-
భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం
సాక్షి, ఖానాపూర్: భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం నాయక్, ఎస్సై భవానిసేన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని బీర్నంది పంచాయతీ పరిధిలోని కొమ్ముతాండ గ్రామానికి చెందిన లక్ష్మి (40) భర్త బుక్య బలిరాం సోదరుడు గతంలో మృతిచెందాడు. అతడి భార్యతో బలిరాం వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో ఈ విషయంపై భార్యతో తరుచుగా గొడవలు జరిగేవి. గ్రామస్తులు సైతం పలుమార్లు హెచ్చరించారు. అయినా తీరు మార్చుకోకపోవడంతో పాటు భార్యను తరుచుగా వేధించేవాడు. శుక్రవారం ఉదయం పంటచేనుకు వెళ్లిన లక్ష్మిని అక్కడికి వెళ్లి తీవ్రంగా కొట్టాడు. దీంతో పంట చేనులోని పురుగుల మందు తాగి లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలికి కుమారుడు వెంకటేశ్, కూతుల్లు చంద్రకళ, స్వప్న ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. మృతదేహాన్ని పరిశీలిస్తున్న సీఐ -
బినామీ పేరుపై ‘కల్యాణలక్ష్మి’
సాక్షి, ఖానాపూర్: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని రాష్ట్రప్రభుత్వం కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టింది. కానీ ఉన్నతాధికారుల పర్యవేక్షణలోపం.. స్థానిక అధికారుల నిర్లక్ష్యం.. వెరసి పథకం అమలులో చోటు చేసుకుంటున్న లోపాలతో ప్రభుత్వం అప్రతిష్ట పాలవుతుందని పలువురు పేర్కొంటున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సత్తన్పల్లిలో బినామి పేర్లతో కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేసిన దళారులు అధికారులతో కుమ్మకై చెక్కును మంజూరు చేయించుకోవడంతో పాటు డబ్బులు స్వాహా చేసేందుకు ప్రయత్నించారనే బలమైన ఆరోపణలు ఇప్పుడు మండలంలో హాట్ టాపిక్గా మారాయి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన వివరాలిలా ఉన్నాయి. నలుగురు మనుషులు లేకున్నా ఉన్నట్లు సృష్టి సత్తన్పల్లి గ్రామంలోని దొమ్మటి రమ–వెంకటేశ్గౌడ్ దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. కూతురు లేదు. కాని కుటుంబ సభ్యులకు సంబందం లేకుండా గ్రామాలోని ఇద్దరు దళారులు ఆదంపతులకు కూతురు శ్యామల ఉన్నట్లు సృష్టించడంతో పాటు గ్రామంలో అసలే లేని పెళ్లికొడుకు, వారి తల్లిదండ్రులను కల్పితంగా సృష్టించి వివాహ ఆహ్వాన కార్డును ముద్రించారు. ఇరువురికి గ్రామంలోనే గత సంవత్సరం డిసెంబర్ 14న వివాహం జరిగినట్టు సృష్టించి కల్యాణలక్ష్మికి దరఖాస్తు చేశారు. దీంతో గ్రామానికి చెందిన దొమ్మటి రమ పేరుపై చెక్కు మంజూరైంది. ఈ నెల 4న స్తానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే చెక్కుల పంపిణీ సందర్భంగా ఈ తతంగం అధికారుల దృష్టికి వచ్చింది. అధికారులు చెక్కును ఇవ్వకుండా లోలోపల సమస్య సమసిపోయేలా గోప్యత ప్రదర్శించారనే విమర్శలొచ్చాయి. రమ–వెంకటేశ్లు మాత్రం ఇందులో తమ ప్రమేయం ఏమీలేదన్నారు. అధికారుల తీరుపైనే అనుమానం.. గ్రామస్థాయిలోరెవెన్యూ అధికారి, మండల స్థాయిలో గిరిధవార్లు క్షేత్రస్థాయిలో నిర్థారించి ప్రభుత్వానికి సిఫారసు చేస్తే చెక్కు మంజూరవుతుంది. కానీ అధికారులు మాత్రం పోర్జరీ చేసి దరఖాస్తు చేశారని, తమ ప్రమేయం లేదని దాటవేస్తున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సత్యనారాయణను వివరణ కోరగా తహసీల్దార్ విజయారెడ్డి ఘటన జరిగినరోజు విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదిక ఇచ్చామన్నారు. విధుల బహిష్కరణ సందర్భంగా ఇంకా విచారణ జరుపలేదన్నారు. పూర్తిస్థాయి విచారణ జరిపిన తర్వాత దోషులపై చట్టపరమైన చర్యలకోసం పైఅధికారులకు నివేదిస్తామన్నారు. -
ఖానాపూర్లో నేటికీ చెదరని జ్ఞాపకాలు
సాక్షి, ఖానాపూర్ : ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో నేటికి చెదరని నెత్తుటి చేదుజ్ఞాపకాలు.. తలుచుకుంటేనే ఒళ్లు జలదరిస్తుంది. ఎటుచూసిన అన్నల అలజడి... తుపాకీ చప్పుళ్లు వినబడుతుండేవి. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట నక్సలైట్లు విధ్వంస చర్యలు జరుగుతూనే ఉండేవి. తరుచూ ఎన్కౌంటర్లు జరుగుతుండేవి... నక్సలైట్ల కవ్వింపు చర్యలు తిప్పికొట్టే ప్రయత్నాల్లో ప్రాణాలర్పించిన పోలీసుల సేవలు మరువలేనివి. ఈ క్రమంలోనే ఎన్నో సంఘటనలు జరిగాయి. దాదాపు 1983 నుంచి అప్పటి ఆదిలాబాద్లో ఉన్న నిర్మల్ జిల్లా పరిధిలో మెల్లమెల్లగా నక్సలైట్ల ప్రభావం పెరుగుతూ వచ్చింది. నిర్మల్ జిల్లా ఖానాపూర్ సర్కిల్ పోలీస్స్టేషన్ పరిధిలో విధి నిర్వహణలో నక్సలైట్ల తూటాలకు 19 మంది పోలీసులు బలి అయ్యారు. ఖానాపూర్ ప్రాంతంలో దట్టమైన అడవులు ఉండడంతో నక్సలైట్లు స్థావరాలు ఎర్పరచుకున్నారు. జిల్లాలో మొదటిసారిగా ఇక్కడి నుంచే విద్రోహ చర్యలకు శ్రీకారం చుట్టారు. సంఘటనల వివరాలివే.. 1987 ఆగస్టు 18న కడెం మండలం అల్లంపల్లి క్యాంపునకు పోలీసులు నడిచి వెళ్తుండగా అద్దాల తిమ్మాపూర్ వద్ద 30 మంది నక్సలైట్లు పకడ్బందీ పథకం ప్రకారం మాటువేసి విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ఇద్దరు ఎస్సైలు, ఒక హెడ్ కానిస్టేబుల్, ఏడుగురు కానిస్టేబుళ్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు కానిస్టేబుళ్లు తప్పించుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. 1989 పిభ్రవరి ఒకటిన జరిగిన సంఘటకు ఒక రోజు ముందు ఖానాపూర్ మండలంలోని రాజూరా గ్రామంలో నక్సలైట్లు దోపిడికి పాల్పడ్డారు. దోపిడి నేపథ్యంలో పోలీసులు ఆ గ్రామానికి వెళ్తుండగా కడెం మండలం సింగాపూర్ గ్రామ సమీపంలో పకడ్బందీ వ్యూహంతో నక్సలైట్లు పోలీసుల జీపును పేల్చివేశా రు. ఎస్ఐ ఖాదర్ఉల్హక్, ఆరుగురు కానిస్టేబుళ్లు జీ. బాపురావు, ఎండీ జలీల్, షేక్హైదర్, వేణుగోపాల్, బోజరావు, ఎస్. మోహన్దాస్లు ప్రాణాలు కోల్పోయారు. ఒకే కానిస్టేబుల్ ప్రాణాలతో బయటపడ్డాడు. 1999 డిసెంబర్ ఐదున కడెం మండలంలో బందోబస్తుకు వెళ్లి వస్తుండగా ఖానాపూర్ మండలం తర్లపాడ్ గ్రామసమీపంలో నక్సలైట్లు రిమోట్కంట్రోలర్ సహాయంతో పోలీసు జీపును పేల్చివేశారు. ఎస్ఐ మల్లేశ్తో పాటు కానిస్టేబుల్, జీపు డ్రైవర్ దుర్మరణం చెందారు. ఖానాపూర్లో అమరుల స్థూపం ఖానాపూర్ పోలీస్స్టేషన్లో అమవీరుల స్మారాకర్థం స్థూపం లేకపోవడంతో స్టేషన్ ఆవరణలోని ఓ వేపచెట్టు కింద శిలాఫలకంపై పేర్లు రాసి ఉంచేవారు. అనంతరం 2008 సంవత్సరంలో అప్పటి సీఐ, ఎస్ఐలు స్మారక స్థూప నిర్మాణానికి కృషి చేశారు. ప్రస్తుత సీఐజయరాంనాయక్తో పాటు ఎస్ఐ గోగికారి ప్రసాద్లు వివిధ కార్యక్రమాలు చేపడుతున్నారు. -
మౌనపోరాటంతో అనుకున్నది సాధించింది
సాక్షి, ఖానాపూర్(ఆదిలాబాద్) : ప్రియుడితో పెళ్లి చేయాలని ఓ యువతి చేసిన పోరాటం ఎట్టకేలకు ఫలించింది. మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గ మహేష్ ప్రేమించి పెళ్లికి నిరాకరించడంతో ఈనెల 18న ప్రియుడి ఇంటి ముందు ఓ యువతి మౌనదీక్షకు దిగిన విషయం తెల్సిందే. బాధితురాలి కథనం ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం బెంగళూర్లోని భాగ్యపల్లికి చెందిన కె.సునిత పనినిమిత్తం ముంబైకి వెళ్లి ఓ ఇంట్లో హౌస్ కీపింగ్గా పనిచేస్తోంది. అదే ఇంట్లో మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం మహేష్తో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. దీంతో మూడేళ్లుగా వారు ప్రేమలో ఉన్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన మహేశ్ ఆమె నుంచి రూ. 1.80 లక్షలు తీసుకున్నా డు. శారీరకంగా దగ్గరకావడంతో యువతి గర్భం దాల్చింది. తీరా పెళ్లి విషయం తెచ్చేసరికి మహేశ్ ముంబై నుంచి ఇంటికి చేరుకున్నాడు. ఇక్కడికొచ్చాక పెళ్లి చేసుకోనంటూ సునితతో చెప్పి సెల్ స్విచ్ఛాఫ్ చేశాడు. దీంతో బాధితురాలు మహేశ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. ముంబై వెళ్లి అక్కడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ముంబయి పోలీసులు కేసు నమోదు చేయడంతో ఆందోళన చెందిన మహేశ్ కుటుంబ సభ్యులు ఇద్దరికి వివాహం చేయడానికి రాజీ కుదించారు. మండలంలోని గొడిసెర్యాల శ్రీ రాజరాజేశ్వర ఆలయం లక్ష్మణ స్వామి ఆలయంలో వివాహం చేయడంతో బాధితురాలికి న్యాయం చేసినట్లయ్యింది. -
దొంగలు బాబోయ్.. దొంగలు
సాక్షి, ఖానాపూర్ (ఆదిలాబాద్) : గత మూడు నెలలుగా ఖానాపూర్లో దొంగల బెడదతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. తాళాలు వేసి ఉన్న ఇళ్లనే టార్గెట్ చేస్తూ పగలు, రాత్రి అనే తేడా లేకుండా యథేచ్చగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆయా నివాసాల్లో విలువైన బంగారం, వెండి, నగదును ఎత్తుకెళ్తున్నారు. వరుస దొంగతనాలు జరుగుతున్నా పోలీసులు దొంగలను పట్టుకోలేక పోతున్నారు. దొంగతనాలు నియంత్రించడంలో కూడా విఫలం అవుతున్నారని పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరుస చోరీలతో మారని తీరు పోలీస్ స్టేషన్ సమీపంలో గల అటవీ శాఖ కార్యాలయం ముందు గల వాచ్ల దుకాణంలో రూ. 30 వేల నగదుతో పాటు గడియారాలను దొంగలు ఎత్తుకెళ్లారు. జగన్నాథ్రావు చౌరస్తాలోని రాజేశ్వర్ అనే వ్యక్తికి చెందిన బంగారం దుకాణంలో చొరబడి వెండితో పాటు పలు బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. విద్యానగర్లోని నారాయణ ఇంట్లో టీవీతో పాటు ఇతర సామాగ్రిని, కొంత నగదును ఎత్తుకెళ్లారు. జేకే నగర్లోని టీఆర్ఎస్ మైనార్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు ఖాన్ నివాసంలో చొరబడి ఇంట్లోని పలు సామాగ్రితో పాటు కొంత నగదు కూడా ఎత్తుకెళ్లారు. పట్టపగలే చోరీ ఈ నెల 9న శాంతినగర్ కాలనీకి చెందిన శేఖర్ అనే వ్యక్తి నివాసంలో పట్టపగలే చొరబడి దొంగలు పెద్ద ఎత్తున చోరీకి పాల్పడ్డారు. ఇంట్లోని 11 తులాల బంగారంతో పాటు రూ. లక్షా 40 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ పోలీసు యంత్రాంగం ఎస్ఐ, సీఐతో పాటు డీఎస్పీ సైతం ఘటనా స్థలానికి చేరుకొని, పోలీసు జాగిలాలతో పాటు ఫ్రింగర్ ఫ్రింట్ క్లూస్ టీంలతో క్షుణ్ణంగా పరిశీలించి విచారణ చేపట్టారు. తాజాగా ఈ నెల 14న బాలికల ఉన్నత పాఠశాలలో చొరబడ్డ దొంగలు, క్వింటాల్న్నర బియ్యంతో పాటు పప్పు దినుసులు, నూనెలు, తదితర సామగ్రినీ ఎత్తుకెళ్లారు. 15న రాత్రి రిటైర్డ్ వీఆర్వో ఇంట్లో ఎవరు లేకపోవడంతో తాళాలు, బీరువాలు పగులగొట్టి తులం బంగారం ఎత్తుకెళ్లారు. హడలెత్తిస్తున్న దొంగలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. త్వరలో పట్టుకుంటాం వరుస దొంగతనాల నేపథ్యంలో పట్టణంలో పెట్రోలింగ్ ముమ్మరం చేశాం. దొంగలను త్వరలో పట్టుకొని ప్రజలకు దొంగల బెడదను తొలగిస్తాం. ప్రజలు ఎటువంటి భయాందోళన చెందవద్దని విజ్ఙప్తి చేస్తున్నాం. విలువైన వస్తులు, బంగారం, వెండి, నగదు ఇంట్లో ఉంచుకోవద్దు. దూర ప్రయాణాలు చేసే వారు పోలీస్ ష్టేషన్లో ముందస్తుగా సమాచారం ఇవ్వాలి. -జయరాం, సీఐ, ఖానాపూర్ -
బావిలో చిరుతపులి..
