-
"చెల్లీ.. మళ్లీ నేను ఆడుతున్నానంటే కారణం నీవే"..
టీమిండియా పేసర్, ఆర్సీబీ స్టార్ పేసర్ హర్షల్ పటేల్ సోదరి మరణించిన సంగతి తెలిసిందే. దీంతో హర్షల్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్తో మ్యాచ్కు ముందు బయోబబుల్ వీడి సోదరి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు. అయితే ఒక్క రోజులో తిరిగి మళ్లీ ఆర్సీబీ జట్టులో చేరి హర్షల్ పటేల్ అందరిని ఆశ్చర్యపరిచాడు. తాజాగా తన చెల్లెలను ఉద్దేశించి ఓ ఎమోషనల్ నోట్ను ఇన్స్టాగ్రామ్ వేదికగా హర్షల్ పటేల్ షేర్ చేశాడు. "మా జీవితాల్లో అత్యంత విలువైన వ్యక్తివి నీవు. నీవు లేని లోటు ఎప్పటికీ తీర్చలేనిది. తుది శ్వాస విడిచే వరకూ నీ ముఖం మీద చిరు నవ్వు పోనివ్వలేదు. నీ జీవితంలో ఎన్నో కష్టాలను ఎదర్కొన్నావు. నేను నీతో హాస్పిటల్లో ఉన్నప్పుడు నా ఆటపై దృష్టి పెట్టమని.. తిరిగి ఇండియాకు పంపించేశావు. ఆ మాటల వల్లనే నేను వచ్చి మళ్లీ ఆడగాలిగాను. నీ మాటలను గౌరవిస్తూ, నిన్ను ఎప్పుడూ తలుచుకుంటూ ఉంటానని చెప్పడానికి నేను చేయగలిగింది ఇదే. నేను చేసే ప్రతీ పని నీవు గర్వపడేలా చేస్తాను. నా జీవితంలోని ప్రతీ క్షణం నిన్ను మిస్ అవుతున్నా. అవి మంచివైనా చెడ్డవైనా. ఐ లవ్ యూ సో మచ్... రెస్ట్ ఇన్ పీస్ జదీ’" అంటూ హర్షల్ పటేల్ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. చదవండి: IPL 2022 CSK Vs GT: "వెల్కమ్ బ్యాక్ రుత్రాజ్.. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడావు" -
IPL 2022: ధర 30 లక్షలు.. ఇంతకీ సూయశ్ ఎవరు?
ఐపీఎల్ అరంగేట్రంలోనే అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు రాయల్ చెలెంజర్స్ యువ ఆటగాడు సూయశ్ ప్రభుదేశాయి. చెన్నై సూపర్కింగ్స్ సీనియర్ ప్లేయర్ మొయిన్ అలీ రనౌట్లో కీలక పాత్ర పోషించిన సూయశ్.. బ్యాట్తోనూ ఆకట్టుకున్నాడు. మొత్తంగా 18 బంతులు ఎదుర్కొన్న అతడు 34 పరుగులు(5 ఫోర్లు, ఒక సిక్సర్) ఆగమనంలోనే తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా సీఎస్కేతో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మ్యాచ్ ద్వారా సూయశ్ రూపంలో మరో కొత్త టాలెంట్ మాత్రం వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలో అతడి గురించి ఆసక్తికర అంశాలు! దేశవాళీ టోర్నీల్లో సత్తా చాటిన సూయశ్ ►సూయశ్ 1997 డిసెంబరు 6న జన్మించాడు. ►గోవా తరఫున దేశవాళీ టోర్నీల్లో ఆడుతున్న కుడిచేతి వాటం గల ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ 2016లో లిస్ట్ ఏ క్రికెట్లో అడుగుపెట్టాడు. ►2016-17 సీజన్లో బెంగాల్తో మ్యాచ్తో విజయ్ హజారే ట్రోఫీ వన్డే టోర్నీతో అరంగేట్రం చేశాడు. ►2018-19 రంజీ ట్రోఫీలో భాగంగా హర్యానాతో మ్యాచ్లో ఫస్ట్క్లాస్ క్రికెట్లోకి సూయశ్ ఎంట్రీ ఇచ్చాడు. ►ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఒక సెంచరీ, 8 అర్ధ శతకాలు సాధించడంతో పాటుగా ఇప్పటి వరకు ఎనిమిది వికెట్లు తీశాడు ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్. టీ20 ఫార్మాట్లోనూ.. ►సూయశ్ 2018-9 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా సిక్కింతో మ్యాచ్లో తొలిసారిగా టీ20 ఫార్మాట్లో అడుగుపెట్టాడు. ►రాజస్తాన్తో మ్యాచ్లో 23 బంతుల్లో 35 పరుగులు సాధించి గోవాను గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. తద్వారా క్రికెట్ ప్రేమికుల దృష్టిని ఆకర్షించాడు సూయశ్. ►అదే విధంగా మధ్యప్రదేశ్తో మ్యాచ్లో 200 స్ట్రైకు రేటుతో 48 పరుగులు సాధించి అజేయంగా నిలిచి సత్తా చాటాడు. ►అంతేగాక తమిళనాడుపై గోవా విజయంలో కీలక పాత్ర పోషించి వార్తల్లో నిలిచాడు. ►దేశీ టీ20 ఫార్మాట్లో ఇప్పటి వరకు 20 ఇన్నింగ్స్ ఆడిన సూయశ్ 443 పరుగులు సాధించాడు. గోవా తరఫున నాలుగో ఆటగాడు.. ►ఈ క్రమంలో ఐపీఎల్ ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షించిన సూయశ్ ఐపీఎల్ మెగా వేలం-2022లోకి రాగా ఆర్సీబీ 30 లక్షలు వెచ్చించి అతడిని కొనుగోలు చేసింది. సీఎస్కేతో మ్యాచ్లో హర్షల్ పటేల్ దూరమైన నేపథ్యంలో సూయశ్ ఆర్సీబీ తరఫున ఐపీఎల్లో ఎంట్రీ ఇచ్చాడు. ►గోవా తరఫున ఐపీఎల్లో ఆడుతున్న నాలుగో ఆటగాడు సూయశ్. అతడి కంటే ముందు స్వప్నిల్ అసోంద్కర్(రాజస్తాన్ రాయల్స్), షాదాబ్ జకాటి(సీఎస్కే, ఆర్సీబీ, గుజరాత్ లయన్స్), సౌరభ్ బండేద్కర్(ఆర్సీబీ) క్యాష్ రిచ్లో ఎంట్రీ ఇచ్చారు. చదవండి: IPL 2022 CSK Vs RCB: సోదరి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం! #CSKvRCB: Post Match Chat We win some. We fight hard, but still lose some. Mike Hesson talks about the positives from today’s match, & we also caught up with the impressive debutant Suyash Prabhudessai. Here are some post match visuals on Game Day.#PlayBold #IPL2022 #RCB pic.twitter.com/ECIqOqIaTk — Royal Challengers Bangalore (@RCBTweets) April 13, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4141448520.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
చెల్లెలి మరణం.. జట్టుకు దూరం.. అతడి సేవలను మిస్సవుతున్నాం!
IPL 2022 CSK vs RCB: చెన్నై సూపర్కింగ్స్తో మ్యాచ్లో తమ స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ లేని లోటు స్పష్టంగా కనిపించిందని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ అన్నాడు. తానుంటే జట్టుకు బలమని, మ్యాచ్ స్వరూపాన్ని ఒంటిచేత్తో మార్చేయగల సత్తా అతడిని సొంతమని పేర్కొన్నాడు. త్వరలోనే అతడు జట్టులోకి తిరిగి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా ఐపీఎల్-2022లో భాగంగా చెన్నైతో జరిగిన మ్యాచ్లో బెంగళూరు 23 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించిన శివమ్ దూబే, రాబిన్ ఊతప్ప తమ అద్భుత ప్రదర్శనతో సీఎస్కేకు ఈ సీజన్లో మొదటి విజయం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. కాగా గత సీజన్లో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ ఈసారి కూడా తమ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. PC: IPL అయితే, వ్యక్తిగత కారణాల దృష్ట్యా అతడు ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. తన చెల్లెలు మరణం నేపథ్యంలో హర్షల్ పటేల్ బయోబబుల్ను వీడి ఇంటికి వెళ్లాడు. కాగా గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న హర్షల్ సోదరి ఏప్రిల్ 9న తుదిశ్వాస విడిచినట్లు సమాచారం. ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే ఆమె చనిపోయినట్లు జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమ సహచర ఆటగాడికి కష్టకాలంలోనూ అండగా ఉంటామన్న సందేశం ఇచ్చే క్రమంలో.. ఆర్సీబీ క్రికెటర్లు సీఎస్కేతో మ్యాచ్ సమయంలో నల్లటి బ్యాండ్లు ధరించి సోదరభావాన్ని చాటుకున్నారు. హర్షల్ పటేల్ సోదరి మరణం నేపథ్యంలో చేతులకు బ్యాండ్లు ధరించి మైదానంలో దిగారు. సీఎస్కే వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ స్కోర్లు: చెన్నై: 216/4 (20) బెంగళూరు: 193/9 (20) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: శివమ్ దూబే చదవండి: IPL 2022 CSK Vs RCB: కెప్టెన్గా తొలి గెలుపు.. ఈ విజయం నా భార్యకు అంకితం: జడేజా var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
IPL 2022: బయో బబుల్ను వీడిన ఆర్సీబీ స్టార్ బౌలర్!
IPL 2022: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ బౌలర్ హర్షల్ పటేల్ బయో బబుల్ను వీడినట్లు తెలుస్తోంది. అతడి కుటుంబంలో విషాదం చోటు చేసుకున్న క్రమంలో ఇంటికి వెళ్లినట్లు సమాచారం. ముంబై ఇండియన్స్తో మ్యాచ్ ముగిసిన అనంతరం హర్షల్కు ఈ విషయం గురించి తెలిసినట్లు ఐపీఎల్ వర్గాలు జాతీయ మీడియాకు వెల్లడించాయి. కాగా ఆర్సీబీ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ హర్షల్ పటేల్... స్టార్ బౌలర్గా ఎదిగాడు. గత సీజన్లో 15 ఇన్నింగ్స్ ఆడిన అతడు అత్యధికంగా 32 వికెట్లు పడగొట్టి పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. అయితే, హర్షల్ను రిటైన్ చేసుకోని బెంగళూరు.. వేలంలో ఇతర జట్లతో పోటీ మరీ అతడిని సొంతం చేసుకుంది. 10.75 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కొనుగోలు చేసింది. అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తున్న హర్షల్ ఐపీఎల్-2022లో ఇప్పటి వరకు ఆడిన నాలుగు మ్యాచ్లలో కలిపి 6 వికెట్లు పడగొట్టాడు. ఇక ముంబైతో శనివారం నాటి మ్యాచ్లో 4 ఓవర్లు బౌలింగ్ చేసిన హర్షల్ కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీశాడు. కాగా హర్షల్ కుటుంబానికి చెందిన వ్యక్తి ఒకరు మరణించినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న హర్షల్ మ్యాచ్ ముగిసిన వెంటనే కుటుంబాన్ని కలవడానికి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ మేరకు.. ‘‘దురదృష్టవశాత్తూ హర్షల్ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. అందుకే అతడు బయో బబుల్ను వీడాల్సి వచ్చింది. అయితే, చెన్నై సూపర్కింగ్స్తో ఏప్రిల్ 12 నాటి మ్యాచ్ కంటే ముందే అతడు జట్టుతో చేరే అవకాశం ఉంది’’ అని ఐపీఎల్ వర్గాలు చెప్పినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. చదవండి: IPL 2022: అతడు భవిష్యత్ ఆశా కిరణం: డుప్లెసిస్ ప్రశంసలు var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4031445617.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
కోహ్లి స్టన్నింగ్ క్యాచ్.. వీడియో వైరల్
ఐపీఎల్ 2022లో భాగంగా రాజస్తాన్ రాయల్స్తో మ్యాచ్లో ఆర్సీబీ స్టార్ ఆటగాడు కోహ్లి స్టన్నింగ్ క్యాచ్తో మెరిశాడు. ఇన్నింగ్స్ 10వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే పడిక్కల్ 38 పరుగులతో మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. ఈ నేపథ్యంలో ఓవర్ ఆఖరి బంతిని పడిక్కల్ లాంగాన్ దిశగా భారీ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. బ్యాట్ ఎడ్జ్కు తగలడంతో సరిగ్గా కనెక్ట్ కాలేదు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న కోహ్లి వెనక్కి పరిగెట్టి విల్లులా తిరిగి రెండు చేతులతో స్టన్నింగ్ క్యాచ్ అందుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. కోహ్లి స్టన్నింగ్ క్యాచ్ కోసం క్లిక్ చేయండి -
ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా హర్షల్ పటేల్
ఐపీఎల్లో ఆర్సీబీ బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఫీట్ సాధించాడు. ఐపీఎల్ చరిత్రలో వరుసగా రెండు మెయిడెన్ ఓవర్లు వేసిన రెండో బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్తో మ్యాచ్లో హర్షల్ ఈ ఫీట్ అందుకున్నాడు. ఇంతకముందు ఆర్సీబీకే చెందిన మహ్మద్ సిరాజ్ అదే కేకేఆర్పై ఐపీఎల్ 2020లో తన వరుస రెండు ఓవర్లను మెయిడెన్ వేసి తొలి బౌలర్గా ఉన్నాడు. ఇక 12వ ఓవర్లో బౌలింగ్కు వచ్చిన హర్షల్ ఆ ఓవర్ను మెయిడెన్ వేశాడు. అంతేకాదు తన తొలి ఓవర్లోనే సామ్ బిల్లింగ్స్ను ఔట్ చేశాడు. ఆ తర్వాత రెండో ఓవర్ను కూడా మెయిడెన్ వేసిన హర్షల్ ఈసారి రసెల్ రూపంలో రెండో వికెట్ తీసుకున్నాడు. మొత్తంగా రెండు ఓవర్లు ముగిసేసరికి హర్షల్ స్పెల్ 2-2-0-2గా ఉంది. ఏ క్రికెటర్కైనా ఇది బెస్ట్ స్పెల్ అని చెప్పొచ్చు. ఆ తర్వాత మూడో ఓవర్నూ దాదాపు అదే రీతిలో బౌల్ చేసిన హర్షల్.. ఓవరాల్గా తన కోటా బౌలింగ్ను (4-2-11-2)తో ముగించాడు. చదవండి: IPL 2022: క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది పవర్ ప్లేను కూడా వదలని ఎస్ఆర్హెచ్.. ఇంకెన్ని చూడాలో! -
క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది
ఐపీఎల్ 2022లో భాగంగా కేకేఆర్,ఆర్సీబీ మధ్య మ్యాచ్లో ఒక ఆసక్తికర ఘటన జరిగింది. కేకేఆర్ ఇన్నింగ్స్ 16వ ఓవర్ హర్షల్ పటేల్ వేశాడు. అప్పటికే హర్షల్ పటేల్ 2 ఓవర్లు వేసి 2 మెయిడెన్లు సహా 2 వికెట్లు తీసి ఫుల్ స్వింగ్లో ఉన్నాడు. ఈ నేపథ్యంలో క్రీజులో ఉన్న వరుణ్ చక్రవర్తికి హర్షల్ 16వ ఓవర్లో ఆఖరి బంతిని ఫుల్టాస్గా వేశాడు. ఆ బంతి బ్యాట్కు తగిలి వన్ స్టప్ అయి కీపర్ చేతుల్లోకి వెళ్లింది. అది క్లియర్గా ఔట్ కాదని తెలిసినప్పటికి.. బంతి వరుణ్ చక్రవర్తి బూట్లకు తగిలి బ్యాట్కు తగిలిందేమోనని హర్షల్ పటేల్ అంపైర్కు అప్పీల్ చేశాడు. అంపైర్ నాటౌట్ ఇచ్చాడు. ఇంతటితో ఊరుకుంటే అయిపోయేది.. కానీ హర్షల్ పటేల్ కెప్టెన్ డుప్లెసిస్వైపు చూడడం.. అతను రివ్యూ తీసుకోవడం జరిగిపోయింది. ఇక రిప్లేలో బంతి ఎక్కడా కనీసం బ్యాట్స్మన్ బూట్లకు తగిలినట్లుగా కూడా కనిపించలేదు. అంతేకాదు బంతి బ్యాట్ మిడిల్లో తగిలినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ''డుప్లెసిస్ తీసుకున్న రివ్యూ.. క్రికెట్ చరిత్రలో అత్యంత చెత్త రివ్యూగా మిగిలిపోనుంది.. బౌలర్ కంటే తెలియకపోవచ్చు.. కెప్టెన్గా అనుభవం ఉన్న నీకు ఆ రివ్యూ ఎలా తీసుకోవాలనిపించింది డుప్లీ..'' అంటూ క్రికెట్ ఫ్యాన్స్ కామెంట్ చేశారు. చదవండి: Ravi Shastri: ఉమ్రాన్ మాలిక్పై టీమిండియా మాజీ కోచ్ ప్రశంసల వర్షం IPL 2022: కేకేఆర్కు ఆ జట్టు మాజీ ప్లేయర్ వార్నింగ్.. తేడా వస్తే -
