-
మోదీ ద్వేషాన్ని ప్రేమతో ఎదుర్కొంటాం
న్యూఢిల్లీ/ముంబై: దేశ ప్రజల్లో ప్రేమ, కరుణ పెంపొందించడం ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ తెలిపారు. తమ వాదనే సరైందని నమ్మకం కలిగించేందుకు ప్రధాని∙మోదీ ప్రజల మనసుల్లో విద్వేషం, భయం, ఆగ్రహాన్ని పాదుకొల్పుతున్నారని ఆరోపించారు. విద్వేషం బదులు ప్రజల్లో ప్రేమ, కరుణ ద్వారా మాత్రమే జాతి నిర్మాణం సాధ్యమని చెప్పేందుకు ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టామని ఆయన శనివారం ట్వీటర్లో పేర్కొన్నారు. -
అవిశ్వాసంతో చులకనయ్యామే..!
సాక్షి, అమరావతి: కేంద్రంపై పెట్టిన అవిశ్వాసం వల్ల లబ్ధి రాకపోగా ప్రజల్లో మరింత చులకనయ్యామని టీడీపీ నాయకులు మధనపడుతున్నారు. తాజా పరిణామాలన్నీ జాతీయ స్థాయిలో సీఎం చంద్రబాబు, టీడీపీ పరువు తీశాయనే ఆందోళన టీడీపీ శ్రేణులందరిలోనూ కనిపిస్తోంది. ప్రత్యేక హోదా, అవిశ్వాసం సహా పలు అంశాల్లో యూటర్న్లు తీసుకోవడంపై ప్రతిపక్ష పార్టీలు ఎంత చెప్పినా అనుకూల మీడియా ద్వారా మేనేజ్ చేశామని, కానీ స్వయంగా ప్రధానమంత్రే పార్లమెంట్లో చంద్రబాబు యూటర్న్పై మాట్లాడటంతో గాలి మొత్తం పోయిందనే భావన టీడీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. తాము కేంద్రంపై పోరాడుతున్నామని, ధర్మ పోరాటం చేస్తున్నామని కొద్దినెలల నుంచి రాష్ట్రంలో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నా నేరుగా ప్రధానే వాస్తవాలు బయటపెట్టడంతో ఇకపై ఇబ్బందులు తప్పవని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. చంద్రబాబు అంగీకారంతోనే ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని, ప్యాకేజీ ప్రకటించినందుకు ఆర్థిక మంత్రి జైట్లీని చంద్రబాబు సత్కరించారని మోదీయే చెప్పడం తమను తీవ్ర ఇరకాటంలోకి నెట్టిందని వారు భావిస్తున్నారు. కొత్త విషయం ఏం చెప్పారు..? టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ తన ప్రసంగంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక హోదా పోరాటంలో మొదటి నుంచి చెప్పిన విషయాలనే చెప్పడంతో కొత్తగా పార్లమెంటులో ఏం చెప్పారనే దానికి టీడీపీ నాయకుల వద్ద సమాధానం లేకుండాపోయింది. జయదేవ్ చెప్పిన విషయాలను వైఎస్ జగన్ అసెంబ్లీలో చెప్పినప్పుడు టీడీపీ తీవ్రంగా వ్యతిరేకించడం వంటివన్నీ ఇప్పుడు అధికారపక్షానికి ఇబ్బందికరంగా మారాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను పరిణితి చెందిన నేతగా ప్రధాని మోదీ పేర్కొనడాన్ని కూడా టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. చంద్రబాబు ప్రతి దానికి గొడవలు పడేవారని, తమ జోక్యంతో కేసీఆర్ పరిణితి చూపించినా చంద్రబాబు మాత్రం మారలేదని చెప్పడం ద్వారా మోదీ, బాబు అసలు స్వరూపాన్ని బయటపెట్టినట్లయిందని, ఇది తీవ్ర అవమానకరమని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక అర్ధరాత్రి 12 గంటలకు మీడియా సమావేశం పెట్టి మరీ మోదీపై ఎదురుదాడి చేసిన విషయం తెలిసిందే. మోదీ మాటల ముందు బాబు చెప్పేవన్నీ ఇప్పుడు జనాలు పట్టించుకోరని టీడీపీ నేతలు అంచనావేస్తున్నారు. చంద్రబాబు వెంటనే ఢిల్లీ వెళ్లినా తమ అధినేత ఏమీ చేయలేకపోయారని, అది ఇంకా మైనస్గా మారిందని టీడీపీ నాయకులు ఆవేదన చెందుతున్నారు. సోషల్ మీడియాతో బెంబేలు.. ఒకపక్క పరువు పోయి కుంగిపోతున్న టీడీపీ శ్రేణులు సోషల్ మీడియాలో జరుగుతున్న దాడితో బెంబేలెత్తిపోతున్నారు. జయదేవ్ ప్రసంగం, మోదీ చెప్పిన అంశాలకు సంబంధించి సెటైర్లు, జోకులు, విమర్శలతో చేసిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో టీడీపీ శ్రేణులకు ఏం చేయాలో పాలుపోవడంలేదు. ఈ పరిస్థితుల్లో కేంద్రానికి వ్యతిరేకంగా శనివారం ఆందోళనలు చేయాలని సీఎం చంద్రబాబు పిలుపు ఇచ్చినా దానికి టీడీపీ క్యాడర్ పెద్దగా స్పందించలేదు. అక్కడక్కడా కొందరు బయటకు వచ్చి కొద్దిసేపు హడావుడి చేసినా ఇతరులెవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఇంకా పరువు పోగొట్టుకోవడమెందుకనే అభిప్రాయం వారిలో కనిపిస్తోంది. కేంద్రంపై అవిశ్వాసం పెట్టి సెల్ఫ్గోల్ చేసుకున్నామని టీడీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. -
మోదీ ఫ్రాన్స్.. రాహుల్ క్రొయేషియా
ముంబై: ఫ్రాన్స్ ఫుట్బాల్ ప్రపంచకప్ గెలిచినట్లు ప్రధాని మోదీ అవిశ్వాస పరీక్షలో నెగ్గినా, రన్నరప్గా నిలిచిన క్రొయేషియాలా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ అందరి మనసులు గెలుచుకున్నారని శివసేన అధికార ప్రతినిధి, ఎంపీ సంజయ్ రౌత్ కితాబిచ్చారు. ‘ప్రపంచకప్ ఫైనల్లో ఫ్రాన్స్ గెలిచినప్పటికీ, గొప్ప ఆటతీరు, పోరాటపటిమను ప్రదర్శిం చిన జట్టుగా క్రొయేషియాను ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. రాహుల్ను అందరూ ఇదే తరహాలో చూస్తున్నారు. ఎవరైనా ఇలాంటి రాజకీయాలు చేస్తే కచ్చితంగా అతను మిగతా వారి కంటే నాలుగైదు అడుగులు ముందుంటాడు’ అని వ్యాఖ్యానించారు. అందరి దృష్టిని ఆకర్షించేందుకే రాహుల్ మోదీని కౌగిలించుకున్నారనీ, ప్రధానికి షాకివ్వాలన్న లక్ష్యంతో రాహుల్ ఆ పని చేసుంటే ఆయన లక్ష్యం నెరవేరినట్లేనని రౌత్ అభిప్రాయపడ్డారు. -
ఓటు వేయకుండా ఎందుకు పారిపోయారు: షబ్బీర్ అలీ
సాక్షి, న్యూఢిల్లీ: అవిశ్వాస తీర్మానంపై జరిగిన ఓటింగ్లో కేంద్రానికి వ్యతిరేకంగా ఓటు వేయకుండా టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు పారిపోయారని మండలి ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ ప్రశ్నించారు. శని వారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను అమలు చేయకుండా రాష్ట్రంపై వివక్ష చూపిస్తున్న కేంద్రా నికి వ్యతిరేకంగా టీఆర్ఎస్ ఎందుకు మాట్లాడటం లేదని, మోదీ అంటే ఎందుకంత భయమని ప్రశ్నించారు. దీనిపై రాష్ట్ర ప్రజలకు ఆ పార్టీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీ: పొంగులేటి సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్, బీజేపీల వైఖరి ఇంటి ముందు లడాయి.. ఇంటి వెనుక దోస్తీలాగా ఉందని సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్రెడ్డి విమర్శించారు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు రాజకీయ మైలేజీ కోసమే ప్రయత్నించారు తప్ప విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో ఇసుమంత కూడా ప్రయత్నించలేదని ఆరోపించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో పొంగులేటి విలేకరులతో మాట్లాడుతూ అవిశ్వాసంపై చర్చ సందర్భంగా మోదీ చేసిన ప్రసంగమంతా సెల్ఫ్ డబ్బాలాగా సాగిందన్నారు. తల్లిని చంపి బిడ్డను కాపాడే విధంగా రాష్ట్ర విభజన చేశారనడం , రాష్ట్ర విభజనను పాకిస్తాన్, బంగ్లాదేశ్లతో పోల్చడం సరైంది కాదన్నారు. లోక్సభలో రాహుల్గాంధీ పరిణతి చెందిన రాజకీయ నాయకుడి తరహాలో వ్యవహరించారన్నారు. -
టీఆర్ఎస్, బీజేపీల బంధం బట్టబయలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు ప్రయోజనం కలిగేందుకు లోక్సభలో లభించిన మంచి అవకాశాన్ని టీఆర్ఎస్ చేజార్చుకుందని టీపీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. టీఆర్ఎస్, బీజేపీల మధ్య ఉన్న బంధం అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా బట్టబయలైందన్నారు. శనివారం గాంధీభవన్లో ఎమ్మెల్యే రేవంత్రెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షుడు రసూల్ఖాన్, ప్రధాన కార్యదర్శి వినోద్రెడ్డి, యూత్కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్కుమార్ యాదవ్లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ హక్కుల విషయంలో టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ప్రసంగం పేలవంగా ఉందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన చట్టంలోని హామీలను నెరవేర్చలేదని లోక్సభలో ప్రధాని మోదీని ఎందుకు నిలదీయలేకపోయారని ప్రశ్నించారు. విభజన హామీల గురించి కేంద్రంపై పోరాడటంలో విఫలమైన టీఆర్ఎస్, ‘మీ హృదయంలో ప్రేమ ఉంటే చాలు’ అంటూ మోదీనుద్దేశించి వ్యాఖ్యానించడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనమని విమర్శించారు. ఖమ్మంలోని ఏడు మండలాలను ఆంధ్రలో కలిపినప్పుడు సీఎంగా కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్, కవితలిద్దరూ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేకహోదా ఇవ్వాలని గతంలో మాట్లాడారని, మరిప్పుడు అదే విషయంలో కేం ద్రంపై పెట్టిన అవిశ్వాసం తీర్మానానికి ఎందుకు మద్దతివ్వలేదని నిలదీశారు. మైనార్టీ రిజర్వేషన్లపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, ఆ రిజర్వేషన్ల ఫైలు ఏం చేశారని కేంద్రాన్ని ఎందుకు అడగలేకపోయారని ఉత్తమ్ నిలదీశారు. కేసీఆర్ మోదీ ఏజెంటు... తెలంగాణ ప్రయోజనం కోసం ఎవరినైనా ఎదిరిస్తానని బీరాలు పలికిన కేసీఆర్ ఇప్పుడు అవిశ్వాసం విషయంలో ఎందుకు తటస్థంగా ఉన్నారని, తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ప్రధాని మోదీ మాట్లాడితే టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు నోరెత్తలేదని ప్రశ్నించారు. జాతీయ సాగునీటి ప్రాజెక్టుల కోసం పోరాడితే 90 శాతం నిధులు కేంద్రం నుంచి వచ్చేవని, అప్పుడు రాష్ట్రానికి అప్పులు తగ్గేవని అన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, ఎయిమ్స్, ఐఐఎం, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు, హైకోర్టు విభజన లాంటి హామీలు నాలుగేళ్లుగా పెండింగ్లో ఉండేందుకు టీఆర్ఎస్, బీజేపీలే కారణమని విమర్శించారు. అవిశ్వాసం సమయంలో వీరి నిజస్వరూపం బయటపడిందని, మోదీ ఏజెంట్ కేసీఆర్ అని తేలిపోయిందన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులు కారని, టీఆర్ఎస్, బీజేపీలకు తగిన బుద్ధి చెప్పేందుకు సిద్ధమవుతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఓటేస్తే బీజేపీకి వేసినట్టేననే విషయాన్ని తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. రాహుల్ ప్రసంగం అద్భుతం మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సందర్భంగా జరిగిన చర్చలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్గాంధీ అద్భుతంగా మాట్లాడాని, ఆయన ప్రసంగం చరిత్ర లో నిలిచిపోతుందని ఉత్తమ్ వ్యాఖ్యానించారు. -
వాళ్ల ఐకమత్యం మాకు మహాబలం
షాజహాన్పూర్: ప్రతిపక్షాల ఐకమత్యం తమకే లాభం చేకూరుస్తుందని ప్రధాని మోదీ అన్నారు. అవిశ్వాసం ఎందుకు పెట్టారని ప్రశ్నిస్తే కౌగిలింతతో సరిపుచ్చారని ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో శనివారం జరిగిన రైతు ర్యాలీలో మోదీ ప్రసంగించారు. రైతుల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, విపక్షాల ఐక్యత, అవిశ్వాసంపై చర్చ జరుగుతున్న సమయంలో రాహుల్ వచ్చి హఠాత్తుగా తనని కౌగిలించుకోవడం తదితర విషయాలను ప్రస్తావించారు. తమ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఓర్వలేక విపక్షాలు పార్లమెంట్లో అవిశ్వాసం పేరిట కాలక్షేపం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ‘దేశంలో ఇప్పుడు ఒక్కటే దళ్(రాజకీయ పార్టీని ఉద్దేశించి) లేదు. ఎన్నో దళ్లు కలవడం వల్ల ఏర్పడే దల్దల్(బురద) ‘కమలం’ వికసించడానికే దోహదపడుతుంది’ అని మోదీ చమత్కరించారు. ‘అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి కారణమేంటని ప్రశ్నిస్తే వారు బదులివ్వలేదు. కౌగిలింతతో సరిపెట్టారు’ అని రాహుల్నుద్దేశించి అన్నారు. ప్రధాని పీఠంపైనే కళ్లన్నీ.. పేదలు, యువతను విస్మరిస్తూ ప్రతిపక్షాలన్నీ ప్రధాని పీఠం కోసం పాకులాడుతున్నాయని మోదీ మండిపడ్డారు. ‘లోక్సభలో శుక్రవారం జరిగిన చర్చను చూశారా? తప్పెవరిదో తెలిసిందా? ప్రతిపక్షాలు దేశం, పేదల గురించి ఆలోచించడం లేదు. ప్రధాని కుర్చీపైనే వాళ్ల కళ్లన్నీ ఉన్నాయి. అవినీతితో పోరాడుతూ దేశం, ప్రజల కోసం పనిచేయడమేనా నా నేరం? ప్రతిపక్షాల కుతంత్రాలు నాకు తెలుసు. సైకిలు(సమాజ్వాదీ పార్టీ), ఏనుగు(బీఎస్పీ)తో జతకట్టినా వారిని గెలవనీయం. భారత ప్రజాస్వామ్యంలో 125 కోట్ల మంది ఓటు ద్వారా ఇచ్చిన తీర్పే శిరోధార్యమని, దానికి వ్యతిరేకంగా వెళ్తే మూల్యం చెల్లించుకోక తప్పదని వారిని హెచ్చరిస్తూనే ఉన్నాం. కానీ వారు నన్ను పదవి నుంచి తొలగించాలని ఆరాటపడుతున్నారు’ అని మోదీ మండిపడ్డారు. నాటి ప్రధాని రాజీవ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ..ఆనాడు రూపాయి ప్రయోజనంలో పేదలకు కేవలం 15 పైసలే చేరాయని అన్నారు. కానీ తమ ప్రభుత్వం సాంకేతికత సాయంతో పూర్తి ప్రయోజనాన్ని నేరుగా లబ్ధిదారుడి ఖాతాలోనే వేస్తోందని చెప్పారు. ఆ చీకట్లకు బాధ్యులెవరు.? ఎన్డీయే నాలుగేళ్ల పాలనకాలంలోని సంక్షేమ కార్యక్రమాలను పేర్కొంటూ..తాము 18 వేల గ్రామాలకు విద్యుత్ సౌకర్యం కల్పించినా, కొందరు విమర్శలు చేస్తున్నారన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు దాటినా కొన్ని గ్రామాలు చీకట్లోనే ఉన్నాయంటే దానికి కారణమెవరని ప్రశ్నించారు. రైతుల సంక్షేమానికి గత ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయలేదన్న మోదీ..సాగును లాభసాటిగా మార్చేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాలను వివరించారు. ఈ డిసెంబర్ నుంచి మొలాసిస్, చెరకు రసం నుంచి ఇథనాల్ ఉత్పత్తి చేసేందుకు మిల్లులకు అనుమతి ఇచ్చిన సంగతిని గుర్తుచేశారు. చెరకు కనీస ధరను క్వింటాలుకు రూ.20 పెంచామని తెలిపారు. -
రాహుల్ ఆలింగనం వెనుక సందేశం ఇదే!
మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధిపత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షిణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యా సదృశమే అవుతుంది. అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చ అనేక ప్రశ్న లకు జవాబిచ్చింది. 2019 ఎన్నికలను ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్ అధ్య క్షుడు రాహుల్గాంధీ మధ్య పోరుగా బీజేపీ చిత్రించడాన్ని ప్రతిపక్షాలు అనుమతిస్తాయా లేక రాష్ట్రానికో తీరున కాషాయపక్షంతో అవి తలపడ తాయా? రాహుల్ను చూసి బీజేపీ భయపడాలా? ఆయనను పాలకపక్ష మెప్పుడూ సీరియస్గా తీసుకోలేదు. మోదీతో తలపడే పట్టుదల, దూకుడు తనకున్నాయని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో మోదీ వ్యతిరేక పోరు తన నాయకత్వంలోనే సాగుతుందని రాహుల్ చెప్పకనే చెప్పారు. ‘పెద్దలు’ గంభీర ప్రసంగాలతో నీతులు చెప్పే రాజకీయ ప్రపంచంలో రాహుల్ తన అనూహ్య ప్రవర్తనతో కొంత పప్పూలా కనపడడం వల్ల నష్టమేమీ లేదు. భారత ఓటర్లలో అత్యధిక సంఖ్యలో ఉన్న యువతకు సీనియర్ నేతల నీతిబోధలు విసుగుపుట్టిస్తాయి. కాబట్టి రాహుల్ పోకడ వారికి బాగానే ఉంటుంది. ఇప్పటి వరకూ తనను సవాలు చేసే నేత లేకుండా ముందుకు పోతున్న మోదీకి పోటీగా రాజకీయ గోదాలో రాహు ల్ను ప్రత్యర్థిగా నిలబెట్టారు. కాంగ్రెస్ కోరుకున్నది సరిగ్గా ఇదే. సభలో రాహుల్ ప్రదర్శించిన దూకుడు, స్పష్టత చూసి కాంగ్రెస్ వాదులే ఆశ్చర్యపోయారు. ప్రధానిపై పదునైన విమర్శలతో, మధ్యమధ్యలో పాలకపక్ష నేతలను ‘డరో మత్’ (భయపడకండి) అంటూ తనకంటే అన్ని విధాల బలవంతుడైన తన ప్రత్యర్థితో తలపడడం ద్వారా రాహుల్ చాలా పెద్ద ‘రిస్క్’ తీసుకున్నారు. శ్రోతలను ఉర్రూతలూగించే వాగ్ధాటి, అతి ఆడంబరంగా కనిపించే ఆలింగనాల విషయంలో ఆరితేరిన మోదీతో పోటీకి దిగడం రాహుల్ ధైర్యానికి అద్దంపట్టింది. ఆయుధాలు లేని ద్వంద్వ యుద్ధాల్లో ఇలా ముందుకు సాగవచ్చేమోగాని, దయాదాక్షి ణ్యాలు లేని రాజకీయాల్లో ఇలాంటి పోరు ఆత్మహత్యాసదృశమే. రాజకీయాలను కుస్తీ, ద్వంద్వయుద్ధం వంటి ఆయుధాలు అవసరం లేని క్రీడగా భావిస్తే.. మోదీ, ఇతర బీజేపీ నేతలు ఇందులో బాగా ఆరితేరారనేది అందరికీ తెలిసిన సత్యం. రాహుల్ వంటి ప్రతిపక్ష నేతలు ఈ క్రీడల్లో ఇంకా విద్యార్థులేనని చెప్పాల్సి ఉంటుంది. లోక్సభలో చర్చ సందర్భంగా ప్రసంగంతో మీడి యాలో ప్రధాన శీర్షికలతో ప్రచారం సంపాదించాలంటే కీలక సందర్భం కోసం నాయకులు పోరాటయోధుల మాదిరిగా ఎదురు చూస్తారు. ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ, అనూహ్య ఆలింగ నంతో మోదీతో ప్రత్యక్షంగా తలపడడం ద్వారా రాహుల్ తన 14 ఏళ్ల రాజకీయ జీవితంలో అతి పెద్ద సాహసం చేశారు. ఈ ప్రత్యక్ష పోరులో మోదీని ‘నాకౌట్’ చేయలేకపోయినా రాహుల్ కొన్ని పాయింట్లు తన ఖాతాలో వేసుకోగలిగారు. కానీ, పార్లమెంటరీ చర్చల్లో మెరుపులు మెరిపించి కొన్ని ‘పాయింట్లు’ సాధించడం వల్ల రాజకీయ వాస్తవాలు మారవు. రాహుల్ ఎంత గొంతు చించు కుని మాట్లాడి, మోదీని కౌగిలించుకున్నా లోక్సభలో అవిశ్వాస తీర్మానం 325– 125 ఓట్ల తేడాతో వీగిపోయింది. మోదీకి జనం విశ్వసించదగిన పోటీదారుగా ఎదగాలంటే రాహుల్ ఇంకా చాలా దూరం ప్రయాణించాలి. ఇంతవరకూ ఆయన ఏ రాష్ట్ర ఎన్నిక ల్లోనూ కాంగ్రెస్ను గెలిపించింది లేదు. ఆయన పార్టీ ఒకటిన్నర రాష్ట్రాల్లో (కర్ణాటకలో సగం) పరిపాలన సాగిస్తోంది. అవసరమై నన్ని నిధులు లేక కాంగ్రెస్ అల్లాడుతోంది. లోక్సభ ఎన్నికల ప్రచారం మొదలయ్యే నాటికి ఆయన పార్టీ నేతలు, వారి కుటుం బసభ్యులు ‘అవినీతి’ ఆరోపణలపై వేసిన కేసులకు సంబంధించి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితులున్నాయి. 2019 ఎన్నికల్లో పోటీచేయడం అంటే కాంగ్రెస్ తన మొదటి ఇన్నింగ్స్ సీట్ల లోటుతో (అంటే లోక్సభలో మెజారిటీకి అవసర మైన 270కి పైగా సీట్ల నుంచి ఇప్పటి 44 తీసేస్తే వచ్చే సంఖ్య 230) రెండో ఇన్నింగ్స్ ప్రారంభించాల్సి ఉంటుంది. ఇంతటి భారీ లోటు భర్తీ కావడానికి కాంగ్రెస్కు అనుకూలంగా ఎలాంటి ‘ప్రభం జనం’ కనిపించడం లేదు. ఈ లెక్కన రాహుల్ రాజకీయ క్షేత్రంలో నిజంగా ఎదిగారా? అనేది ప్రధానాంశం కాదు. ఆయన ఇంకా ఎదగలేదు. గమ్యం చేరుకోవడానికి ఇంకా చాలా దూరం పరుగులు తీయాల్సి ఉంది. ఆయన కేవలం నేతగా అవతరిం చారు. టీవీ చానళ్ల మాటల్లో చెప్పాలంటే ఆయన ఇప్పటి పరిస్థితు లకు తగినట్టు పైకి వచ్చినట్టు కనిపిస్తున్నారు. రాజకీయాలు, ప్రజాసేవపై ఆయనకున్న అంకితభావం, దృష్టిపై గతంలో అను మానాలుండేవి. తరచూ దేశం నుంచి అదృశ్యమౌతూ విదేశాల్లో చక్కగా గడపడానికి పోవడం వంటి చర్యలతో ఆధారపడదగిన నేత కాదనే ఇమేజ్ని ఆయనే సృష్టించుకున్నారు. ఆయనకు ఈ విషయం చెప్పే ధైర్యం పార్టీ నేతలకు లేదు. కానీ, కాంగ్రెస్ చుక్కాని లేని నావలా మారిందని, తమ నాయకుడు నిజంగా పూర్తి కాలం పనిచేసే అధ్యక్షుడు కాదనే దిగులుతో కుమిలిపోయే వారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాలు రాహుల్పై ఇలాంటి అభిప్రాయాలు తొలగించడానికి ఎంతవరకు తోడ్పడతాయో? రాహుల్ తన తల్లి సోనియా కంటే చాలా భిన్నమైన శైలిగల నాయకుడినని నిరూపించుకున్నారు. ఇప్పటి వరకూ ఏబీ వాజ్ పేయి తర్వాతి బీజేపీని సోనియా, ఆమె పార్టీ ద్వేషంతో, ధిక్కా రంతో చూస్తూనే ఉన్నాయి. మోదీని అంటరాని నేతగా పరిగణిస్తు న్నాయి. సహజంగానే రాజకీయ పోరుకు ముందుకు దూకే స్వభావమున్న మోదీ కాంగ్రెస్ ధోరణిని తనకు అనుకూలంగా మార్చు కున్నారు. పదేళ్ల క్రితం మోదీని ‘మృత్య్ కా సౌదాగర్’ (మృత్యు బేహారి–మరణాలతో వ్యాపారం చేసే నేత) అని సోనియా వర్ణిం చారు. మోదీ అదే దారిలో ఈ తల్లీకొడుకులను జెర్సీ ఆవు, దూడ అంటూ అభివర్ణించారు. ఇప్పుడేమో మోదీ దగ్గరకు పోయి కౌగ లించుకున్న రాహుల్ ప్రధానిని ప్రేమిస్తున్నానని చెప్పారు. కానీ, రాజకీయాల్లో వ్యంగ్యం అనేది ప్రత్యర్థిని అంటరానివాడిగా చూడటం కన్నా తక్కువ బాధకలిగిస్తుంది. అలాగే, కర్ణాటకలో తన జూనియర్ భాగస్వామి అయిన జేడీఎస్కు వెంటనే ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం ద్వారా రాహుల్ తన పార్టీ సంప్రదాయానికి, ఆధి పత్య పోకడలకు విరుద్ధంగా వ్యవహరించారు. మోదీ దగ్గరకు పోయి ఆలింగనం చేసుకుని, ఆయనను ప్రేమిస్తున్నట్టు నటించడం ద్వారా తన రాజకీయ లక్ష్యమేమిటో ఇప్పుడు సూచనప్రాయంగా చెప్పారు. ‘మోదీ మినహా ఎవరినైనా ప్రధానిగా అంగీకరిస్తా. నాకు ఈ పదవి దక్కకపోయినా బాధపడను’ అనేదే రాహుల్ సందేశంగా అర్థమౌతోంది. శేఖర్ గుప్తా వ్యాసకర్త దప్రింట్ చైర్మన్, ఎడిటర్–ఇన్–చీఫ్ twitter@shekargupta -
‘జుమ్లా’లో కనిపించని కోణాలెన్నో!
శుక్రవారం లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చ 2019లో జరగ బోయే ఎన్నికల ప్రచారానికి డ్రెస్ రిహార్సల్స్. రాబోయే సార్వత్రిక ఎన్నికలలో ఏ పార్టీ వైఖరి ఏ విధంగా ఉంటుందో అంచనా వేయడానికి ఎన్డీఏ ప్రభుత్వంపైన మొదటిసారి పెట్టిన అవిశ్వాస తీర్మానంలో వివిధ పార్టీల నేతలు మాట్లాడిన తీరూ, ఓటింగ్ జరిగిన సరళీ ఉపయోగపడతాయి. అవిశ్వాసతీర్మానం ప్రవేశపెట్ట డంలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఉద్దేశం ఏమైనా, తీర్మానాన్ని వెంటనే అను మతించి వెనువెంటనే చర్చ, ఓటింగ్ నిర్వహించాలని నిర్ణయించడంలో ఎన్డీఏ ప్రభుత్వ ఎత్తుగడ ఏమైనా దేశప్రజలకు ఏ పార్టీ ‘జుమ్లా’ ఆట ఆడుతున్నదో, ఎవరి కపట నాటకం ఎటువంటిదో, ఎవరు నిజాయితీగా ప్రజల తరఫున నిలిచి పోరాడుతున్నారో తెలిసిపోయింది. ఎన్డీఏ ప్రభుత్వం పైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాలలోనే అవిశ్వాస తీర్మానానికి 13 సార్లు నోటీసులు ఇచ్చి అనుమతి లభించక విసిగి వేసారి పదవులకు రాజీనామా చేసిన అయిదుగురు వైఎస్ఆర్ సీపీ లోక్సభ సభ్యులను ఎద్దేవా చేసిన తెలుగుదేశం ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం పెట్టడంలో ఆంతర్యం ఏమిటి? పైగా, టీడీపీ నోటీసు ఇచ్చిన వెంటనే దానిని అనుమతించడంలో ఎన్డీఏ సర్కార్ ఎత్తుగడ ఏమిటి? అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వం పడిపోదని తెలుసుననీ, ప్రత్యేకహోదాపైన చర్చ జర గాలనే ఉద్దేశంతోనే తీర్మానం పెట్టామనీ సుజనాచౌదరి అన్నారు. అమిత్ షా నోట ‘జుమ్లా’ ‘జుమ్లా’ అనే మాటను వర్తమాన రాజకీయాలలో మొదట ప్రయోగించిన వ్యక్తి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా. ‘జుమ్లా’ అంటే ఉత్తిమాట, నీటిమీద రాత, మాట వరుసకు అన్న మాట అని రూఢి అయింది. విదేశీ బ్యాంకులలో మూలుగుతున్న నల్లధనం తీసుకొని వచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తానంటూ ప్రధాని నరేంద్రమోదీ ఎన్నికల ప్రసంగంలో చేసిన మాటను ‘చునావీ జుమ్లా’ (ఎన్నికల ప్రచారంలో మాటవరుసకి అన్న మాట)గా అమిత్ షా అభివర్ణించి ఆ మాటను పట్టుకొని వేళ్ళాడవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అప్పటి నుంచీ ‘జుమ్లా’ అనే మాట భారత రాజకీయాలలో తరచుగా విని పిస్తున్నది. సర్జికల్ స్ట్రయిక్స్ను కూడా జుమ్లా స్ట్రయిక్స్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ అభివర్ణించారంటూ ప్రధాని నరేంద్ర మోదీ తప్పుపట్టారు. ‘జుమ్లా స్ట్రయిక్ నంబర్ ఏక్, జుమ్లా స్ట్రయిక్ నంబర్ దో...’ అంటూ రాహుల్గాంధీ ప్రధాని మోదీపైన బాణాలు సంధించి, ప్రసంగం ముగి సిన తర్వాత మోదీ దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని తిరిగి వచ్చి తన స్థానంలో కూర్చొని పక్కనున్న సభ్యుడివైపు చూసి నవ్వుతూ కన్నుగీటడంతో మోదీపై తన దాడి యావత్తూ ‘జుమ్లా స్ట్రయికే’నని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వా లంటూ టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ రాహుల్కీ, మోదీకి మధ్య సంవాదంగా సాగిందే తప్ప ప్రత్యేకహోదా ఊసు లేదు. చర్చను ప్రారంభిస్తూ టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ తన ఇంగ్లీషు ప్రసంగపాఠాన్ని బాగా చదివారు. రామ్మోహన్నాయుడు హిందీలో, ఇంగ్లిష్లో ఆశువుగా మాట్లాడి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ఇద్దరు యువ పార్లమెంటేరియన్లకూ మంచి అవకాశం లభించడం తప్పిస్తే అవిశ్వాసతీర్మానం వల్ల రాష్ట్రానికి ఒరి గింది ఏమీలేదు. ఈ విషయం చంద్రబాబే అమరావతి మీడియా గోష్ఠిలో స్వయంగా అంగీకరించారు. పనిగట్టుకుని శనివారం ఇదే మాట చెప్పడానికి ఢిల్లీ వెళ్ళి కాన్స్టిట్యూషన్ క్లబ్లో మీడియా గోష్ఠి నిర్వహించారు. టీడీపీ ఇచ్చిన అవిశ్వాసతీర్మానాన్ని బలపర్చుతున్నట్టు జయదేవ్ చాలా పార్టీల పేర్లు చదివారు. ఆ పార్టీలన్నీ తీర్మానానికి అనుకూలంగా ఓట్లు వేసి ఉంటే 126 మాత్రమే పడేవి కాదు. ఎన్డీఏ ప్రభుత్వానికి అనుకూలంగా 325 ఓట్లు పడేవికావు. జయదేవ్ చదివిన పార్టీల జాబితా సైతం ‘జుమ్లా’నే అనుకోవాలి. 12 గంటల చర్చ తర్వాత ఏమి సాధించారంటే కొండను తవ్వి ఎలుకను సైతం పట్టలేక పోయారని చెప్పు కోవాలి. తక్కిన పార్టీ నాయకులు ఎవ్వరూ ప్రత్యేకహోదా గురించి ప్రస్తావిం చలేదు. ఏ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆ పార్టీకి ముఖ్యం. ప్రాంతీయ పార్టీల నాయకులు తమ ప్రాంతాలలోని రాజకీయాలకే ప్రాధాన్యం ఇచ్చారు. టీడీపీ అనుసరిస్తున్న ఒంటెత్తు పోకడ వల్లనే అవిశ్వాసం అపహాస్యం పాలయింది. అన వసరంగా సెల్ఫ్గోల్ కొట్టుకున్నామంటూ ఆ పార్టీ నాయకులే వాపోతున్నారు. ‘మా నాయకుడి చక్రానికి తుప్పు పట్టింది. చక్రం తిరగడం లేదు. పాచిక పారడం లేదు’ అని ఒక సీనియర్ టీడీపీ నేత వ్యాఖ్యానించారు. ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని స్వయంగా నరేంద్రమోదీనే లోక్ సభ సాక్షిగా చెప్పారు. టీడీపీ ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మర ల్చడానికే ఆ పార్టీ యూ–టర్న్ తీసుకొని ఎన్డీఏ నుంచి వైదొలిగి బీజేపీని విమ ర్శించడం ప్రారంభించిందని కూడా చెప్పారు. ఈ రెండు అంశాలకే ప్రధాని పరి మితమైనారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన పార్టీపైన ఎంతోకొంత విమర్శ చేయకపోతే బాగుండదు కనుక ఈ రెండు మాటలూ అన్నారు. చంద్రబాబుపైన మోదీకి ఆగ్రహం లేదు. ఉంటే ఆయనకు తెలిసిన సమస్త సమాచారాన్ని విని యోగించుకొని ధ్వజమెత్తేవారు. ఓటుకు కోట్ల కేసు సంగతి ప్రధానికి జ్ఞాపకం లేకపోలేదు. పట్టిసీమలో అక్రమాల గురించి సమాచారం ఉంది. సింగపూర్ సంగ తులూ తెలుసు. ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తికి ఒక ముఖ్యమంత్రి వ్యవహారాలు తెలుసుకోవడం కష్టం కాదు. టీడీపీ అధ్యక్షుడిని చులకన చేయడం ప్రధానికి ఇష్టం లేదు. చంద్రబాబును మోదీ ప్రత్యర్థిగా చూడటం లేదు. వైఎస్ఆర్సీపీ పట్ల తన వైఖరిని ప్రధాని దాచుకోలేదు. ప్రత్యేకహోదా కోసం నాలుగేళ్ళుగా ఉద్య మిస్తున్న వైఎస్ఆర్సీపీ ‘ఉచ్చు’లో పడవద్దంటూ తాను చంద్రబాబుకు ఫోన్ చేసి మరీ హెచ్చరించినట్టు ప్రధాని లోక్సభలో అన్నారు. 2014 ఫిబ్రవరిలో నాటి ప్రధాని డాక్టర్ మన్మోహన్సింగ్ రాజ్యసభలో చేసిన ప్రత్యేకహోదా వాగ్దానం అమలు చేయాలంటూ డిమాండ్ చేయడాన్ని, దానికి అనుకూలంగా ప్రజాభిప్రా యాన్ని ప్రోది చేయడాన్ని ‘ఉచ్చు’గా అభివర్ణించడంలో ప్రధాని అసహనం స్పష్టం అవుతోంది. టీడీపీకి ఫిరాయించిన ముగ్గురు ఎంపీలపైన అనర్హత వేటు వేయాలని నోటీసు ఇచ్చి ఏళ్ళూపూళ్ళూ గడిచినా ప్రధాని కానీ, లోక్సభ స్పీకర్ కానీ స్పందించలేదు. 22 మంది వైఎస్ఆర్సీపీ ఎంఎల్ఏలను టీడీపీ కొనుగోలు చేసినా, వారిలో నలుగురికి మంత్రిపదవులు కట్టబెట్టినా ప్రధాని ఆక్షేపించలేదు. మొత్తం మీద టీడీపీ పట్ల ఆపేక్ష, వైఎస్ఆర్సీపీ పట్ల ఉపేక్ష స్పష్టంగా కనిపి స్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖరరావు (కేసీఆర్) అభివృద్ధిపైన దృష్టి కేంద్రీకరిస్తే, చంద్రబాబు ఇతర విష యాలపైన దృష్టి పెట్టారని వ్యాఖ్యానించడం ద్వారా మిత్రుడిని ఎత్తిపొడవడమే కానీ గాయపరచాలనే సంకల్పం లేదు. అంతకుముందు దేశీయాంగ మంత్రి రాజ్నాథ్సింగ్ బీజేపీ, టీడీపీ మైత్రీబంధం ఎంతబలమైనదో నొక్కి వక్కాణిం చారు. ‘చంద్రబాబు నాయుడితో మాకు బలమైన అనుబంధం గతంలో ఉంది. ఇప్పుడూ ఉంది. ఎప్పటికీ ఉంటుంది. ఆ బంధాన్ని తెంచడం ఎవ్వరివల్లా కాదు,’ అంటూ ఆయన ఉద్ఘాటించారు. వాస్తవానికి రాజ్నాథ్సింగ్కి మర్మం తెలియదు. ఆయన తన మనసులో ఉన్నమాట నిస్సంకోచంగా చెబుతారు. ప్రత్యేకహోదా నిజంగా సాధించాలని అనుకుంటే మొత్తం 25 మంది ఎంపీలు రాజీనామాలు చేసి సత్యాగ్రహం చేయడం రాజమార్గం. రాజకీయ పోరాటాలలో రాజీనామాను ఆయుధంగా వినియోగించే ఆనవాయితీ మనకు ఉన్నది. తమ ఎంపీల చేత రాజీనామా చేయించి కేంద్రంపైన ఒత్తిడి పెంచకపోగా రాజీనామా చేసిన వైఎస్ఆర్సీపీ ఎంపీలను తప్పుపట్టడం కేవలం అదరగండపు రాజకీయం. తాను లాలూచీ పడుతూ ఎదుటివారు లాలూచీ పడుతున్నట్టు ఆరోపించడం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు ప్రత్యేకత. వైఎస్ఆర్సీపీ ఎంపీలు అవిశ్వాస తీర్మానానికి ఇచ్చిన నోటీసును అనుమతించకపోవడంలో, టీడీపీ నోటీసును వెంటనే అనుమతించడంలోనూ బీజేపీ, టీడీపీ లాలూచీ స్పష్టంగా కనిపిస్తున్నది. జయదేవ్ ప్రసంగంలో కొత్త అంశం ఏముంది? అవిశ్వాసతీర్మానంపై చర్చ ప్రారంభిస్తూ గల్లా జయదేవ్ ఏమైనా కొత్త విషయం చెప్పారా? నాలుగేళ్ళుగా ధర్నాలలోనూ, బంద్లలోనూ, రాస్తారోకోలలోనూ, యువభేరి సభలలోనూ, శాసనసభ సమావేశాలలోనూ వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి పదేపదే చెప్పిన అంశాలనే జయదేవ్ లోక్సభలో చదివి విని పించారు. 14వ ఆర్థిక కమిషన్ ప్రత్యేకహోదాను వద్దనలేదంటూ ఆర్థిక కమిషన్ సభ్యుడు రాసిన లేఖను జగన్మోహన్రెడ్డి అసెంబ్లీలో చదివి వినిపించినప్పుడు అధికార పక్షం అహంకారంతో పెడచెవిన పెట్టింది. ప్రత్యేకహోదా మంజూరు చేయాలంటూ కేంద్ర సర్కార్ను కోరుతూ శాసనసభ రెండోసారి తీర్మానం చేసినప్పుడే ప్రతిపక్ష నాయకుడు కేంద్రానికి ఒక నెల రోజులు గడువు ఇవ్వాలనీ, గడువులోగా ప్రత్యేకహోదా ఇవ్వకపోతే ఉద్యమం బాట పట్టాలనీ, అన్ని పార్టీలూ కలసికట్టుగా పోరాడాలనీ, టీడీపీ ఎన్డీఏ నుంచి వైదొలగాలనీ ఉద్ఘా టించారు. 2017 మే నెలలో ప్రధానిని కలుసుకున్నప్పుడు ప్రత్యేకహోదా ఇవ్వా లంటూ జగన్ విజ్ఞప్తి చేశారు. అంతకుముందు సంవత్సరం కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రత్యేకహోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించినప్పుడు అదే రోజు పొద్దుపోయిన తర్వాత అమరావతితో మీడియా గోష్ఠి నిర్వహించి చంద్ర బాబు నాయుడు ప్యాకేజీని ఆహ్వానించారు. అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడికీ, ఆర్థికమంత్రికీ శాలువలు కప్పి సన్మానించారు. ప్రధానికి ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పారు. అన్ని రాష్ట్రాలకంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కువ సాధించిందంటూ గొప్పలు చెప్పుకున్నారు. జైట్లీ ప్రకటన చేసిన వెంటనే జగన్ మోహన్రెడ్డి ప్యాకేజీని తిరస్కరించమంటూ చంద్రబాబు నాయుడికి విజ్ఞప్తి చేశారు. ఆ సలహా పాటించకపోగా అడ్డంగా వాదించారు. ప్రత్యేకహోదా సంజీ విని కాదనీ, పదేళ్ళ కిందట ఆ హోదా లభించిన రాష్ట్రాలలో అభివృద్ధి ఏమీ జరగలేదనీ చెప్పుకొచ్చారు. ప్రత్యేకహోదా ప్రాణప్రదమైనదనీ, అది ఆంధ్రుల శ్వాస అనీ ప్రజలలో బలంగా నాటుకున్న తర్వాత బీజేపీతో మంతనాలు జరిపి ‘జుమ్లా’ తిరుగుబాటుకు తెరదీశారు. బీజేపీ–టీడీపీ అవగాహనలో భాగంగానే ఎన్డీఏ నుంచి ఇద్దరు టీడీపీ మంత్రులను ఉపసంహరించుకోవడం. రాష్ట్ర స్థాయిలో బీజేపీ నాయకులు టీడీపీ ప్రభుత్వంపైన విమర్శలు చేస్తూ ఉంటారు కానీ జాతీయ నాయకత్వంతో టీడీపీ అధినేతకి సత్సంబంధాలే ఉంటాయి. ముఖ్యమంత్రికీ, ప్రధానికీ చేసిన విజ్ఞప్తుల వల్ల ఫలితం లేకపోవడం, ధర్నాలలో, రాస్తారోకోలలో, బంద్లలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ, వామపక్షాలూ, ఇతర సంస్థల కార్యకర్తలపై టీడీపీ ప్రభుత్వం పోలీసులను ప్రయోగించి జైళ్ళలో పెట్టడం, లాఠీచార్జీలు చేయించడంతో విసిగిన వైఎస్ఆర్సీపీ ఎంపీల రాజీ నామాస్త్రాన్ని ప్రయోగించింది. ప్రత్యేకహోదా ఇవ్వకపోవడం పట్ల కేంద్ర ప్రభుత్వానికి నిరసన వెలిబుచ్చడానికి వైఎస్ఆర్సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారనీ, పార్లమెంటు నుంచి నేరుగా ఆంధ్రప్రదేశ్ భవన్కు వెళ్ళి అక్కడ ఆమరణ నిరాహారదీక్షకు కూర్చుంటారనీ వైఎస్ జగన్ మే 31న పాదయాత్రలోనే ప్రకటించారు. మొత్తం 25మంది ఎంపీలు రాజీనామా చేసి నిరశనదీక్ష చేస్తే కేంద్రం దిగివస్తుందని అప్పుడే చెప్పారు. ఆ తర్వాత అనేకసార్లు అదే ఉద్బోధ చేశారు. శనివారంనాడు కూడా ఆ మాటే అన్నారు. కేంద్రంపైన ఒత్తిడి తెచ్చేందుకు మంగళవారం (జూలై 24న) రాష్ట్ర బంద్ పాటించాలని పిలుపు ఇచ్చారు. టీడీపీ ఏమి చేసింది? అధికారంలోకి వచ్చిన తర్వాత ఏడు మాసాలపాటు చంద్రబాబు ప్రభుత్వం ప్రణాళికాసంఘాన్ని ప్రత్యేక హోదా గురించి అడగలేదు. కానీ, ప్రత్యేక హోదా కావాలంటూ అసెంబ్లీలో రెండుసార్లు తీర్మానం చేయించారు. తర్వాత అరుణ్ జైట్లీతో సమాలోచనలు జరిపి హోదా బదులు ప్యాకేజీకి అంగీకరించారు. ప్రత్యేక ప్యాకేజీని సాధించడమే గొప్ప రాజకీయ విజయంగా చాటుకున్నారు. ప్రత్యేక హోదా అవసరం ప్రజలు గ్రహించారని తెలుసుకొని బీజేపీతో విభేదించినట్టూ, తిరుగుబాటు చేసినట్టూ ఇప్పుడు ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కర్ర విరగకుండా పాము చావకుండా విన్యాసాలు చేస్తున్నారు. ప్రత్యేకహోదాను అమలు చేయకపోవడంలో బీజేపీ, టీడీపీల జమిలి మోసం ఉన్నదని ప్రజలు గ్రహించారు. నాలుగేళ్ళుగా అంటకాగుతూ వీరు సాగించిన నాటకాన్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అవిశ్వాసతీర్మానం పెట్టామని తెలుగుదేశం ప్రభుత్వం చాటుకుంటుంది. అది వీగిపోయింది కనుక ఇకమీదట హోదా ప్రస్తావన తీసుకొని రావద్దంటూ బీజేపీ వాదిస్తుంది. ఈ విన్యాసాల వల్ల ఇసుమంతైనా ప్రయోజనం లేదు. ఏదేమైనా అవిశ్వాస తీర్మానంతో ఒక్క విషయం మాత్రం నిగ్గు తేలింది. రాబోయే ఎన్నికల తర్వాత టీడీపీ, టీఆర్ఎస్లు బీజేపీకి మద్ద తుగా నిలుస్తాయని జాతీయ చానళ్ళలో వివిధ పార్టీల ప్రవక్తలు ఏకాభిప్రాయం వెలిబుచ్చారు. కె. రామచంద్రమూర్తి -
రాహుల్ లెక్కల్లో తప్పెంతా?
సాక్షి, న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై శుక్రవారం లోక్సభలో జరిగిన చర్చలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామంటూ అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం ఏడాదికి కేవలం నాలుగు లక్షల ఉద్యోగాలను మాత్రమే కల్పించిగలిగిందని ధ్వజమెత్తారు. చైనా ప్రభుత్వం ప్రతి 24 గంటలకు 50 వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తుండగా, భారత్ ప్రతి 24 గంటలకు 400లకు మించి ఉద్యోగాలు కల్పించలేక పోతోందంటూ విమర్శించారు. రాహుల్ చెప్పేవన్నీ అబద్ధాలని, చూపేవన్నీ తప్పుడు లెక్కలని బీజేపీ నాయకులు విమర్శించారు. అయితే వారెవరూ తమ విమర్శలను నిరూపించలేకపోయారు. ఎందుకంటే వారి వద్ద ఎలాంటి లెక్కలు లేవు. తాము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏయే విభాగాల్లో ఎన్నెన్ని ఉద్యోగాలు ఇచ్చామో లెక్క తేల్చాల్సిందిగా లోక్సభ సమావేశాలు ముగిశాక ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెల్సింది. ‘మినిస్ట్రీ ఆఫ్ స్టాటస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇప్లిమెంటేషన్’ 2017 ఇయర్ బుక్, వివిధ ప్రభుత్వ పారిశ్రామిక సంస్థల అప్డేట్స్, ఫ్యాక్టరీ ఎంప్లాయిమెంట్ డాటా, ‘ఫాప్స్ అండ్ కమర్షియల్ ఎంప్లాయీమెంట్ ఫిగర్స్’ను పాత్రికేయులు క్షుణ్నంగా పరిశీలించగా ఆశ్చర్యంగా 2014 సంవత్సరం నుంచి ఉపాధి అవకాశాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్స్ లేవు. భారత కార్మిక శాఖ మాత్రం 2016 నుంచి ప్రతి మూడు నెలలకోసారి దేశంలోని ఉపాధి అవకాశాలపై సర్వే జరిపినట్లు ఉంది. 2018, మార్చి 12న భారత కార్మిక శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం 2016–2017 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో దేశంలో 77 వేల ఉద్యోగాలు పెరగ్గా, మూడవ త్రైమాసికంలో 32 వేల ఉద్యోగాలు పెరిగాయి. నాలుగవ త్రైమాసికంలో 1.22 లక్షలు, ఐదవ త్రైమాసికంలో 1.85 లక్షల ఉద్యోగాలు పెరిగాయి. ఉద్యోగాలు నాలుగైదు త్రైమాసికంలో పెరగడానికి గల కారణాలేమిటో వివరించలేదు. రోజుకు 1,139 ఉద్యోగాలు కల్పించినట్లు కార్మిక శాఖ పేర్కొంది. ఈ లెక్కలు నిజమనుకుంటే రాహుల్ చెప్పిన రోజుకు 400 ఉద్యోగాల లెక్క తప్పు. ఇక చైనా రోజుకు 50 వేల ఉద్యోగాలను కల్పిస్తున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు. రోజుకు 37,013 చొప్పున, ఏడాదికి 1.10 కోటి ఉద్యోగాలను కల్పించాలన్నది 2017 సంవత్సరానికి చైనా లక్ష్యంగా పెట్టుకోగా 1.35 కోట్ల ఉద్యోగాలు కొత్తగా కల్పించినట్లు చైనా మానవ వనరులు, సామాజిక భద్రతా మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అంటే రోజుకు దాదాపు 38 వేల ఉద్యోగాలను కల్పించినట్లే. రాహుల్ కాస్త అతిశయోక్తిగా చెప్పినప్పటికీ ఉద్యోగాల కల్పనలో చైనా మనకన్నా అందనంత దూరానుంది. అందుకే చైనాలో నిరుద్యోగం 3.9 శాతం కాగా, భారత్లో 7.1 శాతంగా ఉంది. -
‘కౌగిలింత కాదు.. అదొక రకం షాక్’
సాక్షి, ముంబై : అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేసిన పనులు చర్చనీయంగా మారాయి. ప్రసంగం ముగిసిన తర్వాత ప్రధాని మోదీ వద్దకు వెళ్లి కౌగిలించుకుని మరీ షేక్ హ్యాండ్ ఇవ్వటం.. ఆపై తన కుర్చీలో కూర్చుని కన్నుకొట్టడం.. వంటి చర్యలతో రాహుల్ గాంధీపై విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. సభా వేదికగా జరిగిన ఈ ఊహించని పరిణామంతో ప్రధానితో సహా సభలో ఉన్నవాళ్లంతా విస్మయం వ్యక్తం చేశారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ కూడా రాహుల్ చేసిన పనిని తప్పుబట్టారు. యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ కూడా ఈ విషయమై రాహుల్ను మందలించినట్లు తెలుస్తోంది. అయితే బీజేపీ మిత్రపక్షం శివసేన మాత్రం రాహుల్ చర్యను తనకు అనుకూలంగా మార్చుకుంది. లోక్సభలో రాహుల్ మోదీకి ఇచ్చింది కౌగిలింత కాదని.. ఆయనకదో గట్టి షాక్ అని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. రాహులే అసలైన విజేత.. ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాసం తీర్మానంలో మోదీ నెగ్గినప్పటికీ అసలైన విజేత మాత్రం రాహులేనని సంజయ్ వ్యాఖ్యానించారు. ఫిఫా ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్ను ఉటంకిస్తూ.. ఓడిపోయిప్పటికీ తమ అద్భుత ప్రదర్శన ద్వారా ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకున్న క్రొయేషియా జట్టు లాగే.. రాహుల్ కూడా తన ప్రసంగం, చర్యలతో ప్రజలను ఆకట్టుకున్నారని పేర్కొన్నారు. శుక్రవారం లోక్సభలో జరిగిన సంఘటనల ద్వారా రాహుల్ నిజమైన రాజకీయ నాయకుడినని నిరూపించుకున్నారని వ్యాఖ్యానించారు. రాహుల్ చర్యలను డ్రామా అంటూ విమర్శిస్తున్న వారంతా ప్రతీ రాజకీయ నాయకుడు డ్రామాలాడుతారన్న విషయాన్ని గుర్తిస్తే బాగుంటుందని హితవు పలికారు. కాగా శుక్రవారం జరిగిన అవిశ్వాస తీర్మాన చర్చలో పాల్గొనకుండా శివసేన దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. -
‘ఏపీ, తెలంగాణల మధ్య చిచ్చు పెట్టే యత్నం’
సాక్షి, న్యూఢిల్లీ : పక్క రాష్ట్రం(తెలంగాణ) మద్ధతు కూడా కూడగట్టలేకపోయిన తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ఏపీ, తెలంగాణాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేసిందని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. ప్రత్యేక హోదాపై పదే పదే వైఖరి మార్చుకుంటున్న చంద్రబాబుకు ప్రతీ విషయంలోనూ యూటర్న్ తీసుకోవడం అలవాటైందని వ్యాఖ్యానించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే కేంద్రంపై అవిశ్వాస తీర్మానం పెట్టారని ఆయన ఆరోపించారు. జనాలను మభ్యపెట్టి, మోసం చేయాలని చూస్తున్న చంద్రబాబు ప్రయత్నాలేవీ సఫలం కావన్నారు. చంద్రబాబుకు విశ్వసనీయత లేదు కాబట్టి టీడీపీ మాటలను ఎవరూ పట్టించుకోలేదన్నారు. ప్రత్యేక హోదా బదులు ప్రత్యేక ప్యాకేజీకి చంద్రబాబు ఒప్పుకున్నారని.. అసెంబ్లీలో మహానాడులో ప్రత్యేక ప్యాకేజీని కొనియాడారని గుర్తు చేశారు. ఏకగ్రీవ తీర్మానం కూడా చేశారని, మళ్ళీ యూటర్న్ ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. టిడిపి ఇచ్చిన ఆరువందల హామీల అమలుపై వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు మాటమార్చారని చిన్నపిల్లలకు కూడా అర్థమైందని ఎద్దేవా చేశారు. ‘రాహుల్ గాంధీ అసమర్థుడు..’ రాజకీయాల్లో విశ్వనీయత ముఖ్యమని జీవీఎల్ నరసింహారావు వ్యాఖ్యానించారు. సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ చిన్నపిల్లాడిలా వ్యవహరించారన్నారు. ఆంధ్రప్రదేశ్కు ప్రయోజనం చేకూర్చే ఒక్క మాట కూడా మాట్లాడలేదని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ అసమర్థుడని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. కేవలం మోదీపై విద్వేషంతోనే విపక్షాలు ఒక్కటయ్యాయని విమర్శించారు. -
‘టీడీపీలో తిరుగుబాటు’
సాక్షి, తిరుపతి: లోక్సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాసం విగిపోవడం ద్వారా టీడీపీకి గట్టి దెబ్బ తగిలిందని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ పరువును టీడీపీ నాయకులు బజారుకు ఈడ్చారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్, టీడీపీ మైత్రీ బంధానికి లోకసభ వేదికగా నిలిచిందన్నారు. త్వరలో టీడీపీలో తిరుగుబాటు మొదలవుతుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్తో తమ పార్టీ కలిసి పనిచేయడం టీడీపీలోని సీనియర్ నాయకులకు ఇష్టం లేదని, అలాంటి వారందరూ తిరుగుబాటు చేయాడానికి సిద్ధమౌతున్నారని వెల్లడించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్సభలో గల్లా జయదేవ్ అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రికి సన్మానం, అసెంబ్లీ తీర్మానం చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. మోదీని నిందించాలనే టీడీపీ కుట్ర బెడిసికోట్టిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ సీపీ వలలో చిక్కుకున్న పక్షి టీడీపీ అని వ్యాఖ్యానించారు. ప్రజా వ్యతిరేకను కప్పిపుచ్చుకోవడానికి తమపై బురదచల్లాలని చూశారని మాధవ్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధిపై బీజేపీ రాజీపడదని, ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తామన్నారు. తెలుగుజాతికి తలవంపులు తెచ్చేలా టీడీపీ ఎంపీలు లోక్సభలో వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మళ్లీ గొప్పలకు పోతున్న చంద్రబాబు!
అవిశ్వాస తీర్మాణంపై శుక్రవారం లోక్సభలో చర్చ జరిగినా.. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ నేతలు తమదైన శైలిలో మాట్లాడి అసలు విషయాన్ని ప్రస్తావించకుండా సభను రక్తి కట్టించారు. కాగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాద రాజకీయాన్ని, ఇష్టమొచ్చినట్లుగా ఆయన తీసుకున్న యూటర్న్లను పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టేశారు. దీంతో కంగుతున్న చంద్రబాబు ప్రస్తుతం నష్ట నివారణ చర్యలకు సిద్ధమైనట్లు కనిపిస్తున్నారు. న్యూఢిల్లీ : పార్లమెంట్ సాక్షిగా టీడీపీ డ్రామాలు అవిశ్వాస తీర్మానం చర్చలో భాగంగా మరోసారి తేటతెల్లమైన విషయం తెలిసిందే. అయినా కూడా లోక్సభలో తాము ప్రత్యేక హోదా కోసం పోరాడామంటూ గొప్పలు చెప్పుకునే యత్నాలు మళ్లీ మొదలుపెట్టే పనిలో టీడీపీ నేతలు బిజీగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. ‘హోదా వద్దు ప్యాకేజీ కావాలని చంద్రబాబే అడిగారు, అనంతరం ప్యాకేజీ ప్రకటించినందుకు ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆపై ఎన్నికల సమయం వచ్చేసరికి యూటర్న్ తీసుకున్న చంద్రబాబుకు ప్రత్యేక హోదా గుర్తొచ్చిందని’అవిశ్వాసంపై ప్రధాని నరేంద్ర మోదీ పార్లమెంట్ సాక్షిగా ఏపీ సీఎం నిజ స్వరూపాన్ని బయటపెట్టగా వాటి నుంచి దృష్టి మళ్లించేందుకు స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగారు. ఏపీకి తాము ఎన్నో చేయాలని చూసినా బీజేపీ వల్లే అది సాధ్యపడటం లేదన్న తరహాలో చంద్రబాబు చెప్పడం చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. నేనే ఎక్కడా యూటర్న్ తీసుకోలేదు. ప్రధాని మోదీనే ప్రస్తుతం యూటర్న్ తీసుకున్నారు. మోదీ మమ్మల్ని అవమానించారు. గతంలో ప్రధాని అయ్యేందుకు అవకాశం వచ్చినా వదులుకున్నాను. అభివృద్ధి ఎలా చేయాలో నాకు తెలుసు. గత నాలుగేళ్లు మోదీతో కలిసి పనిచేశాను. ఇప్పుడు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నా. ఆయన నాకు మిత్రుడు కాదు.. శత్రువు కాదు. నా శ్రేయోభిలాషి ఎంతమాత్రం కాదు. అవిశ్వాస తీర్మానంపై మోదీ వద్ద సమాధానం లేదని తెలుసు. కేవలం 1500 కోట్ల రూపాయలతో రాజధాని కాదుకదా.. ఎలక్ట్రికల్ కేబుల్ పనులు కూడా చేయలేం. విభజన చట్టం అమలు చేస్తామని గతంలో మోదీ హామీ ఇచ్చారు. ఢిల్లీని మించిన రాజధాని నిర్మిస్తామన్నారు. కాంగ్రెస్ను విమర్శించడం సరికాదు, ముందు మీరేం చేశారో చెప్పండి. ఏపీకి ఇచ్చిన హామీల అమలు బాధ్యత ప్రధానికి లేదా’ అని మోదీని చంద్రబాబు ప్రశ్నించారు. నాకు అన్నీ తెలుసు అందరి కంటే రాజకీయాలు నాకే ఎక్కువ తెలుసు. నేషనల్ ఫ్రంట్ను ఏర్పాటు చేసిన ఘనత నాదే. జాతీయస్థాయిలో చక్రం తిప్పాం. భవిష్యత్తు కార్యాచరణ ఏం చేయాలన్న దానిపై చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మా ఎంపీలు రాజీనామాలు ఎందుకు చేయాలి. కడప స్టీల్ ప్లాంట్ గురించి అడుగుతున్నారు. కానీ అందుకు పరిస్థితులు అనుకూలించే ఉన్నాయో లేదో తెలుసుకోవాలి. మా ఎంపీలు రాజీనామా చేస్తే మన గొంతుక వినిపించడం ఎలా సాధ్యమవుతుంది. అసలే బీజేపీని నమ్మే పరిస్థితులు లేవని చంద్రబాబు అన్నారు. -
రాహుల్ కౌగిలింత : అమూల్ కూడా వదిలిపెట్టలేదు..
న్యూఢిల్లీ : కౌగిలింత... కన్ను కొట్టడం.. వంటి సరదా సన్నివేశాలతో సీరియస్గా జరిగే పార్లమెంట్లో సైతం నవ్వులు పూశాయి. లోక్సభ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా...సీరియస్గా అప్పడి వరకు విమర్శలు ఎక్కు పెట్టిన కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ.. ఒక్కసారిగా ప్రధాని దగ్గరకు వెళ్లి కౌగలించుకోవడం, ఆ తర్వాత వచ్చి కన్ను గీటడం హాట్టాఫిక్గా మారింది. లోక్సభలో నిన్న జరిగిన ఈ డ్రామాటిక్ సీన్లపై ఇప్పటికీ ట్విటర్ మారుమోగిపోతోంది. న్యూస్పేపర్లు సైతం రాహుల్ కౌగిలింత సీన్ను ఫ్రంట్ పేజీలో ప్రచురించాయి. ఇలా అనూహ్యమైన పరిణామాలు జరిగినప్పుడు డయిరీ కో-ఆపరేటివ్ అమూల్ ఏమైనా చూస్తూ ఊరుకుంటోందా? తాను కూడా నాలుగు సెటైర్లు వేసి, నెటిజన్లను మరింత మురిపిస్తూ ఉంటోంది. ఇదే విధంగా నిన్న లోక్సభలో జరిగిన రాహుల్ గాంధీ కౌగిలింత సీన్పై కూడా ఓ సెటైరికల్ ఫీచర్ను వేసింది. రాహుల్, మోదీని కౌగిలించుకోవడాన్ని ఉట్టంకిస్తూ.. ‘ఆలింగనంగా ఉందా లేదా ఇబ్బంది కరంగా ఉందా’ అంటూ ఓ పిక్చర్ను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా ఆ పిక్చర్లోనే రాహుల్ గాంధీ కన్ను కొట్టడాన్ని కూడా స్కెచ్ చేసింది. నిన్న జరిగిన సెషన్లో ప్రధానిని కౌగలించుకోవడంతో పాటు రాహుల్ కన్ను గీటడం కూడా దేశమంతా ఆశ్చర్యం వ్యక్తం చేసేలా చేసింది. కాగ, 126:325 తేడాతో అవిశ్వాసం వీగిన సంగతి తెలిసిందే. కరెంట్ టాఫిక్స్తో అమూల్ విడుదల చేస్తున్న ఈ క్రియేటివ్ పిక్చర్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి. తాజాగా ఈ సెటైరికల్ పిక్చర్ సైతం నెటిజన్లను ఆకట్టుకుంది. చాలా మంది నెటిజన్లు అమూల్ను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. ‘కరెంట్ హాట్టాపిక్స్తో వ్యంగ్యమైన పిక్చర్స్ను రూపొందించడంలో అమూల్ నీవు చాలా బెస్ట్’ అంటూ ఓ యూజర్ ట్వీట్ చేశారు. అందుకే అమూల్ టేస్ట్ ఆఫ్ ఇండియా అంటూ మరో యూజర్ పేర్కొంది. ప్రతేడాది భలే ఐడియా వస్తుంది అంటూ అమూల్పై నెటిజన్లపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. #Amul Topical: Hugs in Parliament.... pic.twitter.com/dNurd7XDaX — Amul.coop (@Amul_Coop) July 20, 2018 Wow ! awesome sense of humour you guys have to. — KANISHKA (@Kanishk94486037) July 20, 2018 Amul, the original meme makers since 1967. Super idea every week. 😂😂 — #WhatNext (@ThisNMore) July 21, 2018 And thats why Amul is the Taste of India!!! 😀😀😀👏👏👏👍👍👍 — Renu Bhagwat-Gadgil (@RenuGadgil) July 20, 2018 You amul guys are the best .... Always making something sarcastic memes on current hot topics ...🤣😛😉 — Viswam jr 🇮🇳😎 (@EshwarViswam) July 20, 2018 -
‘చంద్రబాబు మోసాలు తేటతెల్లం’
సాక్షి, కడప : సీఎం చంద్రబాబు మోసాలను పార్లమెంట్లో ప్రధాని మోదీ, రాజ్నాథ్లు తేటతెల్లం చేశారని వైఎస్సార్సీపీ నేతలు సురేష్బాబు, అంజాద్ బాషాలు పేర్కొన్నారు. శనివారం నేతలు మీడియాతో మాట్లాడుతూ.. 24వ తేదీన వైఎస్సార్సీపీ చేపట్టిన రాష్ట్ర బంద్ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అసెంబ్లీ సీట్లను పెంచుకోవడానికి బాబు ఢిల్లీ వెళ్లారని తప్ప.. ప్రత్యేక హోదా విషయం ఒక్కసారి కూడా ప్రస్తావించలేదని వారు ధ్వజమెత్తారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంలో 5కోట్ల మంది ప్రజల ఆశలు గల్లంతయ్యాయి. పార్లమెంట్లో టీడీపీ, బీజేపీ మధ్యబంధం ఏంటో కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారని నేతలు అన్నారు. విభజన హామీలు సాధించడం వైఎస్ జగన్కే సాధ్యం.. విభజన హామీలు సాధించడం వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే సాధ్యమని వైఎస్సార్సీపీ నేతలు శ్రీకాంత్ రెడ్డి, అమరనాథ్రెడ్డిలు విశ్వాసం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు హోదా అంశం సజీవంగా ఉందంటే వైఎస్ జగన్ పోరాట ఫలితమే అన్నారు. అంతేకాక ప్రత్యేక హోదా విషయంలో సీఎం చంద్రబాబును నేతలు దుయ్యబట్టారు. చంద్రబాబు ప్యాకేజీని స్వాగతించి హోదాను సమాధి చేశారని ఆరోపించారు. -
‘చంద్రబాబు 40 ఏళ్ల అనుభవం ఏమైంది?’
సాక్షి, విజయవాడ : లోక్సభలో జరిగిన అవిశ్వాసం చర్చపై వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై ఒక్క పార్టీ కూడా మాట్లాడలేదని వెల్లంపల్లి ధ్వజమెత్తారు. అంతేకాక సీఎం చంద్రబాబు తీరును కూడా ఆయన దుయ్యబట్టారు. తనకు 40ఏళ్ల అనుభవం ఉందని చంద్రబాబు చెప్పుకోవడాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. చంద్రబాబు ఆ అనుభవం ఇప్పుడు ఏమైందని వెల్లంపల్లి ప్రశ్నించారు. పార్లమెంట్ సమావేశాల్లో ఏ పార్టీ కూడా ఆంధ్రప్రదేశ్కు జరిగిన అన్యాయంపై మాట్లాడలేదని వైఎస్సార్సీపీ నేత పేర్కొన్నారు. హోదాను వదిలేసి చంద్రబాబు ప్యాకేజీకి ఒప్పుకున్నారని పార్లమెంట్లో స్వయనా ప్రధాని మోదీనే చెప్పారు. అయినా టీడీపీ ఎంపీలు రాజీనామా చేయకుండా డ్రామాలాడుతున్నారని వెల్లంపల్లి విరుచుకుపడ్డారు. నాలుగేళ్ల నుంచి ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్సీపీనే పోరాడుతుందన్నారు. ఏపీ బంద్కు అన్ని పార్టీలు సహకరించాలని వైఎస్సార్సీపీ నేత వెల్లంపల్లి శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. -
చంద్రబాబుకి పవన్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. బీజేపీ నష్టం కలగకూడదనే.. పవన్ ట్వీట్లు చేస్తున్నారంటూ చంద్రబాబు నిన్న ప్రెస్మీట్లో వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘చంద్రబాబుగారూ మీకు ఇదే నా బదులు...’ అంటూ పవన్ ఈ ఉదయం వరుస ట్వీట్లు చేశారు. ‘బీజేపీని వెనకేసుకొస్తే మాకు(జనసేన) వచ్చే లాభమేంటి? ఏపీ ప్రజలు సంపూర్ణంగా బీజేపీని వదిలేశారు. అలాంటి పార్టీతో పొత్తు ఎవరైనా పెట్టుకుంటారా? వెనకేసుకొస్తారా? అసలు నా ట్వీట్ల ఉద్దేశం ఏంటంటే... బీజేపీతో సమానంగా టీడీపీ కూడా రాష్ట్ర ప్రయోజనాల్ని అంతేదారుణంగా దెబ్బకొట్టిందని. ప్రజలను మోసం చేశారు. వంచించారు.. ...మరి ఈ రోజు కొత్తగా తెలుసుకున్నట్లుగా.. మోసపోయినట్లుగా మీరు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మీ సుదీర్ఘమైన అనుభవం, పాలన దక్షత రాష్ట్రాన్ని కాపాడలేకపోతున్నాయి.గత నాలుగు సంవత్సరాల్లో ప్రత్యేక హోదా మీద మీరూ.. మీ పార్టీ ఎన్ని రకాలుగా మాట మార్చారో మీకు తెలియంది కాదు. తద్వారా ఏపీ ప్రజలను నిలకడలేని వాళ్లుగా.. అవకాశవాదులుగా.. ఆత్మగౌరవం లేనివాళ్లుగా దేశస్థాయిలో నిలబెట్టారు’ అని పవన్ పేర్కొన్నారు లోపల కాళ్లు మొక్కుతారు... ‘నిన్న ప్రధాన మంత్రి మోదీగారి కాళ్లకి మీ టీడీపీ ఎంపీలు పాధాభివందనం చేయటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి.. అదే సభలో ఓవైపు మీ ఎంపీలు బీజేపీని తిడతారు. ఇంకోవైపు బీజేపీ కాళ్లకు మొక్కుతారు. దీన్ని మేం ఎలా అర్థం చేసుకోవాలి? కేంద్ర మంత్రి శ్రీ రాజ్నాథ్ సింగ్గారు మిమల్ని ఇంకా మిత్రులుగా చూస్తున్నారు అని అంటారు. దీనిని బట్టి ‘మీరు చేస్తున్నది ధర్మమైన పోరాటం అని ఎలా నమ్ముతామో మీరే చెప్పండి?’ అని చంద్రబాబును ఉద్దేశించి పవన్ ట్వీట్లు చేశారు. రేపు మళ్లీ మీ అవసరాల కోసం.. వైఖరి మార్చుకోరన్న గ్యారెంటీ ఏంటీ?.. అని పవన్ ఏకీపడేశారు. గల్లాపై సెటైర్... ఎంపీ గల్లా జయదేవ్పై పవన్ సెటైర్లు పేల్చారు. గతంలో గల్లా చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ ఆయన ఓ ఫోటోను ఉంచారు. గజిని చిత్రంలో హీరోలాగా టీడీపీ వాళ్లకి Convenient Memory loss Syndrome రోజు రోజుకీ పెరిగిపోతోంది. In case If TDP has memory loss.. pic.twitter.com/Kxf3peoetp — Pawan Kalyan (@PawanKalyan) 21 July 2018 -
అవిశ్వాసంలో బీజేపీకి మిత్రపక్షం ఝలక్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం సందర్భంగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఇబ్బందికర పరిణామం ఎదుర్కొంది. ఎన్డీయే మిత్రపక్షమైన శివసేన లోక్సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను బహిష్కరించింది. సభలో జరిగిన ఓటింగ్లోనూ పాల్గొనలేదు. కేంద్రంలోనూ, మహారాష్ట్రలోనూ బీజేపీతో శివసేన అధికారాన్ని పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజా పరిణామం నేపథ్యంలో బీజేపీతో శివసేన తెగదెంపులు చేసుకునే అవకాశముందని ఊహాగానాలు వెలువడుతున్నాయి. ఈ అంశంపై వేచిచూసి ధోరణిలో ఉన్నామని, బీజేపీతో బ్రేకప్ విషయంలో తామేమీ ఆందోళన చెందడం లేదని శివసేన వర్గాలు అంటున్నాయి. నిజానికి అవిశ్వాస తీర్మానం సందర్భంగా సభకు తమ ఎంపీలందరూ హాజరుకావాలని శివసేన లోక్సభ పక్ష నేత ఆనంద్రావు అద్సుల్ విప్ కూడా జారీచేశారు. బీజేపీ నేతల బుజ్జగింపులతో ఆయన విప్ జారీచేసినట్టు తెలుస్తోంది. అయితే, శుక్రవారం ఉదయానికి శివసేన అధినాయకత్వం వైఖరిలో మార్పు వచ్చినట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనేతల తీరుతో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. బీజేపీతో శివసేన గతకొంతకాలంగా ఘర్షణపూరితమైన వైఖరిని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అవిశ్వాస తీర్మానం సందర్భంగా లోక్సభకు దూరంగా ఉన్న శివసేన మరోవైపు.. మోదీ సర్కారుపై తీవ్ర విమర్శలు గుప్పించింది. లోక్సభలో మోదీ సర్కారు అవిశ్వాస తీర్మానంలో నెగ్గినా.. ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, అందుకే లోక్సభకు తాము గైర్హాజరయ్యాయమని శివసేన నేతలు చెప్తుండగా.. శివసేన అధికార పత్రిక సామ్నా బీజేపీ సర్కారుపై తీవ్రంగా విరుచుకుపడింది. ‘జంతువులను కాపాడుతూ.. మనుషులను చంపే కసాయిలు నేడు ఈ దేశాన్ని పాలిస్తున్నారు. దేశాన్ని పాలిస్తున్న వారిలో కనీసం దయా, జాలి లేకుండాపోయాయి. ఎలాగైనా గెలుస్తూ.. అధికారంలో కొనసాగడమే ప్రజాస్వామ్యం కాదు. మెజారిటీ శాశ్వతం కాదు. ప్రజలే సుప్రీం’ అని సామ్నా పేర్కొంది. -
‘బెస్ట్ యాక్టర్.. బెస్ట్ డ్రామా!’
సాక్షి, అమరావతి: కేంద్రంలోని బీజేపీ సర్కారుతో నాలుగేళ్ల పాటు అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదాను గాలికి వదిలేసిన సీఎం చంద్రబాబు. కానీ, ఇప్పుడు అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పార్లమెంట్లో ఎంపీ గల్లా జయదేవ్ బాగా మాట్లాడారంటూ, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళం వినిపించారంటూ ట్వీట్ చేయడం పట్ల సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. పలువురు నెటిజన్లు.. నాలుగేళ్లుగా హోదా విషయాన్ని మరిచిపోయారా? అని చంద్రబాబును ప్రశ్నించారు. హోదా మాటెత్తితే అరెస్టులు చేస్తానంటూ గతంలో హెచ్చరించిన చంద్రబాబు ఇప్పుడు హోదా కోసం అవిశ్వాస తీర్మానం పెట్టడాన్ని తప్పుబడుతూ ‘బెస్ట్ యాక్టింగ్... బెస్ట్ యాక్టర్ చంద్రబాబు... బెస్ట్ డ్రామా’ అని ట్వీటర్లో పోస్టింగులు పెట్టారు. ‘ప్యాకేజీ ముద్దు... హోదా వద్ద’న్న బాబు మాటలను గుర్తు చేశారు. టీడీపీ నేతలు నాటకాలాడుతున్నారంటూ మండిపడ్డారు. కేంద్రం సంగతి తేల్చడం సరే.. మీరిచ్చిన హామీల సంగతేంటని కొందరు సీఎంను ప్రశ్నించారు. ట్వీటర్, ఫేస్బుక్, గూగుల్లో ఇలాంటి కామెంట్స్ వైరల్గా మారాయి. చంద్రబాబు ట్విట్టర్లో పోస్టింగ్ పెట్టిన 4 గంటల్లోనే 232 మంది వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. గల్లా జయదేవ్, నారా లోకేష్ ట్వీట్లకూ ఇదే రీతిలో వ్యతిరేకత వచ్చింది. -
బాబు యూటర్న్ను బయటపెట్టిన ప్రధాని మోదీ
-
లోక్సభలో అనూహ్య పరిణామం
-
ఏపీకి హోదా ఊసెత్తని కాంగ్రెస్
-
ప్యాకేజీ కావాలని బాబే అడిగారు
-
సభా మర్యాదలు పాటించాలి
న్యూఢిల్లీ: మోదీని కౌగిలించుకున్నందుకు స్పీకర్ సుమిత్రా మహాజన్ రాహుల్ను మందలించారు. సభ్యులంతా సభా మర్యాదలు పాటించాలని ఆమె కోరారు. రాహుల్ ఎవరిని కౌగిలించుకున్నా తానేమీ వ్యతిరేకిని కాననీ, అయితే సభలో మర్యాదతో నడచుకోవాలని ఆమె కోరారు. తనకెవరూ శత్రువు కాదనీ, రాహుల్ తన కొడుకులాంటి వాడని ఆమె పేర్కొన్నారు. ఆయన మోదీని కౌగిలించుకోవడం తనకు ఓ డ్రామాలా అనిపించిందన్నారు. హోదాపై మాట లేదు సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో కనీసం ప్రస్తావించలేదు. గంటకుపైగా ప్రసంగించినా ఎక్కడా ఏపీకి ఇచ్చిన విభజన హామీల గురించి చిన్న మాట కూడా ఎత్తలేదు. కేవలం గల్లా జయదేవ్ ప్రసంగాన్ని ప్రస్తావిస్తూ.. ఏపీ తీరును ఆయన వివరించారని చెప్పి ముగించారు. లోక్సభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే మాట్లాడుతూ.. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర విభజన సందర్భంగా ఏపీకిచ్చిన అన్ని హామీలనూ బీజేపీ సమ్మతించిందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా, పన్ను రాయితీలు, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలపడం, ఆర్థిక లోటు భర్తీ హామీలను అమలు చేసేందుకు బీజేపీ అంగీకరించిందని అన్నారు. ఏపీకిచ్చిన హామీలను 2016లో మాజీ ప్రధాని మన్మోహన్ రాజ్యసభలో తిరిగి ప్రస్తావించారన్నారు. -
2019లో ప్రధాని పదవి ఖాళీగా లేదు
న్యూఢిల్లీ: వచ్చే లోక్సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదని కేంద్ర మంత్రి, ఎల్జేపీ అధినేత రామ్విలాశ్ పాశ్వాన్ తెలిపారు. అవిశ్వాసంపై చర్చ సందర్భంగా పాశ్వాన్ మాట్లాడుతూ.. ‘2019 లోక్సభ ఎన్నికల్లో ప్రధాని పదవికి ఖాళీ లేదు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ 2024 లోక్సభ ఎన్నికలు లక్ష్యంగా పనిచేయాలి. ప్రస్తుతం కాంగ్రెస్ కేవలం 3 రాష్ట్రాలకే పరిమితం కావడానికి గల కారణాలపై రాహుల్ ఆత్మపరిశీలన చేసుకోవాలి. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తామని మోదీ చెప్పలేదు. కోర్టు తీర్పుకోసం వేచి ఉండాలనే చెప్పారు. దేశంలో 18,000 గ్రామాలను నిర్ణీత గడువులోగా విద్యుదీకరణ చేశాం. అలాగే గడువులోపలే మరుగుదొడ్ల నిర్మాణ లక్ష్యాన్ని పూర్తిచేశాం. ఇండియన్ జ్యుడీషియల్ సర్వీసెస్ను కేంద్రం తీసుకురావడాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తోంది. ఈ మాట పార్లమెంటులో చెప్పాను కాబట్టి సరిపోయింది కానీ బయట చెప్పిఉంటే కోర్టు ధిక్కారం అయ్యేది. కోలీజియం వ్యవస్థలో సైతం పారదర్శకత లేదు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల భర్తీలాగే జడ్జీల నియామకంలోనూ పారదర్శకత రావాలి’ అని పాశ్వాన్ వ్యాఖ్యానించారు.