారు. నామినేషన్ల ప్రక్రియ నిర్వహణకు చేయాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమలు సరళి, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూం కార్యకలాపాలు, వివిధ మార్గాల ద్వారా వస్తున్న ఫిర్యాదులు–వాటి పరిష్కారం, ఎన్నికల పరిశీలకులకు చేయాల్సిన ఏర్పాట్లు, ఎన్నికల సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ అమలు, ఎన్నికల సిబ్బంది శిక్షణ తదితర అంశాలపై చర్చించి సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఆర్వో వి.శ్రీనివాసరావు, కలెక్టరేట్ ఏవో సీహెచ్ నాగలక్ష్మి, ఎన్నికల సెల్ సూపరింటెండెంట్ ఎం.దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సీ–విజిల్ ద్వారా 526 ఫిర్యాదులు పరిష్కారం.... జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు సీ–విజిల్ ద్వారా 526 ఫిర్యాదులురాగా అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపారు. ఓటర్ హెల్ప్లైన్, నేషనల్ గ్రీవెన్స్ సర్వీసెస్ పోర్టల్ (ఎన్జీఎస్పీ) తదితర మార్గాల ద్వారా మొత్తం 1,331 ఫిర్యాదులు రాగా 1,303 పరిష్కార ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. మిగిలినవి పురోగతిలో ఉన్నాయని తెలిపారు. ఓటరు హెల్ప్లైన్ (1950) ద్వారా 211 ఫిర్యాదులు రాగా 211 పరిష్కరించామని వెల్లడించారు. ఎన్జీఎస్పీ ద్వారా 407 ఫిర్యాదులు రాగా వాటిలో 403 పరిష్కరించినట్లు వివరించారు. అదే విధంగా వాట్సాప్ నంబరు (9154970454) ద్వారా 31 ఫిర్యాదులు రాగా 27 , కాల్ సెంటర్ (0866–2570051) ద్వారా 22 ఫిర్యాదులు రాగా 22 పరిష్కరించినట్లు తెలిపారు. కంప్లయింట్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సీఎంఎస్) ద్వారా 58 ఫిర్యాదులు రాగా 48, సీఈవో మెయిల్స్ ద్వారా 13 ఫిర్యాదులు రాగా 9 పరిష్కరించినట్లు పేర్కొన్నారు. 63 ప్రతికూల వార్తలకు సంబంధించి 57 అంశాలను పరిష్కరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదుపైనా ప్రత్యేకంగా దృష్టి సారించి నాణ్యతతో పరిష్కరిస్తున్నామన్నారు. సమర్థవంతంగా ఎన్నికల నియమావళి అమలు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని సమర్థవంతంగా అమలుచేస్తున్నామని.. సీజర్ మేనేజ్మెంట్ వ్యవస్థ పటిష్టంగా అమలవుతోందని కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు రూ. 7.06 కోట్ల విలువైన నగదు, మద్యం, మత్తు పదార్థాలు, విలువైన వస్తువులు, ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. రూ. 3.16 కోట్ల నగదుతో పాటు రూ. 94.16 లక్షల విలువైన 19,583 లీటర్ల మద్యం, రూ. 12.20 లక్షల విలువైన మత్తు పదార్థాలు, రూ. 2.32 కోట్ల విలువైన 7,758 గ్రాముల విలువైన లోహాలు, రూ. 6.43 లక్షల విలువైన 132 ఉచితాలు తదితరాలను సీజ్ చేసినట్లు చెప్పారు. జగ్గయ్యపేట నియోజకవర్గానికి సంబంధించి రూ. 1.16 కోట్ల మేర సీజర్లు జరిగినట్లు వెల్లడించారు. అదే విధంగా మైలవరం నియోజకవర్గంలో రూ. 48.59 లక్షలు, నందిగామలో రూ. 20.23 లక్షలు, తిరువూరులో రూ. 85.84 లక్షలు, విజయవాడ సెంట్రల్లో రూ. 2.75 కోట్లు, విజయవాడ తూర్పులో రూ. 64.26 లక్షలు, విజయవాడ పశ్చిమలో రూ. 94.81 లక్షల విలువైన సీజర్లు జరిగినట్లు వివరించారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు 526 సీ–విజిల్ ఫిర్యాదుల పరిష్కారం -
బీసీలకు బ్యాక్ బోన్ వైఎస్సార్ సీపీ
జగ్గయ్యపేట: బీసీలకు బ్యాక్బోన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య తెలిపారు. పట్టణంలోని ఎస్జీఎస్ కళాశాలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ ఆధ్వర్యంలో నియోజకవర్గ బీసీ ఆత్మీయ సదస్సు సోమవారం రాత్రి నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో బీసీలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందారని చెప్పారు. చట్ట సభలలో 50 శాతం రిజర్వేషన్లు కావాలంటే జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేసుకోవాలని తెలిపారు. చంద్రబాబు ప్రజలను ఓటర్లుగా చూస్తారని జగన్మోహన్రెడ్డి కుటుంబ సభ్యులుగా చూస్తారని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను జగన్మోహన్రెడ్డి అమలు చేశారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి జగన్ వంటి గొప్ప నాయకుడు కావాలంటూ కర్ణాటక, తమిళనాడు, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్, చత్తీస్ఘడ్ రాష్ట్రాల ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యే ఉదయభానును గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీల వర్గాలతో పాటు ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఎమ్మెల్యే సామినేని ఉదయభాను మాట్లాడుతూ నియోజకవర్గంలో ఐదేళ్లలో కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా బీసీలకు ఎంతో ప్రాధాన్యతనిచ్చామని తెలిపారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి మాటల సీఎం కాదని చేతల సీఎం అన్నారు. ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసే తాను పోలీస్ ఉద్యోగాన్ని వదిలి రాజకీయాల్లోకి వచ్చానన్నారు. టీటీడీ పాలక మండలి సభ్యుడు సిద్దవాటం యానాదయ్య మాట్లాడుతూ నాయీ బ్రాహ్మణులను కించపరిచిన చంద్రబాబును రానున్న ఎన్నికలలో మట్టి కరిపించాలని పిలుపునిచ్చారు. నవరత్నాలతో పేదలకు మేలు... ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి మాట్లాడుతూ నవరత్నాల పథకాల ద్వారా నిరుపేదలకు మేలు జరిగిందన్నారు. అనంతరం ఆర్.కృష్ణయ్య, ఉదయభానును బీసీ సెల్ నాయకులు సత్కరించారు. ముందుగా మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి, వడ్డెర, నాయీబ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్లు జింకా విజయలక్ష్మీ, దేవళ్ల రేవతి, తొండమళ్ల పుల్లయ్య, పార్టీ మహిళా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బేబిరాణి, ముదిరాజ్ హక్కుల సాధన సమితి అధ్యక్షుడు పిల్లి రామారావు, నెడ్కాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్, నియోకవర్గ పరిశీలకుడు నూతలపాటి హనుమయ్య, యువజన నాయకుడు సామినేని వెంకట కృష్ణ ప్రసాద్, ఫైనాన్స్, పూసల, మైనింగ్ కార్పోరేషన్ల డైరెక్టర్లు విజిత, కుమారి, రామారావు, విమలాభాను ఫౌండేషన్ చైర్మన్ విమలాభాను, నియోజకవర్గ బీసీ సెల్ నాయకులు పెంటి శ్రీనివాసరావు, శ్రీనివాస గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీ ఆత్మీయ సదస్సులో కృష్ణయ్య -
యాత్ర సాగిందిలా..
● మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సోమవారం కేసరపల్లి వద్ద ఏర్పాటు చేసిన రాత్రి బస నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరారు. ● అక్కడి నుంచి గన్నవరం, ఆత్కూరు, వీరపల్లి, హనుమాన్ జంక్షన్, పుట్టగుంట, జొన్నపాడు, నాగవరప్పాడు (గుడివాడ) వరకు సాగింది. ● మధ్యాహ్నం 3:30 గంటలకు జొన్నపాడు వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు. ● అనంతరం 4:40కి బయలుదేరి జనార్దనపురం మీదుగా సాయంత్రం 5:05గంటలకు గుడివాడ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. ● సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా ఏలూరు జిల్లా నారాయణపురంలో ఏర్పాటు చేసిన రాత్రి బస శిబిరానికి చేరుకున్నారు. -
యువతి మృతి
గుణదల(విజయవాడ తూర్పు): అనుమానాస్పద స్థితిలో యువతి మృతి చెందిన ఘటన మాచవరం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. మాచవరం సీఐ గుణరామ్ తెలిపిన వివరాల ప్రకారం... చుట్టుగుంట బీఎస్ఎన్ఎల్ ప్రాంతానికి చెందిన కాట్రగంటి మౌనిక (22) మానసిక వికలాంగురాలు. తండ్రి కొన్నేళ్ల క్రితం మృతి చెందాడు. తల్లి బీఎస్ఎన్ఎల్లో ఉద్యోగి. ఇంట్లోనే ఉంటున్న మౌనిక గత కొంత కాలంగా ఒంటరిగా తనలో తాను మాట్లాడుకుంటూ మతి స్థిమితం లేకుండా ఉంటోంది. సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో తాడుతో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆఫీసు నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తల్లి తలుపు కొట్టినా ఎంతకీ తీయకపోవడంతో అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూస్తే ఉరికి వేలాడుతున్న మౌనిక కన్పించింది. 108 సహాయంతో ఆసుపత్రికి తరలించగా ఆమె అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. -
ప్రజలు.. దేవుడు జగనన్నకు అండగా నిలిచారు
ఉప్పాల రాము, హారిక దంపతులు పెడన: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రజలు, దేవుడు అండగా నిలిచారని వైఎస్సార్ సీపీ పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి ఉప్పాల రమేష్ (రాము), జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక అన్నారు. కేసరపల్లిలో ఏర్పాటు చేసిన బస వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని సోమవారం పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాము, హారిక మాట్లాడుతూ జగనన్న భయపడే వ్యక్తి కాదని తెలిపారు. జగనన్నకు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక నీచ సంస్కృతికి ప్రతిపక్షాలు పాల్పడ్డాయని ధ్వజమెత్తారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకుని ప్రజల ముందుకు క్షేమంగా తిరిగి వచ్చారని తెలిపారు. మరింత జనరంజక పాలన అందించడానికి వస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ విజయం ఖాయమన్నారు. -
నేత్ర పర్వంగా కూచిపూడి నృత్యాలు
విజయవాడ కల్చరల్: శ్రీరామనవమి సందర్భంగా ముమ్మనేని సుబ్బారావు సిద్ధార్థా కళాపీఠం ఆధ్వర్యంలో మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాలలోని వేదికపై సోమవారం కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలు ఆకట్టుకున్నాయి. నాట్యాచార్యుడు అజయ్కుమార్ శిష్యబృందం శ్రీ రాఘవం నృత్య కార్యక్రమాలు శ్రీ రామచంద్రుని వైభవాన్ని చాటాయి. శ్రీరాఘవంతో ప్రారంభించి బాలకనకమయ, రామనామము, రామాయణ శబ్దం, రామచంద్రుడితడు రఘు వీరుడు, గరడగమన రారా, రాముడు రాఘవుడు, ఇదిగో భద్రాద్రి అంశాలను ప్రదర్శించారు. నట్టువాగం శ్రీనివాస్, గాత్రం సుధా శ్రీనివాస్, మృదంగం పై శ్రీధరా చార్య, వయోలిన్పై చావలి శ్రీనివాస్, వేణువుపై కుమార్బాబు సహకరించారు. సిద్ధార్థ కళాశాల విద్యార్థిని కృష్ణ సేన ప్రదర్శించిన కూచిపూడి నృత్యం ఆకట్టుకుంది. కళాశాల విద్యార్థినులు శ్రీరామునిపై భక్తి గీతాలు ఆలపించారు. కళాపీఠం బాధ్యలు ఎన్.లలిత్ ప్రసాద్, సాంస్కృతిక కార్యక్రమాల కార్యదర్శి బీవీఎస్ ప్రకాష్ కళాకారులను సత్కరించారు. -
బంగారు దుకాణంలో చోరీ
కంచికచర్ల : మండల కేంద్రంలోని ఓ బంగారం దుకాణంలో సోమవారం తెల్లవారుజామున చోరీ జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. నందిగామ సబ్ డివిజన్ ఏసీపీ రవికిరణ్ కథనం మేరకు...కంచికచర్లలో జూలూరు శేషుకుమార్కు చెందిన శ్రీ వాసవి జ్యూయలర్స్ దుకాణంలో గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగులకొట్టి 350 గ్రాముల బంగారు నగలు, 8 కిలోల వెండి చోరీ చేశారని చెప్పారు. వాటి విలువ సుమారు రూ.14.50 లక్షలు ఉంటుందని వెల్లడించారు. షాపునకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కూడా తీసుకెళ్లారని తెలిపారు. మచిలీపట్నం నుంచి డాగ్ స్క్వాడ్, వేలిముద్రల నిపుణలను పిలిపించి విచారణ చేపట్టామని పేర్కొన్నారు. త్వరలోనే దుండగులను పట్టుకుంటామని తెలిపారు. పోయిన నగలు రికవరీ చేస్తామన్నారు. కార్యక్రమంలో క్రైం ఏసీపీ శ్రవంతిరాయ్, నందిగామ రూరల్ సర్కిల్ సీఐ పి.చంద్రశేఖర్, ఎస్ఐ పెంకె వెంకట సత్య సుబ్రహ్మణ్యం, ఎస్ఐ–2 హేమలత, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
వైభవం.. కల్యాణోత్సవం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గా మల్లేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలో షష్టిని పురస్కరించుకుని వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారి కల్యాణోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై ఉత్సవ మూర్తులకు ఆలయ వైదిక కమిటీ సభ్యుడు యజ్ఞనారాయణ శర్మ, అర్చకులు కల్యాణోత్సవాన్ని శాస్త్రోక్తంగా జరిపించారు. ఆలయ ఈవో కేఎస్ రామరావు, పలువురు ఉభయదాతలు పాల్గొన్నారు. కల్యాణోత్సవం అనంతరం స్వామి వారికి తలంబ్రాలను సమర్పించగా, ఆ తర్వాత తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు. ఆ తర్వాత ఉత్సవ మూర్తులకు నిర్వహించిన పల్లకీ సేవలో పాల్గొనేందుకు భక్తులు పోటీ పడ్డారు. సేవలో పాల్గొన్న ఉభయదాతలకు ప్రత్యేక క్యూలైన్ మార్గం ద్వారా అమ్మవారి దర్శనానికి అనుమతించారు. అత్యుత్తమ విద్యాసంస్థ ‘ఇగ్నో’వన్టౌన్(విజయవాడపశ్చిమ): ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలను పాటించే విద్యాసంస్థల్లో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) మొదటిదని ఆ సంస్థ విజయవాడ ప్రాంతీయ కేంద్రం సీనియర్ రీజనల్ డైరెక్టర్ డాక్టర్ డీఆర్ శర్మ అన్నారు. కేబీఎన్ కళాశాల ఇగ్నో స్టడీ సెంటర్ నూతన విద్యార్థుల ఇండక్షన్ మీటింగ్ ఆదివారం ఆ కళాశాల ప్రాంగణంలో జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన డాక్టర్ డీఆర్ శర్మ మాట్లాడుతూ ఉన్నత విద్యారంగంలో ఇగ్నోకు ప్రత్యేక స్థానముందన్నారు. డెప్యూటీ డైరెక్టర్ డాక్టర్ బి.ప్రసాద్బాబు మాట్లాడుతూ ఇగ్నో అనుసరించే బోధనా పద్ధతులు, ఇతర నిర్వహణ తదితర అంశాల ద్వారా యూజీజీ నాక్ నుంచి ఏ డబుల్ప్లస్ గ్రేడ్ను సాధించి ప్రమాణాల విషయంలో అగ్రగామిగా ఉందన్నారు. స్టడీ సెంటర్ కోఆర్డినేటర్ ఎన్. సాంబశివరావు, అసిస్టెంట్ కోఆర్డినేటర్లు డాక్టర్ ఎం. వెంకటేశ్వరరావు, రీజనల్ సెంటర్ అసిస్టెంట్ కోఆర్డినేటర్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పీఎల్ రమేష్ పాల్గొన్నారు. కార్టూన్లు సామాజిక చైతన్యం కలిగించాలి విజయవాడ కల్చరల్: కార్టూన్లు సామాజిక చైతన్యం కలిగించాలని దుర్గామమల్లేశ్వర స్వామి దేవస్థానం ఈవో కేఎస్ రామరావు అన్నారు. పాలపర్తి రాజగోపాల్ ఉమాదేవి స్మారక కమిటీ, ఎన్సీసీఎఫ్ విశాఖపట్నం ఆధ్వర్యంలో సూర్యారావు పేటలోని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ప్రాంగణంలోని ఎమెస్కో సాహిత్య వేదికపై ఆదివారం ఉగాది కొసమెరుపు మినీ హాస్యకథల పోటీ, కార్టూన్లు పోటీ విజేతలకు బహుమతి ప్రదానోత్సవం జరిగింది. అలాగే నాగిశెట్టి కార్టూన్లు ఆవిష్కరణ, 2024 సంవత్సరానికి గానూ సాహితీవేత్త భావరాజు పద్మినీ ప్రియదర్శినికి బంగార్తల్లి పురస్కార ప్రదానం చేశారు. రామారావు మాట్లాడుతూ కార్టూన్లు హాస్యానికి పెద్దపీట వేస్తూ సామాజిక చైతన్యం కలిగించాలని సూచించారు. కేబీఎన్ కళాశాల కార్యదర్శి, కరస్పాండెంట్ టి. శ్రీనివాస్ మట్లాడుతూ కవులు రచయితలు సమాజాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఆధునిక చిత్రకళలో మార్పులను స్వాగతించాలి విజయవాడకల్చరల్: ఆధునిక చిత్రకళలో వస్తున్న మార్పులను స్వాగతించాలని ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య అధ్యక్షుడు ప్రొఫెసర్ ఎస్ఎం పిరాన్ అన్నారు. చిత్రకారుల సమాఖ్య ఆధ్వర్యాన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా స్వరాజ్య మైదానంలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద చిత్ర కళాంజలి పేరుతో చిత్ర కళా ప్రదర్శన, చిత్రకారులకు సన్మానం, విగ్రహ రూప శిల్పి శివప్రసాద్ ఆత్మీయ సత్కార కార్యక్రమం నిర్వహించారు. చిత్రకారుడు పిరాన్ చిత్ర కళా ఆధునికత అంశంగా ప్రసంగించారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కె.బాలయోగి మాట్లాడుతూ భారతీయ చిత్రకళ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తోందని తెలిపారు. జాయింట్ సెక్రటరీ మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రపంచ తెలుగు చిత్రకారుల సమాఖ్య ద్వారా బాల బాలికలకు శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. చిత్ర కళావర్క్షాప్లో 30 మంది చిత్రకారులు పాల్గొన్నారు. -
కనులపండువగా పుష్పార్చన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రోత్సవాల్లో ఆరో రోజైన ఆదివారం దుర్గగుడిలో అమ్మవారికి కాగడా మల్లెలు, జాజులతో అర్చన చేశారు. తొలుత ఆలయ ఈవో కె.ఎస్.రామరావు దంపతులు, ఏఈవో ఎన్. రమేష్బాబు, స్థానాచార్య శివప్రసాద్ శర్మ, వైదిక కమిటీ సభ్యులు రంగావజ్జుల శ్రీనివాసశాస్త్రి, మురళి, ఇతర అర్చకులు అమ్మవారికి అర్చన చేయిఆంచే పుష్పాలతో అంతరాలయంలోని మూలవిరాట్ను దర్శించుకున్నారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ ఊరేగింపుగా పుష్పార్చన వేదిక వద్దకు చేరుకున్నారు. ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చారణ చేస్తుండగా, అర్చకులు పుష్పాలతో అమ్మవారికి అర్చన నిర్వహించారు. అనంతరం అమ్మవారికి పంచహారతుల సేవ జరిగింది. అర్చన చేసిన పుష్పాలను భక్తులకు పంపిణీ చేశారు. భక్తులతో లక్ష్మీ గణపతి ప్రాంగణం సందడిగా మారింది. పుష్పార్చనను వీక్షించేందుకు విచ్చేసిన భక్తులకు ఈవో రామరావు సౌభాగ్య ఆధ్యాత్మిక పుస్తకాలను పంపిణీ చేశారు. -