'వేలంలో ఏకంగా 10.75 కోట్లు.. అతడు ఒక అద్భుతమైన బౌలర్'
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ను దక్కించకోవడానికి చాలా ప్రాంఛైజీలు పోటీ పడ్డాయి. చివరకి ఆర్సీబీ రూ. 10.75 కోట్ల భారీ ధరకు హర్షల్ పటేల్ను కొనుగోలు చేసింది. ఈ నేపథ్యంలో హర్షల్ పటేల్పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించాడు. మెగా వేలంలో హర్షల్ పటేల్ తగిన ధర దక్కిందని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ఇక వెస్టిండీస్తో జరిగిన తొలి టీ20లో రెండు వికెట్లు పడగొట్టి భారత విజయంలో హర్షల్ పటేల్ తన వంతు పాత్ర పోషించాడు. "వేలంలో దక్కిన ప్రతీ పైసా, ప్రతీ రూపాయికి హర్షల్ పటేల్ అర్హుడు. గత ఏడాది సీజన్లో హర్షల్ అద్భుతమైన ప్రదర్శన చేశాడు. అంతకుముందు అతడి బౌలింగ్ పేస్లో ఏటువంటి మార్పు లేకపోవడంతో బ్యాటర్లు ఈజీగా ఎదుర్కొనేవారు. కానీ అతడు ఇప్పుడు తనను తాను రూపు దిద్దు కున్నాడు. ప్రస్తుతం అద్భుతమైన పేస్తో హర్షల్ పటేల్ బౌలింగ్ చేస్తున్నాడు. తన పేస్లో మార్పులతో బ్యాటర్లను అతడు ఇబ్బంది పెడుతున్నాడు. అదే విధంగా అఖరి ఓవర్లలో అతడు స్లో బౌన్సర్లు, యార్కర్లు బౌలింగ్ చేయగలడు" అని గవాస్కర్ పేర్కొన్నాడు. చదవండి: IPL 2022: ఆర్సీబీ కెప్టెన్గా దక్షిణాఫ్రికా స్టార్ ఆటగాడు.. వేలంలో 7కోట్లు! -
మెగావేలంలో టాప్ లేపిన భారత కుర్రాళ్లు
IPL 2022 Auction: ఐపీఎల్ మెగావేలం 2022లో ఊహించనట్లుగానే టీమిండియా యువ ఆటగాళ్లు సత్తా చాటారు. అంచనాలకు మించి ఈ ఆటగాళ్లు మంచి ధరను సొంతం చేసుకున్నారు. నితీష్ రాణా, హర్షల్ పటేల్, ఆల్రౌండర్ దీపక్ హుడా, దేవదూత్ పడిక్కల్ ఈ జాబితాలో ఉన్నారు. హర్షల్ పటేల్: గత సీజన్లో అంచనాలకు మించి రాణించిన హర్షల్ పటేల్కు జాక్పాట్ తగిలింది. 32 వికెట్లతో పర్పుల్క్యాప్ అందుకున్న హర్షల్ను మరోసారి ఆర్సీబీ దక్కించుకుంది. రూ. 2 కోట్ల కనీస ధరతో బరిలోకి దిగిన హర్షల్ను రూ. 10.75 కోట్లకు ఆర్సీబీ మరోసారి దక్కించుకుంది. నవంబర్ 2021లో న్యూజిలాండ్తో జరిగిన టి20 సిరీస్ ద్వారా టీమిండియా తరపున హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. ఆడిన తొలి మ్యాచ్లోనే రెండు వికెట్లు తీసిన హర్షల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. దేవదూత్ పడిక్కల్: టీమిండియా అన్క్యాప్డ్ ప్లేయర్ దేవదూత్ పడిక్కల్ దశ తిరిగింది. ఐపీఎల్ 2020, 2021 సీజన్లలో ఆర్సీబీ తరపున దేవదూత్ పడిక్కల్ దుమ్మురేపాడు. ఐపీఎల్ 2020 సీజన్లో 473 పరుగులతో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది అవార్డు గెలుచుకున్న పడిక్కల్.. మరుసటి ఏడాది ఐపీఎల్ సీజన్లోనూ అదే జోరు చూపెట్టాడు. 411 పరుగులు చేసిన పడిక్కల్ సీజన్లో వేగవంతమైన సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. 51 బంతుల్లోనే సెంచరీ మార్క్ సాధించి ఔరా అనిపించాడు.తాజాగా ఐపీఎల్ మెగావేలంలో ఆర్సీబీ అతని కోసం పోటీపడినప్పటికి చివరికి రాజస్తాన్ రాయల్స్ రూ. 7.75 కోట్లకు దక్కించుకుంది. నితీష్ రాణా: గత సీజన్లో కేకేఆర్ తరపున నితీష్ రాణా మంచి ప్రదర్శన కనబరిచాడు. దీంతో అతనిపై నమ్మకముంచిన కేకేఆర్ నితీష్ రాణాను రూ. 8 కోట్లతో దక్కించుకుంది. కాగా గత సీజన్లో కేకేఆర్ తరపున 17 మ్యాచ్ల్లో 383 పరుగులు చేసిన నితీష్ ఖాతాలో రెండు అర్థసెంచరీలు ఉన్నాయి. కాగా 2015లో తొలిసారి ఐపీఎల్లో అరంగేట్రం చేసిన నితీష్ రానా ముంబై ఇండియన్స్కు ప్రాతినిధ్యం వహించాడు. తొలి సీజన్లో ఒక్క మ్యాచ్ ఆడని నితీష్.. ఆ తర్వాతి సీజన్లో 4 మ్యాచ్ల్లో 104 పరుగులు చేశాడు. 2017 సీజన్లో 13 మ్యాచ్ల్లో 333 పరుగులతో ఆకట్టుకున్న నితీష్ను ముంబై రిలీజ్ చేయగా.. 2018 వేలంలో అతన్ని కేకేఆర్ దక్కించుకుంది. అప్పటినుంచి నితీష్ రాణా కేకేఆర్ రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయాడు. దీపక్హుడా: టీమిండియా ఆల్రౌండర్ దీపక్ హుడాను రూ. 5.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ దక్కించుకుంది. రూ. 75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చిన దీపక్ హుడాది మంచి ధరే అని చెప్పొచ్చు. ఇప్పటివరకు ఐపీఎల్లో 80 మ్యాచ్లాడిన దీపక్ హుడా 785 పరుగులు చేశాడు. -
అప్పుడు రూ.20 లక్షలు.. ఇప్పుడు ఏకంగా రూ.10.75 కోట్లు.. వారెవ్వా హర్షల్!
ఐపీఎల్-2022 మెగా వేలంలో టీమిండియా ఆల్రౌండర్ హర్షల్ పటేల్ భారీ ధరకు అమ్ముడు పోయాడు. ఈ వేలంలో అతడిని రూ.10.75 కోట్లకు రాయల్ ఛాలంజెర్స్ బెంగళూరు కైవసం చేసుకుంది. హర్షల్ పటేల్ బేస్ ప్రైస్ 2 కోట్లుగా ఉంది. వేలంలో హర్షల్ పటేల్ కోసం సన్రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ చివర వరకు పోటీ పడ్డాయి. కాగా వేలానికి ముందు ఆర్సీబీ హర్షల్ పటేల్ను రీటైన్ చేసుకోలేదు. అయితే మళ్లీ వేలంలో ఆర్సీబీ అతడిని సొంతం చేసుకుంది. ఐపీఎల్-2021 సీజన్లో పర్పుల్ క్యాప్ హోల్డర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. గత సీజన్లో ఆర్సీబీ కేవలం 20 లక్షలకు మాత్రమే కోనుగోలు చేసింది. అయితే అదే ఫ్రాంచైజీ అతడిని 10.75 కోట్లకు కోనుగోలు చేయడం గమనార్హం. ఇక ఈ మెగా వేలంలో భారత స్టార్ ఆటగాడు, ఢిల్లీ క్యాపిటల్స్ మాజీ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ భారీ ధర పలికాడు. కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్టు అతడిని రూ. 12.25 కోట్లకు దక్కించుకుంది. ఇప్పటి వరకు జరిగిన వేలంలో అయ్యర్కే అత్యధిక ధర. ఇక సురేష్ రైనా, స్టీవ్ స్మిత్ వంటి స్టార్ ఆటగాళ్లు తొలి ఫేజ్లో అమ్ముడు పోలేదు. చదవండి: IPL 2022 Auction: వేలంలో షాకింగ్ ఘటన.. కుప్పకూలిన ఆక్షనీర్ -
Ind Vs Wi: నీకు మా మద్దతు ఉంటుందని ద్రవిడ్ చెప్పారు.. అందుకే..
వెస్టిండీస్తో టీ20 సిరీస్కు సన్నద్ధమవుతున్నాడు టీమిండియా బౌలర్ హర్షల్ పటేల్. స్వదేశంలో న్యూజిలాండ్తో టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూలోనే ఇరగదీసిన సంగతి తెలిసిందే. రెండో మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన అతడు కేవలం 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా తుది జట్టులోకి తన ఎంపిక సరైందేనని నిరూపించాడు. ఇక టీమిండియా హెడ్కోచ్గా రాహుల్ ద్రవిడ్కు, టీ20 కెప్టెన్గా రోహిత్ శర్మకు కివీస్తో సిరీసే మొదటిదన్న సంగతి తెలిసిందే. హర్షల్కు కూడా అరంగేట్రం కారణంగా ఈ సిరీస్ మరింత స్పెషల్. ఈ నేపథ్యంలో కెప్టెన్, కోచ్ తన పట్ల వ్యవహరించిన తీరు గురించి హర్షల్ పటేల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. స్టార్ స్పోర్ట్స్తో మాట్లాడిన అతడు...‘‘రోహిత్ శర్మ మన చేతికి బంతిని ఇస్తాడు. ఒకవేళ మన పట్ల తనకు నమ్మకం ఉంటే ఏం చేయాలన్న విషయం గురించి చెప్పడు. ‘‘ఏం చేయాలో తెలుసు కదా.. అదే చేసెయ్’’ మరి మన కర్తవ్యాన్ని గుర్తు చేస్తాడు. నిజంగా తను చాలా మంచి కెప్టెన్. అలాంటి వ్యక్తి సారథ్యంలో ఆడటాన్ని ఎవరైనా పూర్తిగా ఆస్వాదిస్తారు. ఒకవేళ పరుగులు ఎక్కువగా ఇస్తున్నానని అనిపిస్తే.. నా వద్ద ప్లాన్ ఏ, బీ, సీ సిద్ధంగా ఉంటాయి. వాటినిక అమలు చేసేందుకు కెప్టెన్ సహకారం ఉంటుంది. నిజంగా రోహిత్.. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తాడు’’ అని ప్రశంసలు కురిపించాడు. ఇక రాహుల్ ద్రవిడ్ తనతో మాట్లాడిన విధానాన్ని హర్షల్ పటేల్ గుర్తు చేసుకున్నాడు. ‘‘మాకు తెలుసు నువ్వు ఆత్మవిశ్వాసం గల బౌలర్వి. నువ్వు చేయగలవో.. ఏం చేయాలనుకుంటున్నావో.. చేసెయ్. మైదానంలో దిగిన తర్వాత నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావో అలాగే ఉండు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించు. ఏదేమైనా నీకు మా మద్దతు ఉంటుంది’’ అని ద్రవిడ్ తనకు భరోసా ఇచ్చాడని చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్ -2021 సీజన్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగిన హర్షల్ పటేల్... 32 వికెట్లు పడగొట్టాడు. తద్వారా పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఈ క్రమంలో జాతీయ జట్టులో చోటు దక్కించుకుని 30 ఏళ్ల 361 రోజుల వయసులో అంతర్జాతీయ క్రికెట్లో ఎంట్రీ ఇచ్చాడు. విండీస్తో సిరీస్కు భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, కోహ్లి, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్, పంత్, వెంకటేశ్ అయ్యర్, దీపక్ చహర్, శార్దుల్, యుజువేంద్ర చహల్, వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్, అక్షర్ పటేల్, సిరాజ్, హర్షల్ పటేల్, రవి బిష్ణోయ్, అవేశ్ ఖాన్. చదవండి: IPL 2022 Mega Auction: వేలంలో అతడికి ఏకంగా రూ.11 కోట్లు.. అయ్యర్కి మరీ ఇంత తక్కువా! -
'ఐపీఎల్లో ఆ జట్టుకు ఆడాలని ఉంది.. అతడే నా ఫేవరెట్ కెప్టెన్'
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్-2022 మెగా వేలంకు సమయం ఆసన్నమైంది. బెంగళూరు వేదికగా ఫిబ్రవరి 12, 13 తేదీల్లో ఈ మెగా వేలాన్ని నిర్వహించనున్నారు. ఇక గతేడాది పర్పుల్ క్యాప్ హోల్డర్ హర్షల్ పటేల్ను ఆర్సీబీ రీటైన్ చేసుకోలేదు. ఆర్సీబీ విరాట్ కోహ్లితో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, సిరాజ్ను రీటైన్ చేసుకుంది. దీంతో రానున్న మెగా వేలంలో హర్షల్ పటేల్ కోసం జట్లు పోటీ పడతాయి ఆనడంలో సందేహం లేదు. అయితే తాజాగా ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ తన మనసులోని మాటను బయట పెట్టాడు. ఈ ఏడాది సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడేందుకు ఆసక్తిగా ఉన్నానని హర్షల్ తెలిపాడు. చెన్నై కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని తన ఆల్ టైమ్ బెస్ట్ కెప్టెన్ అని హర్షల్ పటేల్ పేర్కొన్నాడు. ఐపీఎల్- 2021లో 32 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. ముంబై ఇండియన్స్పై హ్యాట్రిక్ వికెట్లతో అదరగొట్టాడు. కాగా రానున్న మెగా వేలంలో తన బేస్ ప్రైస్ రూ.2 కోట్లగా నమోదు చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ 2021లో కేవలం రూ. 20 లక్షలకు కొనుగోలు చేయడం గమనార్హం. చదవండి: Shakib Al Hasan: 'శ్రీవల్లీ' పాటకు బంగ్లా ఆల్రౌండర్ స్టెప్పులు.. ఊహించని ట్విస్ట్ -
IPL 2022 Auction: వదిలేసినా ఆ జట్టుకే ఆడాలని ఉందన్న స్టార్ ప్లేయర్
IPL 2022 Auction: ఐపీఎల్-2021 సీజన్లో అద్భుతంగా రాణించాడు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు బౌలర్ హర్షల్ పటేల్. 15 ఇన్నింగ్స్లో 32 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. తద్వారా పర్పుల్ క్యాప్ దక్కించుకున్నాడు. అయితే, రిటెన్షన్ సమయంలో మాత్రం యాజమాన్యం అతడిని పరిగణనలోకి తీసుకోలేదు. హర్షల్ కంటే కూడా టీమిండియాలో రెగ్యులర్ పేసర్గా మారిన సిరాజ్ వైపు ఫ్రాంఛైజీ మొగ్గు చూపింది. స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి (రూ.15 కోట్లు) , ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్ (రూ. 11 కోట్లు), సిరాజ్ (రూ. 7 కోట్లు)లను అట్టిపెట్టుకుంది. అత్యధికంగా నలుగురిని రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నా హర్షల్ను వదిలేసింది. దీంతో అతడు మెగా వేలంలోకి రానున్నాడు. ఈ క్రమంలో క్రిక్ట్రాకర్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్షల్ పటేల్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆర్సీబీ తనను కొనుగోలు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ‘‘నన్ను రిటైన్ చేసుకోలేదని తెలిసిన వెంటనే... ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెసన్ నాకు కాల్ చేశారు. పర్సులో సరిపడా డబ్బు లేనందు వల్లే నన్ను వదిలేశామని చెప్పారు. కాబట్టి మెగా వేలంలో వాళ్లు కచ్చితంగా నన్ను పరిగణనలోకి తీసుకుంటారనుకుంటున్నా.. నేను కూడా మరోసారి ఆర్సీబీకి ఆడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఎందుకంటే... ఐపీఎల్-2021 సీజన్లో బెంగళూరు జట్టుకు ఆడటం.. నా కెరీర్ను మాత్రమే కాదు... నా జీవితాన్ని కూడా కీలక మలుపు తిప్పింది’’ అని ఉద్వేగానికి లోనయ్యాడు. ఇక వేలం నేపథ్యంలో ఇప్పటి వరకు తనను ఏ ఫ్రాంఛైజీ సంప్రదించలేదని హర్షల్ చెప్పుకొచ్చాడు. కాగా ఐపీఎల్-2021 ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ పేసర్.. స్వదేశంలో న్యూజిలాండ్తో జరిగిన టీ20 సిరీస్తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్ల సిరీస్లో నాలుగు వికెట్లతో రాణించి... కివీస్ను 3-0 తేడాతో వైట్వాష్ చేయడంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇక యార్కర్లతో బ్యాటర్లను ఇబ్బంది పెట్టగల హర్షల్ను కొనుగోలు చేసేందుకు ఐపీఎల్ ఫ్రాంఛైజీలు పోటీపడతాయడనంలో ఏమాత్రం సందేహం లేదు. చదవండి: Ind Vs Sa: హనుమ విహారికి నో ఛాన్స్.. పంత్కు అవకాశం... సిరాజ్ స్థానంలో అతడే! ఎందుకంటే.. IPL 2022: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీలకు డెడ్లైన్ విధించిన బీసీసీఐ -
Harshal Patel: ‘ఎలా మొదలైంది.. ఎలా కొనసాగుతోంది’.. ఫొటోలు వైరల్
Harshal Patel Shared Before After Picture With Team India Head Coach Rahul Dravid: ఆలస్యంగానైనా సరే టీమిండియా తరఫున అరంగేట్రం చేయాలన్న కలను నెరవేర్చుకున్నాడు హర్షల్ పటేల్. ఇటీవల న్యూజిలాండ్తో ముగిసిన టీ20 సిరీస్ ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన హర్షల్.. డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు. రెండో టీ20లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. ఇక 30 ఏళ్ల 361 రోజుల వయసులో పొట్టి ఫార్మాట్లో అడుగుపెట్టిన హర్షల్.. హెడ్కోచ్ రాహుల్ ద్రవిడ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ తాజాగా రెండు ఫొటోలు షేర్ చేశాడు. ‘‘ఎలా మొదలైంది.. ఎలా కొనసాగుతోంది’’ అన్న క్యాప్షన్తో ద్రవిడ్తో దిగిన పాత, కొత్త ఫొటోలను పంచుకున్నాడు. ఈ క్రమంలో.. ‘‘2004కు... ఇప్పటికీ పెద్దగా మార్పులేమీ కనిపించడం లేదు. కానీ నువ్వు నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి పట్టుదలగా ముందుకు సాగిన విధానం మాత్రం మమ్మల్ని ఆకట్టుకుంటోంది’’ అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ద్రవిడ్ నమ్మకాన్ని గెలుచుకోవడమే కాదు.. దానిని నిలబెట్టుకున్నావు కూడా అంటూ అభినందిస్తున్నారు. కాగా లేటు వయసులో టీ20లో ఎంట్రీ ఇచ్చిన ఆటగాళ్ల జాబితాలో ద్రవిడ్ (38 ఏళ్ల 232 రోజులు).. మొదటి స్థానంలో ఉండగా.. హర్షల్ ఆరో స్థానంలో కొనసాగుతుండటం విశేషం. ఇక ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహిస్తున్న హర్షల్ పటేల్.. 2021 సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన ఆటగాడిగా నిలిచాడు. 15 మ్యాచ్లు ఆడిన అతడు 32 వికెట్లు తన ఖాతాలో వేసుకుని పర్పుల్ క్యాప్ గెలుచుకున్నాడు. ఈ క్రమంలో న్యూజిలాండ్తో పొట్టి ఫార్మాట్ సిరీస్కు ఎంపికయ్యాడు. చదవండి: India vs New Zealand: గిల్ కళ్లు చెదిరే సిక్స్ .. వీడియో వైరల్ IND vs NZ 1st Test- Shreyas Iyer: నెరవేరిన అయ్యర్ కల.. దిగ్గజ క్రికెటర్ చేతుల మీదుగా క్యాప్.. వీడియో View this post on Instagram A post shared by Harshal Patel (@harshalvp23) -
Ind vs Nz 2021: క్లీన్స్వీప్.. ‘కెప్టెన్’ రోహిత్ శర్మ సూపర్!
Ind vs Nz 2021: India Beat New Zealand 73 Runs In 3rd T20I Clean Sweep: మ్యాచ్ నామమాత్రం అయినప్పటికీ భారత జట్టు నిర్లక్ష్యం చూపకుండా చెలరేగింది. న్యూజిలాండ్తో ఆదివారం జరిగిన చివరిదైన మూడో టి20 మ్యాచ్లో టీమిండియా 73 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్ల సిరీస్ను రోహిత్ శర్మ బృందం 3–0తో క్లీన్స్వీప్ చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 184 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ కెప్టెన్ రోహిత్ శర్మ (31 బంతుల్లో 56; 5 ఫోర్లు, 3 సిక్స్లు), ఇషాన్ కిషన్ (21 బంతుల్లో 29; 6 ఫోర్లు) మెరిశారు. చివర్లో దీపక్ చహర్ (8 బంతుల్లో 21 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) ధనాధన్ ఆటతీరుతో భారత్ భారీ స్కోరు ను అందుకుంది. ఛేదనలో న్యూజిలాండ్ 17.2 ఓవర్లలో 111 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ గప్టిల్ (36 బంతుల్లో 51; 4 ఫోర్లు, 4 సిక్స్లు) మినహా మిగిలినవారు విఫలమయ్యారు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అక్షర్ పటేల్ (3/9), హర్షల్ పటేల్ (2/26) ప్రత్యర్థిని దెబ్బ తీశారు. న్యూజిలాండ్ తాత్కాలిక సారథి సౌతీ విశ్రాంతి తీసుకోవడంతో ఈ మ్యాచ్లో సాన్ట్నర్ కెప్టెన్సీ బాధ్యతలు నిర్వహించాడు. రెండు జట్ల మధ్య తొలి టెస్టు ఈనెల 25న కాన్పూర్లో మొదలవుతుంది. రోహిత్ దూకుడు... భారత్కు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ శుభారంభం చేశారు. బౌల్ట్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి ఖాతా తెరిచిన రోహిత్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిల్నే వేసిన రెండో ఓవర్లో ఇషాన్ కూడా రెండు ఫోర్లు కొట్టి స్కోరు బోర్డును పరుగెత్తించాడు. ఫెర్గూసన్ వేసిన ఆరో ఓవర్లో రోహిత్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్ బాదగా... ఇషాన్ మరో ఫోర్ కొట్టాడు. దాంతో ఆ ఓవర్లో భారత్కు 20 పరుగులు లభించాయి. పవర్ప్లేలో భారత్ వికెట్ నష్టపోకుండా 69 పరుగులు చేసింది. పవర్ ప్లే ముగిశాక టీమిండియా ఇన్నింగ్స్ గాడి తప్పింది. సాన్ట్నర్ ఒకే ఓవర్లో ఇషాన్, సూర్యకుమార్ (0)లతో పాటు తన తర్వాతి ఓవర్లో పంత్ (4)ను అవుట్ చేశాడు. అయితే మరో ఎండ్లో రోహిత్ దూకుడు తగ్గించలేదు. అతడు 27 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం సోధి పట్టిన అద్భుత రిటర్న్ క్యాచ్తో రోహిత్ పెవిలియన్కు చేరాడు. దాంతో భారత్ 69/0 నుంచి 103/4గా నిలిచింది. చివర్లో హర్షల్ (11 బంతుల్లో 18; 2 ఫోర్లు, 1 సిక్స్), దీపక్ చహర్ దూకుడుగా ఆడారు. మిల్నే వేసిన ఆఖరి ఓవర్లో దీపక్ వరుసగా 4, 4, 2, 6, 2, 1తో 19 పరుగులు రాబట్టాడు. గప్టిల్ ఒక్కడే... భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ను భారత బౌలర్లు కట్టడి చేశారు. ఓపెనర్ మిచెల్ (5) త్వరగా అవుటయ్యాడు. చాప్మన్ (0), ఫిలిప్స్ (0)లను అక్షర్ పెవిలియన్కు చేర్చాడు. ఓపెనర్ గప్టిల్ అర్ధ సెంచరీతో ఒంటరి పోరాటం చేశాడు. చహల్ బౌలింగ్లో గప్టిల్ భారీ షాట్కు యత్నించి లాంగాన్లో సూర్యకుమార్ చేతికి చిక్కాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాటర్స్ విఫలమవ్వడంతో టీమిండియా విజయం ఖాయమైంది. మీకు తెలుసా? న్యూజిలాండ్పై భారత్కిది మూడో టి20 సిరీస్ విజయం. రెండు జట్ల మధ్య ఆరు టి20 సిరీస్లు జరిగాయి. మరో మూడింటిలో న్యూజిలాండ్ గెలిచింది. స్వదేశంలో రోహిత్ కెప్టెన్సీలో భారత్ గెలిచిన టి20 మ్యాచ్ల సంఖ్య. 11 భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) సోధి 56; ఇషాన్ (సి) సీఫెర్ట్ (బి) సాన్ట్నర్ 29; సూర్యకుమార్ (సి) గప్టిల్ (బి) సాన్ట్నర్ 0; పంత్ (సి) నీషమ్ (బి) సాన్ట్నర్ 4; శ్రేయస్ (సి) మిచెల్ (బి) మిల్నే 25; వెంకటేశ్ (సి) చాప్మన్ (బి) బౌల్ట్ 20; అక్షర్ (నాటౌట్) 2; హర్షల్ (హిట్వికెట్) (బి) ఫెర్గూసన్ 18; దీపక్ (నాటౌట్) 21; ఎక్స్ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 184. వికెట్ల పతనం: 1–69, 2–71, 3–83, 4–103, 5–139, 6–140, 7–162. బౌలింగ్: బౌల్ట్ 4–0–31–1, మిల్నే 4–0–47–1, ఫెర్గూసన్ 4–0–45–1, సాన్ట్నర్ 4–0–27–3, సోధి 4–0–31–1. న్యూజిలాండ్ ఇన్నింగ్స్: గప్టిల్ (సి) సూర్యకుమార్ (బి) చహల్ 51; మిచెల్ (సి) హర్షల్ (బి) అక్షర్ 5; చామ్మన్ (స్టంప్డ్) (బి) అక్షర్ 0; ఫిలిప్స్ (బి) అక్షర్ 0; సీఫెర్ట్ (రనౌట్) 17; నీషమ్ (సి) పంత్ (బి) హర్షల్ 3; సాన్ట్నర్ (రనౌట్) 2; మిల్నే (సి) రోహిత్ (బి) వెంకటేశ్ 7; సోధి (సి) సూర్యకుమార్ (బి) హర్షల్ 9; ఫెర్గూసన్ (సి అండ్ బి) దీపక్ 14; బౌల్ట్ (నాటౌట్) 2; ఎక్స్ట్రాలు 1; మొత్తం (17.2 ఓవర్లలో ఆలౌట్) 111. వికెట్ల పతనం: 1–21, 2–22, 3–30, 4–69, 5–76, 6–76, 7–84, 8–93, 9–95, 10–111. బౌలింగ్: భువనేశ్వర్ 2–0–12–0, దీపక్ 2.2–0–26–1, అక్షర్ 3–0–9–3, చహల్ 4–0–26–1, వెంకటేశ్ 3–0–12–1, హర్షల్ 3–0–26–2. చదవండి: Unmukt Chand Marriage: ప్రేయసిని పెళ్లాడిన ఉన్ముక్త్ చంద్... ఫొటోలు వైరల్ -
పాపం హర్షల్ పటేల్.. రాహుల్ తర్వాత ఆ చెత్త రికార్డు నమోదు..
Harshal Patel becomes second Indian to be dismissed hit wicket in T20Is: టీ20ల్లో హర్షల్ పటేల్ ఓ చెత్త రికార్డును మూటకట్టుకున్నాడు. న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్లో అనుహ్యరీతిలో హిట్ వికెట్గా హర్షల్ పటేల్ వెనుదిరిగాడు. దీంతో టీ20ల్లో టీమిండియా తరుపున హిట్ వికెట్గా ఔటైన రెండో ఆటగాడిగా హర్షల్ నిలిచాడు. ఇన్నింగ్స్ 19 ఓవర్ వేసిన లాకీ ఫెర్గూసన్ బౌలింగ్లో కట్ షాట్కు ప్రయత్నించిన హర్షల్ పటేల్.. తన బ్యాట్తో వికెట్లను టచ్ చేయడంతో ఈ ఆప్రతిష్టతను మూటకట్టుకున్నాడు. అంతకముందు 2018లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ హిట్ వికెట్గా ఔటయ్యాడు. కాగా ఈ మ్యాచ్లో హర్షల్ పటేల్ 11 బంతుల్లో 18 పరుగులు సాధించాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. మెదట బ్యాటింగ్ చేసిన టీమిండియా, కీవిస్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 184 పరుగులు చేసింది. టీమిండియా బ్యాటర్లలో రోహిత్ శర్మ(56) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా, కిషన్(29), శ్రేయాప్ అయ్యర్(25),దీపక్ చాహర్(21) పరుగులతో రాణించారు. న్యూజిలాండ్ బౌలర్లలో మిచెల్ సాంట్నర్ మూడు వికెట్లు పడగొట్టగా, బౌల్ట్ రెండు వికెట్లు, సోధి, మిల్నే చెరో వికెట్ సాధించారు. ఇక 185 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ తడబడుతుంది. 10 ఓవర్లలలో మూడు వికెట్ల నష్టానికి కివీస్ 68 పరగులు చేసింది. pic.twitter.com/eelIHt718i — Simran (@CowCorner9) November 21, 2021 -
అసలు మెదటి మ్యాచ్ ఆడుతున్నట్లే అనిపించలేదు
Gautam Gambhir Comments on Harshal Patel: అంతర్జాతీయ అరంగేట్ర మ్యాచ్లోనే అదరగొట్టిన టీమిండియా ఫాస్ట్బౌలర్ హర్షల్ పటేల్పై భారత మాజీ ఓపెనర్ గౌతం గంభీర్ ప్రశంసల వర్షం కురిపించాడు. శుక్రవారం (నవంబర్ 19) న్యూజిలాండ్తో జరిగిన రెండో టీ20లో హర్షల్ పటేల్ అరంగేట్రం చేశాడు. తొలి టీ20లో గాయపడిన మహ్మద్ సిరాజ్ స్థానంలో హర్షల్ జట్టులోకి వచ్చాడు. డెబ్యూ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా హర్షల్ పటేల్ నిలిచాడు. ఈ మ్యాచ్లో హర్షల్ తన తొలి మ్యాచ్ ఆడుతున్నట్లు కనించలేదని, అనుభవజ్ఞుడులా బౌలింగ్ చేశాడిని గంభీర్ తెలిపాడు. సుదీర్ఘకాలం పాటు దేశవాళీ క్రికెట్, ఐపీఎల్లో ఆడడం అతడికి ఎంతో ఉపయోగపడింది అని గంభీర్ చెప్పాడు. “హర్షల్ పటేల్ అద్బుతమైన బౌలర్. అతడు తన మొదటి మ్యాచ్ ఆడుతున్నట్లు అనిపించలేదు. అతడి ప్రదర్శన నన్ను చాలా ఆకట్టుకుంది. 8-10 సంవత్సరాల ఫస్ట్-క్లాస్ క్రికెట్, ఐపీఎల్లో ఆడడం అతనికి కలిసొచ్చింది. ఐపీఎల్లో హర్షల్ పటేల్ ఏ విధంగా అయితే రాణించాడో భారత తరుపున అదే విధంగా రాణించాలి అని కోరుకుంటున్నాను. అంతర్జాతీయ స్ధాయిలో ఆడటం పట్ల అతడు చాలా సంతోషంగా ఉన్నాడు" అని గంభీర్ స్టార్ స్పోర్ట్స్ షోలో పేర్కొన్నాడు. చదవండి: Pat Cummins : ఆస్ట్రేలియా కొత్త కెప్టెన్గా పాట్ కమిన్స్..! -
వారెవ్వా హర్షల్ పటేల్.. డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు
Harshal Patel Best Bowling Debut T20I Match.. టీమిండియా పేసర్ హర్షల్ పటేల్ డెబ్యూ మ్యాచ్లోనే ఇరగదీశాడు. న్యూజిలాండ్తో మ్యాచ్ ద్వారా 94వ ఆటగాడిగా టీమిండియా తరపున టి20ల్లో అరంగేట్రం చేశాడు. బౌలింగ్లో నాలుగు ఓవర్లు వేసిన హర్షల్ పటేల్ 25 పరుగులిచ్చి రెండు కీలక వికెట్లు తీశాడు. హర్షల్ తాను వేసిన ప్రతీ బంతి దాదాపు 140 కిమీ వేగంతో విసరడం విశేషం. అలా తన డెబ్యూ మ్యాచ్తోనే హర్షల్ అందరిచేత ప్రశంసలు అందుకున్నాడు. ఇక కివీస్ ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత హర్షల్ పటేల్ తన బౌలింగ్ ప్రదర్శనపై స్పందించాడు. ''దేశానికి ఆడడం గర్వంగా ఉంటుంది. ఆటను ఇష్టపడే నేను.. దేశానికి ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. మ్యాచ్కు ముందు ద్రవిడ్ సర్ నాతో మాట్లాడుతూ.. నీ ప్రిపరేషన్ ముగిసింది అంటే మ్యాచ్లో వికెట్లు తీస్తూ ఎంజాయ్ చేయాలని చెప్పాడు. ద్రవిడ్ అన్నట్లుగానే తొలి మ్యాచ్లోనే ఆకట్టుకునే ప్రదర్శన చేయడం సంతోషం కలిగించింది. ఐపీఎల్ ఫామ్ను ఇక్కడ కంటిన్యూ చేస్తూ డెబ్యూ మ్యాచ్లోనే రెండు వికెట్లు తీశాను. ఈ ప్రదర్శన ఎప్పటికి మరిచిపోను.'' అంటూ చెప్పుకొచ్చాడు. చదవండి: Harshal Patel: 30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర Axar patel: అక్షర్ పటేల్.. 2017 తర్వాత మళ్లీ ఇప్పుడే -
30 ఏళ్ల 361 రోజులు.. హర్షల్ పటేల్ కొత్త చరిత్ర
Harshal Patel Sixth Oldest Player T20I Debut For Team India.. న్యూజిలాండ్తో మ్యాచ్లో టీమిండియా తరపున హర్షల్ పటేల్ టి20ల్లో 94వ ఆటగాడిగా అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. ఈ సందర్భంగా లేటు వయసులో టి20ల్లో అరంగేట్రం చేసిన ఆటగాడిగా హర్షల్ పటేల్ కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం హర్షల్ పటేల్ 30 ఏళ్ల 361 రోజులతో ఆరో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రాహుల్ ద్రవిడ్ 38 ఏళ్ల 232 రోజులు.. మొదటిస్థానంలో ఉన్నాడు. సచిన్ టెండూల్కర్(33 ఏళ్ల 221 రోజులు), శ్రీనాథ్ అరవింద్( 31 ఏళ్ల 177 రోజులు), స్టువర్ట్ బిన్నీ(31 ఏళ్ల 44 రోజులు), మురళీ కార్తిక్( 31 ఏళ్ల 39 రోజులు) వరుసగా రెండు, మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. చదవండి: Shoaib Malik: మరీ ఇంత బద్దకమా; విచిత్రరీతిలో రనౌట్ ఇక ఐపీఎల్ 2021 సీజన్లో ఆర్సీబీకి ఆడిన హర్షల్ పటేల్ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. ఈ సీజన్లో 15 మ్యాచ్లాడి 32 వికెట్లు తీసుకున్న హర్షల్ పటేల్ అత్యధిక వికెట్లతో పర్పుల్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో హర్షల్ పటేల్ డ్వేన్ బ్రావోతో కలిసి సంయుక్తంగా తొలి స్థానంలో నిలిచాడు. చదవండి: PAK vs BAN: ఓటమి అంచుల వరకు వెళ్లింది.. కానీ గెలిచింది Really nice to see Ajit Agarkar giving the debut cap for Harshal Patel, leading wicket taker in IPL 2021, one of the stars and making the debut for India tonight.pic.twitter.com/ct9QN5I3n0 — Johns. (@CricCrazyJohns) November 19, 2021 -
రోహిత్కే టి20 పగ్గాలు.. జట్టులోకి వెంకటేశ్ అయ్యర్, రుతురాజ్
Venkatesh Iyer, Ruturaj Gaikwad, Harshal Patel Picked For T20Is Against New Zealand: న్యూఢిల్లీ: ఊహించిందే జరిగింది. లాంఛనం ముగిసింది. భారత టి20 క్రికెట్ జట్టుకు పూర్తిస్థాయి నాయకత్వ మార్పిడి జరిగింది. టీమిండియా టి20 జట్టుకు కొత్త కెప్టెన్గా రోహిత్ శర్మను నియమిస్తున్నట్లు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మంగళవారం ప్రకటించింది. యూఏఈలో జరిగిన ఐపీఎల్ టోర్నీ సందర్భంగా టి20 ప్రపంచకప్ తర్వాత తాను భారత టి20 జట్టు కెప్టెన్సీ నుంచి వైదొలుగుతానని విరాట్ కోహ్లి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కోహ్లి స్థానంలో మరో సీనియర్ క్రికెటర్ రోహిత్ శర్మను ఈ ఫార్మాట్లో కెప్టెన్గా నియమిస్తారని ప్రచారం జరిగింది. ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా బీసీసీఐ సెలెక్షన్ కమిటీ రోహిత్ శర్మకే టి20 పగ్గాలు అప్పగించింది. కేఎల్ రాహుల్ వైస్ కెప్టెన్గా వ్యవహరిస్తాడు. టి20 ఫార్మాట్లో రోహిత్ శర్మకు కెప్టెన్సీ కొత్తేమీ కాదు. ఐపీఎల్లో రోహిత్ సారథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు ఐదుసార్లు చాంపియన్గా నిలిచింది. గతంలో కోహ్లి గైర్హాజరీలో రోహిత్ శర్మ 19 మ్యాచ్ల్లో భారత టి20 జట్టుకు తాత్కాలికంగా నాయకత్వం వహించాడు. రోహిత్ కెప్టెన్సీలో భారత జట్టు 15 మ్యాచ్ల్లో గెలిచి, 4 మ్యాచ్ల్లో ఓడింది. 2017లో 3 మ్యాచ్ల్లో... 2018లో 9 మ్యాచ్ల్లో... 2019లో 6 మ్యాచ్ల్లో... 2020లో ఒక్క మ్యాచ్లో రోహిత్ భారత టి20 జట్టుకు తాత్కాలిక కెప్టెన్గా వ్యవహరించాడు. హార్దిక్, వరుణ్లపై వేటు టి20 ప్రపంచకప్లో భారత జట్టు లీగ్ దశలోనే నిష్క్రమించడం... ఈనెల 17 నుంచి స్వదేశంలో న్యూజిలాండ్తో మూడు మ్యాచ్ల టి20 సిరీస్ ఉండటంతో మంగళవారం బీసీసీఐ సెలెక్షన్ కమిటీ 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించింది. టి20 ప్రపంచకప్ బరిలో దిగిన 15 మంది జట్టులో ఏడుగురు మాత్రమే న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపికయ్యారు. ఫిట్నెస్ సమస్యలు.. ఫామ్లో లేకపోవడం కారణంగా ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా, మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తిలపై సెలెక్టర్లు వేటు వేశారు. టి20 ప్రపంచకప్లో ఆడిన శార్దుల్ ఠాకూర్, రాహుల్ చహర్లను కూడా న్యూజిలాండ్తో సిరీస్కు ఎంపిక చేయలేదు. కోహ్లి, బుమ్రా, షమీ, రవీంద్ర జడేజాలకు వారి కోరిక మేరకు విశ్రాంతి ఇచ్చారు. శ్రేయస్ అయ్యర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, దీపక్ చహర్, హైదరాబాద్ పేసర్ మొహమ్మద్ సిరాజ్లకు మళ్లీ పిలుపు వచ్చింది. మూడు కొత్త ముఖాలు... ఐపీఎల్లో నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్న వెంకటేశ్ అయ్యర్ (కోల్కతా నైట్రైడర్స్), హర్షల్ పటేల్ (రాయల్ చాలెంజర్స్ బెంగళూరు), అవేశ్ ఖాన్ (ఢిల్లీ క్యాపిటల్స్)లకు తొలిసారి జాతీయ జట్టులో స్థానం దక్కింది. మధ్యప్రదేశ్కు చెందిన 26 ఏళ్ల వెంకటేశ్ అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్లో 370 పరుగులు చేయడంతోపాటు మూడు వికెట్లు తీశాడు. దేశవాళీ క్రికెట్లో హరియాణా జట్టుకు ఆడే గుజరాత్కు చెందిన 30 ఏళ్ల హర్షల్ పటేల్ ఐపీఎల్లో 32 వికెట్లు తీసి ‘పర్పుల్ క్యాప్’ గెల్చుకున్నాడు. మధ్యప్రదేశ్కు చెందిన 24 ఏళ్ల అవేశ్ ఖాన్ ఈ ఐపీఎల్లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా నిలిచాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో 635 పరుగులు సాధించిన మహారాష్ట్ర ప్లేయర్ రుతురాజ్ గైక్వాడ్కు కూడా జట్టులో చోటు దక్కింది. ఇటీవల శ్రీలంకలో పర్యటించిన రుతురాజ్ భారత్ తరఫున రెండు టి20 మ్యాచ్ల్లో ఆడాడు. తొలి టెస్టుకు కూడా రోహితే కెప్టెన్! న్యూజిలాండ్తో టి20 సిరీస్ ముగిశాక రెండు టెస్టులు జరగనున్నాయి. తొలి టెస్టుకు కూడా కోహ్లి అందుబాటులో ఉండటంలేదని.. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తొలి టెస్టులో టీమిండియాకు నేతృత్వం వహిస్తాడని సమాచారం. డిసెంబర్ 3 నుంచి 7 వరకు ముంబైలో జరిగే రెండో టెస్టుకు రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి జట్టుకు అందుబాటులో ఉంటాడని తెలిసింది. ఇక వన్డే ఫార్మాట్లోనూ కోహ్లిని కెప్టెన్సీ నుంచి తప్పించి రోహిత్ శర్మకే పగ్గాలు ఇవ్వాలని బీసీసీఐ సెలెక్టర్లు భావిస్తున్నట్లు సమాచారం. అయితే భారత జట్టు వచ్చే జనవరిలో దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ ఆడనుండటంతో అప్పుడే ఈ మార్పు జరిగే అవకాశముంది. భారత టి20 జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), వెంకటేశ్ అయ్యర్, యజువేంద్ర చహల్, అశ్విన్, అక్షర్ పటేల్, అవేశ్ ఖాన్, భువనేశ్వర్, దీపక్ చహర్, హర్షల్ పటేల్, మొహమ్మద్ సిరాజ్. భారత్, న్యూజిలాండ్ టి20 సిరీస్ షెడ్యూల్ నవంబర్ 17: తొలి మ్యాచ్ (జైపూర్లో) నవంబర్ 19: రెండో మ్యాచ్ (రాంచీలో) నవంబర్ 21: మూడో మ్యాచ్ (కోల్కతాలో) NEWS - India’s squad for T20Is against New Zealand & India ‘A’ squad for South Africa tour announced.@ImRo45 named the T20I Captain for India. More details here - https://t.co/lt1airxgZS #TeamIndia pic.twitter.com/nqJFWhkuSB — BCCI (@BCCI) November 9, 2021 చదవండి: పొట్టి క్రికెట్లో ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన భారత్-పాక్ మ్యాచ్ -
IPL 2021 Prize Money: విజేతకు 20 కోట్లు.. మరి వాళ్లందరికీ ఎంతంటే!
IPL 2021 Prize Money: ఐపీఎల్-2021 విజేతగా చెన్నై సూపర్కింగ్స్ అవతరించింది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో కోల్కతా నైట్రైడర్స్పై విజయం సాధించి నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. మరి... టైటిల్ విన్నర్, రన్నరప్ గెలుచుకున్న ప్రైజ్ మనీ ఎంత? ఎమర్జింగ్ ప్లేయర్, ఫెయిర్ ప్లే, గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్, అత్యధిక సిక్సర్ల వీరుడు ఎవరు.. వాళ్లు గెలుచుకున్న మొత్తం ఎంత? తదితర అంశాలను పరిశీలిద్దాం. అవార్డు ప్లేయర్ గెలుచుకున్న మొత్తం (రూపాయల్లో) ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు ఫెయిర్ ప్లే అవార్డు రాజస్తాన్ రాయల్స్ 10 లక్షలు గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్ హర్షల్ పటేల్ 10 లక్షలు సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ షిమ్రోన్ హెట్మెయిర్ 10 లక్షలు మాక్సిమమ్ సిక్సెస్ అవార్డు కేఎల్ రాహుల్ 10 లక్షలు పవర్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ వెంకటేశ్ అయ్యర్ 10 లక్షలు పర్ఫెక్ట్ క్యాచ్ ఆఫ్ ది సీజన్ రవి బిష్ణోయి 10 లక్షలు పర్పుల్ క్యాప్ హర్షల్ పటేల్ 10 లక్షలు ఆరెంజ్ క్యాప్ రుతురాజ్ గైక్వాడ్ 10 లక్షలు అత్యంత విలువైన ఆటగాడు హర్షల్ పటేల్ 10 లక్షలు విజేత చెన్నై సూపర్ కింగ్స్ 20 కోట్లు రన్నరప్ కోల్కతా నైట్రైడర్స్ 12.5 కోట్లు మూడోస్థానం ఢిల్లీ క్యాపిటల్స్ 8.75 కోట్లు నాలుగో స్థానం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 8.75 కోట్లు చదవండి: IPl 2021 Final: ఈ ఏడాది టైటిల్ గెలిచే అర్హత కేకేఆర్కు ఉంది: ధోని -
హర్షల్ పటేల్ను అభినందనల్లో ముంచెత్తిన బ్రావో.. సూపర్ అంటూ..
Harshal Patel: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన రికార్డు సాధించాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. దీంతో హర్షల్ పటేల్ 2013 సీజన్లో అత్యధిక వికెట్లు (32) తీసిన డ్వేన్ బ్రావో రికార్డును సమం చేశాడు. ఈ సందర్భంగా చెన్నై సూపర్ కింగ్స్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావో తనతో సమంగా నిలిచిన హర్షల్ పటేల్ను అభినందించాడు. "అభినందనలు హర్షల్. నీవు ఖచ్చితంగా ఈ రికార్డును సాధిస్తావు !! నీ పోరాట పటిమ చూడటానికి చాలా బాగుంది!' అని బ్రావో ఇన్స్టాగ్రామ్ స్టోరీలో రాశాడు. కాగా మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల్ 32 వికెట్లు పడగొట్టాడు. అయితే ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా సోమవారం కోల్కతా నైట్ రైడర్స్ జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు పడగొట్టిన హర్షల్ ఈ ఘనత సాధించాడు. కాగా 17ఓవర్ వేసిన హర్షల్ పటేల్ బౌలింగ్లో సునీల్ నరైన్ క్యాచ్ పడక్కల్ వదిలివేయడంతో ఒక సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డను తృటిలో చేజార్చుకున్నాడు. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచాడు. కాగా కోల్కతా నైట్రైడర్స్తో సోమవారం జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 4 వికెట్ల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. దీంతో కేకేఆర్.. ఢిల్లీ క్యాపిటల్స్తో క్వాలిఫైయర్-2 ఆడేందుకు అర్హత సాధించగా... కోహ్లి సేన ఇంటిముఖం పట్టింది. చదవండి: Glenn Maxwell: కొంచెం డీసెంట్గా ఉండండి.. చెత్తగా వాగొద్దు -
ఐపీఎల్లో హర్షల్ పటేల్ నయా రికార్డు
Harshal Patel Most wickets In IPL Season.. ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు(ఆర్సీబీ) బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనత అందుకున్నాడు. ఒక ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా హర్షల్ పటేల్ చరిత్ర సృష్టించాడు. మొత్తం 15 మ్యాచ్లాడిన హర్షల్ పటేల 32 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఒక హ్యాట్రిక్ ఉండడం విశేషం. తద్వారా హర్షల్ పటేల్ సీఎస్కే బౌలర్ డ్వేన్ బ్రావోతో సమానంగా అగ్రస్థానంలో నిలిచాడు. 2013 ఐపీఎల్లో సీఎస్కే తరపున ఆ సీజన్లో 32 వికెట్లు తీశాడు. హర్షల్ పటేల్, బ్రావోల తర్వాత రెండో స్థానంలో కగిసో రబడ( ఢిల్లీ క్యాపిటల్స్, 30 వికెట్లు, ఐపీఎల్ 2020) ఉన్నాడు. ఇక జేమ్స్ ఫాల్కనర్ (28వికెట్లు, 2013 ఐపీఎల్), లసిత్ మలింగ (28 వికెట్లు, 2011 ఐపీఎల్), బుమ్రా( 27 వికెట్లు, ఐపీఎల్ 2020) వరుసగా మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో ఉన్నారు. కాగా 139 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ ప్రస్తుతం 18 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 127 పరుగులు చేసింది. కేకేఆర్ విజయానికి ఇంకా 12 పరుగుల దూరంలో ఉంది. -
అరుదైన రికార్డుకు చేరువలో హర్షల్ పటేల్..
Harshal Patel On The Brink Of Breaking This Huge IPL Record: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ అరుదైన ఘనతకు చేరువలో ఉన్నాడు. ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల తీసిన రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 30 వికెట్లు ఉన్నాయి. నేడు కోల్కతాతో జరగనున్న మ్యాచ్లో మరో రెండు వికెట్లు సాధిస్తే ఆ ఘనత అతడి సొంతమవుతుంది. ఇప్పటికే ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా హర్షల్ పటేల్ నిలిచిన సంగతి తెలిసిందే. ఎలిమినేటర్ మ్యాచ్ లో భాగంగా నేడు(సోమవారం) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. చదవండి: Virat Kohli: కెప్టెన్సీ నుంచి ఎందుకు తప్పుకున్నాడో బయట పెట్టిన కోహ్లి... -
చరిత్ర తిరగరాసిన ఆర్సీబీ బౌలర్.. బుమ్రా రికార్డు బద్దలు
Harshal Patel Breaks Bumrah IPL Record: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్ హర్షల్ పటేల్ చరిత్రను తిరగరాసాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా పేరిట ఉన్న రికార్డు(27 వికెట్లు)ను బద్దలు కొట్టి.. ఓ ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్గా నిలిచాడు. బుధవారం సన్రైజర్స్తో మ్యాచ్లో మూడు వికెట్లు పడగొట్టిన హర్షల్.. అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ప్రస్తుతం ఈ సీజన్లో హర్షల్ ఖాతాలో 29 వికెట్లు ఉన్నాయి. ఈ సీజన్లో ఆర్సీబీ కనీసం మరో రెండు మ్యాచ్లు ఆడే అవకాశం ఉండడంతో అతను ఐపీఎల్ సీజన్లో అత్యధిక వికెట్ల రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. ఈ రికార్డు చెన్నై బౌలర్ డ్వేన్ బ్రావో పేరిట ఉంది. 2013 సీజన్లో బ్రేవో ఏకంగా 32 వికెట్లు పడగొట్టాడు. కాగా, లీగ్ దశలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆర్సీబీ ప్లేఆఫ్స్కు చేరుకున్న సంగతి తెలిసిందే. చదవండి: Umran Malik: పళ్లు, కూరగాయలు అమ్ముతాం.. మమ్మల్ని గర్వపడేలా చేశాడు