-
బావిలో చిరుత.. నిచ్చెన ద్వారా జంప్
సాక్షి, ఖానాపూర్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం రాజురా గ్రామ సమీపంలోని వ్యవసాయ బావిలో ఒక చిరుతపులి పడింది. బావిలోని నీటిలో అటు-ఇటు తిరుగుతూ.. దిక్కుతోచనిస్థితిలో బిక్కుబిక్కుమంటూ ఉన్న చిరుతను గ్రామస్తులు గుర్తించారు. బావి నీటిలో ప్రాణాపాయస్థితిలో ఉన్న చిరుత గురించి పోలీసులకు, అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న అధికారులు బావిలోని చిరుతను బయటకు తెచ్చేందుకు ఓ నిచ్చెనను ఏర్పాటటు చేశారు. నిచ్చెనను గుర్తించి.. అతికష్టం మీద ఎగబాకుతూ బయటకు వచ్చిన చిరుత.. బతుకు జీవుడా అంటూ అక్కడి నుంచి సమీప అడవిలోకి పరుగు తీసింది. బావిలో చిరుత పడ్డ సమాచారం తెలియడంతో దానిని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల పెద్ద ఎత్తున ప్రజలు బావి వద్ద గుమిగూడారు. మొత్తానికి చిరుత బావి నుంచి బయటపడటంతో గ్రామస్తులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. -
అంత్యక్రియలకు హాజరై వెళ్తుండగా..
ఖానాపురం: అంత్యక్రియలకు హాజరై తిరుగు ప్రయాణంలో ఇంటికి వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో వ్యక్తి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. వివరాల ప్రకారం.. మండలంలోని అశోక్నగర్ గ్రామంలో ఓ వ్యక్తి అంత్యక్రియలకు కృష్ణా జిల్లా నందిగామ మండలం అంబర్పేట గ్రామానికి చెందిన బెల్లంకొండ ఏసు(35)తో పాటు మరో నలుగురు బుధవారం హాజరయ్యారు. అంత్యక్రియలు ముగిసిన తర్వాత ఆటోలో తిరిగి వెళ్తున్న క్రమంలో అయోధ్యనగర్ శివారులో గుర్తు తెలియని ట్రాక్టర్ ఢీకొట్టడంతో ఆటో బోల్తాపడింది. ప్రమాదంలో ఏసుకు తీవ్ర గాయాలు కాగా మరో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు చికిత్స నిమిత్తం నర్సంపేట ఏరియా ఆస్పత్రికి తరలించగా ప్రాథమిక చికిత్స అందించారు. ఏసు పరిస్థితి విషమంగా ఉండటంతో ఎంజీఎంకు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని పోలీసులు సందర్శించి వివరాలు సేకరించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అగ్ని ప్రమాదాలను తగ్గించిన ‘ఫైర్లైన్స్’
సాక్షి, జన్నారం(మంచిర్యాల): వేసవిలో అడవిలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు అమలు చేస్తున్న ఫైర్లైన్స్ విధానం సత్ఫలితాలనిస్తోంది. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల అడవి కాలడంతోపాటు వన్యప్రాణులు, పక్షులకు ప్రమాదం పొంచి ఉంటుంది. అగ్ని ప్రమాదాలను నివారించాలనే ఉద్దేశంతో అటవీ శాఖ నూతన విధానాన్ని రూపొందించింది. వేసవిలో అగ్ని ప్రమాదాలు నివారించి, అడవికి నిప్పు తగులకుండా ఆపేందుకు అధికారులు కొత్త పద్ధతి అమలు చేస్తున్నారు. అడవిలో కూలీల ద్వారా ఫైర్లైన్స్(అగ్గి వరుస) ఏర్పాటు చేసి వాటికి నిప్పు పెడితే అడవంతా రగిలే అవకాశం ఉండదనే ఉద్దేశంతో వాటిని ఏర్పాటు చేశారు. దీంతో వేసవిలో అడవికి నిప్పు తగులకుండా మంచి ఫలితాలు ఇస్తున్నాయి. టైగర్జోన్లోని జన్నారం అటవీ డివిజన్లో మూడు అటవీ రేంజ్ల పరిధి అన్ని బీట్లలో ఫైర్లైన్ పనులు చేయిస్తున్నారు. జిల్లాలో ఫైర్లైన్స్ కోసం కాంపా స్కీం కింద రూ.10 లక్షలు కేటాయించారు. గత సంవత్సరం 40 కిలోమీటర్ల దూరం ఫైర్లైన్స్ చేయగా, ఈ ఏడాది ఇప్పటివరకు 22 కిలోమీటర్ల దూరం చేశారు. ఆకులు శుభ్రం చేసే బ్లోయర్లు గత సంవత్సరం ఆరు కొనుగోలు చేయగా ఈసారి మరో నాలుగు బ్లోయర్లు కొనుగోలు చేశారు. ఫైర్లైన్స్ అంటే అడవిలో ప్రస్తుతం ఆకులు రాలిపోతాయి. దీంతో పశువుల కాపరులు గాని, అడవికి వెళ్లిన వారు గాని బీడీ, చుట్ట తాగి అలాగే పడేస్తే ఎండిన ఆకులకు అంటుకుని అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. దీని ద్వారా మంటలు అడవంతా వ్యాపించి, పక్షులు, చెట్లు, వన్యప్రాణులకు ప్రాణహాని కలిగే అవకాశం ఉంది. అగ్ని ప్రమాదాలు నివారించడానికి ఫైర్లైన్ సిస్టం ఏర్పాటు చేశారు. ప్రతీ బీట్లోని అటవీ ప్రాంతాల్లో ఎడ్లబండ్ల తొవ్వలు, కాలి నడక తొవ్వలకు ఇరువైపులా ఎండిన ఆకులను 5 మీటర్ల వెడల్పులో పోగు చేస్తారు. ఈ తొవ్వలపై వేసి అడవికి అంటకుండా నున్నగా చేసి పోగు చేసిన ఆకులకు నిప్పు పెట్టి కాలుస్తారు. ఆకులు కాలే వరకు పర్యవేక్షిస్తారు. ఫలితంగా దారి వెంట ఎవరైన బీడీ కోసం నిప్పంటించుకుని పడేస్తే నిప్పంటుకునే అవకాశం ఉండదు. అందుకే ఎప్పటికప్పుడు దారులపై ఎండిన ఆకులను ఉండకుండా చూస్తారు. ప్రమాదవశాత్తు నిప్పంటినా ఈ దారుల వరకే వ్యాపించి ఆగుతుంది. దీంతో అడవిలో అగ్ని ప్రమాదం జరుగకుండా ఉంటుం ది. అన్ని డివిజన్లలోని కంపార్ట్మెంట్, బీట్, డివిజన్, బౌండరీలలో ఈ అగ్గి వరుసలు వేస్తారు. శాటిలైట్ ద్వారా ఫైర్ అలర్ట్ అటవీశాఖ ఉన్నత అధికారులు అగ్ని ప్రమాదాలను నివారించేందుకు శాటిలైట్ ద్వారా పర్యవేక్షిస్తుంటారు. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డెహ్రడూన్ ఆధ్వర్యంలో శాటిలైట్ ద్వారా ఎక్కడ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా సమాచారం చేరవేస్తారు. ప్రతీ రోజు ఉదయం 5.30 గంటలకు ప్రమాదం జరుగుతున్న ప్రదేశం గురించి సంబంధిత అధికారులకు మొబైల్ ఫోన్కు మేసేజ్ వస్తుంది. కంపార్టుమెంట్ నంబర్, ఏరియాతో సహా తెలియపరుస్తారు. దీంతో సంబంధిత అధికారులు జీపీఎస్ ద్వారా ఆ ప్రాంతానికి వెళ్లి మంటలు ఆర్పివేస్తారు. అగ్ని ప్రమాదాలు జరిగే అవకాశాలు ఏ ప్రాంతాల్లో ఉన్నాయో కూడా శాటిలైట్ ద్వారా ముందుగానే హెచ్చరికలు జారీ చేస్తారు. దీంతో అధికారులు అప్రమత్తమై ఆ ప్రాంతంలో చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం 90 సార్లు డివిజన్లో అగ్ని సమాచారాలు రాగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు ఒక్కటి కూడా రాలేదని, ఆ విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఫైర్లైన్ చేసి ఆకులు కాల్చుతున్న కూలీలు కూలీలకు చేతినిండా పని వేసవిలో కూలీలకు చేతినిండా పని ఉంటుంది. ఫిబ్రవరి నుంచి మే మాసం వరకు ఈ పనులు నిరంతరంగా జరుగుతాయి. ఎండిన ఆకులను ఉండకుండా ఎప్పటికప్పుడు పోగు చేసి నిప్పంటించడం, ఆ నిప్పు అడవిలోకి వ్యాపించకుండా చూడడం కూలీల పని. ఇందుకు 5 మీటర్ల వెడల్పు, ఒక మీటర్ పొడవుకు రూ.5.50 కూలి ఇస్తారు. ఒక్కో కూలీ రోజుకు 20 నుంచి 40 మీటర్ల వరకు ఫైర్లైన్ వేస్తారు. దీంతో మూడు నెలల వరకు కూలీలకు పని దొరుకుతుంది. గ్రామాల్లో అవగాహన సదస్సులు అటవీ సమీప గ్రామాల్లో శాటిలైట్ ద్వారా ప్రధాన కార్యాలయం నుంచి వచ్చిన సమాచారం మేరకు అగ్ని ప్రమాదాలు సంభవించే అటవీ సమీప గ్రామాల ప్రజలకు అగ్ని ప్రమాదాలు, నష్టంపై అటవీశాఖ అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. పశువుల కాపరులు అగ్గిపెట్టలు, సిగరేట్, బీడీలు అడవులకు పట్టుకెళ్లకుండా చూస్తున్నారు. సమీప గ్రామాల ప్రజలు పొలాల్లో గడ్డికి నిప్పు పెట్టడం, చెత్త అడవిలో వేసి కాల్చడం వంటివి చేయకుండా అవగాహన కల్పిస్తున్నారు. కొందరు బీడీ ఆకులు, ఇప్ప పువ్వు కోసం చెట్లకు నిప్పు పెట్టే అవకాశం ఉన్నందున అలాంటివి జరుగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అటవీ ప్రాంతంలోకి ఎవ్వరినీ అనుమతించకపోవడం, పశువులను మేత కోసం పంపకపోవడం, అటవీ ప్రాంతాల్లో నివసించే వారికి అవగాహన కల్పించడంతోపాటు హెచ్చరికలు జారీ చేయడం వల్ల ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. జీరో పర్సెంట్ ప్రమాదాలకు చర్యలు గత సంవత్సరం 80 వరకు ప్రమాదాలు జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటివరకు ఒక్కటి కూడా జరుగకుండా చూశాం. గత సంవత్సరం మొత్తం 90 సార్లు శాటిలైట్ ద్వారా అగ్నిప్రమాదాల గురించి మేసేజ్లు వచ్చాయి. ఈ సంవత్సరం ఒక్కటి కూడా రాలేదు. అంటే డివిజన్లోని అడవుల్లో జీరో పర్సెంట్ అగ్ని ప్రమాదాలకు చర్యలు తీసుకుంటున్నాం. ఇప్పుడు ఫైర్లైన్ పనులు జరుగుతున్నాయి. ప్రతీ రోజు బీట్ల వారీగా పనుల వివరాలు తెలుసుకుని ఉన్నత అధికారులకు తెలియజేస్తున్నాం. – రవీందర్గౌడ్, ఎఫ్డీవో -
బాదన్కుర్తి.. బుద్ధుడి ధాత్రి!
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మహాజనపదం అస్మక రాజ్యం.. ఆ రాజ్యంలో గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో ఉన్న ఓ జనావాసం.. అది తెలంగాణలోనే ఉంది. అక్కడికి చేరువలో నది మధ్యలో చిన్న దీవి.. ఆ దీవిలో ఉందీ ఓ అద్భుతమైన బౌద్ధ స్థూపం.. ఇటీవలే జరిపిన తవ్వకాల్లో ఈ స్థూపం బయల్పడింది. ఇది తెలంగాణలో బయటపడ్డ అతి పురాతన స్తూపంగా చరిత్రకారులు భావిస్తున్నారు. బావరి గ్రామానికి సమీపంలో.. క్రీ.పూ.1 నుంచి 3 శతాబ్దాల మధ్య కాలానికి చెందినదిగా అంచనా వేస్తున్నారు. విశేషమేంటంటే బుద్ధుడిని స్వయంగా కలసి ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించిన బావరి అనే వ్యక్తి నివసించిన ప్రాంతానికి 7 కిలోమీటర్ల దూరంలోనే ఈ స్తూపం ఉంది. అంటే బుద్ధుడు సజీవంగా ఉన్నప్పుడు ఆయన బోధనలను ప్రచారం చేసిన వారి తాలూకు వ్యక్తులే వీటిని నిర్మించారని తెలుస్తోంది. గోదావరి నది మధ్యలో చిన్న దీవిలో ఉన్న ఈ స్తూపంతో పాటు దాని చుట్టుపక్కల ఉన్న ఇతర బౌద్ధ నిర్మాణాలను వెలుగులోకి తెస్తే ఇది పెద్ద పర్యాటక ప్రాంతంగా వెలుగొందుతుందని చెబుతున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో గోదావరి నది మధ్యలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు చరిత్రకారుల దృష్టిని ఆకర్షిస్తోంది. బౌద్ధ సాహిత్యంలో ప్రస్తావన.. బౌద్ధులు అత్యంత పవిత్రంగా భావించే సుత్త నిపత గ్రంథంలో ఈ ప్రాంత ప్రస్తావన ఉంది. ఇప్పటివరకు బయటి ప్రపంచానికి దీని గురించి తెలియకపోవటంతో బౌద్ధ పర్యాటకులు ఇక్కడికి రావట్లేదు. నిర్మాణాలు వెలుగు చూసి, వాటి ప్రాధాన్యంపై ప్రచారం చేస్తే దేశవిదేశీ బౌద్ధ భిక్షువులు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. సుత్త నిపత గ్రంథంలోని పారాయణ వగ్గ చాప్టర్లో తెలంగాణ ప్రాంతం ప్రస్తావన ఉందని గతంలోనే నిపుణులు గుర్తించారు. ‘అస్మక రాజ్యంలో గోదావరి నది రెండుగా చీలిన ప్రాంతంలోని ఆవాసానికి చెందిన వారు బుద్ధుడిని దర్శనం చేసుకుని ఆయన బోధనలను విశ్వవ్యాప్తం చేసేందుకు నడుం బిగించారు’అని అందులో లిఖితపూర్వకంగా ఉంది. అస్మక పరిధిలో తెలంగాణ ఉండటంతో ఇక్కడ గోదావరి రెండుగా చీలిన ప్రాంతంలో జనావాసం ఎక్కడుందా అని నిపుణులు శోధించి.. అది ఖానాపూర్ మండలంలోని బాదన్కుర్తి గ్రామంగా గుర్తించారు. ఆ గ్రామం నది చీలికలో ఉంటుంది. అక్కడ ప్రాథమికంగా తవ్వకాలు జరిపి బౌద్ధ నిర్మాణాలున్నట్లు గుర్తించారు. కానీ వాటిపై ఓ దేవాలయం సహా వేరే నిర్మాణాలు రావటంతో ఏమీ చేయలేకపోయారు. తాజాగా దానికి చేరువలో అతి పురాతన బుద్ధ స్తూపంతోపాటు ఇతర నిర్మాణాలను గుర్తించారు. బుద్ధవనం ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య ఆదేశంతో బుద్ధవనం అధికారి శ్యాంసుందర్, పుణేలోని డెక్కన్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ శ్రీకాంత్, ఔత్సాహిక చరిత్రకారులు జితేంద్రబాబు, శ్రీరామోజు హరగోపాల్ తదితరులు ఇటీవల పర్యటించి వాటిని గుర్తించారు. ►బాదన్కుర్తి గ్రామానికి 7 కిలోమీటర్ల దూరంలో బావాపూర్ సమీపంలో గోదావరి మధ్యలో రెండు చిన్న దీవులున్నాయి. వాటిల్లో దాదాపు 57 ఎకరాల మేర విస్తరించి ఉన్న ఒక దీవిని పరిశీలించగా ఇవి వెలుగు చూశాయి. ►దాదాపు 17 అడుగుల ఎత్తున మట్టి దిబ్బను పరిశీలించగా అది బౌద్ధ స్తూపమని తేలింది. ►3 అంచెలుగా ఈ స్తూపం నిర్మితమైంది. ►ఇందులో దిగువ ఉన్న చివరి అంచె రాతి కట్టడంగా ఉండగా, పై 2 అంచెలు పెద్ద ఇటుకలతో నిర్మితమై ఉన్నాయి. చివరి వరుస వ్యాసం 40 చదరపు అడుగులు ఉంది. ►దీనికి చేరువలో 20 అడుగుల వ్యాసంతో మరో రెండు స్తూపాలున్నాయి. ఇలా ఒకేచోట 3 స్తూపాలుండటం, పెద్ద స్తూపం మూడు అంచెలుగా ఉండటం అరుదని నిపుణులంటున్నారు. గుప్త నిధుల కోసం కొందరు ఆ మూడు స్తూపాల మధ్య తవ్వటంతో అవి కొంతమేర దెబ్బతిన్నాయి. ఎంతగానోఆకట్టుకుంటుంది చాలా పురాతనమైన స్తూపాలుండటం, బుద్ధుడి బోధనలు స్వయంగా విని బౌద్ధాన్ని ప్రచారం చేసిన బావరి నివసించిన ప్రాంతం కావటం, గోదావరి నది మధ్యలో ఉండటంతో ఇది పర్యాటకంగా బాగా అభవృద్ధి చెందే ప్రాంతం. అందుకే అక్కడ వెంటనే తవ్వకాలు జరిపి నిర్మాణాలను వెలుగులోకి తేవాలని హెరిటేజ్ తెలంగాణ శాఖను కోరాం. సమీపంలోనే కడెం రిజర్వాయర్, దట్టమైన అడవి, గోదావరి నది.. పర్యాటక ప్రాంతంగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయంలో ప్రతిపాదనలు రూపొందిస్తాం –మల్లేపల్లి లక్ష్మయ్య, బుద్ధవనం ప్రత్యేకాధికారి -
‘ఏపీ ప్రజలను గాలికొదిలేసి.. తెలంగాణలో ప్రచారం’
సాక్షి, ఉట్నూర్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి గడ్డం గీసుకోకుంటే తెలంగాణ ప్రజలకు ఒరిగేదేమీ లేదని ఆపద్దర్మ మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్లో టీఆర్ఎస్ అభ్యర్థి రేఖా నాయక్ తరఫున ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాశనం చేసిన తెలంగాణను ఇప్పుడిప్పుడే బాగు చేసుకుంటున్నామని చెప్పారు. ఆంధ్ర ప్రజలను గాలికి వదిలేసి తెలంగాణలో చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని వర్గాలకు టీఆర్ఎస్ మేలు చేసిందని తెలిపారు. గతంలో కాంగ్రెస్ 200 రూపాయల పెన్షన్ ఇస్తే.. టీఆర్ఎస్ దేశంలో ఎక్కడా లేని విధంగా 1000 రూపాయలు ఇచ్చిందని పేర్కొన్నారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను ప్రజలకు వివరించారు. 12 లక్షల మంది యువతకు నిరుద్యోగ భృతి ఇవ్వబోతున్నట్టు హామీ ఇచ్చారు. ఒక్క కేసీఆర్ను ఎదుర్కొనేందుకు అన్ని పార్టీలు గుంపులుగా వస్తున్నాయని విమర్శించారు. సంక్రాతికి ముందే గంగిరేద్దులా మహాకూటమి అభ్యర్థులు గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 3400 తాండాలు, గూడేలను గ్రామ పంచాయితీలుగా మార్చిన ఘనత కేసీఆర్దేనని అన్నారు. ఒకప్పుడు ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లాలంటే భయపడేవారని.. కానీ నేడు 35 శాతానికి పైగా ప్రజలు ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఖానాపూర్ నియోజకవర్గాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు. మిగతా పార్టీల బాసులు ఢిల్లీలో, అమరావతిలో ఉంటారని.. తమ బాసులు మాత్రం గల్లీల్లో ఉంటారని వ్యాఖ్యానించారు. కేసీఆర్పై దుష్ప్రచారం చేస్తున్న పార్టీలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
టీఆర్ఎస్ అభ్యర్థి నామినేషన్పై ట్విస్ట్
సాక్షి, నిర్మల్ : జిల్లాలోని ఖానాపూర్ టీఆర్ఎస్ అభ్యర్థి రేఖానాయక్ దాఖలు చేసిన నామినేషన్పై ఉత్కంఠ నెలకొంది. గత బుధవారం ఆమె మూడు సెట్లు నామినేషన్ పత్రాలు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. అయితే మూడు సెట్లలోని ఒక కాలమ్ను ఖాళీగా ఉంచారు. దీంతో రిటర్నింగ్ అధికారి ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఉట్నూరుకు చెందిన రితేష్ రాథోడ్ అనే వ్యక్తి రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేఖానాయక్ నామినేషన్ను తిరస్కరించాలని డిమాండ్ చేస్తున్నాయి. -
టీఆర్ఎస్లో ముసలం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారు తిరుగుబావుటా ఎగరేస్తున్నారు. వరంగల్ తూర్పు టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ టీఆర్ఎస్పై బహిరంగ విమర్శలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో గులాబీ నేత టీఆర్ఎస్పై తిరుగబాటు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ టికెట్ తనకు కేటాయించకపోవడంతో మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ ఇండిపెండెంట్గా బరిలోకి దిగేందుకు సిద్దమైయ్యారు. ఈ మేరకు శనివారం స్థానిక నేతలు, కార్యకర్తలతో సమావేశమైన రాథోడ్.. ఖానాపూర్లో సీఎం కేసీఆర్ పోటీచేసినా.. తాను ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలుస్తానాని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాకుండా తన కొడుకు రితీష్ రాథోడ్ను జోగు రామన్నకు వ్యతిరేకంగా బరిలో నిలుపుతున్నట్లు ఆయన ప్రకటించారు. ఖానాపూర్ టికెట్ ఇస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ మాట ప్రకారమే తాను గతంలో టీఆర్ఎస్లో చేరినట్లు ఆయన తెలిపారు. కాంగ్రెస్లోకి వలసల జోరు మరోవైపు రమేష్ రాథోడ్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్న వార్తలు వస్తున్నాయి. త్వరలో కాంగ్రెస్ నేతలతో చర్చించి.. అసెంబ్లీ స్థానంపై క్లారిటీ తీసుకుని హస్తం గూటికి చేరుతారని సమాచారం. దీనిపై స్పందించిన రాథోడ్ తన అభిమానులతో చర్చించిన అనంతరం తుది నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. మరోవైపు టీఆర్ఎస్ అసంతృప్తులను చేరదీసేందుకు కాంగ్రెస్ రంగంలోని దిగింది. టీఆర్ఎస్పై తిరుగుబాటు ఎగరేసిన కొండా దంపతులను పార్టీలోకి ఆహ్వానించేందుకు కాంగ్రెస్ దూతలను పంపినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు డీఎస్, ఎమ్మెల్సీ భూపతి రెడ్డి త్వరలో హస్తం గూటికి చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. బీజేపీకి చెందిన ఇద్దరు కీలక నేతలు సమరసింహరెడ్డి, నందీశ్వర్ గౌడ్ శనివారం కమళానికి గుడ్బై చెప్పి హస్తంకు చేయందించిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో దగ్గరపడుతున్నకొద్ది మరెంతమంది అసంతృప్త నేతలు కారుదిగుతారోనని టీఆర్ఎస్ శిబిరంలో ఆందోళన మొదలైంది. -
గుప్తనిధుల కోసం తమ్ముడి కొడుకునే...
ఖానాపూర్ : ఆధునిక యుగంలోనూ జనం మూఢనమ్మకాలను వీడడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా కొంతమంది మూఢనమ్మకాలను విశ్వసిస్తూ అనాగరికంగా వ్యవహరిస్తున్నారు. గుప్త నిధుల కోసం మనుషులను బలిచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామపంచాయతీ పరిధిలోని రంగపేట గ్రామంలో సొంత తమ్ముడి కుమారుడినే బలిచ్చే ప్రయత్నం జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆలస్యంగా వెలుగులోకి.. రంగపేట గ్రామానికి చెందిన గోనె లచ్చన్న–లక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. కూలి పనిచేస్తూ జీవనం సాగిస్తున్న వీరికి ఎదురుకాళ్లతో జన్మించిన చిన్న కుమారుడు మహేశ్(13) ఉన్నాడు. లచ్చన సోదరుడు (అన్న) లింగన్న గత పదిహేను రోజుల క్రితం తమ్ముడిని కలిశాడు. ఎదురుకాళ్లతో ఉన్న నీ కుమారుడు మహేశ్ను తమకు ఇస్తే తమకు వచ్చే దాంట్లో నీకు సగం బంగారం ఇస్తానని చెప్పాడు. వచ్చే దాంతో పెద్ద ఇల్లు కట్టుకోవచ్చని ఆశచూపాడు. దీంతో ఆందోళనకు గురైన మహేశ్ తల్లి లక్ష్మి తానేందుకు కుమారున్ని ఇస్తానని వాగ్వాదానికి దిగింది. ఈ ఘటన జరిగి పదిహేను రోజులైంది. ఈ క్రమంలో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తన కుమారుడికి ప్రాణభయం ఉందని శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్సై గోగికారి ప్రసాద్ను వివరణ కోరగా ఫిర్యాదు అందిందని, విచారణ చేస్తున్నామని తెలిపారు. -
రైతు సంక్షేమానికి ప్రభుత్వం కృషి
ఖానాపూర్: ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తుందని గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. పెంబి మండలం మందపల్లి పంచాయతీ పరిధి నాగాపూర్ గ్రామంలో నాల్గో విడత మిషన్ కాకతీయ పథకం కింద రూ.2.50 కోట్లతో మంజూరైన రాగిచెరువు పనులను ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్తో కలిసి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. మిషన్ కాకతీయ పథకానికి దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిందన్నారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్తో పాటు పెట్టుబడి సాయంగా ఎకరాకు రూ.4వేలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. మందపల్లి గ్రామంలోని పల్కేరు వాగు ఎత్తు పెంచడానికి అధికారులు సర్వే చేస్తున్నారన్నారు. సరస్వతి కాలువ, ఉప కాలువలతో పాటు సదర్మాట్ బ్యారేజీ పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. కోర్టు ఆదేశాలతో పంచాయతీ ఎన్నికలు వాయిదా పడ్డాయన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ మంత్రి సహకారంతో నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాగి చెరువు నిధుల మంజూరుకి కృషి చేసిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. అంతకముందు గ్రామస్తులు మంత్రి, ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ జిల్లా చైర్మన్ వెంకట్రామ్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ నల్ల శ్రీనివాస్, పెంబి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పుప్పాల శంకర్, ఎంపీటీసీ పోతురాజుల లచ్చవ్వ, ఎఫ్సీఎస్ చైర్మన్ రాంకిషన్రెడ్డి, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్, నాయకులు గోవింద్, శేఖర్గౌడ్, లక్ష్మీనారాయణ, రాజవ్వ, ఈఈ రమేశ్, డీఈ శరత్బాబు, ఏఈఈ శ్రీనివాస్ తదితరులున్నారు. -
తల్లి, చెల్లిని రోడ్డుపైకి గెంటేసిన సోదరులు
ఖానాపూర్ : వ్యవసాయ భూమికోసం అన్నదమ్ములు మధ్య సఖ్యతలేక కన్న తల్లిని, తోడబుట్టిన చెల్లిని రోడ్డుపై వదిలేసిన సంఘటన ఖానాపూర్ మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని పాత ఎల్లాపూర్ పంచాయతీ పరిధి ఒడ్డెవాడలోని పల్లెపు ఎంకవ్వ, మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కూతుళ్లున్నారు. మల్లయ్య ఎనిమిదేళ్ల క్రితం చనిపోయాడు. ఇద్దరు కూతుళ్లకు వివాహం అయినప్పటికీ ఒక కూతురు నర్సవ్వ తల్లి ఎంకవ్వతోనే ఉంటోంది. పదేళ్లుగా ఎంకవ్వ పెద్ద కొడుకు ఎంకటి, చిన్న కొడుకు జగన్ తల్లీచెల్లి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో వారిద్దరూ కూలీ పనులు చేసుకునే చిన్న కొడుకు ఇంటి వద్ద ఉన్న ఓ గుడిసెలో నివసిస్తున్నారు. కాగా.. గ్రామంలోని చెరువు వద్ద ఆర్ఓఎఫ్ఆర్కు చెందిన సుమారు రెండెకరాల భూమి ఉంది. ఆ భూమి పదేళ్లకుపైగా పెద్ద కుమారుడు ఎంకటి సాగు చేసుకుంటున్నాడు. దీంతో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిలో నుంచి తనకు సగం వాటా ఇవ్వాలని జగన్ అన్నను కోరాడు. దానికి అన్న ససేమిరా అన్నాడు. దీంతో అన్న ఇంటి వద్ద కు పోవాలని ఇంటి నుంచి తల్లీచెల్లిని గెంటివేశా డు. పెద్ద కుమారుడు కూడా తన వద్ద వద్దనడం తో గ్రామంలోని ప్రధాన రహదారి వద్ద గల చెట్టు కిందకు తల్లీచెల్లి చేరారు. పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా వారిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో పోలీసులు శుక్రవారం ఈ ఘటనపై కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి. -
రైతుబంధు చెక్కులు ఇప్పించాలి
ఖానాపూర్ : కడెం మండలం బెల్లాల్ గ్రామానికి చెందిన తమ భూములను టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ నాయకుడి చెర నుంచి కాపాడాలని గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజనులు ఆదివారం ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సంబందిత నాయకుడు ఇదివరకు తమ భూములు పెద్ద సంఖ్యలో కబ్జాకు పాల్పడ్డాడని, సాగులో ఒక్కొక్కరికి ఐదెకరాలకు పైగా ఉన్నప్పటికీ ఒక్కో ఎకరంతో పట్టాలు వచ్చాయని అన్నారు. కబ్జాపోను మిగిలిన ఒక్కో ఎకరం భూమికి ప్రభుత్వం రైతుబంధు ద్వారా చెక్కులు ఇస్తే వాటిని కూడా ఇవ్వకుండా అడ్డుకుంటున్నాడని ఆరోపించారు. గ్రామ శివారులో గల జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మండలం బోర్నపెల్లిలో ఉన్న తమ భూములకు ప్రభుత్వం నుంచి రైతుబంధు ద్వారా వచ్చిన చెక్కులను ఇచ్చేలా చూడాలని ఎమ్మెల్యేకు విన్నవించారు. ఈ విషయమై ఎంతటివారైనా సరే తాను సంబందిత అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో వెడ్మ గంగు, తోడసం గంగు, వెడ్మ లింగు, వెడ్మ దేవేందర్, ఆత్రం గంగు, లింబారావ్, బాదిరావ్, లింగు, మోహన్, జుగాదిరావ్, శ్రీను, జ్యోతిరాం, మారుతి, ఆనంద్, బుచ్చవ్వ, తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన అతివేగం
జన్నారం(ఖానాపూర్) : అతివేగం యువకుని ప్రాణాలు తీసింది. హెల్మెట్ ధరించాలని, మద్యం సేవించి వాహనాలు నడుపవద్దని ఒకపక్క పోలీసులు చెబుతు న్నా పట్టించుకోకుండా మద్యం సేవించి అతివేగంగా వాహనం నడిపి అదుపుతప్పి కల్వర్టుకు ఢీకొని బీటెక్ విద్యార్థి దుర్మరణం పాలైన సంఘటన ఉట్నూర్ మండలంలోని కన్నెపల్లిలో చోటు చేసుకుంది. ఉట్నూర్ మండలం కన్నెపల్లికి చెందిన తొడసం నాగరాజు(19) తన స్నేహితులైన ఇంద్రవెల్లికి చెందిన మె స్రం మారుతి, గొడిసర్యాలకు చెందిన జుగునక మ హేశ్లతో కలిసి శుక్రవారం ద్విచక్ర వాహనంపై ఉ ట్నూర్ నుంచి జన్నారం మండలం ధర్మారం బయలు దేరారు. మార్గమధ్యలో ఇందన్పల్లి వద్ద మద్యం సేవించి జన్నారం మీదుగా ధర్మారం వెళ్లి స్నేహితున్ని కలిసి తిరుగు ప్రయాణంలో వస్తుండగా ధర్మారం, జన్నారం గ్రామాల మధ్యన ఉన్న కల్వర్టును ఢీకొట్టా డు. దీంతో బైక్ నడుపుతున్న నాగరాజుకు తీవ్రగాయాలై సంఘటనాస్థలంలోనే మృతి చెందగా అతని స్నేహితులిద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. బీటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న నాగరాజు తండ్రి నాలుగేళ్ల క్రితమే మృతి చెందగా ప్రస్తుతం తల్లి ఉన్నా రు. పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని స్వల్పగాయాలైన ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అతివేగమే ప్రమాదానికి కారణమని ఎస్సై తహసినొద్దీన్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్సెట్టిపేట్కు ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
ప్రాణం తీసిన ప్రేమ వ్యవహారం
కడెం(ఖానాపూర్): మండలంలోని కొండుకూరు గ్రామానికి చెందిన మద్ది శ్రావణ్(24) గురువారం పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఎస్సై అజయ్బాబు తెలిపిన వివరాలివీ..శ్రావణ్ మండలంలోని పాండ్వాపూర్ గ్రామానికి చెందిన అమ్మాయిని ప్రేమించాడు. కాని మరో అమ్మాయితో నిశ్చితార్థం చేసుకోవడంతో ప్రేమించిన అమ్మాయి గురువారం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి చెందిన యువకుడు మద్దిపడగ గ్రామసమీపంలోని అటవీ ప్రాంతంలో పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుంటుంబీకులు అపస్మారక స్థితిలో ఉన్న యువకున్ని 108లో ఖానాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి తల్లి పోశవ్వ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
కరెంట్ షాక్తో మాజీ సర్పంచ్ మృతి
సాక్షి, రాయపర్తి : వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలం కొండూరు గ్రామంలో పొలం పనులకు వెళ్లిన నాగపూరి వెంకటేశ్వర్లు అనే మాజీ సర్పంచ్ విద్యుదాఘాతంతో మృతిచెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వర్లు తన పొలానికి నీళ్లు కట్టెందుకు వెళ్లాడు. నెలపై తెగిపడిన విద్యుత్ తీగని గమనించకుండా తొక్కడంతో కరెంట్ షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన కుటుంబసభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. -
ముగ్గురు గురుకుల విద్యార్థునుల అదృశ్యం
ఖానాపూర్(నిర్మల్ జిల్లా): ఖానాపూర్ మండలకేంద్రంలోని గురుకుల పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్దినులు మంగళవారం అదృశ్యమయ్యారు. గురుకుల పాఠశాల హాస్టల్ గది కిటీకీ నుంచి దూకి పారిపోయారు. పారిపోయిన విద్యార్థునులు ఆశ్రియ, మైత్రి, సహస్రికలుగా గుర్తించారు. వీరంతా ఆరో తరగతి చదువుతున్నారు. హాస్టల్ నుంచి పారిపోయిన వారు ఇంటికి కూడా వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు, పాఠశాల ముందు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పదోన్నతులు వెంటనే చేపట్టాలి
► ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న జన్నారం(ఖానాపూర్): ఉమ్మడి సర్వీసు రూల్స్కు రాష్ట్రపతి ఆమోద ముద్రవేయడంతో ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులకు మార్గం సుగమం అయిందని ఎస్సీ, ఎస్టీ ఉఫాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాడి రాజన్న అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఎంఈవో, డిప్యూటీఈవో, డైట్, బీఈడీ, జూనియర్ లెక్చరర్ పోస్టులను, పదోన్నతులు చేపట్టాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో అమలవుతున్న మూల్యంకన విధానాన్ని తనిఖీకి శాశ్వత ప్రతిపాదినక అకాడమిక్ మానిటరింగ్ బృందాలు ఏర్పాటు చేయాలని కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి రాజలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి బుక్య రాజన్న, జిల్లా కార్యదర్శి రమేశ్, మండల అధ్యక్షుడు తుంగూరి గోపాల్, ప్రధాన కార్యదర్శి సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రిడ్జి నిర్మాణంతో రాకపోకలు
► నాడు పడవ ప్రయాణం.. ► గతంలో కాలినడక,ఎడ్లబండ్లే దిక్కు ► బలోపేతమవుతున్న ఇరు జిల్లాల ప్రజా సంబంధాలు ఖానాపూర్: నాడు పడవ ప్రయాణం.. ప్రస్తుతం బస్సు ద్వారా రాకపోకలు. ఖానాపూర్ మండలంలోని బాదన్కూర్తిలో 2009లో బ్రిడ్జి నిర్మా ణం చేపట్టి పూర్తవడంతో ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. బాదన్కూర్తి గ్రామం మీదుగా అంతర్జిల్లా రోడ్డు మార్గం ఉంది. ఈ రోడ్డుతో రెండు జిల్లాల (నిర్మల్, జగిత్యాల) ప్రయాణికులకు రవాణా సౌకర్యం ఉంది. ఎక్కడైన వెళ్లాలంటే రోడ్డు మార్గాన ద్వారా వెళ్తున్నారు. దీం తో ఇరు జిల్లాల ప్రజాసంబంధాలు మెరుగుపడుతున్నాయి. గతంలో కాలినడకన, ఎడ్లబండ్ల ద్వారా వెళ్లేవారు. 8 ఏళ్ల క్రితం బ్రిడ్జి నిర్మాణం పూర్తవడంతో ఇరువైపులా బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మండలంలోని మస్కాపూర్, సుర్జాపూర్, బాదన్కూర్తి గ్రామాల మీదుగా జగిత్యాల జిల్లాలోని మల్లాపూర్ మండలం ఒగులాపూర్కు చేరుకోవచ్చు. అక్కడి నుంచి గతంలో ఉన్న ప్రధాన రోడ్డు ద్వారా మెట్పల్లి, కోరుట్ల, జగిత్యాల, కరీంనగర్ ప్రాంతాలకు వెళ్లవచ్చు. బ్రిడ్జి నిర్మాణం పూర్తయిన నాటి నుంచి ఆయా గ్రామాల నుంచి ప్రతిరోజు బస్సులు వచ్చి వెళ్తున్నాయి. రెండు వైపులా జిల్లా సరిç ßæద్దు గ్రామాలు కావడంతో బంధుత్వాలు రెండు జిల్లాలో ఉన్నాయి. మండల కేంద్రం నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మల్ కంటే దగ్గరగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్పల్లి ప్రాంతానికి ఇటీవలకాలం అత్యధికంగా ఇక్కడి ప్రజలు ప్రయాణిస్తున్నారు. పెరుగుతున్న వ్యాపార లావాదేవీలు ఇరు జిల్లాలోని రైతులకు తమ వ్యవసాయ ఉత్పత్తులు అమ్ముకోవడానికి అటువైపు, ఇటువైపు మంచి మార్కెట్ కేంద్రాలు ఉన్నాయి. మెట్ పల్లి మార్కెట్కు చెందిన వ్యాపారులకు గతకొద్ది రోజులుగా ఖానాపూర్ మార్కెట్ యార్డులో పసుపు కొనుగోళ్లు చేపట్టారు. ఆయా గ్రామాల్లో వ్యవసాయ మార్కెట్తోపాటు మంచి మార్కెట్ సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం సైతం గతంలో రైతుల తమ పంట ఉత్పత్తులను ఎక్కడ గిట్టుబాటు ధరలు ఉంటే అక్క డ అమ్ముకోవచ్చని ఉన్న ఆంక్షలు ఎత్తేయడంతో గిట్టుబాటు ధర ఉన్న చోట అమ్ముకుంటున్నారు. అదేవిధంగా మండల కేంద్రం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న మెట్పల్లికి వెళ్లి, ఆసుపత్రుల్లో చికిత్సలు సైతం చేయించుకుం టారు. ఖానాపూర్లో జరిగే వారసంతలో కూరగాయలు, బట్టలు మసాలా దినుసులను ఇతర వ్యాపార లావాదేవీలకు కోసం సమీప మండలాల్లోని వ్యాపారులు, ప్రజలు అధికసంఖ్యలో వచ్చి అమ్మకాలు, కొనుగోలు చేపడతారు. ప్రç Ü్తుతం ఆయా జిల్లాలకు చెందిన డిపోల నుంచి సైతం ప్రతిరోజు బస్సులు నడుస్తున్నాయి. నాడు అష్టకష్టాలు.. నేడు రాచమార్గం గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని గ్రామాలకు వెళ్లాలంటేనే ఎడ్లబండ్ల ద్వారా, కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితి. రవాణా మార్గం కావడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇరుజిల్లాల సరిహద్దు గ్రామాల్లో పిల్లలకు పెళ్లిల్లు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నాయి. దాంతో ఇరు జిల్లాల్లో బంధుత్వాలు ఎక్కువై ప్రజా సంబంధాలు బలపడుతున్నాయి. రవాణా సౌకర్యం మెరుగైన క్రమంలో మరిన్ని బస్సు ట్రిప్పులు ఆయా గ్రామాలకు పెంచాలని ప్రజలు కోరుతున్నారు. -
ఖానాపూర్లో కార్డెన్ సెర్చ్
నిర్మల్: నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్లో బుధవారం ఉదయం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు లేని 53 ద్విచక్రవాహనాలు, 3 ఆటోలు, ఓ ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో పాటు లక్ష రూపాయల విలువైన కలప, పెద్ద ఎత్తున గుట్కా ప్యాకెట్లు, 20 లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నారు. -
దహన సంస్కారాలకు వెళ్లి వస్తూ..
► ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ ► ఇద్దరు మృతి ఖానాపురం: బంధువు మృతి చెందగా దహన సంస్కారాల కు వెళ్లిన ఇద్దరు వ్యక్తులు తిరుగు ప్రయాణంలో జరి గిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ సంఘ టన శుక్రవారం వరంగల్ రూరల్ జిల్లా ఖానపురం మండలం బుధరావుపేటలో చోటుచేసుకుంది. బం« దువుల కథనం ప్రకారం.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామ పంచాయతీ పరిధిలోని కొర్రతండా(రామన్నగూడెం)కు చెందిప బానోతు వీరన్న(40), వరంగల్ రూరల్ జిల్లా గీసుగొండ మండలం కొమ్మాలతండాకు చెందిన అజ్మీరా రాజు(35)లు తమ సమీప బంధువు అయిన ఖా నాపురం మండలంలోని మంగళవారిపేట గ్రామపంచాయతీ పరిధిలోని భద్రుతండాకు చెందిన బానోతు ఈర్య గురువారం మృతి చెందడంతో మృతుడి దహ న సంస్కారాల నిమిత్తం శుక్రవారం వీరన్న, రాజు వేర్వేగా భద్రుతండాకు వచ్చారు. దహన సంస్కారా లు పూర్తి అయిన అనంతరం ఇంటికి వెళ్లే క్రమంలో బానోతు వీరన్న తన ద్విచక్ర వాహనంపై అజ్మీరా రా జుతో కలసి నర్సంపేట వైపునకు వస్తున్నాడు. బుధరావుపేట గ్రామం దాటిన తర్వాత సంగెం కాల్వ స మీపంలో రాగానే ఎదురుగా అతివేగంతో వచ్చిన ఓ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో బానోతు వీరన్న, అజ్మీరా రాజులు అక్కడికక్కడే మృ తి చెందారు. విషయం తెలుసుకున్న మృతుల కు టుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకోని బోరున విలపించారు. ప్రమాదానికి కారణ మైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళనకు దిగారు. దీంతో రూరల్ సీఐ బోనాల కిషన్, ఎస్సై దుడ్డెల గురుస్వామి ఆందోళనకారులతో మాట్లాడి పరి స్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. మృ తుడు బానోతు వీరన్నకు భార్య యాదమ్మ, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. అజ్మీరా రాజుకు భార్య రజిత, ముగ్గురు కుమారులు ఉన్నారు.