వెలంపల్లిపై అనుచిత వ్యాఖ్యలు
టీడీపీ నేతలపై కేసు నమోదు సత్యనారాయణపురం(విజయవాడసెంట్రల్): ఎన్నికల కోడ్ ఉల్లంఘించి ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావుపై నిరాధార ఆరోపణలు, అసభ్యకర వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకులపై ఎన్నికల కమిషన్ ఆదేశాలతో రెండు రోజుల క్రితం ఎస్ఎన్పురం పీఎస్లో కేసు నమోదైంది. వివరాల ప్రకారం ఈ ఏడాది మార్చి 26న సింగ్నగర్లోని టీడీపీ సెంట్రల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ నేతలు డూండి రాకేష్, తుమ్మలపెంట శ్రీనివాసరావు మాట్లాడారు. ఎమ్మెల్యే వెలంపల్లిపై దుర్భాషలాడుతూ ఆయన సామాజిక వర్గానికి తప్పుడు సంకేతాలు వెళ్లేలా మాట్లాడటంతో పాటు ఆయనపై అసత్య ఆరోపణలతో కూడిన కరపత్రాలను ముద్రించి సత్యనారాయణపురంలోని పలు ప్రాంతాల్లో పంపిణీ చేశారు. దీనిపై వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కన్వీనర్ కుంచెం యోహాను సెంట్రల్ ఎలక్షన్ కంప్లైంట్ సెల్లో అధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో జోనల్ కమిషనర్, ఎంసీసీ టీం, ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారులు పూర్తిస్థాయిలో విచారణ చేశారు. అందులో ప్రింటింగ్ ప్రెస్ అడ్రస్, కాపీల సంఖ్య వంటి వివరాలు లేకుండా ఎమ్మెల్యే వెలంపల్లిపై తప్పుడు ఆరోపణలతో కరపత్రాలను ముద్రించి పంపిణీ చేసినట్లు గుర్తించారు. ఇది ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని, దీనికి పాల్పడిన ఇద్దరు టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాల్సిందిగా ఎస్ఎన్పురం పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
జైత్రయాత్రకు కృష్ణా సిద్ధం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్రకు కృష్ణా జిల్లా ముస్తాబైంది. సోమవారం ఉదయం కేసరపల్లి రాత్రి బస నుంచి బయలు దేరి గన్నవరం, హనుమాన్జంక్షన్ మీదుగా గుడివాడకు సీఎం చేరుకోనున్నారు. గుడివాడ–ఏలూరు రోడ్డు నాగవరప్పాడు వైఎస్సార్ కాలనీకి సమీపంలో సిద్ధం సభ ఏర్పాటు చేస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల ప్రజలు ఈ సభకు హాజరు కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. వేదిక ముందు భాగంలో పార్టీ గుర్తు ఫ్యాన్ ఆకారంలో వాక్ ర్యాంపును ఏర్పాటు చేశారు. స్టేజికి ఇరువైపుల ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతో పాటు సభా ప్రాంగణం వద్ద భారీ కటౌట్లు, ప్లెక్సీలు ఏర్పాటు చేశారు. భారీ జనసందోహంతో సభను సక్సెస్ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నాని పేర్కొన్నారు. ఎదురుచూపులు.. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సిద్ధం సభల పేరిట ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు సభలు నిర్వహించారు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉండగా ప్రజలకు చేసిన మేలును వివరించడంతో పాటు ప్రజల కోసం పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వంపై ప్రతిపక్షాల మూకుమ్మడి కుట్రను వివరించారు. ఆ సభలు చరిత్రలో నిలిచేలా విజయవంతమైన విషయం తెలిసిందే. ఇదే ఉత్సాహంతో మేమంతా సిద్ధం పేరిట ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం దాకా బస్సు యాత్ర చేపట్టారు. ఆయన రాకకోసం పార్టీ శ్రేణులు, అభిమానులు, లక్షలాది మంది ప్రజలు ఎదురుచూస్తున్నారు. కదనోత్సాహంలో అభిమానులు.. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రచారానికి రావడంతో వైఎస్సార్ సీపీ శ్రేణుల్లో కదనోత్సాహం కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 స్థానాల్లో 14 స్థానాలను గెలుచుకొంది. ఐదేళ్ల సంక్షేమ, అభివృద్ధి పాలన చూసిన ప్రజలు మరోసారి వైఎస్సార్ సీపీ జెండాను ఎగురవేసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో అన్ని స్థానాలకు క్లీన్ స్వీప్ చేసే దిశగా వైఎస్సార్ సీపీ అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ బస్సుయాత్ర జరిగే దారి మార్గంలో స్వాగతం పలికేందుకు గన్నవరం, గుడివాడ నియోజకవర్గంలోని అభిమానులు సమాయత్తమవుతున్నారు. నేడు యాత్ర షెడ్యూల్ ఇలా.. మేమంతా సిద్ధం 15వ రోజు సోమవారం ఈ యాత్రలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉదయం 9గంటల నుంచి కేసరపల్లి రాత్రి బస నుంచి బయలు దేరతారు. గన్నవరం, ఆత్కూర్, వీరవల్లి క్రాస్, హనుమాన్జంక్షన్, పుట్టుగుంట, మీదుగా జొన్నపాడు వద్దకు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు. అనంతరం జొన్నపాడు జనార్థనపురం మీదుగా గుడివాడ సమీపంలోని బహిరంగ సభ ప్రాంతానికి చేరుకుంటారు. సభ అనంతరం హనుమాన్ జంక్షన్ జాతీయ రహదారి, గుండుగొలను మీదుగా నారాయణపురం రాత్రి బస శిబిరానికి చేరుకుంటారు.నేడు సీఎం వైఎస్ జగన్ బస్సు యాత్ర పునఃప్రారంభం గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల్లో రోడ్డు షో గుడివాడలోని వైఎస్సార్ కాలనీ సమీపంలో బహిరంగ సభ ఇప్పటికే పూర్తయిన ఏర్పాట్లు జననేతకు స్వాగతం పలికేందుకు ‘మేమంతా సిద్ధం’ అంటున్న జనాలు -
రగిలిన గుండెలు
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా బాంధవుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిపై రాయితో దాడి.. ఆయన నుదుటిపై నెత్తుటి ధార చూసిన గుండె కన్నీటి గాయంతో విలవిల్లాడుతోంది. ఆ గాయం ఎంత సలుపుతు న్నా.. నొప్పిని పంటి బిగువున అణచుకుంటూ షెడ్యూల్ప్రకారం యాత్రను పూర్తి చేసిన జననే త తత్వాన్ని చూసిన అభిమాని అంతులేని ఆవేదనను మిగిల్చింది. తమ బాధను, ఆక్రందనను రోడ్లెక్కి వెలిబుచ్చారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో విజయవాడ అజిత్సింగ్నగర్ వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ శ్రేణులు, అభిమానులు ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. క్యాండిల్ ర్యాలీలు చేపట్టారు. నల్లదుస్తులు ధరించి పార్టీ నాయకులు నిరసనలు తెలిపారు. ప్రజాభిమానంతో ఎదుర్కోలేని చంద్రబాబు హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. కూటమి కుట్రలు తిప్పికొడతామని ప్రతినబూనారు. ● జగ్గయ్యపేట పట్టణంలో ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో నల్ల కండువాలు ధరించి నిరసన తెలిపారు. కూటమి కుట్రలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గాయంతో ఉన్న వైఎస్ జగన్ ఫొటోలను ప్రదర్శించారు. ఉదయభాను సతీమణి సామినేని విమలభాను, ఏపీ నెడ్ క్యాప్ చైర్మన్ వేల్పుల రవికుమార్, కేడీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ తన్నీరు నాగేశ్వరరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఇంటూరి రాజగోపాల్ పాల్గొన్నారు. ● విజయవాడ పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ ఆధ్వర్యంలో సితార సెంటర్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ పార్టీ నాయకులు నినాదాలు చేశారు. ● విజయవాడ సెంట్రల్లోని పార్టీ కార్యాలయం వద్ద పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే బోండా ఉమాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డెప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, కార్పొరేటర్లు, డైరెక్టర్లు పాల్గొన్నారు. సింగ్నగర్లోని వివేకానంద స్కూల్ వద్ద వైఎస్సార్సీపీ వికలాంగ విభాగం ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేశారు. ● విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరిగాయి. 15, 17, 20 డివిజన్లలో కార్పొరేటర్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎన్టీఆర్ సర్కిల్ వద్ద నిరసన కార్యక్రమం జరిగింది. గుణదల బెత్ల్లెహం నగర్లో ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ప్రెస్మీట్ నిర్వహించి సీఎంపై జరిగిన హత్యాయత్నాన్ని ఖండించారు. ● సీఎం జగన్పై జరిగిన దాడికి నిరసనగా గన్నవరం వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంపీపీ అనగాని రవి, జెడ్పీటీసీ ఎలిజబెత్ రాణి విలేకరులతో మాట్లాడారు. పార్టీ నాయకులు మేచినేని బాబు, నీలం ప్రవీణ్ కుమార్, జలసూత్రం రామ్మోహన్ రావు, దీపు, అరుణ పాల్గొన్నారు. ● పెనమలూరు నియోజకవర్గంలోని గంగూరులో గల వైఎస్సార్ సీపీ కార్యాలయంలో రాష్ట్ర గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు కార్యాలయ ప్రాంగణంలో నిరసన చేపట్టారు. నల్లబ్యాడ్జీలు ధరించి దాడి ఘటనను తీవ్రంగా ఖండించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు బాకీ బాబు, టిడ్కో డైరెక్టర్ పి.రాఘవరావు, నాయకులు పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నాన్ని ఖండిస్తూ ఆందోళనలు కూటమి కుట్రలపై మండిపడ్డ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యే అభ్యర్థులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన పార్టీ శ్రేణులు -
అంబేడ్కర్ భావజాలమే స్ఫూర్తి
సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్ధన్ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ భావజాలం, ఆలోచన విధానాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ సెక్రటరీ కె. హర్షవర్ధన్ అన్నారు. లెనిన్ సెంటర్లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ భవన్లో ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యాన డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి రాష్ట్ర స్థాయి మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. సంక్షేమ శాఖ కార్యదర్శి కె.హర్షవర్ధన్, డైరెక్టర్ విజయ్ కృష్ణన్, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జాయింట్ కలెక్టర్ పి.సంపత్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎండీ ఎస్.చినరాములు, లిడ్క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ డోలాశంకర్.. అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. హర్షవర్ధన్ మాట్లాడుతూ అంబేడ్కర్ స్ఫూర్తితో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు. జాతీయ సమైక్యతకు అంబేడ్కర్ సింబల్గా నిలుస్తారన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ డైరెక్టర్ విజయకృష్ణన్ మాట్లాడుతూ అంబేడ్కర్ ఓర్పుతో జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకున్నారన్నారు. కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ పట్టుదల కలిగిన వ్యక్తి బీఆర్ అంబేడ్కర్ అని పేర్కొన్నారు. జేసీ సంపత్ కుమార్ మాట్లాడుతూ అంబేడ్కర్బాటలో అందరూ నడవాలన్నారు. తొలుత భవన ప్రాంగణంలోని డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ , సాంఘిక సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ కృష్ణమోహన్, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విజయభారతి, సంఘ నాయకులు సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహ విద్యార్థులు పాల్గొన్నారు. చరిత్ర పుటల్లో చెరగని ముద్ర అంబేద్కర్ది కోనేరుసెంటర్: చరిత్ర పుటల్లో చెరగని ముద్ర డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ది అని కృష్ణా ఎస్పీ అద్నాన్ నయీమ్అస్మీ అన్నారు. భారత రాజ్యాంగ రూపకర్త, ప్రపంచ మేధావి డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతిని ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఎస్పీ ఇతర అధికారులతో కలిసి అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలు భారతదేశం వైపు చూసేలా చేసిన గొప్ప మేధావి అంబేడ్కర్ అని కొనియాడారు. ఎన్నో వివక్షల నడుమ విద్యాభ్యాసాన్ని పూర్తిచేసి ప్రపంచంలోనే ఎవరు అందుకోనన్ని డిగ్రీలు తీసుకుని విద్యారంగంలో ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలిచారన్నారు. న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా అనేక ఉద్యమాలు చేసి అణగారిన వర్గాల అభ్యున్నతికి విశేష కృషి చేశారని కొనియాడారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటేశ్వరరావు, ఏఆర్ ఏఎస్పీ ప్రసాద్, బందరు డీఎస్పీ సుభాని, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
భగవంతుని దయతో తప్పిన ప్రమాదం
గుడివాడ టౌన్: భగవంతుని దయతో, ప్రజాశీస్సులతో సీఎం జగన్మోహన్రెడ్డికి పెను ప్రమాదం తప్పిందని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) చెప్పారు. కృష్ణా జిల్లా గుడివాడలోని తన ఎన్నికల కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. శనివారం రాత్రి విజయవాడ సింగ్నగర్లో సీఎం జగన్మోహన్రెడ్డిని హతమార్చేందుకు గురిచూసి నవరుగంత మీద తగిలేలా రాళ్లతో దాడిచేయించారన్నారు. ఆనాడు విశాఖ ఎయిర్ పోర్టులో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడమీద కత్తితో పొడవాలని ప్రయత్నిస్తే భగవంతుని దయతో అది భుజానికి తగిలి పెనుప్రమాదం తప్పిందని గుర్తుచేశారు. ఈ రోజు ఒక రాయితో పకడ్బందీగా వ్యూహం ప్రకారం గురిచూసి నవరుగంతను కొట్టాలని ప్రయత్నించారన్నారు. బస్సు అటు ఇటు కదులుతుండటంతో గురి తప్పిందని, లేకపోతే పెను ప్రమాదం జరిగేదని ఆందోళన వ్యక్తం చేశారు. దాన్ని ఖండించాల్సిన కొంతమంది పెద్దలు సంస్కారహీనంగా మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి దాడిచేయించుకున్నారని, సానుభూతి కోసమే ఈ దాడికి తెరలేపారని అనడం నీచాతినీచమని ఆగ్రహం వ్యక్తంచేశారు. జగన్మోహన్రెడ్డిని రాజకీయంగా ఎదుర్కోలేక, కుట్రలకు తెరలేపారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పది సంస్థలు సర్వేలు చేస్తే తొమ్మిది సంస్థలు జగన్మోహన్రెడ్డి 125 పైబడి ఎమ్మెల్యే స్థానాలు, 20 పైగా ఎంపీ స్థానాలు గెల్చి ప్రభుత్వం ఏర్పాటుచేస్తారని చెపుతున్నారన్నారు. దీంతో పాటు విజయవాడ నడిబొడ్డున డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేశారన్న కక్షతో కొన్ని సామాజిక వర్గాలు ఈ రోజు జగన్మోహన్రెడ్డిపై దాడి చేశారని తాను అభిప్రాయపడుతున్నానన్నారు. ఒక ముఖ్యమంత్రి మీద దాడి చెయ్యాలంటే దమ్ము, ధైర్యం ఉండాలన్నారు. ముఖ్యమంత్రి ప్రాణాలు తీయాలి అనే ప్రక్రియకు సామాన్యుడు ిసిద్ధపడరన్నారు. దీని వెనుక పెద్ద నేతల అండ, వారిచ్చిన ధైర్యం, సొమ్ముతో ఇంత పెద్ద సాహసం చేశారని తాను విశ్వసిస్తున్నానన్నారు. శనివారం మధ్యాహ్నం తుళ్లూరులో చంద్రబాబు నాయుడు ప్రసంగాన్ని తాను విన్నానన్నారు. జగన్మోహన్రెడ్డిని రాళ్లతో కొట్టాలని చంద్రబాబు నాయుడు సూచించారని, ఆ వీడియోలు ఉన్నాయని పేర్కొన్నారు. కుట్ర పన్నారు జగన్మోహన్రెడ్డిని రాళ్లతో కొట్టండి, అతను దుర్మార్గుడు, దున్నపోతు, సైకో రాళ్లతో దాడి చెయ్యండి అని చంద్రబాబు చెబితే ఈ దుర్మార్గులు, పచ్చకుక్కలు, తెలుగు తమ్ముళ్లు, పిచ్చి పరాకాష్టకు చేరిన కులగజ్జి పట్టిన కుక్కలు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్రెడ్డిని చంపడానికి కుట్ర పన్నారన్నారు. ఒక రాయి చేతితో విసిరితే తగిలే దెబ్బకాదన్నారు. జగన్మోహన్రెడ్డికి నుదురు మీద చిట్లి అదే రాయి తిరిగి వెల్లంపల్లికి గాయం జరిగిందంటే అది ఎంత ఫోర్స్గా వచ్చిందో అర్థం చేసుకోవాలని తెలిపారు. చేత్తో కొడితే అంత వేగంగా రాదన్నారు. కొందరు టీడీపీ కుక్కలు జగన్మోహన్రెడ్డి కరెంటు తీయిస్తున్నాడని విమర్శించడాన్ని తప్పుపట్టారు. ఒక ముఖ్యమంత్రిగానీ ప్రధాన మంత్రి గానీ బస్సు యాత్ర చేస్తుంటే కరెంటు తీయడం ఆనవాయితీ అన్నారు. చంద్రబాబు నాయుడు బస్సు యాత్ర చేసినప్పుడు కరెంటు తియ్యలేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు ప్రణాళికతో జగన్మోహన్రెడ్డి మీద గత ఎన్నికల ముందు, ఈ ఎన్నికల ముందు దాడి చేయించారని విమర్శించారు. ఆయనకు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనికి మాలిన వెధవలకు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఇస్తున్నారని, 420గాళ్లకు సెక్యూరిటీ పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు.. సానుభూతి కోసం జగన్మోహన్రెడ్డి దాడులు చేయించుకుంటున్నారనడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. తిరుపతి అలిపిరి వద్ద బాంబు దాడి జరిగి 18 అడుగులు ఎత్తు ఎగిరిపడి చేతులకు కాళ్లకు కట్లు కట్టుకుని సానుభూతి కోసం ఎన్నికలకు వెళితే ప్రజలు నీకెందుకు ఓటు వెయ్యలేదని ప్రశ్నించారు. 46 సీట్లకే నిన్నెందుకు పరిమితం చేశారన్నారు. మంచి పనులు చేస్తే ప్రజల హృదయాలను దోచుకుంటే ఓట్లు పడతాయిగానీ ఉల్లిపాయ బాంబులు పేల్చుకుని వేషాలు వేస్తే ఓట్లు రావన్నారు. ఈ చంద్రబాబు నాయుడు మాటలు దాడి చేసిన వారిని పట్టుకోమనకుండా దాడి చేసిన వారిని పట్టుకోలేక పోయిన పోలీసు అధికారుల మీద చర్యతీసుకోవాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేస్తాననడం దుర్మార్గమని తెలిపారు. తక్షణమే ఈ కుట్ర వెనుక దాగి ఉన్న వ్యక్తులను పట్టుకోవాలి. జగన్ మోహన్రెడ్డికి బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం వైఎస్ జగన్పై ఒక అజ్ఞాతశక్తి దాడి చేయించింది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని