-
USA Presidential Elections 2024: తప్పుకోవాలంటూ బైడెన్పై ఒత్తిళ్లు
వాషింగ్టన్: అట్లాంటాలో టీవీలో ముఖాముఖి చర్చలో రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ధాటికి చేతులెత్తేసిన డెమొక్రటిక్ అభ్యర్థి, అధ్యక్షుడు జో బైడెన్పై సొంత పారీ్టలోనే వ్యతిరేకత ఎక్కువవుతోంది. 81 ఏళ్ల వయసున్న ఆయన అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలని డిమాండ్లు పెరుగుతున్నాయి. ఆయన మాత్రం తాను తప్పుకునే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు! ట్రంప్తో చర్చలో బైడెన్ పేలవ ప్రదర్శనను పలు మీడియా సంస్థలు సంపాదకీయాల్లో ఏకిపారేశాయి. సోషల్ మీడియాలో మీమ్స్కు కొదువే లేదు. ఈ విమర్శలపై బైడెన్ స్పందించారు. ‘‘బరాక్ ఒబామా మాదిరి ప్రత్యర్థిని నేను వాగ్ధాటితో ఇరుకున పెట్టలేకపోయిన మాట వాస్తవమే. దీనిపై నా మద్దతుదారులు, పారీ్టలోనూ కొంత అసంతృప్తి నెలకొందని తెలుసు. కానీ ట్రంప్పై మరింతగా పోరాడతా’ అని అన్నారు. డెమొక్రటిక్ ముఖ్యుల్లో పెరిగిన అసంతృప్తి ట్రంప్తో డిబేట్ తర్వాత బైడెన్ అభ్యరి్థత్వంపై చాలా మంది డెమొక్రటిక్ నేషనల్ కమిటీ(డీఎన్సీ) సభ్యుల్లో అసమ్మతి పెరిగింది. యువనేతకు అవకాశమిశ్వాలన్న డిమాండ్ తెరపైకి వస్తోంది. షికాగోలో ఆగస్ట్ 19న జరిగే డెలిగేట్ల భేటీలో దీనిపై కీలక నిర్ణయం తీసుకోవచ్చని పార్టీ వర్గాల కథనం. -
బిగ్ డిబేట్లో బైడెన్ బేజారు!.. ‘నేనేం కుర్రాడిని కాదుగా’
వాషింగ్టన్: వాడీవేడిగా సాగిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(81), మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(78)ల చర్చ యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. నువ్వు అబద్ధాలకోరువంటే.. నువ్వే అబద్ధాలకోరువంటూ మాటల దాడి చేసుకున్నారు ఈ ఇద్దరూ. అయితే డిబేట్లో ట్రంప్ పైచేయి సాధించారంటూ బైడెన్ డెమొక్రటిక్ సహచరులు సైతం అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం.ట్రంప్తో సాగిన డిబేట్లో తన ప్రదర్శపై అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం స్పందించారు. ‘‘స్పష్టంగా చెప్పాలంటే.. నేను కుర్రాడిని కాదనే విషయం నాకు తెలుసు. అలాగని నడకలోనూ, మాటల్లోనూ, చర్చల్లోనూ అంత తేలికగా వ్యవహరించను. నేను ఈ బాధ్యతను(అధ్యక్ష పదవి) మళ్లీ సమర్థవంతంగా నిర్వహించగలనని మనసారా, ఆత్మ సాక్షిగా నమ్మాను. కాబట్టే మళ్లీ బరిలో నిలుచున్నా. ఏది ఏమైనా.. అధ్యక్ష రేసు నుంచి తప్పుకునేది లేదు. రిపబ్లికన్ ప్రత్యర్థి ట్రంప్ను ఓడించి తీరతా’’ అని బైడెన్ అన్నారు.దేశాధ్యక్ష పీఠం కోసం డెమొక్రటిక్ పార్టీ నుంచి బైడెన్, రిపబ్లికన్ల తరఫున ట్రంప్ బరిలో ఉన్న సంగతి తెలిసిందే. అమెరికా కాలమానం ప్రకారం గురువారం రాత్రి(భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) జరిగిన డిబేట్లో పరస్పరం తీవ్ర విమర్శలు గుప్పించుకున్నారు. నవంబరులో జరగనున్న అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి వీరిద్దరి మధ్య ఇదే తొలి ముఖాముఖి చర్చ. దేశ ఆర్థిక వ్యవస్థ, సరిహద్దు, విదేశాంగ విధానం, గర్భవిచ్ఛిత్తి తదితర అంశాలపై ఒకరికొకరు ప్రశ్నలు సంధించుకొని.. దాదాపు 90 నిమిషాలపాటు ఆరోపణలు గుప్పించుకున్నారు. -
Presidential Debate: ట్రంప్ జోరు బైడెన్ బేజారు
అట్లాంటా: అమెరికా అధ్యక్ష ఎన్నికల రేసులో రిపబ్లికన్ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (78) దూకుడు పెంచారు. దేశాధ్యక్షుడు, డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్తో తొలి ప్రెసిడెన్షియల్ డిబేట్లో స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించారు. శుక్రవారం (భారత కాలమానం ప్రకారం) సీఎన్ఎన్ చానల్లో దాదాపు 90 నిమిషాల పాటు జరిగిన వాదనలో బైడెన్ సర్వశక్తులూ ఒడ్డారు. తన వయసుపై విమర్శలు, అధ్యక్ష బాధ్యతలను సజావుగా నిర్వర్తించడంపై అమెరికన్లలో నానాటికీ పెరుగుతున్న అనుమానాలను కొట్టిపారేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేశారు. ట్రంప్ తనకంటే కేవలం మూడేళ్లే చిన్నవాడని పదేపదే చెప్పుకున్నారు. కానీ డిబేట్ పొడవునా బైడెన్ పదేపదే తడబడ్డారు. ప్రసంగం మధ్యలో ఉన్నట్టుండి మౌనాన్ని ఆశ్రయించారు. మాటల కోసం తడుముకున్నారు. తనలో తానే గొణుక్కుంటూ కన్పించారు. మాట్లాడుతున్న అంశాన్ని అర్ధంతరంగా వదిలేసి మరో విషయం ఎత్తుకుని ఆశ్చర్యపరిచారు. కొన్నిసార్లు బైడెన్ ఏం చెప్తున్నదీ ఎవరికీ అర్థం కూడా కాలేదు. పలు అంశాలపై ట్రంప్ పచ్చి అబద్ధాలు చెప్పినా వాటిని ఎత్తిచూపడంలో, సొమ్ము చేసుకోవడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు. తనకు అనుకూలమైన గణాంకాలను సమయానుకూలంగా ప్రస్తావించడంలో కూడా చతికిలపడ్డారు. డిబేట్లో ట్రంపే నెగ్గారని సీఎన్ఎన్ పోలింగ్లో ఏకంగా 67 శాతం మంది ఓటర్లు పేర్కొన్నారు. బైడెన్కు 33 శాతం ఓట్లే లభించాయి. న్యూయార్క్ టైమ్స్ వంటి ప్రఖ్యాత వార్తా పత్రికలు కూడా తొలి డిబేట్ ట్రంప్దేనని పేర్కొన్నాయి. ‘‘బైడెన్పై వయోభారం కొట్టొచ్చినట్టు కని్పస్తోంది. ఆయన మాటతీరులోనూ అది స్పష్టంగా ప్రతిఫలించింది. ఆయన చెబుతున్న విషయాల్లో పొందికే లేకుండా పోయింది’’ అంటూ విమర్శలు గుప్పించాయి. దూకుడుకు మారుపేరైన ట్రంప్కు 81 ఏళ్ల బైడెన్ ఏ మేరకు పోటీ ఇవ్వగలరోనంటూ డెమొక్రాట్లలో ఇప్పటికే గట్టిగా ఉన్న అనుమానాలు కాస్తా తాజా డిబేట్ నేపథ్యంలో ఆందోళనగా మారాయి. వాదనలో బైడెన్ తొలుత కాస్త వెనకబడ్డారని ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కూడా అంగీకరించారు. అయితే క్రమంగా పుంజుకుని సమర్థంగా ముగించారని చెప్పుకొచ్చారు. బైడెన్ భార్య జిల్ మాత్రం తన భర్త భలే బాగా మాట్లాడారంటూ ప్రశంసించారు! ‘‘ప్రతి ప్రశ్నకూ చక్కగా బదులిచ్చావు. అన్ని సమాధానాలూ తెలుసు నీకు!’’ అంటూ ఆయన్ను మెచ్చుకున్నారు. కానీ ఈ డిబేట్ నేపథ్యంలో బైడెన్ అధ్యక్ష రేసు నుంచి తప్పుకోవాలంటున్న వారి సంఖ్య డెమొక్రాట్లలో క్రమంగా పెరుగుతోంది. ట్రంప్, బైడెన్లను అధ్యక్ష అభ్యర్థులుగా ఇంకా లాంఛనంగా ప్రకటించాల్సి ఉంది. జూలై 15–18 మధ్య జరిగే సదస్సులో రిపబ్లికన్లు, ఆగస్టు 19న సదస్సులో డెమొక్రాట్లు తమ అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటిస్తారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్ 5న జరగనున్నాయి. పరస్పర విమర్శల వర్షం... అమెరికా ఆర్థిక వ్యవస్థ, అబార్షన్ చట్టం, విదేశీ వ్యవహారాలు, వలసల వంటి పలు అంశాలపై ట్రంప్, బైడెన్ మధ్య వాడివేడి వాదనలు సాగాయి. ఆ క్రమంలో నేతలిద్దరూ తిట్ల పర్వానికి దిగారు. ‘‘నువ్వే అబద్ధాలకోరు. అమెరికా చరిత్రలోనే అత్యంత చెత్త ప్రెసిడెంట్ కూడా నువ్వే’’ అంటూ పరస్పరం దుయ్యబట్టుకున్నారు. పలు రకాల విమర్శలు చేసుకున్నారు. హష్ మనీ కేసు దోషి అంటూ ట్రంప్కు బైడెన్ చురకలు వేశారు. ‘‘జరిమానాలుగా నువ్వు ఎన్ని బిలియన్ డాలర్లు కట్టాలో గుర్తుందా? భార్య గర్భవతిగా ఉండగా నీలి చిత్రాల తారతో గడిపావు. నైతికత విషయంలో వీధుల్లో విచ్చలవిడిగా తిరిగే పిల్లి కంటే కూడా హీనం’’ అంటూ విమర్శల వర్షం కురిపించారు. బైడెన్తో పాటు ఆయన కుమారుడు హంటర్ కూడా క్రిమినలేనంటూ మాజీ అధ్యక్షుడు ట్రంప్ కూడా విరుచుకుపడ్డారు. అస్తవ్యస్తమైన వలసల విధానంతో దేశ భవితవ్యాన్నే బైడెన్ ప్రమాదంలోకి నెట్టారంటూ దుయ్యబట్టారు. డిబేట్ ఆరంభం నుంచే ట్రంప్ పై చేయి కనబరిచారు. ఆయనను ఇరుకున పెట్టేందుకు బైడెన్ చేసిన ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు. -
తొలి రౌండ్ ట్రంప్దేనా!
లాంఛనంగానైనా కరచాలనాల్లేవు. మర్యాదకైనా చిరునవ్వుల్లేవు. అసలు ఒకరివైపు ఒకరు చూసుకున్న క్షణాలే లేవు. శుక్రవారం దాదాపు 90 నిమిషాలపాటు సాగిన అమెరికా అధ్యక్ష అభ్యర్థుల తొలి సంవాదం అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్లపై ఇప్పటికే ప్రజానీకంలో పాతుకుపోయిన అభిప్రాయాలను మరింత దృఢపరిచింది. బైడెన్ తన విజయాలను ఘనంగా చాటలేరు. ట్రంప్ కన్నార్పకుండా అబద్ధాలు వల్లించటం మానుకోలేరు. వృద్ధాప్య ఛాయలు తనలో మచ్చుకైనా లేవని చాటేందుకు 81 యేళ్ల బైడెన్ తాపత్రయపడితే... న్యాయస్థానం తనను అపరాధిగా నిర్ధారించినా ఆత్మవిశ్వాసం మచ్చుకైనా సడల్లేదన్న అభిప్రాయం కలిగించేందుకు 78 యేళ్ల ట్రంప్ తంటాలుపడ్డారు. చిత్రమేమంటే – ఈ అంశాల్లో ఇద్దరికిద్దరూ విఫలమయ్యారు. బైడెన్కి ఇప్పటికే ఉన్న పాయింట్లు ఇంకా తగ్గగా... ట్రంప్ కాస్త మెరుగుపడిన మాట నిజమే అయినా అనుకున్నంతగా లేదు. 1960లో అధ్యక్ష పదవికి పోటీపడిన జాన్ ఎఫ్ కెనెడీ, రిచర్డ్ నిక్సన్లతో ప్రారంభమైన ఈ సంవాదం ఇంత పేలవంగా సాగిన సందర్భాలు ఎప్పుడూ లేవన్నది విశ్లేషకుల మాట. వచ్చే సెప్టెంబర్ 10న జరగబోయే రెండో సంవాదం సమయానికైనా బైడెన్ మెరుగుపడతారో లేదోనన్న దిగులు డెమాక్రటిక్ పార్టీని నిలువెల్లా వణికిస్తుండగా, రిపబ్లికన్ పార్టీ మాత్రం కులాసాగా సేదతీరుతోంది. బైడెన్ వంటి బలహీనుడు ప్రత్యర్థిగా ఉన్నప్పుడు ఇక చింత ఎందుకన్నది దాని భావన కావొచ్చు. ట్రంప్ను మించిన గెలుపు గుర్రం లేదని ఆ పార్టీ ఎప్పుడో నిర్ణయానికొచ్చింది. అధ్యక్ష అభ్యర్థుల సంవాదంలో మన మాదిరిగా అరుపులూ, కేకలూ ఉండవు. ఎదురుగా జేజేలుకొట్టే అభిమానులూ ఉండరు. ఒకరి ప్రసంగాల్లోకి ఒకరు చొరబడే సంస్కృతి కూడా లేదు. ప్రత్యర్థి చెప్పింది పూర్తిగా విని దీటైన, సహేతుకమైన జవాబు చెప్పగలిగినవారికి మద్దతు పెరుగుతుంది. కానీ ఇద్దరికీ అది పట్టలేదు. అడిగిన ప్రశ్నల్ని దాటేసే ట్రంప్ తీరు బుల్డోజర్ని మరపిస్తే, బైడెన్కు మాట పెగలడమే కష్టమైనట్టు కనబడింది. ట్రంప్ సంధించిన ప్రశ్నలకు జవాబివ్వటంతో మొదలుపెట్టినా... హఠాత్తుగా సంబంధంలేని మరో అంశంలోకి వెళ్లి బైడెన్ అయోమయంలో పడిన సందర్భాలు అనేకం. ట్రంప్లో గతానికి మించిన మూర్ఖత్వం మూర్తీభవించివున్నదని, ఆయన్ను ఎన్నుకుంటే దేశం ప్రమాదంలో పడుతుందని చెప్పటం బైడెన్ ఉద్దేశం. కానీ అది సమర్థవంతంగా చెప్పలేకపోయారు. 2020 నాటి సంవాదం స్థాయిలోనైనా మాట్లాడలేకపోయారు. తన హయాంలోని వైఫల్యాలను కప్పిపుచ్చటమేకాదు... బైడెన్ విజయాలను మరుగుపరచటంలో ట్రంప్ విజయం సాధించారు.వేరే దేశాల ఎన్నికలు ఎవరికీ పెద్దగా పట్టవు. కానీ ప్రపంచాన్నే శాసించే అమెరికాలో జరిగే ప్రతిదాన్నీ జాగ్రత్తగా గమనిస్తారు. యూరప్ ఖండం మొదలుకొని ఉత్తర కొరియా వరకూ అందరూ ఆసక్తి కనబరుస్తారు. సహజంగానే ఉక్రెయిన్లో రష్యా... గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న దురాక్రమణ యుద్ధాలూ, నాటోతో సంబంధాలూ, ప్రపంచంలో అమెరికా పరువు ప్రతిష్ఠలూ చర్చకొచ్చాయి. అలాగే దేశ ఆర్థిక వ్యవస్థ, వలసలు, ద్రవ్యోల్బణం, అబార్షన్లు సైతం ప్రధాన భాగం ఆక్రమించాయి. పుతిన్ను ప్రోత్సహించింది నువ్వంటే నువ్వని పరస్పరం ఆరోపణలు చేసుకోవటం ఆసక్తి కలిగించే అంశం. యూరప్ దేశాలు నాటో వ్యయంలో తమ వాటా చెల్లించకపోతే సంస్థనే మూసేస్తానని ట్రంప్ బెదిరించటం పరోక్షంగా పుతిన్ను సమర్థించినట్టేనని బైడెన్ వాదించగా... అసలు ఉక్రెయిన్పై దాడికి పురిగొల్పిందే బైడెన్ అని ట్రంప్ ఎదురు దాడి చేయటం గమనించదగ్గది. అఫ్గాన్ నుంచి వైదొలగే క్రమంలో జరిగిన భంగపాటే పుతిన్కు ధైర్యాన్నిచ్చిందని ఆయన దబాయించారు. ఉక్రెయిన్కు నిధుల వరద పారిస్తూపోతే ప్రజలను మరింత కుంగదీస్తుందన్నది ట్రంప్ వాదన. అయితే ఇజ్రాయెల్ విషయంలో ఇద్దరిదీ ఒకే మాట! కాకపోతే ఆ దేశానికి అన్నివిధాలా మద్దతిస్తున్నామని బైడెన్ అంటే... అదింకా సరిపోదన్నది ట్రంప్ ప్రత్యుత్తరం. యూదు వోటర్లు గణనీయంగా ఉండటంవల్లే ఇలా ఒకరిని మించి ఒకరు ప్రేమ ఒలకబోశారు. పైగా బైడెన్ పాలస్తీనీయుడిగా మారారని ట్రంప్ ఆరోపించారు. బైడెన్ మెతకదనం ఆసరా చేసుకుని వేరే దేశాల ప్రభుత్వాలు జైళ్లు, పిచ్చాసుపత్రులు ఖాళీ చేయించి అందరినీ అమెరికా పంపుతున్నారనడంలోని అంతరార్థం శ్వేత జాతి వోటర్లను ప్రసన్నం చేసుకునేందుకే! దేశంలో ద్రవ్యోల్బణం క్రమేపీ తగ్గుతున్నా అల్పాదాయ, మధ్యాదాయ వర్గాలను ఇంకా వేధిస్తూనే వుంది. అయితే మాంద్యం బెడద తొలగింది. ఉపాధి అవకాశాలు పెరిగాయి. ధరలూ తగ్గాయి. కానీ వీటిని బైడెన్ గట్టిగా చెప్పలేకపోగా, కార్మికవర్గం సమస్యల్లో ఉందన్న ట్రంప్ వాదనతో ఏకీభవించారు. ట్రంప్ హయాంలో ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిన వైనాన్ని అందరికీ గుర్తు చేయటంలో బైడెన్ విజయం సాధించారు. అబార్షన్కు వాడే మాత్రకు తాను వ్యతిరేకం కాదని ట్రంప్ చెప్పక తప్పలేదు. ఇది మహిళల ఘనవిజయం. ప్రత్యర్థితో గంటన్నరపాటు వాగ్యుద్ధానికి తలపడినప్పుడు ఏదో ఒక సమయంలో ఓటమి ఎదురయ్యే పరిస్థితి రావొచ్చు. కానీ తొలి పది నిమిషాలూ నిబ్బరంగా లేనివారు ఓటమి నుంచి తప్పించుకోలేరంటారు. సంవాదంలో బైడెన్కు అదే జరిగింది. ఆయన ప్రసంగం తడబాట్లతో మొదలైంది. చాలాసార్లు సణుగుడుగా మిగిలిపోయింది. ట్రంప్ అడుగుతున్నప్పుడు నోరు తెరుచుకుని ఉండటం కూడా వీక్షకులను నిర్ఘాంతపరిచింది. మొత్తానికి తొలి రౌండ్లో ట్రంప్దే పైచేయి. -
Watch: బైడెన్ Vs ట్రంప్ వాడీవేడీ మాటల దాడి..
Live Updates..👉బైడెన్, ట్రంప్ మధ్య ముగిసిన డిబెట్.. Watch Joe Biden get escorted off the stage! What a stark contrast between how Trump left the stage and how Biden is exiting. #debate pic.twitter.com/Um9xhPAyMs— Donald Trump Jr. (@DonaldJTrumpJr) June 28, 2024 👉డిబెట్లో భాగంగా సహనం కోల్పోయిన బైడెన్.. ట్రంప్పై తీవ్ర వ్యాఖ్యలు VIDEO: Very horrible moment for Joe Biden, he loses control, and loses his train of thought and just froze. #biden #trump #debate #Debates2024 pic.twitter.com/nwa5J7at6Z— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024 👉గత ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా?👉ట్రంప్ సమాధానిమిస్తూ.. ఇది న్యాయమైన, చట్టబద్ధమైన ఎన్నికలు అయితే ఖచ్చితంగా అంగీకరిస్తాను. కానీ ఈ ఎన్నికలు మోసం, హాస్యాస్పదంగా జరిగాయి.👉బైడెన్ స్పందిస్తూ.. ట్రంప్ నువ్వు ఓడిపోయావు. అనంతరం, దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారు. మీ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే ఏ న్యాయస్థానాలు గుర్తించలేదు. మోసం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవు. మళ్లీ ఓడిపోతే దాన్ని అంగీకరిస్తారని నేను అనుకోవడం లేదు. VIDEO: Trump: "I really don't know what he said at the end of that sentence; I don't think he knows what he said either." #trump #biden #Debates2024 #debate pic.twitter.com/PX95oDF4Xy— Prince Carlton 🇺🇸 (@_PrinceCarlton_) June 28, 2024 👉ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం, పాలస్తీనా స్వతంత్ర దేశానికి మద్దతు ఇస్తారా? అన్న ప్రశ్నపై ట్రంప్ స్పందిస్తూ.. దానిపై ఆలోచిస్తాం అని చెప్పుకొచ్చారు.బైడెన్ బలహీనుడు. అతను ఇప్పుడు పాలస్తీనియన్ వ్యక్తిగా మారిపోయాడు. అయినప్పటికీ బైడెన్ను వారు ఇష్టపడటం లేదు. Donald Trump to Joe Biden during the Presidential debate:“He’s become like a Palestinian. They don’t like him because he’s a very bad Palestinian. He’s a weak one.” pic.twitter.com/pi9leLCmS8— Pop Base (@PopBase) June 28, 2024 👉అమెరికాలో చరిత్రలో బైడెన్ వంటి అసమర్థ నాయకుడిని ఎన్నడూ చూడలేదు: ట్రంప్ Donald Trump and Joe Biden get into an argument over golfing skills during the Presidential debate. pic.twitter.com/guuYjcLUSn— Pop Base (@PopBase) June 28, 2024 👉డిబెట్ సందర్భంగా పలు అంశాలపై ఇద్దరూ నేతలు మాటల దాడి చేసుకున్నారు. ముఖ్యంగా సరిహద్దుల గురించి, బైడెన్ తీసుకువచ్చిన పలు చట్టాలపై మాటల దాడి జరిగింది. 👉బైడెన్పై విరుచుకుపడిన ట్రంప్.. బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నలు చేశారు. అతడిని అరెస్ట్ కాకుండా కాపాడుకున్నారు. Donald Trump says he has “the biggest heart on this stage” during the Presidential debate. pic.twitter.com/hmKPtu2EXs— Pop Base (@PopBase) June 28, 2024 👉 ఉక్రెయిన్ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఉక్రెయిన్ అంశాన్ని ట్రంప్ ప్రస్తావిస్తూ.. నేను అధ్యక్షుడిగా ఉండి ఉంటే ఉక్రెయిన్పై దాడులు జరిగేవి కాదు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారు. 👉సరిహద్దుల విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాల కారణంగా అమెరికా నష్టపోయిందని బైడెన్ ఫైరయ్యారు. 👉 చర్చ సందర్భంగా ఇరువురూ తీవ్ర వ్యాఖ్యలు చేసుకున్నారు. ట్రంప్ లూసర్ అంటూ బైడెన్ అన్నారు. Joe Biden calls Donald Trump a ‘sucker’ and ‘loser’ during the Presidential debate while defending his son. pic.twitter.com/ZpvyZv1DlM— Pop Base (@PopBase) June 28, 2024 👉ఆప్ఘనిస్థాన్ విషయంలో బైడెన్ తీసుకున్న చర్యల కారణంగా 13 మంది అమెరికా భద్రతా సిబ్బంది అమరులయ్యారని ట్రంప్ ఆరోపించారు. అమెరిక్లను కాపాడటంలో బైడెన్ దారుణంగా విఫలమయ్యారు. I can’t believe Joe Biden is actually BOASTING about his Afghanistan withdrawal. 13 servicemembers were kiIIed during his disastrous withdrawal!REMEMBER THEIR NAMES!Johanny Rosario PichardoNicole L. GeeDarin T. HooverHunter LopezDaegan W. PageHumberto A. SanchezDavid L.… pic.twitter.com/uQPHRrghPv— Libs of TikTok (@libsoftiktok) June 28, 2024 👉 ట్రంప్నకు ఓటు వేస్తే ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్టేనన్న జో బైడెన్. ట్రంప్ వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని విమర్శించారు. Joe Biden just declared that every single person who votes for Trump is voting against American democracy. He just vilified well over half the country. This is the most disgraceful thing he has said on the stage tonight. pic.twitter.com/KoEOqP9Z6U— Riley Gaines (@Riley_Gaines_) June 28, 2024 👉ద్రవ్యోల్బణం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అనే అంశంపై చర్చ మొదలైంది.👉ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రతిఫలమిచ్చారని, ఫ్రీఫాల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలింది, ఉద్యోగాలు లేవు, నిరుద్యోగం రేటు 15%కి పెరిగింది, ఇది భయంకరమైనది అన్నారు. 👉దీనికి ప్రతిగా ట్రంప్ మాట్లాడుతూ.. చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. బైడెన్ పరిపాలనలో ఉద్యోగ వృద్ధి కేవలం అక్రమవలసదారులకు మాత్రమే జరిగిందన్నారు. దేశంలో ద్రవ్యోల్భణం ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. 👉చర్చ సందర్భంగా ముఖ్యంగా అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. 👉అగ్ర రాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య వాడీవేడి చర్చా కార్యక్రమం జరుగుతోంది. ఇరువురు నేతలు ముఖాముఖి డిబెట్లో పాల్గొన్నారు.👉అమెరికా చర్రితలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత అధ్యక్షుడు, మాజీ అధ్యక్షుడు చర్చలో పాల్గొన్నారు. -
నేడే బైడెన్, ట్రంప్ బిగ్ డిబేట్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో నిలిచిన రాజకీయ ప్రత్యర్థులు జో బైడెన్, డొనాల్డ్ ట్రంప్ ప్రత్యక్ష చర్చా కార్యక్రమానికి సిద్ధమవుతున్నారు. ఇరువురు నేతలు గురువారం జరిగే ముఖాముఖి డిబేట్లో పాల్గొంటారు. బైడెన్, ట్రంప్ గత ఎన్నికల్లో పరస్పరం పోటీపడిన సంగతి తెలిసిందే. ఈసారి వారిద్దరూ మళ్లీ పోటీ చేస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల ముందు అభ్యర్థుల మధ్య ఆనవాయితీగా జరిగే డిబేట్ గురువారం జరుగనుంది. -
అమెరికాకు ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా: డొనాల్డ్ ట్రంప్
న్యూయార్క్: అమెరికా ఎన్నికల ప్రచారంలో ఇరుపార్టీల నేతలు, ప్రచార బృందాల విమర్శల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా శనివారం రాత్రి ఓ ప్రచార ర్యాలీలో పాల్గొన్న మాజీ అధ్యక్షుడు, రిపబ్లిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్.. అధ్యక్షుడు జో బైడెన్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఫిలడెల్ఫియాలోని టెంపుల్ యూనివర్సిటీలో క్యాంపస్ వద్ద ట్రంప్ మాట్లాడారు. ‘నాలుగు ఏళ్ల క్రితం ఆమెరికా ఒక గొప్పదేశంగా ఉండేది. అంతే స్థాయిలో మరికొన్ని రోజుల్లో అమెరికా గొప్ప దేశం నిల్చోబెడతా. యూఎస్- మెక్సికో సరిహద్దుల్లో వివాదం కొనసాగుతోంది. దీంతో కొంత కాలం నుంచి పెద్ద సంఖ్యలో అమెరికాలో వలసలు పెరిగాయి. బహిష్కరణ విధానాలతో వలసలపై కఠిన చర్యలు తీసుకుంటాను. మోసగాడైన జో బైడెన్.. సోదరభావంతో ఉండే ఫిలడెల్ఫియా సిటీని మొత్తం నేరాలు, రక్తపాతంతో నాశానం చేశారు. ఇక్కడ అక్రమ వలసలు భారీగా పెరిగిపోయాయి. ఇదంతా ‘బైడెన్ వలస నేరం’. .. మన దేశ చరిత్రలో సురకక్షితమైన సరిహద్దులు కలిగి ఉండేవాళ్లం. కానీ ఇప్పడు మనం ప్రపంచ చరిత్రలోనే రక్షణ లేని సరిహద్దులను కలిగి ఉన్నాం. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగకుండా, ఆర్థిక సమస్యలను పరిష్కరిస్తాను. బైడెన్ ఆర్థిక విధానాలను మార్చివేస్తాను. రక్షణ వ్యవస్థలో కూడా మరిన్ని మార్పులు తీసుకువస్తా. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ మాదిరిగా అమెరికాకు సైతం ఐరన్ డోమ్ ఏర్పాటు చేస్తా’అని ట్రంప్ అన్నారు.ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరుగనున్నాయి. జాతీయవాదిగా, వలసలను త్రీంగా వ్యతిరేకించే నేతగా పేరున్న ట్రంప్ ఇటీవల అమెరికాలోని కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్ గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకువస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
గ్రాడ్యుయేట్లకు అమెరికా గ్రీన్ కార్డు: ట్రంప్
వాషింగ్టన్: జాతీయవాదిగా, వలసలను వ్యతిరేకించే నాయకుడిగా పేరుగాంచిన అమెరికా రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తన ధోరణి మార్చుకున్నారు. అమెరికాలో చదువుకొనే విదేశీ విద్యార్థులకు తీపి కబురు చెప్పారు. తాజాగా ఆల్–ఇన్ పాడ్కాస్ట్లో మాట్లాడారు. అమెరికా కాలేజీల్లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన విదేశీ విద్యార్థులకు అటోమేటిక్గా గ్రీన్ కార్డులు అందించే విధానం తీసుకొస్తామని హామీ ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత సొంత దేశాలకు తిరిగి వెళ్లిపోవాల్సిన అవసరం ఉండదని, అమెరికాలోనే ఉండొచ్చని వెల్లడించారు. జూనియర్ కాలేజీల్లో చదువుకున్నవారికి సైతం గ్రీన్కార్డులు ఇస్తామన్నారు. ఇండియా, చైనా దేశాల విద్యార్థులు అమెరికా కాలేజీల్లో చదువుకొని, స్వదేశాలకు తిరిగివెళ్లి మల్టీ బిలియనీర్లుగా పైకి ఎదుగుతున్నారని, పరిశ్రమలు స్థాపించి, వేలాది మందికి ఉపాధి కలి్పస్తున్నారని చెప్పారు. వారు ఇక్కడే ఉండేలా చేస్తే అమెరికాకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యరి్థగా ట్రంప్ మరోసారి బరిలోకి దిగుతుండటం తెలిసిందే. -
గెలిస్తే గ్రాడ్యుయేట్లకు గ్రీన్ కార్డ్.. ట్రంప్ హామీ
భారతదేశంలో మాత్రమే కాకుండా.. చాలా దేశాల్లోని విద్యార్థులు అమెరికాలో గ్రాడ్యుయేట్ చేయాలని ఉవ్విల్లూరుతూ ఉంటారు. అలాంటి వారు గ్రీన్ కార్డు పొందాలని కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఈ తరుణంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేశారు.జరగబోయే ఎన్నికల్లో తాను గెలిస్తే.. అమెరికాలోని కాలేజీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమాతో పాటే వారికి గ్రీన్ కార్డు ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అధికారిలోకి వచ్చిన మొదటి రోజే ఇది అమలయ్యేలా చర్యలు తీసుకుంటానని అన్నారు. జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థులకు కూడా గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు ప్రకటించారు.కరోనా సమయంలో దీన్ని అమలు చేయలేకపోయామని, ఇప్పుడు కూడా అమెరికా, చైనా నుంచి వస్తున్న విద్యార్థులు వీసా సమస్యల కారణంగా మన దేశంలో ఉండలేకపోతున్నారని అన్నారు. అమెరికాలో చదువుకుని వారు సొంత దేశాలకు వెళ్లిపోతున్నారని పేర్కొన్నారు.గతంలో అమెరికాలోని విదేశీయలను వెళ్లగొట్టిన ట్రంప్ ఇప్పుడు రూటు మార్చారు. రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకునేందుకు ఎన్నికల బరిలో డిగ్గనున్నట్లు సమాచారం. సాధారణంగా వలస విధానం మీద తీవ్రంగా విరుచుకుపడే ట్రంప్.. ఈ సారి మాత్రం దీనికి భిన్నంగా వ్యాఖ్యానించారు. గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వారికి.. తాను ఎన్నికల్లో గెలిస్తే గ్రీన్ కార్డు ఇవ్వనున్నట్లు హామీ ఇచ్చారు.అమెరికాలోకి అక్రమంగా చొరబడే వారి వల్ల సమస్యలు తలెత్తుతున్నాయని.. లీగల్గా అమెరికాలోకి వస్తే తమకు ఎలాంటి ఇబ్బంది లేదని ట్రంప్ గతంలోని చాలా సందర్భాల్లో పేర్కొన్నారు. అక్రమ వలసదారుల వల్లే నిరుద్యోగం, నేరాలు, దోపీడీ వంటివి పెరుగుతున్నాయని ట్రంప్ అన్నారు. -
అమెరికాలో పొలిటికల్ హీట్.. ట్రంప్ జైలుకా, వైట్ హౌస్కా
అమెరికా అధ్యక్షుడు అవుతూనే వరస నిర్ణయాలతో మొత్తం ప్రపంచం ఉలిక్కిపడేలా చేశారు ట్రంప్. మెక్సికో-అమెరికా మధ్య గోడ, ఏడు దేశాల నుంచి శరణార్థులను, వలసలను నిషేధించడం. ఇలా అనేక దేశాలను వణికించేశారు. ఆ తర్వాత నాలుగేళ్ల పాలన కూడా అలానే సాగింది. మాకీ అధ్యక్షుడు వద్దు బాబోయ్ అంటూ వాషింగ్టన్ డీసీలో భారీ పింక్ ర్యాలీ మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది. ఇలా వివర్శలు, వివాదాల కేంద్రంగానే ట్రంప్ పాలన సాగింది. ఇప్పుడు మళ్లీ అధ్యక్ష పదవికి పోటీ చేయడానికి రెడీ అయిన నేపథ్యంలో...జైలుకా, వైట్ హౌస్కా అన్న చర్చ మొదలైపోయింది. ఈ ఎపిసోడ్కి ఎలాంటి ముగింపు పడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికన్నా కొద్ది రోజుల ముందే...డోనల్డ్ ట్రంప్ కూడా క్రిమినల్ కేసులో దోషిగా తేలారు. ఒక క్రిమినల్ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు దోషిగా తేలడం అన్నది ఇదే తొలిసారి. ఇది అమెరికా గౌరవానికి భంగపాటు అన్న వాదన ఒకవైపు వినిపిస్తున్నా...ట్రంప్ ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. అంటు రిపబ్లికన్స్ కూడా అదే స్థాయిలో ట్రంప్కి మద్దతుగా నిలుస్తున్నారు. మన్ హట్టన్ కోర్టు ఇచ్చే తీర్పుని తాను లెక్క చేయనని నవంబర్ 5వ తేదీన అసలైన తీర్పు వస్తుందంటున్నారు ట్రంప్. నవంబర్ 5 ఎలక్షన్ డే. అయితే...అందరి చూపు మాత్రం ఇప్పుడు జులై 11వ తేదీన న్యాయమూర్తి జువాన్ మర్చన్ ఖరారు చేసే శిక్ష ఏంటన్న దానిపైనే ఉంది. శిక్ష ఖరారు చేసే సమయంలో ట్రంప్ వయస్సు, గతంలో నేర చరిత్ర లేకపోవడం, గతంలో కోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్లను ఫాలో కావడంలో ఫెయిల్ అవడం...ఇలా అనేక అంశాలను జడ్జి పరిగణలోకి తీసుకుంటారు. దీంతో...జరిమానాతో సరిపెడతారా ? లేక జైలు శిక్ష విధిస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది. హష్ మనీ కేసులో ట్రంప్ పై మొత్తం 34 అభియోగాలు ఉన్నాయి. న్యూయార్క్ చట్టాల ప్రకారం ఇవి తక్కువ తీవ్రత ఉన్న కేసులే అయినా...గరిష్టంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడవచ్చు. ఒక వేళ ట్రంప్కి జైలు శిక్ష పడితే...అనేక ప్రాక్టికల్ సమస్యలు ఉత్పన్నం కావడం ఖాయమని చెబుతున్నారు. అమెరికా అధ్యక్షుడికి సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటుంది. కేవలం అధ్యక్షుడికి మాత్రమే కాదు. మాజీ అధ్యక్షులకు కూడా జీవితాంతం సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ పొందే హక్కు ఉంది. ట్రంప్కి కూడా సీక్రెట్ సర్వీస్ ప్రొటెక్షన్ ఇస్తోంది. ఇప్పుడు హష్ మనీ కేసులో ట్రంప్కి జైలు శిక్ష పడితే...ట్రంప్కి జైల్లో కూడా సీక్రెట్ సర్వీస్ ఏజెంట్స్ సెక్యూరిటీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చాలా కష్టమైన ప్రక్రియ. దీని కోసం అనేక జైలు నిబంధ నలను సవరించాలి. అలానే...అమెరికా మాజీ అధ్యక్షుడుని జైల్లో ఉంచడం అంటే...భద్రతా పరంగా చాలా రిస్క్. ఈ కోణంలో కూడా ఆసక్తికర చర్చ సాగుతోంది. జైలు శిక్ష పడినా అధ్యక్ష పదవి రేసులో ఉండటానికి ట్రంప్కి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఎందుకంటే...అమెరికా రాజ్యాం గం అధ్యక్ష అభ్యర్థికి నిర్ణయించిన అర్హతల్లో వయస్సు, అమెరికా పౌరసత్వం, 14 ఏళ్లుగా అమెరికాలో నివశించడం లాంటి వే ఉన్నాయి. నేర చరిత్ర ఉన్నవారు ఎన్నికలలో పాల్గొనకుండా ఎటువంటి నిబంధనలు లేవని అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు చెబుతున్నాయి. అయితే...ఇప్పటికే ట్రంప్కి జరగాల్సిన నష్టం జరిగిందనే విశ్లేషణలు కూడా బలంగానే వినిపి స్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన బ్లూమ్బర్గ్ - మార్నింగ్ కన్సల్ట్ పోల్లో...ట్రంప్ దోషిగా తేలితే ఆయన రిపబ్లి కన్ అభ్యర్థిత్వాన్ని తిరస్కరిస్తామని కీలకమైన రాష్ట్రాలలోని 53 శాతం ఓటర్లు తెలిపారు. క్విన్నిపియాక్ యూనివర్సిటీ సర్వేలోనూ ట్రంప్ దోషిగా తేలితే ఆయనకు ఓటు వేయబోమని 6 శాతం మంది ఓటర్లు చెప్పారు. ట్రంప్ని న్యాయస్థానం దోషిగా తేల్చిన మర్నాడు ఒక ప్రైవేట్ కంపెనీ చేసిన సర్వేలో ఈ తీర్పు సరైనదే అని, ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకూడదని...సర్వేలో పాల్గొన్న మెజార్టీ అమెరికన్లు తేల్చేశారు. దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఆరోపించారు. ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిం దంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. కానీ...హష్ మనీ కేసు మాత్రం ట్రంప్ని తీవ్ర స్థాయిలో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అదే సమయంలో గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరుగుతోంది. ఆయనకొచ్చే విరాళాలు పెరుగుతున్నాయి.ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. గత ఎన్నికల్లో బైడెన్కి అధికారాన్ని బదలాయించకుండా...తన మద్దతుదా రులను ట్రంప్ రెచ్చగొట్టిన తీరు...ఆయన తెంపరితనానికి పరాకాష్ట. వ్యవస్థలపై ట్రంప్ ఎప్పుడూ పెద్దగా గౌరవం చూపించరు. ఈసారి గెలిస్తే...వలసలను కట్టడి చేయడం దగ్గర నుంచి అంతర్జాతీయ సాయానికి కత్తెర వేయడం దాకా చాలా వివాదాస్పద అంశాలనే ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నారు. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రత ను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. ఈ నేపథ్యంలో జులై 11న హష్ మనీ కేసులో ట్రంప్కి పడే శిక్ష ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు క్రిమినల్ కేసులో ట్రంప్ దోషిగా తేలడాన్ని...తన ప్రచారంలో ఒక అస్త్రంగా వాడుకోవడం పై బైడెన్ ఫోకస్ పెడుతున్నారు. బైడెన్ కుమారుడు ఎపిసోడ్ని కూడా ట్రంప్ వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. 80 ఏళ్లు బైడెన్, 80 వసంతాలకు అతి చేరువలో ఉన్న ట్రంప్. పైగా...వీరిద్దరూ చుట్టూ క్రిమినల్ కేసుల కేంద్రం గా నెగిటివ్ వైబ్రేషన్స్. ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారన్నది పక్కన పెడితే...సమర్థ నాయకత్వాన్ని అమెరికాకు అందించే విషయంలో మాత్రం ఇద్దరు అభ్యర్థులు బలంగా తమ ఉనికిని చాటుకోలేకపోతున్నారని అంతర్జాతీయ పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. -
గెలుపెవరిది..? అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ వర్సెస్ ట్రంప్
జో బైడెన్. అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు. డోనాల్డ్ ట్రంప్. అమెరికా మాజీ అధ్యక్షుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అధ్యక్ష పదవి కోసం తలపబడుతున్నారు. వైట్ హౌస్ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. జో బైడెన్ వృద్ధాప్యంతో ఇబ్బంది పడుతున్నారు. స్ట్రాంగ్ లీడర్ అన్న భావన కలిగించలేకపోతున్నారు. ఇక నాలుగేళ్లు ట్రంప్ పాలన ఎలా సాగిందో ప్రపంచమంతా చూసింది. డెమోక్రాట్స్ బైడెన్కి, రిపబ్లికన్స్ ట్రంప్కి జై కొట్టేశారు. ఇంత వరకు బానే ఉంది. కానీ...గత అధ్యక్షులతో పోల్చితే...సమర్థ నాయకత్వం అందించే భరోసాని వీరిద్దరూ అమెరికాకి ఇవ్వగలరా అన్న ప్రశ్న మాత్రం సజీవంగానే ఉంది.అమెరికా అధ్యక్ష ఎన్నికలంటే...కేవలం ఆ దేశంలోనే కాదు. ప్రపంచవ్యాప్తంగా అందరి అటెన్షన్ అటే ఉంటుంది. ఇప్పుడు కూడా అక్కడి ఎన్నికల కేంద్రంగా జరగుతోంది అదే. కాకపోతే ఆ అటెన్షన్ కేవలం ఎన్నికల సమరం మీద మాత్రమే కాదు. బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థుల నాయకత్వ లక్షణాల కేంద్రంగా, ఇద్దరు అభ్యర్థులను చుట్టుముట్టిన వివాదాల కేంద్రంగా..వరల్డ్ వైడ్గా చర్చ సాగుతోంది.నిజానికి జో బైడెన్, డోనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రజలకి కొత్త కాదు. ప్రపంచ ప్రజలకు కొత్త కాదు. ఇద్దరి పాలనని అమెరికన్స్తో పాటు ప్రపంచ ప్రజలంతా చూశారు.అదే సమయంలో ఇద్దరు ఎదుర్కొంటోన్న అనేక సమస్యలను కూడా వరల్డ్ అంతా చూస్తోంది. వృద్ధాప్యం వల్ల వచ్చే అనేక ఆరోగ్య సమస్యలు...జో బైడెన్ నాయకత్వాన్ని సవాల్ చేస్తోంది. అలానే కుమారుడి మీద కేసులు కూడా ఆయన్ను ఇరుకున పెడుతున్నాయి. ఇక ట్రంప్ సంగతి సరే. ఇద్దరు అభ్యర్థులు వివాదాల కేంద్రంగానే తమ ఉనికిని చాటుకుంటున్నారు.అమెరికా రాజకీయాల్లో వృద్ధులు పదవులు చేపట్టడంపై చాలా కాలం నుంచి చర్చ సాగుతోంది. అమెరికా పౌరుల పదవీ విరమణ వయస్సు 67 ఏళ్లు. కానీ రాజకీయాల్లో రిటైర్మెంట్ వయసంటూ లేదు. బైడెన్ వయస్సు 81. ట్రంప్ వయస్సు 78. ఆ వయస్సు అమెరికాకి నాయకత్వం వహించే స్థాయిలో శారీరిక, మానసిక ఆరోగ్యం సహకరిస్తుందా అన్న చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపు బైడన్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తర్వాత అనేక సార్లు ఆయన వయస్సు కేంద్రంగా చర్చ సాగుతూ వచ్చింది. తాజాగా జీ-7 దేశాల సదస్సులో బైడెన్ వింతగా ప్రవర్తించడంతో...మరోసారి ఈ చర్చ తెరపైకి వచ్చింది.అది.. ఇటలీ తీరప్రాంత నగరం అపూలియా. జీ7 సదస్సు ఆరంభం కావడానికి ముందు అపూలియా తీర ప్రాంతాన్ని ఆయా దేశాల నేతలు సందర్శించారు. అక్కడ ఉన్న వాటర్ స్పోర్ట్స్ను వీక్షించారు. పారా గైడ్లింగ్ చేస్తున్న వారిని పలకరించారు. కానీ.. అదే సమయంలో జో బైడెన్ మాత్రం వింతగా ప్రవర్తించారు. తీర ప్రాంతం వద్ద రిషి సునాక్, జస్టిన్ ట్రూడో, మెలోనీ, ఉర్సులా వాన్ డెర్.. ఒకవైపు ఉండి వాటర్ స్పోర్ట్స్ను తిలకిస్తుండగా.. జో బైడెన్ మాత్రం వారికి దూరంగా వెళ్లి దిక్కులు చూస్తూ నిలబడిపోయారు. అక్కడ ఎవరూ లేకపోయినా ఎవరితోనో ఆయన మాట్లాడుతున్నట్టు సైగలు చేశారు. కుడి చెయ్యి పైకి ఎత్తి పలకరించడం కనిపించింది. ఈ సమయంలో బైడెన్ను గమనించిన మెలోని ఆయన దగ్గరకు వెళ్లి చెయ్యి పట్టుకుని వెనక్కి తీసుకువచ్చారు. ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.అయితే.. బైడెన్ ఇలా వింతగా ప్రవర్తించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు పలు సందర్భాల్లో కూడా ఆయన ఇలాగే చేశారు. అమెరికాకు సంబంధించి చిప్స్ అండ్ సైన్స్ చట్టంపై సంతకం చేసే కార్యక్రమంలో సెనేట్ మెజార్టీ లీడన్ చక్ షూమర్ అందరికీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. పొడియం వద్దకు వచ్చిరాగానే ముందుగా బైడెన్కు షేక్హ్యాండ్ ఇచ్చి, ఆ తర్వాత అక్కడే ఉన్న మిగితా వారికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. అప్పటికి తను షేక్హ్యాండ్ ఇచ్చిన విషయం మర్చిపోయిన బైడెన్.. మరోసారి షేక్ హ్యాండ్ కోసం చేతిని ముందుకు తీసుకెళ్లారు. కాసేపు అలాగే షేక్ హ్యాండ్ పొజిషన్లో ఉంచి షాక్తో మళ్లి చేతిని కిందకు దించాడు బైడెన్.కొన్నాళ్ల క్రితం వైట్హౌస్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమంలో అధ్యక్షుడి ప్రవర్తన ఇలాగే ఉంది. ఆయన చుట్టూ ఉన్నవారంతా అక్కడ వినిపిస్తున్న సంగీతానికి తగ్గట్టుగా కాలుకదుపుతుంటే.. బైడెన్ మాత్రం కొంతసేపు అలాగే నిల్చుండి పోయారు. ఏం జరుగుతుందో అర్ధం కానట్లు చూస్తుండిపోయారు. కొన్ని సెకన్లపాటు అలాగే ఉండిపోయిన బైడెన్ ఆ తర్వాత తేరుకున్నారు.ఉక్రెయిన్-రష్యా మధ్య యుద్ధం నేపథ్యంలోనూ బైడెన్ దొరికిపోయారు. మీడియాతో మాట్లాడే క్రమంలో రష్యా దేశం, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ పేరు సైతం మర్చిపోయారు. తనతోపాటు పక్కనే ఉన్న అమెరికా ఉపాధ్యక్షురాలను ప్రథమ మహిళ అని సంబోధించి చాలా గందరగోళానికి గురయ్యారు. ఇప్పుడు బైడెన్ తీరు అధికార డెమొక్రాటిక్ పార్టీకి ఇబ్బందిగా మారింది. ఇప్పటికే బైడెన్ ప్రవర్తనని...రిపబ్లికన్ పార్టీ పదే పదే ప్రస్తావిస్తోంది. ఇకపై ప్రచారంలో దీన్ని ఒక కీలక అస్త్రంగా మార్చుకోవచ్చు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ని...గన్ కొనుకోలు కేసులో మొత్తం మూడు ఆరోపణల్లోనూ కోర్టు దోషిగా తేల్చింది. అటు ట్రంప్ మీద ఉన్న ఆరోపణల సంగతి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆరోపణలు మాత్రమే కాదు. హష్ మనీ కేసులో ఆయన దోషిగా తేలారు. త్వరలోనే శిక్ష ఏంటన్నది న్యాయస్థానం ప్రకటించనుంది. ట్రంప్ వయస్సు కూడా 78 ఏళ్లు కావడంతో...వృద్ధాప్యం కోణంలో ఆయన నాయకత్వం మీదా చర్చ జరుగుతోంది. ఇలా అధ్యక్ష పదవి రేసులో ఉన్న ఇద్దరూ సమర్థ నాయకత్వం అందించగలరా అన్నది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ పాయింట్గా మారింది.క్రిమినల్ కేసులో దోషిగా తేలిన కుమారుడిని కలిగి ఉన్న తొలి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్. క్రిమినల్ కేసులో దోషిగా తేలిన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్. వైట్ హౌస్లో అడుగుపెట్టిన నాటి నుంచి... తన ప్రవర్తనతో చర్చనీయాంశంగా మారిన అధ్యక్షుడు బైడెన్. అమెరికాలో చరిత్రలోనే అత్యంత వివాదాస్పద అధ్యక్షుడుగా ట్రంప్కి అద్భుతమైన రికార్డు ఉండనే ఉంది. ఇప్పుడు ఇద్దరి వయస్సు కేంద్రంగా కూడా వాడి వేడి చర్చ సాగుతోంది. ఇలా అనేక కోణాల్లో బైడెన్, ట్రంప్ మధ్య నెగిటివ్ వైబ్రేషన్స్ బలంగా హల్చల్ చేస్తున్నాయి. అదే సమయంలో ఇద్దరి మధ్య వాడి వేడి సమరం తప్పదని ఎన్నికల సాగుతోన్న తీరు చెప్పకనే చెబుతోంది. అమెరికా అధ్యక్ష రేసులో బైడెన్ కన్నా ట్రంప్ ముందున్నారు. ట్రంప్ ట్రాక్ రికార్డ్ అంతా వివాదాలు, ఆరోపణల మయమే. అయినా సరే...ప్రచారంలో ట్రంప్ దూకుడుని బైడెన్ అందుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో బైడెన్కి మరో సమస్య వచ్చి పడింది. ఆయన కుమారుడు హంటర్ బైడెన్...క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ కేంద్రంగా నెగిటివిటీ పెరుగుతోంది. తుపాకీ కొనుగోలు సందర్భంగా తప్పుడు సమాచారం ఇచ్చిన కేసులో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ దోషిగా తేలారు. ఆయనపై మోపిన 3 అభియోగాల్లోనూ నేర నిర్ధారణ జరిగింది. డెలావెర్లోని విల్మింగ్టన్ కోర్టు జడ్జి మేరీఎల్లెన్ నోరీకా... హంటర్ నేరాన్ని నిర్ధారించారు. అయితే శిక్షా కాలాన్ని వెల్లడించలేదు. కానీ ఈ తరహా కేసుల్లో 25 ఏళ్ల వరకూ శిక్ష పడుతుంది. అదే సమయంలో తొలిసారి నేరానికి పాల్పడినందు వల్ల అంత శిక్ష పడక పోవచ్చన్న వాదన కూడా వినిపిస్తోంది. నేరాన్ని నిర్ధారించిన జడ్జి.. ఎంత కాలం శిక్ష వేయనున్నారనేది వెల్లడించలేదు. ఎప్పటి నుంచి శిక్షను అమలు చేసేదీ చెప్పలేదు. 2018లో తుపాకీ కొనుగోలు సందర్భంగా ఆయుధ డీలరుకు ఇచ్చిన దరఖాస్తు ఫారంలో హంటర్ తప్పుడు సమాచారం ఇచ్చారు. తాను అక్రమంగా డ్రగ్స్ కొనుగోలు చేయలేదని, వాటికి బానిస కాలేదని, తనవద్ద అక్రమంగా ఆయుధం లేదని వెల్లడించారు. అయితే అది తప్పని తేలింది. అప్పటికే హంటర్ డ్రగ్స్ అక్రమంగా కొనుగోలు చేశారు. వాటికి బానిసగా మారారు. 11 రోజులపాటు అక్రమంగా ఆయుధం కలిగి ఉన్నారు. హంటర్పై మరో కేసు ఉంది. కాలిఫోర్నియాలో 1.4 మిలియన్ డాలర్ల పన్ను ఎగవేత కేసులో ఆయన విచారణను ఎదుర్కొంటున్నారు. కాలిఫోర్నియా కోర్టులో సెప్టెంబరులో ఇది విచారణకు రానుంది.బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్ క్రిమినల్ కేసులో దోషిగా తేలడానికి కొద్ది రోజుల ముందే...డోనాల్డ్ ట్రంప్ని హష్ మనీ కేసులో దోషిగా తేల్చింది మన్హట్టన్ కోర్టు. శృంగార తార స్టార్మీ డానియల్స్తో ట్రంప్ గతంలో ఏకాంతంగా గడిపారనే ఆరోపణలు ఉన్నాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో దీనిపై ఆమె నోరు విప్పకుండా ఉండేందుకు... ట్రంప్ తన న్యాయవాది ద్వారా ఆమెకు 1.30 లక్షల డాలర్ల హష్మనీని ఇప్పించారన్నది ఆరోపణ. ప్రచార కార్యక్రమాల కోసం అందిన విరాళాల నుంచి ఆ మొత్తాన్ని ఖర్చు చేశార ని, అందుకోసం రికార్డులన్నింటినీ తారుమారు చేశారన్నది ప్రధాన అభియోగం. ఇలా మొత్తం 34 అంశాల్లో ఆయనపై నేరారోపణలు నమోదయ్యాయి. ఆరు వారాల విచారణ అనంతరం ట్రంప్పై మోపిన అభియోగాలన్నీ నిజమేనని 12 మంది జడ్జీలతో కూడిన ధర్మాసనం ఏకాభిప్రాయంతో తీర్పు వెలువరించింది. ట్రంప్తో ఏకాంతంగా గడిపిన మాట వాస్తవమేనని స్టార్మీ డానియల్స్ స్వయంగా కోర్టులో వాంగ్మూలం ఇచ్చారు. ఆమెతో సహా మొత్తం 22 మంది సాక్షులను కోర్టు విచారించింది.45 ఏళ్ళ డేనియల్స్ అసలు పేరు స్టెఫానీ క్లిఫర్డ్. ఆమె లూసియనాలో జన్మించారు. శృంగార చిత్రాల నటి, దర్శకురాలు డేనియల్స్. సినీ రంగంలో ఆమె ప్రతిభకు గాను అనేక అవార్డులు గెలుచుకున్నారు. 2006 జులై లో ఒక చారిటీ గోల్ఫ్ ట్రోర్నమెంట్లో ట్రంప్ని ఒక చారిటీ గోల్ఫ్ టోర్నమెంట్లో కలిసినట్టుగా డేనియల్స్ చెబుతున్నారు. లేక్ తాహో వద్ద నున్న హోటల్ గదిలో తాము ఇద్దరం పరస్పర అంగీకారంతో శృంగారంలో పాల్గొనట్టు ఆమె తెలిపారు.2016 ఎన్నికల ముందు...ట్రంప్ లాయర్ కోహెన్...తనకు హష్ మనీ కింద ఒక లక్షా 30 వేల డాలర్లు ఇచ్చినట్టు డేనియర్స్ తెలిపారు. అమెరికాలో రహస్య ఒప్పందం కింద ఒకరికి నష్టపరిహారం చెల్లించడం చట్టవిరుద్ధం కాదు. కానీ ట్రంప్ ఖాతాల్లో ఈ చెల్లింపులను లీగల్ ఫీజులుగా పేర్కొనడం ద్వారా వ్యాపార రికార్డులను తారుమారు చేశారని ట్రంప్ పై అభియోగాలు నమోదయ్యాయి. హానికారక సమాచారం ప్రజలకు తెలియకుండా ఉండేందుకు నేరాలను కప్పిపుచ్చేందుకు ట్రంప్ ప్రయత్నించారని... డిస్ట్రిక్ట్ అటార్నీ అల్విన్ బ్రాగ్ ఆరోపించారు. 2018 ఆగస్టులో పన్నుల ఎగవేత, డేనియల్స్కు చెల్లింపుల విషయంలో ప్రచార ఆర్థిక నిబంధనలను అతిక్రమించిన కేసులో దోషిగా తేలడంతో... ట్రంప్ మాజీ లాయర్ కోహెన్ జైలు పాలయ్యారు. అయితే ఈ చెల్లింపులతో ట్రంప్కు ఎలాంటి సంబంధం లేదని తొలుత కోహెన్ చెప్పారు. కానీ తరువాత ట్రంపే 1,30,000 డాలర్ల హుష్ చెల్లింపులు చేయాల్సిందిగా ఆదేశించారని అంగీకరించారు. ఈ డబ్బును ట్రంప్ లెక్కల్లో ఎలాగోలా సెట్ చేశారని కూడా చెప్పారు.దోషిగా తేలడంతో ట్రంప్ జైలుకెళ్లాల్సిందేనా అనే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. దీనికి కచ్చితమైన సమాధానం చెప్పలే మని నిపుణులు అంటున్నారు. బిజినెస్ రికార్డులు తారుమారు అనేది న్యూయార్క్లో తక్కువ తీవ్రత ఉన్న నేరంగా పరిగణిస్తారు. గరిష్ఠంగా నాలుగేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. దీనిపై పూర్తి విచక్షణాధికారం న్యాయమూర్తిదే. అయితే, కచ్చితంగా జైలు శిక్ష విధిస్తారా, జరిమానాతో సరిపుచ్చుతారా అనేది చెప్పలేమని న్యాయ నిపుణులు వెల్లడించారు. ఇంత కంటే తీవ్రమైన మరో మూడు కేసుల్లోనూ ట్రంప్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు. అవేవీ ఎన్నికల ముందు విచారణకు వచ్చే అవకాశం లేదని ట్రంప్ న్యాయవాదుల బృందం ధీమాగా ఉంది. మరోవైపు రిపబ్లికన్ పార్టీ ఈ విషయంలో ట్రంప్కి గట్టిగానే మద్దతు తెలుపుతోంది.ట్రంప్ మద్దతుదారులు ఈ కేసును బైడెన్ రాజకీయ కుట్ర అంటారు, ట్రంప్ వ్యతిరేకులు ఆయనకు శిక్షపడినందుకు సంతోషిస్తారు. రాజకీయాన్ని అటుంచితే, మరోసారి దేశాధ్యక్షుడు కావాలనుకుంటున్న ఓ మాజీ అధ్యక్షుడు ఇలా వరుస కేసులు ఎదుర్కోవడం, నేరస్థుడిగా ముద్రపడటం అమెరికా పరువు ప్రతిష్ఠలకు భంగకరమే అంటున్నారు పరిశీలకులు. అయితే...ఈ తరహా వివాదాలు, కేసులు, ట్రంప్కి కొత్త కాదు. ట్రంప్ని ఈ కోణంలో చూడటం అమెరికన్స్కి కొత్త కాదు. దీంతో...కోర్టు విధించే శిక్ష ఏంటి ? ఆ తర్వాత జరిగే పరిణామాలు ఏంటన్నది చర్చనీయాంశంగా మారింది. అదే సమయంలో అటు బైడెన్ కుమారుడు క్రిమినల్ కేసులో దోషిగా తేలడంతో...బైడెన్ మీద ఆప్రభావం ఎంత వరకు పడుతుందన్నది చర్చనీయాంశంగా మారింది. -
‘డొనాల్డ్ ట్రంప్ ఒక మోసగాడు, ఫెయిల్యూర్’
న్యూయార్క్: అమెరికా మాజీ అధ్యక్షుడు రిపబ్లిక్ పార్టీ ప్రెసిడెంట్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గత కొంత కాలం నుంచి అధిక వయసు పేరుతో జో బైడెన్(81)పై విమర్శలు గుప్పిస్తున్నారు. నవంబర్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఇదే విషయాన్ని ట్రంప్ ప్రచార అస్త్రంగా మలుచుకున్నారు. బైడెన్తో పోల్చితే అమెరికాకు తానే చురుకైన ప్రెసెడింట్గా ఉండగలనని పేర్కొంటున్నారు. అయితే శుక్రవారం ట్రంప్ సైతం 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. దీంతో జో బైడెన్ ఎన్నికల ప్రచారం బృందం ఓ వైపు ట్రంప్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తేలియజేస్తునే తీవ్రంగా విమర్శలు చేస్తూ ఓ సందేశం పంపారు.‘హ్యాపీ బర్త్ డే ట్రంప్. మీరు మోసపూరిత, ఫెయిల్యూర్ వ్యక్తి. అమెరికా ప్రజాస్వామ్యం, ఆర్థిక వ్యవస్థ, హాక్కులు, భవిష్యత్తుకు మీరు చాలా ప్రమాదకారి. మీరు ఇక ఎప్పటికీ అమెరికాకు ప్రెసిడెంట్ కాలేరు. మీ 79వ బర్త్డేకు అదే మొదటి అందమైన బహుమతి అవుతుంది’అని తెలిపింది. అదేవిధంగా అధ్యక్షుడు బైడెన్ అధికార యంత్రాగం సైతం ట్రంప్పై విమర్శలు చేస్తూ.. ట్రంప్ సాధించిన 78 విజయాలు ఇవే అంటూ ఆయనపై ఉన్న కేసులు, అభియోగాల జాబితాను విడుదల చేసింది. పలు కేసులు, అభియోగాలు మోపబడిన అమెరికా అధ్యక్ష ఎన్నికల అభ్యర్థి ట్రంప్ అని ఎద్దేవా చేసింది.అంతకుముందు ప్రెసిడెంట్ జో బైడెన్ ట్రంప్కు ఎక్స్లో బర్త్డే శుభాకాంక్షలు తెలిపారు. ‘అధిక వయసు ఉన్న వ్యక్తి నుంచి మరో ఎక్కువ వయసు ఉన్న వ్యక్తిగా బర్త్ డే శుభాకాంక్షలు అందుకోండి. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే. దానికి ఎన్నికలతో సంబంధం లేదు. ఎన్నికలు అధ్యక్షుడి ఎంపిక చేసేవి మాత్రమే’’ అని బైడెన్ అన్నారు. ఇక.. ట్రంప్ అరోపించినట్లు గానే జో బైడెన్ అధిక వయసు, మతిమరుపుతో ఇబ్బంది పడినట్లు పలు సందర్భాల్లో కనిపించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మరోవైపు.. ట్రంప్ 78వ సంవత్సరంలోకి అడుగుపెట్టడంతో ఇద్దరు అధిక వయసు నేతలు అధ్యక్ష ఎన్నికలకు పోటీ పడటం అమెరికాలో తొలిసారి కావటం గమనార్హం. -
Donald Trump: అమెరికన్లకు బిగ్ ఆఫర్ ఇచ్చిన ట్రంప్!
అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. అమెరికా అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకోవాలన్న టార్గెట్తో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ప్రజలకు పెద్ద పెద్ద వరాలే ఇస్తున్నారు. కాగా, రాబోయే ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఏకంగా ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని ప్రకటించారు. దీంతో, ట్రంప్ హామీపై చర్చ నడుస్తోంది.అయితే, వాషింగ్టన్ డీసీలోని క్యాపిటల్ హిల్ క్లబ్లో ట్రంప్.. అమెరికా పార్లమెంట్ సభ్యులతో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో తనను గెలిపిస్తే ఆదాయ పన్ను చెల్లింపుల నుంచి అమెరికన్లకు విముక్తి కల్పిస్తానని, దాని స్థానంలో టారిఫ్ల పాలసీని అమలు చేస్తానని ప్రకటించారు. సమస్యాత్మక సంస్థలతో జరిపే చర్చల్లో సుంకాలను సాధనంగా ఉపయోగించుకోవాలని ఈ భేటీలో తెలిపారు. Trump has floated the concept of eliminating income tax and replacing it with tariffs.Wouldn't that require drastically reducing the size of the US Government?Dammit, I'm in. How about you? pic.twitter.com/YHSw3arMV5— TaraBull (@TaraBull808) June 13, 2024 అయితే, ఈ ప్రతిపాదనపై పలు వర్గాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదాయ పన్ను స్థానంలో టారిఫ్లను తీసుకురావడమంటే దిగువ, మధ్యతరగతి అమెరికన్లను తీవ్రంగా దెబ్బతీసి సంపన్నులకు లబ్ధి చేకూర్చడమే అవుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో, ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలో చర్చనీయాంశంగా మారాయి. -
జీ–7 అసంబద్ధ నిర్ణయం
పేరుకి సంపన్న దేశాలే. ప్రపంచాన్ని ఇప్పటికీ శాసిస్తున్నవే. స్వయంకృతం కావొచ్చు... అంతర్జాతీయ పరిణామాల పర్యవసానం కావొచ్చు ఆ దేశాలకూ సమస్యలుంటాయి. ఇటలీలో గురువారం ప్రారంభమైన జీ–7 దేశాల మూడురోజుల శిఖరాగ్ర సదస్సు ఈ పరిస్థితిని ప్రతిబింబించింది. చుట్టూ అనిశ్చితి, భవిష్యత్తుపై నిరాశా నిస్పృహలు వాటిని పీడిస్తున్నాయి. ఉన్న సమస్యలు చాల్లేదన్నట్టు అమెరికా అధ్యక్ష పీఠం మళ్లీ డోనాల్డ్ ట్రంప్కు దక్కవచ్చన్న అంచనాలు వాటిని వణికిస్తున్నాయి. మూడేళ్ల క్రితం పరిస్థితి వేరు. అప్పటికి ట్రంప్ నిష్క్రమించి జో బైడెన్ అమెరికా అధ్యక్షుడై శిఖరాగ్ర సదస్సుకు హాజరయ్యారు. వస్తూనే అందరికీ అభయమిచ్చారు. మళ్లీ ప్రపంచ సారథ్యాన్ని అమెరికా స్వీకరించి జీ–7కు అన్నివిధాలా అండదండలందిస్తుందని పూచీపడ్డారు. అదే బైడెన్ గురువారం సదస్సుకు హాజరైనప్పుడు వాతావరణం పూర్తి భిన్నంగా ఉంది. ఒకపక్క ఉక్రెయిన్లో రష్యా దురాక్రమణ యుద్ధం ఎడతెగకుండా సాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ మారణకాండ సరేసరి. పాలస్తీనాపై విచక్షణారహితంగా విరుచుకుపడుతున్న ఇజ్రాయెల్కు పాశ్చాత్య దేశాలు, అమెరికా మద్దతిస్తున్నాయన్న ఆగ్రహంతో 1973లో ఒపెక్ దేశాలు చమురు సంక్షోభం సృష్టించినప్పుడు దానికి జవాబుగా జీ–7 ఆవిర్భవించింది. యాభైయ్యేళ్లు గడిచాక ఇప్పటికీ ఇజ్రాయెల్ తీరుతెన్నులు మారలేదు. అమెరికా మాత్రం ఆయుధాలందిస్తూనే గాజాలో దాడులు నిలపాలని ఇజ్రాయెల్ను బతిమాలుతోంది. మరోపక్క ఇటీవలే జరిగిన యూరోపియన్ యూనియన్ (ఈయూ) ఎన్నికల్లో యూరొప్ రాజకీయ ముఖచిత్రం మారుతున్న వైనం వెల్లడైంది. ముఖ్యంగా ఫ్రాన్స్, జర్మనీల్లో మితవాద పక్షాలు బలపడుతున్న ఆనవాళ్లు కనబడుతున్నాయి. అసలు జీ–7కు ఆతిథ్యమిస్తున్న ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీయే మితవాద పక్షానికి చెందినవారు. వీటన్నిటికీ అదనంగా ట్రంప్ సమస్య తోడైతే జీ–7 దేశాధినేతలు నిశ్చింతగా ఎలా ఉండగలరు?ఇలా పీకల్లోతు సమస్యల్లో కూరుకుపోయినా ఈ ఏడాది ఆఖరుకల్లా ఉక్రెయిన్కు 5,000 కోట్ల డాలర్ల (రూ. 4లక్షల కోట్లుపైగా) రుణం అందించాలని గురువారం జీ–7 అధినేతలు తీర్మానించక తప్పలేదు. ఇది సాధారణ సాయమైతే రష్యా కూడా ఎప్పటిలా ఇది సరికాదని ఖండించి ఊరుకునేది. కానీ తాజా నిర్ణయంపై తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే దురాక్రమణ యుద్ధం తర్వాత అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాల్లో రష్యాకున్న 30,000 కోట్ల డాలర్ల విలువైన స్థిరాస్తులతోపాటు నగదు రూపంలోవున్న సంపదను స్తంభింపజేశారు. ఇప్పుడు ఉక్రెయిన్కు ఆ ఆస్తులపై ఆర్జించిన వడ్డీనుంచే రుణం అందజేయబోతున్నారు. నిజానికి గత రెండేళ్లుగా అమెరికా ఈ ప్రతిపాదన చేస్తున్నా ఈయూ దేశాలు తాత్సారం చేస్తున్నాయి. ఆ పని చేస్తే రష్యాను మరింత రెచ్చగొట్టినట్టు అవుతుందనీ, పొరుగునేవున్న తమపై అది నేరుగా దాడికి దిగే ప్రమాదం ఉంటుందనీ భావించాయి. కానీ అమెరికా ఎలాగైతేనేం నచ్చజెప్పి ఒప్పించింది. ఈయూలో ఎప్పుడూ భిన్న స్వరం వినిపించే ఫ్రాన్స్ బాహాటంగానే అమెరికా ప్రతిపాదనను వ్యతిరేకించింది. జీ–7 దేశాలన్నీ విరాళాలు సమకూర్చి, ప్రపంచ దేశాలనుంచి విరాళాలు సేకరించి ఈ రుణాన్ని అందిద్దామని ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ సూచించారు. కానీ చివరకు అమెరికా ఒత్తిడితో రష్యా ఆస్తులనుంచి వచ్చిన వడ్డీనుంచే ఇవ్వాలని తీర్మానించారు. ‘ఇది నేరపూరిత చర్య. మానుంచి దుఃఖాన్ని మిగిల్చే స్పందన చవిచూడాల్సి వస్తుంది సుమా!’ అని రష్యా హెచ్చరించింది. ఇప్పుడున్న నిబంధనల ప్రకారం ఏ దేశమైనా వేరే దేశం ఆస్తుల్ని స్తంభింపజేయటం పెద్ద కష్టం కాదు. కానీ వాటిని వినియోగించటానికి ఇప్పటికైతే న్యాయబద్ధమైన ప్రాతిపదికగానీ, విధానంగానీ లేవు. అమెరికా తనవరకూ చట్టపరమైన ఇబ్బందులు రాకుండా ఉక్రెయిన్ పౌరుల ఆర్థిక పునర్నిర్మాణం, అవకాశాల మెరుగుదల పేరిట రెపో చట్టం తీసుకొచ్చింది. ఈయూ ఇలాంటి చట్టమేమీ లేకుండానే రష్యా ఆస్తులనుంచి వచ్చిన లాభార్జనను పక్కనబెట్టింది. ఇప్పుడు జీ–7 అమెరికా మాదిరిగా ఒక చట్టాన్ని రూపొందించే అవకాశం ఉంది. కానీ అంతర్జాతీయ న్యాయసూత్రాల ప్రాతిపదిక లేకుండా, ఐక్యరాజ్య సమితి వంటి సంస్థల ప్రమేయం లేకుండా ఏవో కొన్ని దేశాలు ఈ తరహా చర్యలకు సిద్ధపడటం అనర్థదాయకం. ఇప్పటికే అమెరికా, పాశ్చాత్య దేశాలకు రష్యా ఒక హెచ్చరిక చేసింది. అగ్రరాజ్యాలు సరఫరా చేసిన భారీ విధ్వంసక ఆయుధాలను ఉక్రెయిన్ ఉపయోగిస్తే దాని పర్యవసానాలను ఆ దేశాలు కూడా అనుభవించాల్సి వస్తుందన్నది ప్రకటన సారాంశం. యుద్ధం మొదలైన నాటినుంచీ రష్యా ఆస్తులను చెరబట్టిన అగ్రరాజ్యాలు ఈ రెచ్చగొట్టే చర్యకు కూడా సిద్ధపడ్డాయంటే ఉన్న సంక్షోభాన్ని మరింత పెంచటమే అవుతుంది.బైడెన్కూ, ట్రంప్కూ మధ్య ఒక్క చైనా విషయంలో మాత్రమే ఏకాభిప్రాయం ఉంది. దానిపై భారీగా సుంకాలు విధించాలన్నదే ఇద్దరి ఆలోచన. కానీ ఈయూ, నాటో, జీ–7లపై ట్రంప్ గతంలో కారాలూ మిరియాలూ నూరేవారు. 2018లో కెనడాలో జీ–7 సదస్సు జరిగినప్పుడు ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రుడో సభ్యదేశాల మధ్య ఏకాభిప్రాయం కుదిరిందంటూ ప్రకటించిన వెంటనే ట్రంప్ అది అబద్ధమని కొట్టిపారేశారు. సంస్థలో రష్యాను చేర్చుకోవాలని ఒత్తిడి చేశారు. ఇటీవలే ఆయన నాటో దేశాలను తీవ్రంగా హెచ్చరించారు కూడా. తాను అధికారంలోకొచ్చాక నాటోనుంచి తప్పుకుంటామనీ, అటుపై రష్యా ఆ దేశాలను ఏంచేసినా పట్టించుకోబోమనీ తెలిపారు. ఇలాంటి స్థితిలో అమెరికా ఒత్తిళ్లకు తలొగ్గటం ఎంతవరకూ సబబో జీ–7 ఆలోచించుకోవాలి. -
కారణం లేకుండానే ట్రంప్ పిలుస్తారు.. మస్క్ కీలక వ్యాఖ్యలు!
టెస్లా సీఈఓ ఇలాన్ మస్క్ (Elon Musk) ఇటీవల తన కంపెనీలో జరిగిన ఓ సమావేశంలో అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గురించి మాట్లాడారు. కారణం లేకుండానే ట్రంప్ తనను పిలుస్తూ ఉంటారని, ఎందుకు పిలుస్తారో నాకే తెలియదని అన్నారు.డొనాల్డ్ ట్రంప్ అరిజోనాలో జరిగిన ర్యాలీలో తనను (మస్క్) ప్రశంసించారని పేర్కొన్నారు. ట్రంప్.. టెస్లా ఎలక్ట్రిక్ వాహనాలకు మాత్రమే కాకుండా నాకు కూడా పెద్ద అభిమాని అని చెప్పినట్లు వెల్లడించారు. సైబర్ట్రక్కి ట్రంప్ పెద్ద ఫ్యాన్ కూడా అని ఈ సందర్భంగా మస్క్ చెప్పుకొచ్చారు.డొనాల్డ్ ట్రంప్ నన్ను పిలిచినప్పుడు చాలా బాగుంటుందని మస్క్ అన్నారు. ఈవీలు భవిష్యత్తుకు మంచివని, బ్యాటరీతో నడిచే కార్లలో అమెరికా అగ్రగామిగా ఉందని ట్రంప్ చెప్పినట్లు టెస్లా సీఈఓ వెల్లడించారు. టెస్లా కార్లను నా స్నేహితులలో కూడా ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారని ట్రంప్ పేర్కొన్నారని అన్నారు. -
డోనాల్డ్ ట్రంప్ కు అమెరికన్ల నుంచి ఊహించని షాక్
-
సర్వేలో ట్రంప్ కు షాక్.. ఏ శిక్ష పడనుంది..?
-
ట్రంప్ కోర్టు పోలింగ్ బూతేనా?
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను న్యాయస్థానం దోషిగా తేల్చిన తర్వాత ఆ దేశ రాజకీయాలు మరింత విభజనకు గురయ్యాయి. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను నొక్కిచెప్పింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ జరిగితే అది ఆయన విజయావకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. విషయాలు అక్కడ భిన్నంగా జరుగుతున్నాయి. ఒకవేళ ఆయన తిరిగి అధ్యక్షుడిగా ఎన్నికైతే తన దేశానికే కాదు, ప్రపంచానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నప్పటికీ, గత మూడేళ్లలో జరుగుతున్నట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి మాత్రం ఆయన హయాంలో జరగలేదు.అమెరికా మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ను తప్పుడు వ్యాపార రికార్డులపై 34 అంశాల్లో న్యాయస్థానం దోషిగా నిర్ధారించిన తర్వాత అమెరికా మరింతగా విభజనకు గురయింది. స్వభావ రీత్యా, ఈ కేసు చిన్నదే. కానీ న్యాయప్రక్రియను అపహాస్యం చేయడం ద్వారా, ప్రాసిక్యూటర్లపై, న్యాయమూర్తిపై కూడా ఎదురుదాడికి దిగుతూ కేసును ఎదుర్కొనాలని ట్రంప్ బృందం తీసుకున్న నిర్ణయం ఈ కేసును విషపూరితం చేసింది. ట్రంప్ ఇప్పుడు దీనిపై అప్పీల్ చేయనున్నారు. అయితే దీనిపై విచారణ జరగడానికి సంవత్సరాలు కాకపోయినా, నెలల సమయం పడుతుంది. ఒకవేళ తాను ఓడిపోయి, ఆ తర్వాత కేసు తారుమారైతే, అది అమెరికా న్యాయ వ్యవస్థ విచ్ఛిన్నమైనదనే ట్రంప్ మద్దతుదారుల అభిప్రాయాలను ధ్రువీకరిస్తుంది. మరోవైపు, ఇవన్నీ ఉన్నప్పటికీ ట్రంప్ గెలిచినట్లయితే, ఆ వ్యవస్థ ఎంత అధ్వాన్నంగా ఉందో అది వెల్లడిస్తుంది. ట్రంప్ న్యాయ ప్రక్రియను కొట్టిపడేస్తూ, ‘మనం ఫాసిస్ట్ రాజ్యంలో జీవిస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. ట్రంప్ తనను తాను అభివర్ణించుకున్నట్లుగా ‘ఎంతో అమాయకపు వ్యక్తి’పై జరుగుతున్న ఈ విచారణ ఒక బూటకమని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఆయన తనను ’రాజకీయ ఖైదీ’గా చెప్పుకొంటున్నారు. పైగా అవకాశం వచ్చినప్పుడు తన ప్రత్యర్థులందరూ కూడా నేరారోపణలను ఎదుర్కొనే దశలోకి అమెరికా ప్రవేశిస్తోందని ట్రంప్ పార్టీ(రిపబ్లికన్) హెచ్చరించింది.ప్రత్యేకించి ఓటర్లలో ఆదరణ లేని ఇద్దరు ప్రధాన అభ్యర్థుల మధ్య జరుగుతున్న విచిత్రమైన రేసులో ఈ తీర్పు ఒక అస్థిరమైన, నాటకీయమైన అంశాన్ని ప్రవేశపెట్టింది. పాత అమెరికాలో, ఒక అభ్యర్థిపై నేర నిర్ధారణ అతని లేదా ఆమె అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపేది. కానీ ఇప్పుడు ఇది ట్రంప్ అమెరికా. ఇక్కడ విషయాలు భిన్నంగా జరుగుతున్నాయి. ఈ తీర్పు నిజానికి ఆయనకు రిపబ్లికన్ పార్టీ మద్దతును మరింతగా బలపరిచింది. తీర్పు వెలువడిన వెంటనే ట్రంప్ ప్రచారానికి వచ్చిన 52.8 మిలియన్ అమెరికన్ డాలర్ల రూపంలో ఇది వ్యక్తమయింది.మరోవైపు డెమోక్రాట్లు తమ ప్రత్యర్థిని, ప్రస్తుతం అగ్రగామిగా ఉన్న వ్యక్తిని న్యాయస్థ్ధానం దోషిగా నిర్ధారించినందుకు సంబరాలు చేసుకుంటున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈ అంశంపై వ్యాఖ్యానించడంలో జాగ్రత్తగా ఉన్నారు. కానీ ఆయన న్యాయవ్యవస్థను సమర్థించారు. పైగా, తీర్పు తమకు ఇష్టం లేదు కాబట్టి దాన్ని ఎవరైనా ప్రశ్నించడం అనేది ‘నిర్లక్ష్యపూరితమైనది, ప్రమాదకరమైనది, బాధ్యతారాహిత్యంతో కూడుకున్నది’ అని అన్నారు.ఈ కేసుకి సంబంధించిన అంశాలు చిన్నవిగానే ఉన్నప్పటికీ, ఇది బూటకపు విచారణ కాదు. సమర్పించిన సాక్ష్యాలు చేసిన నేరాలను నిర్ధారిస్తాయి. అవి ట్రంప్ జీవించే నీచమైన ప్రపంచానికి చెందిన సంగ్రహావలోకనాన్ని కూడా అందించాయి. ఆయన మద్దతుదారులు ఏం చెప్పినా సరే... జ్యూరీ ఆయన్ని ఏకగ్రీవంగానూ చాలా త్వరితంగానూ మొత్తం 34 అంశాల్లో దోషిగా నిర్ధారించింది. పైగా ఇది ట్రంప్ ఎదుర్కొనే ఆరోపణలలో ఒకటి మాత్రమే; మరో మూడు తీవ్రమైన ఆరోపణలు కూడా ఉన్నాయి. కానీ రిపబ్లికన్ల మనస్సులో, ఈ కేసులు ‘న్యాయ వ్యవస్థ ఆయుధీకరణ’ ఫలితం మాత్రమే.వీటిలో రెండు కేసులు 2020 ఎన్నికల ప్రక్రియకు నష్టం గావించడంలో ట్రంప్ పాత్రకు సంబంధించినవి. ఇక మూడవ కేసు, వైట్ హౌస్ నుండి నిష్క్రమించిన తర్వాత ఉద్దేశపూర్వకంగా రహస్య పత్రాలను ట్రంప్ తన వద్ద ఉంచుకున్నట్లు చెబుతోంది. అమెరికా న్యాయ వ్యవస్థలో ఒక భాగం ఇప్పటికీ సమర్థంగా పనిచేస్తున్నప్పటికీ, అమెరికా సుప్రీంకోర్టుతో సహా ఇతర విభాగాల పక్షపాత దృష్టి కారణంగా ట్రంప్పై ఇతర కేసులను అధ్యక్ష ఎన్నికలకు ముందుగా విచారించలేరని న్యూయార్క్ కోర్టు తీర్పు సూచించింది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ముఖ్యమైన ‘న్యాయస్థానం’ పోలింగ్ బూత్ మాత్రమే.ట్రంప్నకు ఉన్మాదపూరితమైన ఓటర్ బలం ఉంది. ఇది ఈ తీర్పు ద్వారా మరింత పెరిగింది. కానీ అది మాత్రమే ఆయనకు ఎన్నికల్లో గెలుపును ఇవ్వలేదు. తక్కువ ఉత్సాహవంతులైన, నేరారోపణలను బట్టి దూరం జరిగే వ్యక్తుల మద్దతు ఆయనకు అవసరం. వాస్తవానికి, ఈ న్యాయవిచారణ ట్రంప్ బలహీనతను, అస్థిర ప్రవర్తనను, కుంభకోణాలతోపాటు ఆయన అసభ్య ప్రవర్తనను నొక్కిచెప్పింది.ఈ తీర్పు వెలువడిన వెంటనే నిర్వహించిన ‘యూ–గవ్’ పోల్లో 27 శాతం మంది ట్రంప్నకు ఓటు వేసే అవకాశం తక్కువగా ఉందనీ, 26 శాతం మంది అలా వేసే అవకాశం ఎక్కువగా ఉందనీ, 39 శాతం మంది తీర్పు తమ ఓటు విధానాన్ని ప్రభావితం చేయదనీ చెప్పారు. ఇవి పూర్తిగా విభజనకు గురైన అమెరికన్ రాజకీయ వ్యవస్థ క్షీణత లోతును పట్టి చూపే భయంకరమైన సంకేతాలు. దేశంలోని సగం మంది మరొకరి అభిప్రాయాలను సహించటానికి ఇష్టపడకపోవటంతో, పెద్ద సంఖ్యలో అమెరికన్లు మూడవ పార్టీలకు ఓటు వేయడం లేదా ఎన్నికలకు దూరంగా ఉండడం కూడా మనం చూడవచ్చు.ట్రంప్ పదవికి పూర్తిగా అనర్హుడన్న విషయం ఈపాటికే స్పష్టం అయింది. అయినా సరే... ఆయన తిరిగి ఎన్నికైతే, తన దేశానికే కాదు, ప్రపంచానికి, భారతదేశానికి కూడా తీవ్రమైన పరిణామాలు ఎదురవుతాయి. ఉక్రెయిన్, గాజాలో జరుగుతున్న యుద్ధాల వల్ల ప్రపంచం అతలాకుతలం అవుతోంది. పైగా తైవాన్ లో ఒక ప్రమాదం పొంచి ఉన్నందున, అమెరికా నాయకత్వ పాత్ర చాలా ముఖ్యమైనది. చైనాతో తలపడుతున్న భారత్ భద్రతకు అమెరికా భాగస్వామ్యం ముఖ్యం.అధ్యక్షుడు బైడెన్ హయాంలో... దక్షిణ కొరియా, జపాన్లతో మాత్రమే కాకుండా ఫిలిప్పీన్స్, భారతదేశంతో కూడా పొత్తులు పెట్టుకోవడం ద్వారా అమెరికా తన ఇండో–పసిఫిక్ ముఖచిత్రాన్ని భారీగా బలోపేతం చేసింది. ఈశాన్య ఆసియాలో బైడెన్ ముఖ్యంగా అమెరికా, జపాన్, దక్షిణ కొరియాతో కూడిన త్రైపాక్షిక సంబంధాన్ని ఏర్పరచుకున్నారు. ట్రంప్ హయాంలో అమెరికా, ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర ఒత్తిడికి లోనయ్యాయి.ముఖ్యంగా, ఆయన ‘ఆకస్’(ఏయూకేయూఎస్–ఆస్ట్రేలియా, యూకే, యూఎస్) సైనిక కూటమిని రూపొందించడానికి కూడా చొరవ తీసుకున్నారు. ఇది భారత్ సభ్యురాలిగా ఉన్న క్వాడ్ సంస్థకు భిన్నం. ఇది ఇప్పుడు ప్రధానంగా ఆరోగ్య భద్రత, సరఫరా గొలుసు స్థితిస్థాపకత, వాతావరణ మార్పులు, క్లిష్టమైన, అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, సైబర్ భద్రత, సముద్ర భద్రత వంటివాటిపై దృష్టి సారిస్తోంది. 2023 జూన్లో, బైడెన్ ఇండో–పసిఫిక్ ప్రాంతం మరొక అంచులో యూఎస్–ఇండియా రక్షణ, భద్రతా సంబంధాలను మరింత ఎత్తుకు తీసుకుపోయే ప్రయత్నంలో ప్రధాని నరేంద్ర మోదీతో కలిశారు. ట్రంప్తో భారతదేశ సంబంధాలు బాగానే ఉన్నాయి. కానీ గత మూడేళ్లలో జరిగినట్టుగా ద్వైపాక్షిక సంబంధాలను నిర్మించడంలో క్రమబద్ధమైన కృషి జరగలేదు.మనోజ్ జోషివ్యాసకర్త న్యూఢిల్లీలోని అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో డిస్టింగ్విష్డ్ ఫెలో (‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో) -
ప్రెసిడెంట్ పోటీ నుంచి ట్రంప్ తప్పుకోవాల్సిందే..! : అమెరికన్లు
న్యూయార్క్: పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన హష్ మనీ కేసులో న్యూయార్క్ కోర్టు డొనాల్డ్ ట్రంప్ను దోషిగా తేల్చటం అమెరికా రాకీయంగా చర్చనీయాంశం అయింది. ట్రంప్పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని కోర్టు వెల్లడించిన విషయం తెలిసిందే. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది.ఇక.. ఈ వ్యవహారంలో ట్రంప్కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు.అయితే ఈ నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి తప్పుకోవాలని సగం మంది అమెరికన్లు అభిప్రాయపడినట్లు ఓ సర్వే వెల్లడించింది. ఈ సర్వేను మే 31 నుంచి జూన్ 1 వరకు నిర్వహించినట్లు సదరు సర్వే సంస్థ పేర్కొంది. హష్ మనీ కేసులో ట్రంప్ను కోర్టు దోషిగా ప్రకటించటంపై సరైందేని 50 శాతం అమెరికన్లు అభిప్రాయపడినట్లు సర్వేను బట్టి తెలుస్తోంది. 23 శాతం మంది ఈ కేసులోని సరైందా? కాదా? అనే విషయంలో ఎటువంటి అభిప్రాయాన్ని కలిగిలేరని కూడా తెలిపింది.అదే విధంగా 27 శాతం మంది మాత్రం ట్రంప్ను దోషిగా తెల్చటాన్ని తప్పుపడుతున్నారు. ఈ కేసులో ట్రంప్పై వచ్చిన ఆరోపణలు 47 శాతం రాజకీయ ప్రేరేపితంగా ఉన్నాయని సర్వేలో పాల్గొన్న అమెరికన్లు వెల్లడించారు. 38 శాతం మంది మాత్రం ఈ అభిప్రాయాన్ని ఏకిభవించలేదు. ముఖ్యంగా ఈ కేసులో ట్రంప్ అక్రమానికి పాల్పడినట్లు 51 శాతం మంది అభిప్రాయపడినట్లు సర్వే రిపోర్టు వెల్లడించింది.దీంతో మొత్తంగా 49 శాతం మంది అమెరికన్లు ట్రంప్ అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని సూచించిట్లు తెలిపింది. ట్రంప్ పలు ప్రైమరి ఎన్నికల్లో విజయం సాధించి రిపబ్లికన్ పార్టీ తరఫున అధక్ష పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇక.. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు నవంబర్లో జరగనున్నాయి. ట్రంప్ను దోషిగా ప్రకటించటం అమెరికా రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారటం.. ఆయన గెలుపు అవకాశాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. -
Hush money case: డొనాల్డ్ ట్రంప్ దోషి
న్యూయార్క్/వాషింగ్టన్: ఒక కేసులో దోషిగా తేలిన అమెరికా తొలి మాజీ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్(77) అప్రతిష్ట మూటగట్టుకున్నారు. పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్కు 1.30 లక్షల డాలర్లు అక్రమంగా చెల్లించి, బిజినెస్ రికార్డులు తారుమారు చేసిన కేసులో న్యూయార్క్ కోర్టు ఆయనను దోషిగా తేలి్చంది. ట్రంప్పై నమోదైన 34 తీవ్ర అభియోగాలన్నీ రుజువయ్యాయని వెల్లడించింది. జూలై 11న న్యాయస్థానం తుది తీర్పు ఇవ్వడంతోపాటు శిక్ష ఖరారు చేయనుంది. ఈ వ్యవహారంలో ట్రంప్కు జైలు శిక్ష లేదా జరిమానా విధించే అవకాశం ఉందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. శిక్ష పడినప్పటికీ.. మరో ఆరు నెలల్లో జరగబోయే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ పోటీ చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు కాబోవని అంచనా వేస్తున్నారు. న్యూయార్క్ కోర్టు తీర్పుపై డొనాల్డ్ ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది తమకు ఆమోదయోగ్యం కాదన్నారు. కోర్టు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ఓ న్యాయమూర్తి అవినీతికి పాల్పడి తప్పుడు తీర్పు ఇచ్చారని విమర్శించారు. ఇక్కడేం జరిగిందో ప్రజలకు తెలుసని చెప్పారు. అసలైన తీర్పును నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికల్లో అమెరికా ప్రజలు ఇవ్వబోతున్నారని స్పష్టం చేశారు. తాను నిజాయతీపరుడినని, ఎలాంటి తప్పూ చేయలేదని పేర్కొన్నారు. అమెరికా కోసం, అమెరికా రాజ్యాంగం కోసం పోరాటం కొనసాగిస్తానని వెల్లడించారు. ఈ పోరాటంలో అంతిమ విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు. హష్ మనీ కేసులో దోషిగా తేలిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ నిబ్బరంగానే కనిపించారు. కోర్టులో నిశ్శబ్దంగా ఉండిపోయారు. తుది తీర్పు వచ్చేదాకా బెయిల్పై బయటే ఉంటారు. జూలై 11న శిక్ష ఖరారు కానుంది. నవంబర్లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ అభ్యర్థిత్వం ఇప్పటికే ఖరారైంది. జూలై 15న మిల్వాకీలో రిపబ్లికన్ జాతీయ సదస్సులో ట్రంప్ అభ్యరి్థత్వాన్ని అధికారికంగా ప్రకటించబోతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్(81)తో డొనాల్డ్ ట్రంప్ తలపడతారు. కోర్టు తీర్పుపై బైడెన్–కమలా హారిస్ ప్రచార విభాగం ప్రతినిధి, కమ్యూనికేషన్స్ డైరెక్టర్ మైఖేల్ టైలర్ హర్షం వ్యక్తం చేశారు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని న్యూయార్క్ కోర్టు తేల్చిచెప్పిందని అన్నారు ఏమిటీ కేసు? శృంగార తార స్టార్మీ డేనియల్తో ట్రంప్ సన్నిహితంగా గడిపినట్లు వార్తలొచ్చాయి. 2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె నోరు విప్పితే తనకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ట్రంప్ అడ్డదారి ఎంచుకున్నారు. ఆమె నోరు మూయించేందుకు 1.30 లక్షల డాలర్లు తన లాయర్ ద్వారా చెల్లించారు. ఎన్నికల ప్రచారం కోసం పారీ్టకి అందిన విరాళాల నుంచే ఈ సొమ్మును స్టార్మీ డేనియల్కు చేరవేశారు. అక్రమ చెల్లింపులను కప్పిపుచ్చడానికి బిజినెస్ రికార్డులను తారుమారు చేశారు. ఈ వ్యవహారమంతా బహిర్గతం కావడంతో అమెరికాలో గగ్గోలు మొదలైంది. ట్రంప్పై విచారణ అధికారులు 34 అభియోగాలు నమోదు చేశారు. ఈ కేసులో న్యూయార్క్ కోర్టులో సుదీర్ఘంగా విచారణ జరిగింది. 22 మంది సాక్షులను న్యాయస్థానం ప్రశ్నించింది. ఎన్నికల చట్టాన్ని ట్రంప్ ఉల్లంఘించారని, పోర్న్ స్టార్కు చెల్లించిన సొమ్మును కోర్టు ఖర్చుల కింద చూపించారని ప్రాసిక్యూటర్లు వాదించారు. ట్రంప్ తనతో ఏకాంతంగా గడిపిన మాట నిజమేనని స్టార్మీ డేనియల్ కోర్టుకు ఇచి్చన వాంగ్మూలంలో అంగీకరించారు. గురువారం 12 మంది న్యాయమూర్తుల ప్యానెల్ చరిత్రాత్మక తీర్పు వెలువరించింది.ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయొచ్చా? న్యూయార్క్ కోర్టు తీర్పు నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ట్రంప్ భవితవ్యంపై పడింది. కోర్టు ఆయనకు జైలు శిక్ష గానీ, జరిమానా గానీ విధిస్తే అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా? చట్టపరంగా అది సాధ్యమేనా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. అమెరికా రాజ్యాంగం ప్రకారం చూస్తే నేరస్థులు ఎన్నికల్లో పోటీ చేయకుండా అడ్డుకొనే నిబంధన ఏదీ లేదని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోరి్నయాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ రిచర్డ్ ఎల్.హసెన్ చెప్పారు. చట్టపరంగా ఇప్పుడు ట్రంప్ అభ్యరి్థత్వానికి వచ్చే ముప్పేమీ లేదని అన్నారు.కారాగారమా? గృహ నిర్బంధమా? ⇒ ట్రంప్పై 34 అభియోగాలు రుజువయ్యాయి. ఒక్కో అభియోగానికి గరిష్టంగా నాలుగేళ్ల చొప్పున జైలుశిక్ష, 5 వేల డాలర్ల దాకా జరిమానా విధించే అవకాశం ఉంది. ⇒ జైలు శిక్ష కాకుండా జరిమానా, ప్రొబేషన్/సామాజిక సేవను శిక్షగా విధించవచ్చు. ప్రొబేషన్ శిక్ష విధిస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట ట్రంప్ తరచుగా హాజరు కావాల్సి ఉంటుంది. కండీషనల్ డిశ్చార్జి అనే శిక్ష వేస్తే ప్రొబేషన్ అధికారి ఎదుట హాజరు కావాల్సిన అవసరం ఉండదు. ⇒ గృహ నిర్బంధం విధించే అవకాశం సైతం లేకపోలేదు. అప్పుడు ట్రంప్ తన ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. ఆయన చుట్టూ ఎల్రక్టానిక్ నిఘా పెడతారు. హౌజ్ అరెస్టు అయితే ట్రంప్ నాలుగు గోడల మధ్య నుంచే ఎన్నికల ప్రచారం చేయాలి. ⇒ ట్రంప్ జైలుకెళ్తారా? అంటే కచ్చితంగా చెప్పలేమని న్యాయ నిపుణులు అంటున్నారు. రాబోయే అధ్యక్ష ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కోర్టు ఆయనకు జైలుశిక్ష విధించకుండా కేవలం జరిమానాతో సరిపెట్టే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. రాజకీయ దురుద్దేశాలతోనే నాకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చారు. ఇది హష్మనీ వ్యవహారం కాదు. ఇది బహిర్గతం చేయకూడదనే ఒక ఒప్పందం మాత్రమే. పూర్తిగా చట్టబద్ధంగానే జరిగింది. ఇలాంటివి అమెరికాలో సర్వసాధారణమే. ప్రత్యర్థులు నన్ను ఇలా ఇరికించారంటే వారు ఇక ఎవరినైనా ఇరికించగలరు. నాపై తప్పుడు కేసు పెట్టి, ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారు. వారి ఆటలు సాగవు – డొనాల్డ్ ట్రంప్ -
మహాపరాధి ట్రంప్!
అధికారంలోకొచ్చింది మొదలు అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ను నేరస్తుడిగా నిరూపించాలని తపిస్తున్న డెమాక్రాటిక్ పార్టీ వాంఛ చివరి అంకంలో నెరవేరింది. నీలి చిత్రాల తార స్టార్మీ డేనియల్స్ నోరు మూయించడానికి భారీగా సొమ్ము ముట్టజెప్పి, ఆ మొత్తాన్ని ట్రంప్ తన కంపెనీ ఖాతాల్లో వేరేగా చూపారన్న ఆరోపణ రుజువు కావటంతో మన్హట్టన్ న్యాయస్థానం ఆయన్ను మహాపరాధిగా తేల్చింది. భిన్న రంగాలకు చెందిన అయిదుగురు మహిళలతో సహా 12 మందితో కూడిన జ్యూరీ... ఈ వ్యవహారంలో ట్రంప్కు విధించబోయే శిక్ష ఏమిటన్నది ఇంకా ప్రకటించలేదు. వచ్చే నెల 11న వెల్లడించే ఆ శిక్ష తప్పనిసరిగా కారాగారవాసమే కానవసరం లేదని, అది జరిమానా మొదలుకొని ప్రొబేషన్లో ఉంచటం వరకూ ఏదైనా కావొచ్చన్నది న్యాయనిపుణులు చెబుతున్న మాట. ఇది క్రిమినల్ కేసే అయినా వ్యక్తిని హతమార్చటం వంటిది కాదు గనుక జైలు శిక్ష ఉండకపోవచ్చంటున్నారు. జైలుకు పోయినా పోకపోయినా దేశాధ్యక్ష పదవికి జరగబోయే ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా పోటీపడటానికి అదేమీ అవరోధం కాదు. తీర్పు వెలువరించే ముందు జ్యూరీకి నాయకత్వం వహించిన న్యాయమూర్తి జువాన్ మెర్కన్ తన సహచరులను లాంఛనంగా ‘తీర్పుతో మీరు ఏకభవిస్తున్నట్టేనా...’ అని అడగటం, వారు అంగీకారాన్ని తెలపటం పూర్తయ్యాక ట్రంప్ అక్కడినుంచి నిష్క్రమించారు. వెళ్లేముందు ‘ఇది మోసపూరితమైన, సిగ్గుమాలిన తీర్పు. అసలు తీర్పును నవంబర్ 5న అమెరికా ప్రజలివ్వబోతున్నారు’ అని ఆయన చేసిన వ్యాఖ్య గమనించదగ్గది. వచ్చే అయిదారు నెలల్లో ఆ దేశ రాజకీయ పోకడలెలా ఉండబోతున్నాయో ట్రంప్ వ్యాఖ్య చెబుతోంది. ట్రంప్ నేరం రుజువై అపరాధిగా తేలిన తొలి కేసు ఇదే.దేశాధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తూ 2016లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలోనే ట్రంప్ను అనేకానేక కుంభకోణాలు చుట్టుముట్టాయి. తమపై లైంగిక నేరానికి పాల్పడ్డాడని, అసభ్యకర చేష్టలతో వేధించాడని కొందరు మహిళలు ఏకరువు పెట్టగా, ఆయన ఆర్థిక నేరాలకు పాల్పడ్డాడంటూ మరికొందరు ఆరోపించారు. ఇవిగాక 2021లో పదవినుంచి దిగిపోయేనాటికి రెండు క్రిమినల్ కేసులు కూడా వచ్చిపడ్డాయి. తన గెలుపును డెమాక్రాటిక్ పార్టీ కొల్లగొట్టిందంటూ పార్టీ శ్రేణుల్ని రెచ్చగొట్టడం, అధికార బదలాయింపు కోసం సెనేట్, ప్రతినిధుల సభ కొలువుదీరిన వేళ కాపిటల్ హిల్ భవనంపైకి జనాన్ని మారణాయుధాలతో ఉసిగొల్పటం తదితర ఆరోపణలున్న కేసు కొలంబియా కోర్టులో సాగుతోంది. బైడెన్ విజయాన్ని మార్చడానికి ప్రయత్నించారన్న అభియోగంపై జార్జియాలో విచారణ కొనసాగుతోంది. పదవి నుంచి దిగిపోతూ రహస్య పత్రాలు వెంటతీసుకెళ్లడం తదితర నేరాభియోగాలు ఫ్లారిడాలో విచారిస్తున్నారు. వీటికి అనుగుణంగా రెండు అభిశంసన కేసులు నమోదయ్యాయి. వీటిల్లో ఒక అభిశంసనపై కింది కోర్టు తీర్పిచ్చినా అమెరికా సుప్రీంకోర్టు దాన్ని కొట్టేసింది. ఆ అధికారం అమెరికన్ కాంగ్రెస్కే ఉంటుందని తేల్చింది. లైంగిక నేరాలకు సంబంధించి మహిళలు చేసిన ఆరోపణలు వీగిపోయాయి. 2006 నాటి తన రాసలీలల సంగతి బయటపెట్టొద్దని అభ్యర్థిస్తూ న్యాయవాది ద్వారా స్టార్మీకి పంపిన 1,30,000 డాలర్ల డబ్బే ఇప్పుడు ట్రంప్ను నిండా ముంచింది. ఈ కేసులో వచ్చిన మొత్తం 34 అభియోగాలూ రుజువయ్యాయని న్యాయస్థానం తేల్చింది. ట్రంప్ గద్దెనెక్కకుండా నిరోధించేది ప్రజా తీర్పేనని అధ్యక్షుడు జో బైడెన్ ప్రకటించినా ఆ విషయంలో డెమాక్రాటిక్ పార్టీకి పెద్దగా ఆశలున్నట్టు కనబడదు. తటస్థులైన ఓటర్లలో ఒకటి రెండు శాతంమంది తాజా తీర్పు వెలువడ్డాక ట్రంప్కు వోటేయాలన్న తమ నిర్ణయాన్ని మార్చుకున్నట్టు చెప్పినా అదేమంత ఉపయోగపడేలా కనబడటం లేదు. తొక్కేయాలని చూస్తున్నకొద్దీ ఆయన మరింత బలశాలిగా మారుతున్నాడంటూ రిపబ్లికన్ వ్యూహకర్త స్కాట్ రీడ్ చేసిన వ్యాఖ్య అవాస్తవం కాదు. గత ఆరు వారాలుగా ట్రంప్ రేటింగ్ పెరగటం, ఆయనకొచ్చే విరాళాల వెల్లువ ఇందుకు తార్కాణం. అయిదారేళ్లుగా రిపబ్లికన్ పార్టీ తన సామాజిక మాధ్యమాల ద్వారా, ఫాక్స్ న్యూస్ వంటి పార్టీ అనుకూల మీడియా ద్వారా సాగిస్తున్న ప్రచారం దీనికి కారణం. పార్టీ మొత్తం ట్రంప్ వెనక దృఢంగా నిలబడి ఆయన మాటలనూ, చేష్టలనూ సమర్థిస్తూ వచ్చింది. తమ నాయకుడిది తప్పంటున్న డెమాక్రాటిక్ నేతలే నేరగాళ్లంటూ ఊదరగొట్టింది. వీటి మాటెలావున్నా న్యాయస్థానం మహాపరాధిగా తేల్చిన వ్యక్తి దేశాధ్యక్షుడిగా వ్యవహరించటం సరైందేనా అన్న మీమాంస నడుస్తోంది. నాలుగు వందల ఏళ్లనాటి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి సందేహాలు ఎప్పుడూ రాలేదు. నేర నిరూపణ అయిన వ్యక్తి వందేళ్ల క్రితం జైలునుంచి పోటీచేసిన చరిత్రవున్నా మాజీ అధ్యక్షుడు మహాపరాధిగా తేలటం, ఆయనే మరోసారి బరిలో దిగటం కనీవినీ ఎరుగనిది. ఈ విషయంలో రాజ్యాంగంలో నిర్దిష్టమైన నిబంధనేదీ లేదు. ట్రంప్ ఈ నాలుగేళ్లలో మారిందేమీ లేదు. ఎన్నికల్లో గెలిచిన ప్రత్యర్థికి రాజ్యాంగబద్ధంగా అధికారాన్ని బదలాయించటానికి బదులు అనుచరులను రెచ్చగొట్టి అవరోధాలు సృష్టించాలని చూసిన ట్రంప్కు ఇప్పటికీ వ్యవస్థలంటే గౌరవం లేదు. తిరిగి నెగ్గితే ఆయన చేయబోయే పనుల్లో వలసలను కట్టడి చేయటం మొదలుకొని అంతర్జాతీయ సాయానికి కత్తెరేయటం వరకూ చాలావున్నాయి. ప్రభుత్వ సిబ్బంది సర్వీసు భద్రతను తొలగించే ప్రయత్నం కూడా చేస్తానని ఇప్పటికే చెప్పారు. గెలిచి అందలమెక్కితే ట్రంప్పై కేసులు వ్యక్తిగతంగా ఆయనకు మాత్రమే కాదు... అమెరికాకు సైతం సమస్యగా మారడం ఖాయం. -
శృంగార తార కేసు..ట్రంప్ కు జైలు శిక్ష
-
బయోపిక్లో భార్య రేప్ సీన్.. షాకైన కేన్స్ ఆడియెన్స్
కేన్స్ ఫిల్స్ ఫెస్టివల్ 2024లో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ప్రముఖ వ్యాపారదిగ్గజం.. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బయోపిక్ ‘ది అప్రెంటైస్’ అందుకు కారణం. సినిమా మట్టుకు అద్భుతంగా ఉందంటూ 8 నిమిషాలపాటు స్టాండింగ్ ఒవేషన్ దక్కినప్పటికీ.. ట్రంప్ పర్సనల్ లైఫ్లోని కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.తన మాజీ భార్య ఇవానా(దివంగత)పై ట్రంప్ అత్యాచారం చేసినట్లు ఈ చిత్రంలో ఒక సీన్ ఉంది. ఆ సన్నివేశం కేన్స్ ఆడియొన్స్ను ఒక్కసారిగా బిత్తరపోయేలా చేసింది. అంతేకాదు.. ఈ సినిమా ద్వారా బయటి ప్రపంచానికి తెలియని ట్రంప్ వ్యక్తిగత జీవితాన్ని చూపించిందని చిత్రాన్ని వీక్షించిన విశ్లేషకులు చెబుతున్నారు. సినిమా కేవలం 70, 80 దశకాల్లో కేవలం ట్రంప్ వ్యాపార జీవితాన్నే ప్రముఖంగా ప్రస్తావించినప్పటికీ.. ట్రంప్ టవర్ వేదికగా జరిగిన కొన్ని చీకటి విషయాల్ని చూపించిందని అంటున్నారు. దావాకు రెడీమరోవైపు ఈ చిత్రం తన అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి ఉపయోగపడుతుందని భావించిన ట్రంప్కు.. పెద్ద షాకే ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై దావా వేసేందుకు సిద్ధం అయ్యారాయన. ‘‘ ఈ చిత్రం(ది అప్రెంటైస్) ఒక చెత్త. కల్పిత కథనాలతో సంచలనంగా.. చర్చనీయాంశంగా మారడానికి ప్రయత్నించారు. ఈ చిత్రంపై దావా వేయబోతున్నాం’’ అని ట్రంప్ టీం ఒక అధికారిక ప్రకటక విడుదల చేసింది.ట్రంప్ ఆశ్చర్యపోతారేమో: డైరెక్టర్ అబ్బాసీఅయితే ట్రంప్ టీం దావా బెదిరింపులపైనా చిత్ర డైరెక్టర్ అలీ అబ్బాసీ స్పందించారు. డొనాల్డ్ టీం తప్పకుండా ఈ చిత్రం చూడాలని. ఆ తర్వాతే దావా వేయడం గురించి మాట్లాడాలని అంటున్నారు. అంతేకాదు ట్రంప్ సైతం ఈ చిత్రం చూసి ఆశ్చర్యపోతారే తప్ప నచ్చకపోవడం లాంటిది జరగకపోవచ్చు ఆయన అభిప్రాయపడ్డారు. ‘‘ప్రతీ ఒక్కరూ ఆయన ఫలానా వాళ్ల మీద దావా వేస్తున్నారనే చర్చ జరుపుతుంటారు. కానీ, ఆయన ఎలా సక్సెస్ అయ్యారు? వ్యాపారంలో ఆ స్థాయికి ఎలా ఎదిగారన్నది పట్టించుకోరు. ఈ చిత్రం చూస్తే వాళ్లకే అర్థమవుతుంది. బహుశా ట్రంప్ కూడా ఈ చిత్రాన్ని మెచ్చుకోవచ్చు’’ అని అబ్బాసీ అన్నారు.ది అప్రెంటిస్ చిత్రంలో ట్రంప్ పాత్రను నటుడు సెబాస్టియన్ స్టాన్(మార్వెల్ చిత్రాల ఫేమ్) పోషించగా.. ట్రంప్ వ్యక్తిగత లాయర్ జెర్మీ స్ట్రాంగ్ పాత్రలో రోయ్ కోన్, ఇవానా ట్రంప్ రోల్లో మరియా బాకాలోవా నటించారు. 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో మే 20వ తేదీన చిత్రాన్ని ప్రదర్శించారు. అయితే అమెరికాతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాదిలోనే రిలీజ్ కావాల్సి ఉండగా.. అధికారిక తేదీని ఇంకా ప్రకటించలేదు. -
USA Presidential Elections 2024: బైడెన్, ట్రంప్ రె‘ఢీ’
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల సందర్భంగా ఇరు పారీ్టల అభ్యర్థులు వాదనలతో ఎదురెదురుగా బలాబలాలు తేల్చుకునే ‘చర్చల’ అంకానికి డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తెరలేపారు. సీఎన్ఎన్ టీవీ ఛానల్లో జూన్ 27వ తేదీన, ఏబీసీ ఛానల్లో సెప్టెంబర్ పదో తేదీన ఈ డిబేట్లు ఉంటాయి. మూడు దశాబ్దాలుగా డిబేట్లు నిర్వహించే ‘కమిషన్ ఆన్ ప్రెసిడెన్షియల్ డిబేట్’ను కాదని ఈసారి మీడియాసంస్థల ఆధ్వర్యంలో టీవీ ఛానళ్లలో డిబేట్కు బైడెన్ ప్రచార బృందం ఓకే చెప్పింది. ‘‘అట్లాంటా స్టూడియోలో ఈ డిబేట్ను నిర్వహిస్తాం’ అని సీఎన్ఎన్ తెలిపింది. జనం మధ్యలో డిబేట్ జరిపితే బాగుంటుందని ట్రంప్ అన్నారు. -
చైనాకు ఒకేసారి రెండు దెబ్బలు.. షాకిచ్చిన బైడెన్, ట్రంప్!
అగ్ర రాజ్యం అమెరికాలో ఎన్నికల వాతావరణం హీటెక్కింది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధమే నడుస్తోంది. ఈ తరుణంలో ట్రంప్.. చైనాపై సంచలన ఆరోపణలు చేసి వార్తల్లో నిలిచారు.కాగా, ఎన్నికల ప్రచారంలో భాగంగా డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. అమెరికాలో చైనా తన సైన్యాన్ని నిర్మిస్తోందని ఆరోపించారు. చైనా నుంచి అమెరికాకు వలసలు భారీగా పెరిగాయని.. వాటివల్ల భవిష్యత్తులో ముప్పు పొంచివుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘మిలిటరీ ఏజ్’లో ఉన్న ఆ దేశ పౌరులు ఓ సైన్యంగా మారేందుకు అమెరికాకు వస్తున్నారని, వాళ్లు సైన్యంగా మారి దాడిచేస్తారని అన్నారు. వీరిలో యువకులే ఎక్కువగా ఉన్నారు. వారిని చూస్తుంటే మన దేశంలో చిన్న సైన్యాన్ని నిర్మించేందుకు ప్రయత్నిస్తున్నారా అనిపిస్తోంది. వారి ప్రయత్నం కూడా అదేనా? అంటూ ఆరోపణలు చేశారు. తాము అధికారంలోకి వస్తే ఇలాంటి వారికి తగిన బుద్ధిచెబుతామన్నారు.ఇదిలా ఉండగా.. కోవిడ్ పరిణామాల అనంతరం అమెరికాకు చైనాకు అక్రమ వలసలు పెరిగినట్టు అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అయితే, కోవిడ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో చైనీయులు.. దక్షిణ అమెరికాకు విమానాల్లో చేరుకొని.. అక్కడి నుంచి ప్రమాదకరమైన మార్గాల్లో, కాలినడకన ఉత్తర అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపైనే ట్రంప్ తాజాగా ఆరోపణలు చేశారు.మరోవైపు.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. చైనాకు షాకిచ్చారు. బ్యాటరీలు, ఈవీలు, స్టీల్, సోలార్ సెల్స్, అల్యూమినియంతో సహా చైనా ఉత్పత్తులపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భారీ సుంకాలను విధించారు. ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై 100%, సెమీకండక్టర్లపై 50% సుంకం, చైనా నుండి దిగుమతి చేసుకునే ఎలక్ట్రిక్ వాహనాల బ్యాటరీలపై 25% సుంకాన్ని పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇదే సమయంలో బైడెన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాకు కావాల్సింది చైనాతో వివాదం కాదు. పోటీ కావాలి అని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా చైనాతో పోటీ పడటానికి తాము మెరుగైన స్థితిలో ఉన్నట్టు చెప్పుకొచ్చారు. Biden claims he'll impose a 100% tariff on EVs made in China.He does not mention China barely relies on the U.S. for its EV sales (thanks to President Trump's Section 301 tariffs) and will simply manufacture vehicles in Mexico, then ship them into the U.S. pic.twitter.com/A0q97tgaUT— RNC Research (@RNCResearch) May 14, 2024