టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌పై ట్విస్ట్‌ | Twist For TRS Candidate Rekha Nayak Nomination | Sakshi
Sakshi News home page

Published Tue, Nov 20 2018 1:27 PM | Last Updated on Tue, Nov 20 2018 8:53 PM

Twist For TRS Candidate Rekha Nayak Nomination - Sakshi

సాక్షి, నిర్మల్‌ : జిల్లాలోని ఖానాపూర్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రేఖానాయక్‌ దాఖలు చేసిన నామినేషన్‌పై ఉత్కంఠ నెలకొంది. గత బుధవారం ఆమె మూడు సెట్లు నామినేషన్‌ పత్రాలు రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. అయితే మూడు సెట్లలోని ఒక కాలమ్‌ను ఖాళీగా ఉంచారు.  దీంతో రిటర్నింగ్‌ అధికారి ఈ విషయాన్ని కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై జిల్లా కలెక్టర్‌ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. ఉట్నూరుకు చెందిన రితేష్‌ రాథోడ్‌ అనే వ్యక్తి రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక ప్రతిపక్షాలు మాత్రం నిబంధనలకు విరుద్ధంగా ఉన్న రేఖానాయక్‌ నామినేషన్‌ను తిరస్కరించాలని డిమాండ్‌ చేస్తున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement