![ప్రాకర్లలో ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే అనిల్కుమార్ - Sakshi](/sites/default/files/styles/webp/public/article_images/2024/04/18/17pam01a-310129_mr_1.jpg.webp?itok=6ZAuVy6-)
ఎలకుర్రు(పామర్రు): రానున్న ఎన్నికల్లో లంచాలు లేని ప్రభుత్వం కావాలంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎంగా గెలిపించుకోవాలని పామర్రు ఎమ్మెల్యే కై లే అనిల్కుమార్ అన్నారు. మండలంలోని ఎలకుర్రు గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. తొలుత పామర్రులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ర్యాలీగా ఎలకుర్రు గ్రామం బయలుదేరారు. ఎలకుర్రు, కొరిమెర్ల ప్రాకర్ల గ్రామాల్లో ఉదయం, నిమ్మలూరు, మలయప్పన్నపేట, కాపవరం, సప్తర్ఖాన్పాలెం, మల్లవరం, పరిశేపల్లి, పసుమర్రు గ్రామాల్లో సాయంత్రం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పామర్రు ఎమ్మెల్యేగా తనను, మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సింహాద్రి చంద్రశేఖరరావును గెలిపించాలని కోరారు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక మన ఇంటి దగ్గరకే సంక్షేమ పథకాలు అందేలా సచివాలయ, వలంటీర్ వ్యవస్థను ఏర్పాటు చేశారన్నారు. పెత్తందార్లు పక్షాన నిలిచే చంద్రబాబు అధికారంలోకి వస్తే ఈ వ్యవస్థను రద్దు చేస్తారన్నారు. కార్యక్రమంలో పామర్రు, మొవ్వ ఎంపీపీలు దాసరి అశోక్కుమార్, కుందేటి ఇందిర, పామర్రు, తోట్లవల్లూరు జెడ్పీటీసీ సభ్యులు కె. స్వరూపరాణి, జొన్నల రామ్మోహన్రెడ్డి, వైస్ ఎంపీపీలు ఆరేపల్లి శ్రీనివాసరావు, ఆరుమళ్ల రమాదేవి, ఎంపీటీసీ సభ్యులు రత్నకుమారి, నాగమల్లేశ్వరరావు, కాకొల్లు రాజ్యలక్ష్మీ, నాయకులు కాకర్ల వెంకటేశ్వరరావు, పెయ్యల రాజు, ముప్పిడి సురేష్రెడ్డి, ఆరుమళ్ల శ్రీనాఽథ్రెడ్డి, బొమ్మారెడ్డి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పామర్రు ఎమ్మెల్యే అనిల్కుమార్
Comments
Please login to add a commentAdd a comment