-
1.10 కోట్ల లంచం : ఏసీబీ వలలో తహసీల్దార్
సాక్షి, హైదరాబాద్ : కీసర రెవెన్యూశాఖలో ఓ భారీ అవినీతి చేప ఏసీబీ వలకు చిక్కింది. ఏకంగా రూ. కోటీ 10 లక్షల లంచం తీసుకుంటూ కీసర తహసీల్దార్ నాగరాజు ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. భూరికార్డుల్లో పేర్లు మార్చడం, పట్టాదారు పాస్బుక్ ఇవ్వడం కోసం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేశాడు. కీసర మండలం రాంపల్లి దాయర గ్రామానికి చెందిన సర్వే నంబర్ 604 నుంచి 614 వరకు గల 53 ఎకరాల స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య కోర్టులో కేసు నడుస్తున్నట్టు సమా చారం. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంలో ఓ వర్గానికి అనుకూలంగా రికార్డులు తయారుచేయడానికి తహసీల్దార్ రూ.2 కోట్ల లంచం డిమాండ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి ఏఎస్రావు నగర్లోని తన ఇంటివద్ద మొదటి విడతగా రూ.కోటీ 10 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు దాడిచేసి రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. రాంపల్లి దాయర గ్రామానికి చెందిన కందాడి అంజిరెడ్డి, వరంగల్కు చెం దిన శ్రీనాథ్ యాదవ్తోపాటు రాంపల్లి వీఆర్ఏ సాయిరాజ్ తహసీల్దార్కు సహకరించినట్లు సమాచారం. ఈ ముగ్గురినీ కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నాగరాజుతోపాటు ఆయన బంధు వుల ఇళ్లలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. తొలినుంచీ అవినీతి ఆరోపణలే.. తహసీల్దార్ నాగరాజుపై తొలి నుంచీ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండేళ్ల క్రితం కూకట్పల్లి నుంచి కీసరకు బదిలీపై వచ్చిన ఆయన పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి. గతంలో చీర్యాల గ్రామానికి చెందిన ఓ రైతు వద్ద రూ.లక్ష డిమాండ్ చేయడంతో ఆ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో అతడి కుటుంబ సభ్యులు తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన నాగరాజును నిలదీశారు. కాగా, ఇటీవల కీసర మండలంలో రియల్ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ భూముల ధరలకు రెక్కలు రావడంతో రెవెన్యూ విభాగంలో ఉన్న లోసుగులను అడ్డుపెట్టుకొని తమ కార్యాలయాలకు వచ్చే వ్యక్తుల నుంచి పెద్ద ఎత్తున లంచాలు డిమాండ్ చేసినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కీలక అధికారి విల్లా బహుమతి.. రెవెన్యూశాఖలో టైపిస్ట్గా చేరిన నాగరాజు పదోన్నతిపై తహశీల్దార్గా ఎదిగాడు. మధ్యలో డిప్యూటీ తహసీల్దార్గా ఉన్న సమయంలో ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఏసీబీకి పట్టుబడ్డాడు. అయినా.. రాజకీయ పలుకుబడి ఉపయోగించి తనపై ఉన్న కేసులను తొలగించుకున్నాడు. ఇప్పుడు తన లంచాల స్థాయిని ఏకంగా రూ.కోట్లకు పెంచుకున్నాడు. ఇటీవల మేడ్చల్ జిల్లాలోని ముగ్గురు తహశీల్దార్లు తమ అక్రమాల జోలికి రాకుండా.. ఓ కీలకాధికారికి రూ.కోట్లు విలువ జేసే విల్లాను కొనిచ్చారంటే వీరి అవినీతి ఏ స్థాయిలో ఉందో, వీరు ఎంత పెద్ద అధికారినైనా ఎలా మేనేజ్ చేయగలరో అర్థం చేసుకోవచ్చు. సీఎం కార్యాలయం కన్నెర్ర.. కీసరలో ఏసీబీ దాడులపై సీఎం కార్యాలయం కూడా ఆరా తీసినట్లు సమాచారం. రెవెన్యూ అధికారుల విషయంలో తీవ్ర ఆగ్రహంతో ఉన్న సీఎం కేసీఆర్.. రెవెన్యూశాఖ విషయంలో కీలకమైన నిర్ణయం తీసుకోనున్నారని తెలుస్తోంది. -
కార్పొరేషన్లపై టీఆర్ఎస్ కన్ను
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) పాలక మండలి పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరున ముగియనుంది. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్ల పాలకమండళ్ల పదవీ కాలపరిమితి వచ్చే ఏడాది మార్చితో పూర్తికానుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఆరంభంలో మూడు మున్సిపల్ కర్పొరేషన్లకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో టీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా పావులు కదుపుతోంది. 2016 ఫిబ్రవరిలో జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 డివిజన్లకుగాను 99 స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో అదే స్థాయిలో ఫలితాలను సాధించేలా టీఆర్ఎస్ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. మున్సిపల్ శాఖ మంత్రి హోదాలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జీహెచ్ఎంసీపై ప్రత్యేక దృష్టి సారించి, అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరుపై వరుస సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ మొదటిదశ పనులను ఈ ఏడాది అక్టోబర్లోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించారు. మరోవైపు జీహెచ్ఎంసీలో మౌలిక వసతుల పనులకు కోవిడ్ విపత్కర పరిస్థితుల్లోనూ శంకస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లపైనా దృష్టి వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల నిమిత్తం ఇప్పటికే పార్టీ నేతలను కేటీఆర్ అప్రమత్తం చేశారు. కరోనా కారణంగా ఈ ఏడాది మార్చిలో వరంగల్, ఖమ్మం నగర పర్యటనలను కేటీఆర్ వాయిదా వేసుకున్నారు. ఆ రెండు కార్పొరేషన్ల పరి ధిలో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై దృష్టి పెట్టాల్సిందిగా సంబంధిత జిల్లా మంత్రులు, ఎమ్మె ల్యేలను ఆదేశించారు. అక్టోబర్ నాటికి అభివృద్ధికార్యక్రమాలను పూర్తి చేసి, తర్వాత పూర్తిగా ఎన్నికలపైనే దృష్టి సారించేలా టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసుకుంటోంది. ఆయా కార్పొరేషన్ల పరిధిలో డివిజన్లవారీగా పార్టీ పరిస్థితిపై నివేదిక ఇవ్వాలని ఇటీవల జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కేటీఆర్ సూచించినట్లు సమాచారం. దుబ్బాక బాధ్యతలు హరీశ్కే! దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించడంతో ఆ స్థానం ఖాళీ అయినట్లు శాసనసభ కార్యాలయం నోటిఫై చేసింది. దుబ్బాక ఉప ఎన్నికలు ఎప్పుడనేదానిపై స్పష్టత లేనప్పటికీ, పొరుగునే ఉన్న సిద్దిపేట సెగ్మెంట్కు చెందిన మంత్రి హరీశ్రావుకు ఆ బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది. పార్టీ నేతలు, కేడర్ మధ్య సమన్వయంతోపాటు ఉపఎన్నికల కోణంలో పార్టీ యంత్రాంగాన్ని సం సిద్ధం చేసే బాధ్యత హరీశ్పై పెట్టినట్లు తెలిసింది. -
ఔట్సోర్సింగ్ ఉద్యోగాల్లో లంచాలకు తావుండదు
ఔట్సోర్సింగ్ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే ఉద్యోగాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నాం. లంచాలకు తావు లేకుండా ఉద్యోగాలిస్తాం. నేరుగా వారి జీతాలు వాళ్లకే అందిస్తాం. సాక్షి, అమరావతి: ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు వీలైనంత వరకు ప్రయోజనం కలిగించడం, కోతలు లేకుండా వారి వేతనాలు వారికి పూర్తిగా చెల్లించడంతో పాటు.. ఎక్కడా అవినీతి, లంచాలకు తావు లేకుండా చేసేందుకే ఏపీ ఔట్సోర్సింగ్ సర్వీసుల కార్పొరేషన్ ఏర్పాటు చేశామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. ఇంతకంటే పారదర్శకంగా, గొప్పగా ఎక్కడా ఉండదని, చాలా స్పష్టంగా మార్గదర్శకాల్లో రాస్తే ఎక్కడా లేని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇన్చార్జ్ మంత్రులను పెట్టి ఉద్యోగులను తీసేసే కార్యక్రమాలు చేస్తున్నామని నీచమైన ఆరోపణలు చేస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి పారదర్శకంగా ఈ ప్రక్రియ చేపట్టినా విపక్ష సభ్యులు బురద చల్లుతున్నారని, ప్రతీది రాజకీయం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రతిపక్షం నిత్యం దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ.. అసత్యాలు చెబుతున్నారని, అందుకే ఈ అంశంపై ప్రివిలేజ్ మోషన్కు వెళ్తామని తెలిపారు. రాష్ట్రంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగుల అంశంపై మంగళవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు. ఒక గొప్ప ఆలోచనతో ఈ కార్పొరేషన్ను ఏర్పాటు చేశామన్నారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. ఈ వ్యవస్థలో మార్పు కోసమే.. ‘‘ఔట్సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వడం కోసం లంచాలు, తర్వాత జీతాలు ఇవ్వాలంటే మాకింత ఇస్తేనే అంటూ వసూళ్లు.. మొత్తంగా ఔట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ నష్టపోతున్న పరిస్థితి గత ప్రభుత్వంలో చూశాం. ఈ పేరుతో చివరకు గుళ్లలో శానిటేషన్ పనుల (క్లీనింగ్) కాంట్రాక్ట్ కూడా చంద్రబాబునాయుడు బంధువు భాస్కరనాయుడుకు ఇచ్చారు. మొత్తం మీద వాళ్లకు సంబంధించిన వాళ్లను పెట్టుకుని పూర్తిగా దోచేసే కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు ఈ వ్యవస్థ నడిపితే ఈ వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విధంగా మేం కార్పొరేషన్ ఏర్పాటు చేశాం’’. -
‘బీపీఎస్’పై అధికారుల నిర్లక్ష్యం
పట్టణంలో ఓ చిరుద్యోగి తన తండ్రి నుంచి వచ్చిన స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. ప్లాన్కు విరుద్ధంగా కొంత నిర్మాణం జరిగింది. బిల్డింగ్ పీనలైజేషన్ స్కీమ్ (బీపీఎస్)లో రెగ్యులరైజ్ చేయించుకునేందుకు ఓ సారి దరఖాస్తు చేశాడు. అయితే ఆ దరఖాస్తును పక్కన పెట్టేశారు. మళ్లీ రెండోసారి దరఖాస్తు చేశారు. అయినా పట్టించుకోలేదు. చివరకు ఓ మాజీ ప్రజాప్రతినిధి ద్వారా బేరసారాలకు దిగాడు. చేద్దాం.. చూద్దాం అంటూ బదులిస్తున్నారు. ఈ సమస్య.. ఈ ఒక్క చిరుద్యోగిదే కాదు.. జిల్లా వ్యాప్తంగా బీపీఎస్లో దరఖాస్తు చేసుకున్న వారిలో సగానికి పైగా ఇదే పరిస్థితి. జిల్లాలో అందిన దరఖాస్తుల్లో 12 శాతానికి మించి పరిష్కారానికి నోచుకోకపోవడం అధికారుల నిర్లక్ష్యనికి నిదర్శనం. సాక్షి, మచిలీపట్నం : బీపీఎస్ పథకం కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు ఆదాయం సమకూర్చే ఓ సాధనం. అయితే ఈ పథకంపై జిల్లాలో ఆయా సంస్థల అధికారులు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. దరఖాస్తులు కుప్పలు తెప్పలుగా అందుతున్నా.. పరిష్కారమవుతున్న సమస్యలు బహుస్వల్పంగా ఉండటం ఆందోళన కలిగించే అంశం. కార్పొరేషన్లు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలకు విడుదలయ్యే గ్రాంట్స్లో కేంద్రం ఏటా వివిధ కారణాలు చూపి కోతలు విధిస్తోంది. ఈ తరుణంలో ఆదాయ మార్గాలను పెంచుకునేందుకు ఉద్దేశించిన బీపీఎస్ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సిబ్బంది కొరత సాకుతో టౌన్ ప్లానింగ్ విభాగం బీపీఎస్ దరఖాస్తుల పరిష్కారంలో తీవ్ర నిర్లక్ష్య ధోరణిని ప్రదర్శిస్తుండడంతో ఆదాయంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. బీపీఎస్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానిక సంస్థలు మౌలిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించుకునే వెసులుబాటు ఉంది. అయినా సరే తమకేమి పట్టనట్టుగా అధికారులు వ్యవహరిస్తున్నారు. చివరకు కమిషనర్లు కూడా నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. కేవలం కమిషనర్ సంతకం కోసం జిల్లా వ్యాప్తంగా 600కు పైగా దరఖాస్తులు ఎదురు చూస్తుండడం ఇందుకు నిదర్శనం. కొన్ని చోట్ల ఒక్కో పనికి ఒక్కో రేటు బిల్డింగ్ పీనలైజ్ స్కీమ్ (బీపీఎస్) కింద రెగ్యులరైజ్ చేసుకునేందుకు ప్రభుత్వం జనవరిలో అవకాశమిచ్చారు. ఇందుకోసం ఆగస్టు 31వ తేదీ గడువు విధించింది. గడువు ముగిసే నాటికి సీఆర్డీఏ పరిధితో çసహా జిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్లు, తొమ్మిది మున్సిపాల్టీల్లో 8,321 దరఖాస్తులు అందాయి. వాటిలో ఇప్పటి వరకు 980 దరఖాస్తులను మాత్రమే పరిష్కరించడం ఈ పథకం పట్ల ఏ స్థాయిలో నిర్లక్ష్యం తాండవిస్తోందో అర్థం చేసుకోవచ్చు. 20 దరఖాస్తులను తిరస్కరించగా, 6,689 దరఖాస్తులు వివిధ దశల్లో ఉన్నాయని చెబుతున్నారు. కాగా 623 దరఖాస్తులను కనీసం పరిశీలన కూడా చేయలేదు. ఇప్పటి వరకు పరిష్కరించిన దరఖాస్తుల ద్వారా జిల్లాలోని నగర, మున్సిపాల్టీలకు రూ.21 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా సీఆర్డీఏ పరిధిలో 3,875 దరఖాస్తులందగా వాటిలో రెగ్యులరైజ్ చేసినవి 447 మాత్రమే. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో 3,008 దరఖాస్తులందగా, రెగ్యులరైజ్ చేసినవి 343 మాత్రమే. అత్యల్పంగా నందిగామలో 257 దరఖాస్తులకు కేవలం రెండు దరఖాస్తులను మాత్రమే పరిష్కరించగలిగారు. అయితే చేయి తడిపితే కానీ బీపీఎస్ దరఖాస్తులను పట్టించుకోవడం లేదని దరఖాస్తుదారులు వాపోతున్నారు. కొన్ని మున్సిపాల్టీల్లో ఒక్కో పనికి ఒక్కో రేటు పెట్టి మరీ వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీపీఎస్ కింద అందిన దరఖాస్తులు 8,321 ఇప్పటి వరకు పరిష్కరించినవి 980 వచ్చిన ఆదాయం రూ. 21 కోట్లు వివిధ దశల్లో ఉన్న దరఖాస్తులు 6,689 దరఖాస్తులను పెండింగ్లో పెట్టడం సరికాదు టౌన్ ప్లానింగ్లో సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. కానీ దాన్ని సాకుగా చూపి దరఖాస్తులను పెండింగ్లో పెట్టడం సరికాదు. కమిషనర్లు బాధ్యతగా తీసుకుని వీటి పరిష్కారంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. వీటి ద్వారా వచ్చే ఆదాయాన్ని స్థానికంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలి. – వైపీ రంగనాయకులు, ఆర్డీడీ, టౌన్ప్లానింగ్ విభాగం, రాజమండ్రి రీజియన్ -
ఒకటా మూడా?
సాక్షి, సిటీబ్యూరో: ఢిల్లీ, ముంబై తరహాలో హైదరాబాద్ మహానగరాన్ని మూడు కార్పొరేషన్లుగా విభజిస్తారా..? ఔటర్ లోపల ఉన్న 23 మున్సిపాలిటీలను ఇందులో విలీనం చేస్తారా...? మున్సిపాలిటీల వారీగా మంగళవారం తుది ఓటర్ల జాబితా ప్రకటించిన నేపథ్యంలో మహానగరంలో మళ్లీ సస్పెన్స్ మొదలైంది.అయితే దీనిపై రాష్ట్ర నూతన మున్సిపల్ చట్టం ఆమోదం కోసం బుధవారం రాష్ట్ర కేబినెట్ భేటీలో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. వాస్తవానికి పోలీస్ అవసరాల కోసం నగరాన్ని మూడు కమిషనరేట్లుగా విభజించగా, మున్సిపల్ పాలన మాత్రం జీహెచ్ఎంసీ కేంద్రంగానే కొనసాగుతోంది.శివారు ప్రాంతాలన్నీ మహానగరంలో కలిసిపోయినా మొన్నటి వరకు పంచాయతీలుగానే కొనసాగాయి. తాజా మార్పులతో పట్టణాలుగా అప్గ్రేడ్ అయి వచ్చే నెలారంభంలో ఎన్నికలకు సైతం సన్నద్ధం అవుతున్నాయి. నగరంలో కలిసిపోయిన ప్రాంతాలు గ్రామ పంచాయతీలుగా ఉన్న సమయంలో అక్రమ కట్టడాలు, చెరువులు, నాలాలు, ప్రభుత్వ స్థలాల కబ్జాలు భారీగా జరిగిపోవటంతో ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన పెద్ద సమస్యగా మారిపోయింది. కోర్టు వివాదాలు సైతం భారీగానే పేరుకుపోయాయి. తాజాగా శివారు ప్రాంతాలను ఈ దఫా మున్సిపాలిటీలుగానే కొనసాగించి, వచ్చే ఐదేళ్ల తర్వాత జీహెచ్ఎంసీలో విలీన ప్రతిపాదనలు ఉండగా, మరో వైపు ఔటర్ రింగు రోడ్డు లోపలి ప్రాంతాలన్నింటికి ప్రత్యేక మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి మహానగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలంటే గ్రేటర్లో విలీనం తప్పనిసరి అన్న అభిప్రాయాన్ని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా మహానగరానికి ముఖద్వారాలుగా ఉన్న ప్రాంతాల్లో అడ్డదిడ్డమైన పాలన, రాజకీయ జోక్యం చోటు చేసుకుంటే భవిష్యత్లో కూడా వాటిని సరి చేయలేరన్న భావన వ్యక్తమవుతోంది. విలీనమైతే..మూడు కార్పొరేషన్లు ఇప్పటికే జలమండలి, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీలను విలీనం చేయాలన్న ప్రతిపాదనను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముందుకు తీసుకు రాగా, నగర శివారులోని 23 మున్సిపాలిటీలను గ్రేటర్లో విలీనం చేస్తే మూడు కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసే చాన్స్ కనిపిస్తోంది. వాటిని హైదరాబాద్, హైదరాబాద్ ఈస్ట్, హైదరాబాద్ వెస్ట్ కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి ఈ మూడు కార్పొరేషన్ల మధ్య సమన్వయం కోసం చీఫ్ సెక్రటరీ స్థాయి అధికారిని నియమించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ప్రస్తుతం మున్సిపాలిటీ ఎన్నికల కోసం బీసీ ఓటర్ల గణన, వార్డుల విభజన తదితర అంశాలు పూర్తి కావటంతో ఎన్నికలు నిలిపేయటం సాధ్యం కాకపోతే ఔటర్ రింగురోడ్డు లోపలున్న మున్సిపాలిటీలకు వచ్చే నెలారంభంలో ఎన్నికలు నిర్వహించటం ఖాయం కానుంది. -
పురపాలికల్లో ప్రత్యేక పాలన!
ఉమ్మడి జిల్లాలో గడువు ముగుస్తున్న పాలక మండళ్లు మునిసిపల్ కార్పొరేషన్లు : కరీంనగర్, రామగుండం మునిసిపాలిటీలు : హుజూరాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి కొత్త మునిసిపాలిటీలు: మంథని, సుల్తానాబాద్, కొత్తపల్లి, చొప్పదండి, ధర్మపురి, రాయికల్ సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కొత్త పురపాలక చట్టం రూపకల్పన ఇంకా ఓ కొలిక్కి రాకపోవడంతో మునిసిపల్ ఎన్నికలు గడువులోగా జరిగే అవకాశాలు ఏమాత్రం కనిపించడం లేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీల్లో ప్రస్తుతం కొనసాగుతున్న పాలక మండళ్ల గడువు జూలై 2తో ముగుస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు మొదలుకొని పంచాయతీ, పార్లమెంటు, జిల్లా, మండల పరిషత్ ఎన్నికల ప్రక్రియ రాష్ట్రంలో ముగిసిపోయినప్పటికీ, కేవలం మునిసి‘పోల్స్’ మాత్రమే మిగిలాయి. ఇప్పుడున్న మునిసిపల్ చట్టం స్థానంలో మారిన పరిస్థితులకు అనుగుణంగా కొత్త పురపాలక చట్టం తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏప్రిల్లో పురపాలక శాఖ(ఎంఏయూడీ) ప్రజల నుంచి సూచనలు, సలహాలు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రజల నుంచి వచ్చిన సూచనలతో పాటు ప్రభుత్వం పొందుపరచనున్న అంశాల నేపథ్యంలో కొత్త మునిసిపల్ చట్టం రూపకల్పన పూర్తయి, ఉభయసభల ఆమోదం పొంది అమలులోకి రావడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈ నేపథ్యంలో జూలై 2తో ముగుస్తున్న కార్పొరేషన్లు, మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఏర్పాటైన పురపాలికలకు మరో ఆరునెలల వరకు ఎన్నికలు జరిగే అవకాశాలు లేవని మునిసిపల్ వర్గాలు చెబుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలు జూలై 2న కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో రెండు మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు 8 మునిసిపాలిటీల పాలక మండళ్లకు గడువు ముగుస్తుంది. మేయర్లు, కార్పొరేటర్లు, మునిసిపల్ చైర్మన్లు, కౌన్సిలర్లు మాజీలు కాబోతున్నారు. కరీంనగర్, రామగుండం మునిసిపల్ కార్పొరేషన్లతోపాటు హుజూ రాబాద్, జమ్మికుంట, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, సిరిసిల్ల, వేములవాడ, పెద్దపల్లి పాలక మండళ్ల పదవీ కాలం వచ్చే నెల 2తో పూర్తి కాబోతున్నది. ప్రభుత్వ ఆలోచన ఇప్పటికే తెలియడంతో పాలక మండళ్ల సభ్యులు ఇప్పటికే మానసికంగా సిద్ధమయ్యారు. తమ తమ ప్రాంతాల్లో మిగిలిపోయిన పనులను జనరల్ ఫండ్, స్పెషల్ ఫండ్ కింద పూర్తి చేసుకునే పనిలో మునిగిపోయారు. కొత్తగా ఆరు మునిసిపాలిటీలు ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఉన్న 2 కార్పొరేషన్లు, 8 మునిసిపాలిటీలతోపాటు కొత్తగా ఆరు పురపాలికలు ఏర్పాటయ్యాయి. కరీంనగర్ జిల్లాలో కొత్తపల్లి, చొప్పదండి, పెద్దపల్లిలో మంథని, సుల్తానాబాద్, జగిత్యాల జిల్లాలో ధర్మపురి, రాయికల్ మునిసిపాలిటీలుగా అవతరించాయి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా పాతవాటితోపాటు కొత్త మునిసిపాలిటీలకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. పురపాలికలకు ప్రత్యేక అధికారులే జూలై 2తో పాలక మండళ్ల పాలన ముగుస్తుండడంతో 3వ తేదీ నుంచి అన్ని పురపాలికలు స్పెషల్ ఆఫీసర్ల పాలన కిందికి వెళ్లబోతున్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల స్థాయిని బట్టి వాటికి ప్రత్యేకాధికారులను ప్రభుత్వం నియమిస్తుంది. ఇప్పుడున్న కమిషనర్లనే ప్రత్యేకాధికారులుగా కొనసాగిస్తారా? లేక సీనియర్ అధికారులకు బాధ్యతలు అప్పగిస్తారా అనే విషయంలో స్పష్టత లేదు. కరీంనగర్ కార్పొరేషన్కు ఇటీవలే కొత్త కమిషనర్ ను నియమించారు. ఐఏఎస్ అధికారి కమిషనర్గా వచ్చి ఉంటే రెండు బాధ్యతలు ఆయనే చూసుకునే వీలు ఉండేది. కానీ ప్రభుత్వం ఐఏఎస్ను నియమించలేదు. రామగుండం కార్పొరేషన్తోపాటు మిగతా మునిసిపాలిటీల్లో కొనసాగుతున్న కమిషనర్లను మార్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై వారం రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పట్నం.. ఇక నగరం!
ప్రాచీన పురపాలక సంఘం మచిలీపట్నం..ఇకపై నగరపాలకసంస్థ కానుంది. ఏళ్లుగాకలగానే మిగిలిన కార్పొరేషన్ హోదా త్వరలోనేనెరవేరనుంది. మూడేళ్ల క్రితం కార్పొరేషన్హోదా కల్పిస్తూ ఉత్తర్వులు వెలువడినా..కార్యరూపం దాల్చలేదు. ప్రస్తుతం మున్సిపాలిటీపాలకవర్గాల పదవీ కాలం కొద్ది రోజులుమాత్రమే ఉండటంతో అప్పట్లో వెలువడినఉత్తర్వుల ప్రకారం మున్సిపాలిటీ కార్పొరేషన్గారూపుదిద్దుకునేందుకు అడుగులు పడుతున్నాయి. జూలై 3వ తేదీ నుంచి కార్పొరేషన్గామార్చి పాలన సాగించేందుకు అవసరమైనఏర్పాట్లను అధికారులు చేపడుతున్నారు. సాక్షి,కృష్ణాజిల్లా, మచిలీపట్నం: మచిలీపట్నం 1886లో పురపాలక సంఘంగా రూపాంతరం చెందింది. 42 వార్డుల పరిధిలో 1.80 లక్షల జనాభా నివసిస్తున్నారు. బందరును నగరపాలక సంస్థగా పరిగణించాలని 2015 సెప్టెంబరు 29న ప్రభుత్వం జీవో జారీ చేసింది. జీవో జారీ అయిన వారం రోజుల్లోనే మున్సిపల్ కౌన్సిల్ తీర్మానం చేసి పంపాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. మున్సిపల్ పాలకులు గడువు కంటే ముందే అంటే.. జీవో వచ్చిన మరుసటి రోజే కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రభుత్వానికి పంపించేశారు. అప్పుడే అందరూ బందరు కార్పొరేషన్ అయిపోయిందని భావించారు. నగరపాలక సంస్థ కావాలంటే 3 లక్షలకుపైగా జనాభా ఉండాలి. బందరులో ఆ మేరకు జనాభా లేదు. దీంతో మచిలీపట్నంకు పక్కనున్న గ్రామాలను సైతం విలీనం చేయాలని భావించారు. ఇవన్నీ చేయకుండా ఉంటే సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, దీనికి తోడు పాలకవర్గాలు కొలువుదీరి ఏడాదిన్నర కాలం కూడా గడవకుముందే మళ్లీ ఎన్నికలంటే తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని గుర్తించిన ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల వరకు ఆగాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జీఓను పక్కనబెట్టేశారు. ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పటి ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రకారం అధికారులు మున్సిపాలిటీని కార్పొరేషన్గా తీర్చి దిద్దేందుకు కసరత్తు చేస్తున్నారు. జూలై 3వ తేదీ నుంచి బందరు నగర పాలక సంస్థ కార్పొరేషన్ హోదాలో పాలన సాగించనుంది. అప్పుడలా.. బందరు కార్పొరేషన్గా రూపాంతరం చెందితే ప్రస్తుతం ఉన్న 42 వార్డుల స్థానంలో డివిజన్ వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఒక్కో డివిజన్కు 6 వేల మంది జనాభా ఉండాలి. నగర పాలక సంస్థలో 50 డివిజన్లు ఉండాలి. కానీ ప్రస్తుతం పట్టణంలో 30 డివిజన్లు ఉన్నాయి. దీంతో అప్పట్లో బందరుకు సమీపంలో ఉన్న సుల్తానగరం, అరిశేపల్లి, గరాలదిబ్బ, పోతేపల్లి, మేకవానిపాలెం,పెడన మున్సిపాలిటీ, గూడూరు మండలంలోని కప్పలదొడ్డి, పోసినవారిపాలెం, ఆకులమన్నాడు, కోకనారాయణపాలెం, నారికేడలపాలెంలను బందరు కార్పొరేషన్లో విలీనం చేయాలనుకున్నారు. ఇప్పుడిలా.. ప్రస్తుతం విలీనం ప్రక్రియను పక్కనబెట్టి పట్టణాన్నే కార్పొరేషన్గా చేయాలని మున్సిపల్ అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. దీంతో పట్టణంలోని 42 వార్డులనే 50 డివిజన్లుగా రూపుదిద్దాలని అధికారులు భావిస్తున్నారు. కార్పొరేషన్ హోదాలోనే ఎన్నికలు.. మున్సిపాలిటీ పాలకవర్గ పదవీ కాలం జూలై 2తో ముగియనుంది. సార్వత్రిక ఎన్నికలు సైతం ఇప్పటికే ముగిశాయి. ఈ తరుణంలో కార్పొరేషన్ హోదాలో వచ్చే ఎన్నికలను నిర్వహించనున్నారు. రెండేసి వార్డులు కలిపేసి ఒక డివిజన్గా రూపుదిద్దనుండటంతో వార్డులకు అన్నీ తామై వ్యవహరిస్తున్న కౌన్సిలర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 3 నుంచి కార్పొరేషన్ హోదా.. బందరు మున్సిపాలిటీని కార్పొరేషన్గా మారుస్తూ 2015లోనే ఉత్తర్వులు వెలువడ్డాయి. అప్పట్లో అభ్యంతరాలు రావడంతో సార్వత్రిక ఎన్నికల అనంతరం అమలు చేయాలని ఉత్తర్వులు అందాయి. దీంతో కార్యాచరణ ప్రారంభించాం. డివిజన్ల ఏర్పాటుపై ప్రభుత్వానికి నివేదించాం. పట్టణంలో వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఇవ్వాలని కలెక్టర్కు నివేదించాం. డివిజన్ల ఏర్పాటు, జనాబా వర్గీకరణ తదితర అంశాలపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యవహరిస్తాం.–పీజే సంపత్ కుమార్, మున్సిపల్ కమిషనర్ -
కులవృత్తికి దన్ను
సాక్షి, తాడేపల్లిగూడెం (తాలూకా ఆఫీస్ సెంటర్): స్వర్ణకారులు.. వీరి పేరులో స్వర్ణం ఉన్నా జీవితాల్లో మాత్రం చీకట్లు అలముకున్నాయి. కార్పొరేట్ సంస్థల ఆగమం, రెడీమేడ్ వస్తువులకు గిరాకీ పెరగడంతో స్వర్ణకార వృత్తి రోజురోజుకూ తగ్గుతోంది. చేతినిండా పనిలేకపోవడంతో చాలామంది స్వర్ణకారులకు పూట గడవడటం కష్టంగా మారింది. వృత్తిపరంగానూ వీరు చాలా ఒడుదుడుకులను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో కారుచీకట్లలో కాంతిరేఖలా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి కనిపిస్తున్నారు. స్వర్ణకారుల కష్టాలు దగ్గరనుంచి తెలుసుకున్న ఆయన విశ్వబ్రాహ్మణులకు కార్పొరేషన్ ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఎందరో స్వర్ణకారుల దీనగాథలు తెలుసుకున్న ఆయన వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఈ హామీ వేలాది మంది స్వర్ణకారుల్లో ఆనందం నింపింది. కార్పొరేట్ మాయాజాలం, రెడీమేడ్ ఆభరణాలు మార్కెట్లోకి విరివిగా వస్తుండటంతో స్వర్ణకారుల కొలిమిలో నిప్పు రాజకోవడం గగనమైపోతుంది. బంగారు ఆభరణాల తయారీకి వచ్చే వారి సంఖ్య రోజురోజుకూ తగ్గుతోంది. వస్తువులను మెరుగు పెట్టించుకునేందుకు వీరి వద్దకు వస్తుండటంతో చేతినిండా పనులు లేక పస్తువులు ఉంటున్నారు. కుటుంబ పోషణ, దుకాణాల అద్దెల చెల్లింపులు గగనమైపోతున్నాయి. వారి కష్టాలు తీర్చేందుకు కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఆర్థికంగా ఆదుకుంటామని జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో స్వర్ణకారులకు కొండత భరోసా ఇచ్చినట్టయ్యింది. దీంతో వీరంతా రావాలి జగన్.. కావాలి జగన్ అని అంటున్నారు. రానున్న ఎన్నికల్లో తామంతా మీవెంటే అని నినదిస్తున్నారు. కొండంత ధైర్యం వచ్చింది స్వర్ణకారులు అందరూ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావాలని భావిస్తున్నారు. ప్రజాసంకల్ప యాత్రలో స్వర్ణకారుల ఆవేదనను ఆయన విన్నారు. జగన్ ఇచ్చిన భరోసాతో మాలో ధైర్యం వచ్చింది. వైఎస్సార్ స్ఫూర్తితో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నాం. మేమంతా ఆయన వెంటే. –అకరిపల్లి మల్లికార్జున, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం కార్పొరేషన్ ఏర్పాటుచేయాలి ప్రజాసంకల్ప యాత్రలో మా కష్టాలు విన్న జగన్ విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా మా ఎదుగుదలకు కృషిచేస్తానన్నారు. చాలా ఆనందంగా ఉంది. మేం ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి అవకాశంగా భావిస్తున్నాం. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాం. –ఆవుపాటి సాయిప్రశాంత్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం రుణ సదుపాయం వస్తుంది విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ వల్ల రుణ సదుపాయం వస్తుంది. ఆ«ధునిక యంత్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు తమ పరిస్థితిని పట్టించుకోలేదు. జగన్ మా సంఘీయులకు హామీ ఇవ్వడం సంతో షాన్ని కలిగిస్తుంది. స్వర్ణకారుల కష్టాలు తొలుగుతాయ ని నమ్ముతున్నాం. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం. –పెట్ల రవిప్రసాద్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం యంత్రాలు సమకూర్చుకోవచ్చు విశ్వ బ్రాహ్మణులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇవ్వడం శుభపరిణామం. విశ్వ బ్రాహ్మణులు సమస్యల సుడిగుండంలో ఉన్నారు. కార్పొరేషన్ ఏర్పాటైతే ఆధునిక యంత్రాలు సమకూర్చుకోవచ్చు. మరింత నైపుణ్యం సాధించేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థికంగా బలోపేతం కావచ్చు. –కొండెంపూడి శ్యామ్కుమార్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం విద్యుత్ రాయితీ ఇవ్వాలి స్వర్ణకారులకు విద్యుత్ రాయితీ విషయమై పరిశీలన చేస్తానని జగన్మోహన్రెడ్డి చెప్పడం సంతోషంగా ఉంది. విద్యుత్ చార్జీల్లో రాయితీలు ఇస్తే ఆర్థికంగా కొంతవరకు గట్టు ఎక్కుతాం. స్వర్ణకారుల కష్టాలు చాలావరకు తొలుగుతాయని నమ్ముతున్నాం. జగన్మోహన్రెడ్డి అ«ధికారంలోకి రావడం ద్వారా లబ్ధి తప్పక వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నాం. –సమతాని జెమిని శ్రీనివాస్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం పని దొరకడం కష్టమైంది రెడీమేడ్ ఆభరణాలతో సంప్రదాయ స్వర్ణకారులకు పని దొరకడం లేదు. వరలక్ష్మి రూపులు కూడా రెడిమేడ్ వచ్చేశాయి. చిన్నపాటి పనులు తప్ప పెద్ద పని ఎవరూ ఇవ్వడం లేదు. జగన్ హామీలు మాకు భరోసా ఇచ్చాయి. –లక్కోజు ధర్మేష్, స్వర్ణకారుడు, తాడేపల్లిగూడెం -
శిక్షణతోనే సరి.. రాయితీలు మరి!
సాక్షి, హైదరాబాద్: స్వయం ఉపాధి గాడి తప్పింది. నిరుద్యోగ యువతను ఉద్యోగావకాశాలకు ప్రత్యామ్నాయంగా స్వయం ఉపాధి రంగంవైపు ప్రోత్సహించేందుకు ఏర్పాటుచేసిన ఫైనాన్స్ కార్పొరేషన్ల లక్ష్యం అటకెక్కింది. స్వయం ఉపాధి కోసం ప్రయత్నించిన ఆశావహులందరికీ రాయితీలిచ్చి సహకరిస్తామంటూ వార్షిక సంవత్సరం ప్రారంభంలో భారీ ప్రణాళికలు తయారు చేసిన వివిధ కార్పొరేషన్లు ప్రస్తుతం ముఖం చాటేశాయి. రాయితీలపై నోరుమెదపకుండా శిక్షణ కార్యక్రమాలతో సరిపెడుతున్నా యి. స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తామని దరఖాస్తు చేసుకున్న వారికి చెయ్యిచ్చాయి. మరో నెలన్నరలో 2018–19 ఆర్థిక సంవత్సరం ముగియనుండగా.. కనీసం దరఖాస్తుల పరిశీలన సైతం చేయకపోవడంతో అర్జీదారులు డీలా పడ్డారు. 10.25 లక్షల మంది ఎదురుచూపులు.. భారీ వార్షిక ప్రణాళికలు రూపొందించిన ఫైనాన్స్ కార్పొరేషన్లు గత రెండేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా 10.25 లక్షల మంది నుంచి దరఖాస్తులు స్వీకరించాయి. ఇందులో భాగంగా 2017–18 వార్షిక సంవత్సరం చివర్లో 7,59,788 మంది దరఖాస్తు చేసుకోగా... 2018–19 వార్షికం ప్రారంభంలో 2,65,375 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను పరిశీలిం చి లబ్ధిదారులను గుర్తించాలి. ఈక్రమంలో ముందు గా జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్ధారిస్తే... ఆమేరకు పరిశీలన చేపట్టి అర్హులను గుర్తిస్తారు. కానీ ఇప్పటివరకు జిల్లాల వారీ లక్ష్యాలను ఆయా ఫైనా న్స్ కార్పొరేషన్లు నిర్ధారించలేదు. ఇందుకు ప్రధాన కారణం ఫైనాన్స్ కార్పొరేషన్ల రాష్ట్ర వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఆమోదించకపోవడమే. సాధారణంగా ఫైనాన్స్ కార్పొరేషన్లు వార్షిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించిన వెంటనే వాటికి ఆమోదం రావాల్సి ఉంటుంది. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్లు సమర్పించిన 2018–19 వార్షిక ప్రణాళికలను ప్రభుత్వం ఇప్పటికీ ఆమోదించలేదు. దీంతో ఆయా కార్పొరేషన్లు లబ్ధిదారుల ఎంపికను సైతం నిర్వహిం చలేదు. 2018–19 వార్షిక ప్రణాళికలకు ఆమోదం రాకపోవడం, గత దరఖాస్తులకు మోక్షం కలగని కారణంగా ఈ ఏడాది ఎస్టీ, బీసీ కార్పొరేషన్లతో పాటు బీసీ ఫెడరేషన్లు కనీసం దరఖాస్తులు సైతం స్వీకరిం చలేదు. ప్రస్తుతం కార్పొరేషన్ల వద్ద ఉన్న దరఖాస్తులు పరిష్కరించాలంటే రూ.18,062.41 కోట్లు అవసరమని అధికారులు చెబుతున్నారు. ఎంబీసీ కార్పొరేషన్ వద్ద అందుబాటులో ఉన్న రూ.250 కోట్ల నిధితో 17వేల మంది లబ్ధిదారులకు అధికారులు చెక్కులు సిద్ధం చేశారు. వీరంతా రూ.50 వేలలోపు యూనిట్లు పెట్టుకున్నవారే. కానీ ముందస్తు ఎన్నికలు రావడంతో ఇవికూడా జిల్లా కలెక్టరేట్ల వద్ద పెండింగ్లో ఉండిపోయాయి. ‘ముందస్తు’తో ఆవిరైన ఆశలు.. 2017–18 వార్షికంలో ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో ఆ తరువాతి ఏడాదిపైనే కార్పొరేషన్లు గంపెడాశలు పెట్టుకున్నాయి. ఈక్రమంలో 2018–19 వార్షిక ప్రణాళికలను భారీగా తయారు చేసిన అధికారులు ప్రతిపాదనలు ప్రభుత్వానికి నివేదించారు. ఎన్నికల సీజన్ కావడంతో తప్పకుండా నిధులు వస్తాయని అన్నివర్గాలు ఆశలు పెట్టుకున్నాయి. కానీ రెండో త్రైమాసికంలోనే ప్రభుత్వం ముందస్తుకు సిద్ధం కావడంతో నిరుద్యోగ యువతకు భంగపాటు తప్పలేదు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో మరో రెండు నెలలపాటు కాలయాపన జరిగింది. త్వరలో పార్లమెంటు ఎన్నికలు రానుండడంతో ఈసారి స్వయం ఉపాధికి రాయితీ రుణాలు కష్టమేనని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. -
అంతేగా.. అంతేగా!!
పటమట (విజయవాడ తూర్పు): పాలకులు పలుకుబడి... అధికారుల అండదండలుంటే చాలు నిబంధనలు బేఖాతర్ చేయవచ్చని.. అనుమతులకు చెల్లించాల్సిన చార్జీలను కూడా ఎగ్గోట్టోచ్చని విజయవాడ టీడీపీ నాయకులు, వీఎంసీ అధికారులు మరోమారు నిరూపించారు. నగరపాలక సంస్థలోని పట్టణ ప్రణాళిక అధికారులు పాలకపక్షం నేతలు చెప్పింది తూచా తప్పకుండా పాటించటంతోపాటు వీఎంసీకి రావాల్సిన ఆదాయానికి గండికొట్టి తమ జేబులు నింపుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలిస్తున్న అధికారులు అసలు పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంటుందని ఆరోపణలు పెరుగుతున్నాయి. ఒకే నిర్మాణానికి వేర్వేరు బిల్డింగ్ ఇన్సెపెక్టర్లు పరిశీలనకు వెళ్లగా ఒక అధికారి తిరస్కరించిన ప్లాను, అనుమతిని మరో అధికారి మంజూరు చేయటం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. 14 శాతం ఓపెన్స్పేస్ చార్జీలను ఒక అధికారి సిఫారసు చేస్తే అదే భవనాకికి నామమాత్రపు చార్జీలతో అనుమతులు ఇచ్చేయటం ఇప్పుడు వీఎంసీలో చర్చనీయాంశంగా మారింది. దీనికి నగరంలోని టీడీపీకి చెందిన ఓ యువనేత చక్రం తిప్పి అటు అధికారులకు, ఇటు నిర్మాణాదారులకు మధ్యవర్తిత్వం వహించి వీఎంసీకి సమకూరాల్సిన సొమ్ముకు గండికొట్టారు. వివరాల మేరకు .. బెంజిసర్కిల్ వద్ద కళానగర్లో 2018 నవంబర్ 440 గజాల స్థలంలో సిల్టు, జీప్లస్3 నిర్మాణానికి అనుమతి కావాలని వీఎంసీకి దరఖాస్తు వచ్చింది. దీన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్సెపెక్టర్ వశీంబేగ్ వెళ్లారు. సంబంధిత ఆస్తికి చెందిన దస్తావేజులు, పన్ను చెల్లింపుల రసీదుల పరిశీలనలో భవన నిర్మాణ అనుమతికి సంబంధించి కేవలం 1999ల నుంచి పన్నులు చెల్లిస్తున్నట్లు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ పరిశీలనలో తేలటంతో ఈ ఆస్తికి 14 శాతం ఓపెన్స్పేస్ బెటర్మెంట్ చార్జీలు అప్లై అవుతుందని నివేదిక ఇచ్చారు. ఆ చార్జీలు చెల్లించిన తర్వాతే నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని ఉన్నతాధికారులకు సిఫారసు చేశారు. బెటర్మెంట్ చార్జీలు చదరపుగజానికి రూ. 60,500 చొప్పున 440 చదరపు గజాలకి 14 శాతం చొప్పున 37.26 లక్షలు వీఎంసీకి చెల్లించాల్సి వచ్చింది. దీంతో సదరు భవన నిర్మాణదారులు భవన నిర్మాణ అనుమతి దరఖాస్తును విత్డ్రా చేసుకున్నారు. కానీ నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణ పనులు జరిగినా అధికారులు ఇటువైపు కన్నెతి చూడలేకపోయారు. అయితే ఈ ఏడాది జనవరి 10వ తేదీన సంబంధిత భవనానికి సిల్టు, జీప్లస్ 4 నిర్మాణానికి మళ్లీ వీఎంసీకి దరఖాస్తు అందింది. మళ్లీ క్షేత్రస్థాయి పరిశీలనకు బిల్డింగ్ ఇన్స్పెక్టర్ రాం కుమార్ వెళ్లటంతో సంబంధిత భవన నిర్మాణదారులు టీడీఆర్ (టాన్స్ఫర్బుల్ డెవలప్మెంట్ రైట్స్) బాండ్లు సమర్పించి దరఖాస్తు చేసుకోవటంతో అధికారులు భవన నిర్మాణానికి నామమాత్రపు చార్జీలు రూ. 1.6 లక్షలు చెల్లిస్తే సరిపోతుందని సిఫారసు చేయటంతో వీఎంసీ అధికారులు అనుమతిని యధేచ్ఛగా ఇచ్చేశారు. అయితే ముందు జరిగిన పరిశీలనలో ఉన్న 14 శాతం ఓపెన్ స్పేస్ ఛార్జీలను అధికారులు కన్పించకుండా మాయచేసి అనుమతులు ఇచ్చేవారని, దీనికి నగరంలోని టీడీపీలో కీలకంగా ఉన్న ఓ యువ నాయకుడు చక్రంతిప్పి అటు నిర్మాణదారులకు, ఇటు అధికారులకు సమన్యాయం చేశారని సమాచారం. పరిశీలించాల్సి ఉంది దీనిపై పరిశీలన చేయాల్సి ఉంది. భవన నిర్మాణదారులు 14 శాతం ఓపెన్ స్పేస్ చార్జీలు చెల్లించారా లేదా అనేది పరిశీలించి చెల్లించకపోతే చర్యలు తీసుకుంటాం.- లక్ష్మణరావు, సిటీ ప్లానర్ -
సబ్ప్లాన్ పనులకూ.. అధికార చీడ!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార పార్టీ నేతలు ఏ పనులనూ వదలడం లేదు. అన్నీ తమకే అప్పగించాలంటూ ఒత్తిళ్లు తెస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, మురికి కాలువలు వంటి పనులకు పిలిచిన టెండర్లను తెరవొద్దంటూ అధికారులపై ఒత్తిళ్లు తెస్తున్నారు. దీంతో టెండరు గడువు పూర్తయి సుమారు నెల రోజులు కావస్తున్నా వాటిని కర్నూలు కార్పొరేషన్ అధికారులు తెరవడం లేదు. తన వారికి దక్కలేదన్న కారణంగా అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో టెండర్లు తెరవడం లేదని తెలుస్తోంది. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు సంబంధించి కోట్లాది రూపాయల విలువైన పనులకు సకాలంలో టెండర్లు పిలవలేదంటూఏకంగా మునిసిపల్ డైరెక్టర్ రద్దు చేసినప్పటికీ వ్యవహారంలో మాత్రం మార్పు రావడం లేదు. మునిసిపల్ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సుమారు రూ.4.5 కోట్లతో మూడు వేర్వేరు టెండర్లను ఈ ఏడాది జూలై 21న పిలిచారు. వీటికి బిడ్లు సమర్పించే గడువు ఆగస్టు 13తో పూర్తయ్యింది. ఈ టెండర్లలో పలు సంస్థలు పాల్గొన్నాయి. అయితే, అధికార పార్టీ నేతకు అనుకూలంగా ఉన్న వ్యక్తికి దక్కలేదనే కారణంగా అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి మరీ టెండర్లు తెరవకుండా అడ్డుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిధులు వెనక్కి వెళుతున్నా... ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లను త్వరగా పూర్తి చేయాల్సి ఉంటుంది. గతంలో సబ్ప్లాన్ నిధులను సకాలంలో ఖర్చు చేయలేదన్న కారణంతో వెనక్కి తీసుకున్నారు. 2017–18 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా రూ.300 కోట్ల మేర నిధులను ప్రభుత్వం వెనక్కి తీసేసుకుంది. జిల్లాలో కూడా రూ.20 కోట్ల మేర వెనక్కి వెళ్లాయి. ఇప్పుడు కూడా రూ.4.5 కోట్ల పనులకు టెండర్లను పిలిచి 50 రోజులకు పైగా అయ్యింది. బిడ్లను సమర్పించి కూడా నెల రోజులు కావస్తోంది. అయినప్పటికీ టెండర్లను మాత్రం తెరవడం లేదు. అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి సబ్ప్లాన్ పనులకు సంబంధించిన టెండర్లు ఆలస్యం కాకుండా చూడాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయినప్పటికీ కర్నూలు కార్పొరేషన్లో మాత్రం అధికార పార్టీ నేత ఒత్తిళ్లతో గడువు ముగిసినా టెండర్లను తెరవని పరిస్థితి నెలకొంది. రంగంలోకి ఇతర కాంట్రాక్టర్లు! సబ్ప్లాన్ టెండర్లను తెరవకపోవడంతో కొద్ది మంది మునిసిపల్ కాంట్రాక్టర్లు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. సదరు నేత వద్దకు వెళ్లి.. టెండర్లను తెరిచేందుకు అనుమతి ఇవ్వాలని కోరినట్టు సమాచారం. అయినప్పటికీ ఆ నేత ససేమిరా అన్నట్టు తెలుస్తోంది. టెండరులో పనులు దక్కే కాంట్రాక్టర్ను మీ వద్దకు తీసుకొస్తామని పేర్కొన్నప్పటికీ అంగీకరించలేదని సమాచారం. కేవలం తన మనుషులకు మాత్రమే పనులు దక్కించుకునేందుకు ఈ విధంగా చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
వెంకటగిరి మున్సిపాలిటీలో తెలుగుతమ్ముళ్ల చేతివాటం
-
కుదుంబ బృందం
కోళికోద్.. ఒకప్పటి కాలికట్. అరేబియా తీరం. వాస్కోడిగామా సముద్రమార్గాన ఇండియాకి చేరింది ఇక్కడే. కేరళలోని ఓ జిల్లా కేంద్రం ఇది. ఈ కోళికోద్ ఇప్పుడు మళ్లీ ఓ చరిత్రకు శ్రీకారం చుట్టింది. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడానికి ఓ షాపింగ్ మాల్ను కట్టింది కోళికోద్ కార్పొరేషన్. కుదుంబశ్రీ బజార్ ప్రాజెక్ట్ పేరుతో అర ఎకరా స్థలంలో పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ను కట్టింది. ఈ ఐదంతస్తుల భవనంలో ఉన్న అన్ని షాపులనూ మహిళలకే అద్దెకిస్తారన్నమాట. అంటే మహిళలు స్థాపించిన పరిశ్రమలు, వ్యాపారాలకే ఈ దుకాణాలు. ఈ ప్రాజెక్టు ఇచ్చిన భరోసాతో కేరళ మహిళలు కుదుంబశ్రీ (కుటుంబశ్రీ) పేరుతో సంఘటితమయ్యారు. పదిమంది నుంచి పదిహేను మందితో చిన్న చిన్న బృందాలయ్యారు. తమకు ఆసక్తి ఉన్న పనుల్లో నైపుణ్యం సాధించి వ్యాపారం మొదలుపెట్టారు. ఇప్పటి వరకు సూపర్మార్కెట్, ఫుడ్కోర్ట్, కిడ్స్ పార్క్, స్పా, బ్యూటీపార్లర్, ఉమెన్స్ బ్యాంక్, ఫ్యాన్సీ స్టోర్, టెక్స్టైల్స్, రెడీమేడ్స్, బొటిక్, ఫుట్వేర్, డ్రై క్లీనింగ్, కార్ వాషింగ్, ఆప్టికల్ స్టోర్, హ్యాండీ క్రాఫ్ట్స్, బేబీ కేర్, హోమ్ అప్లయెన్సెస్, బుక్స్టాల్స్.. ఇలా అన్నిట్లో అడుగుపెట్టారు. దాదాపుగా అన్నీ చిన్న తరహా వ్యాపారాలే. తక్కువ పెట్టుబడితో ఆర్థిక స్వావలంబన సాధించడానికి ప్రభుత్వం ఇస్తున్న తోడ్పాటులో భాగం ఇది. కుదుంబశ్రీ బృందాలు మన దగ్గర ఉన్న సెల్ఫ్హెల్ప్ గ్రూపుల వంటివి. వీరిలో కొంతమంది వ్యక్తిగతంగా, మరికొందరు బృందంగా వ్యాపారాలను నిర్వహిస్తున్నారు. తమ వ్యాపారాలతోపాటు షాపింగ్ కాంప్లెక్స్ నిర్వహణ బాధ్యత కూడా ఈ మహిళలే చూసుకుంటారు. ఈ మాల్ మొత్తం ఉమెన్ ఆంట్రప్రెన్యూర్ల కోసమే. కుదుంబశ్రీ సభ్యులకు దుకాణాల అద్దె పదిశాతం తగ్గుతుంది, ఈ బృందంలో సభ్యులు కాని మహిళలకు అద్దెలో రాయితీ ఉండదు. ఈ మాల్లో కాన్ఫరెన్స్ రూమ్లు, ట్రైనింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు కేరళ మహిళలు అక్షరాస్యతలో మిగిలిన రాష్ట్రాలకంటే ముందున్నారు, ఉద్యోగాల్లోనూ ముందు వరుసలోనే ఉన్నారు. వ్యాపార రంగంలో కూడా ముందంజలో ఉండడానికి ప్రభుత్వం ఇస్తున్న సహకారమిది. – మంజీర -
కార్పొరేషన్లకు సభ్యుల నియామకం
అమరావతి: రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు సభ్యులను నియమిస్తూ ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. ఒక్కో కార్పొరేషన్కు నాలుగు నుంచి ఆరుగురు వరకు సభ్యులను నియమించారు. ఏపీ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ హౌసింగ్ కార్పొరేషన్, ఏపీ స్టేట్ ఇర్రిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ఏపీ గ్రంధాలయ సంస్థ, ఏపీ షీప్ అండ్ గోట్ ఫెడరేషన్లకు సభ్యులను కేటాయించారు. ఎన్నికలు దగ్గర సమయంలో టీడీపీలో అసంతృప్తులను చల్లబరిచేందుకు కార్పొరేషన్ల నియామకం చేపడుతోన్నట్లు కనిపిస్తోంది. -
పుట్టి ముంచుతున్న ప్రాజెక్టులు
కార్పొరేషన్లో ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు.. ఆదాయ వనరులు పెరగడం లేదు. పోనీ.. చేస్తున్న ఖర్చులైనా సక్రమంగా జరుగుతున్నాయా అంటే అదీ లేదు. ఏదో ఒక ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడం.. నచ్చిన సంస్థకు ఆ ప్రాజెక్టుని అప్పగించడం.. జీవీఎంసీ ఖజానా నుంచి కోట్ల రూపాయలు కట్టబెట్టడం. గత మూడేళ్లుగా ఇదే తంతు. ఇలాగైతే.. కార్పొరేషన్ పుట్టి మునిగిపోవడం ఖాయం. చివరికి ప్రజలకు కచ్చితంగా ఉపయోగపడే పని ఏదైనా చెయ్యాలంటే ఒక్క రూపాయీ మిగలదేమో..! – ఇటీవల ఓ జీవీఎంసీ అధికారి అన్న మాటలివి.. ఆయన మాటల్లో కించిత్తయినా అవాస్తవం లేదు. ప్రస్తుతం జీవీఎంసీలో జరుగుతున్న తీరును పూసగుచ్చినట్లు చెప్పారు. ప్రజల నుంచి పన్నుల రూపంలో పైసా పైసా కూడబెట్టుకొని మహా నగరాన్ని అభివృద్ధి చేస్తున్న నగరపాలక సంస్థ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అనాలోచిత నిర్ణయాల వల్ల అప్పుల పాలవుతోంది. స్మార్ట్ సిటీ, అమృత్ నగరమంటూ ప్రకటించి.. పప్పుబెల్లాలు చేతికిచ్చి మిగిలిన సొమ్ము పెట్టుబడి పెట్టి చేస్తున్న ప్రాజెక్టులు ఖజానాను ఊడ్చేస్తున్నాయి. తాజాగా.. హైబ్రిడ్ సివరేజ్ ట్రీట్మెంట్ ప్రాజెక్టు కూడా అదే కోవలోకి వస్తోంది. అసలే అప్పుల్లో ఉన్న నగరంపై అదనంగా రూ.150 కోట్ల భారం వేస్తోంది. విశాఖ సిటీ : మహా విశాఖ నగర పాలక సంస్థకు కొత్త ప్రాజెక్టులు తలబొప్పి కట్టిస్తున్నాయి. అరకొర నిధులు మంజూరు చేసి మిగిలిన మొత్తాన్ని కార్పొరేషన్ భరించుకొని పనులు పూర్తి చేయాల్సిన పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతోంది. కేంద్ర ప్రభుత్వం నగరాలు, పట్టణాలను ఆధునికీకరణ, స్వచ్ఛత పేరుతో స్మార్ట్సిటీ, అమృత్ వంటి పథకాలు ప్రవేశపెట్టింది. వీధులు సర్వాంగ సుందరంగా, నగరంలోని ఓ ప్రాంతం సాంకేతిక రూపు సంతరించుకునేలా స్మార్ట్సిటీ, నగరాలు, పట్టణాల్లో తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, ఉద్యానవనాల పథకాల కోసం కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకాలను ప్రవేశపెట్టింది. పేరుకే కేంద్ర ప్రభుత్వ పథకాలైనా.. ఖర్చులో సింహభాగం కార్పొరేషన్దే కావడం గమనార్హం. ఈ పథకాల కారణంగానే జీవీఎంసీ ఖజానా ఖాళీ అవ్వడం ప్రారంభమైంది. అమృత్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం 33.33 శాతం నిధులు మా త్రమే అందిస్తుంది. అంటే అమృత్ పథకం కింద జీవీఎంసీ పరిధిలో రూ.250 కోట్లు పనులు చేపట్టాలని టెండర్లు ఖరారు చేశారు. అయితే ఇందులో కేంద్రం ఇచ్చేది రూ.83 కోట్లు కాగా, జీవీఎంసీపై రూ.167 కోట్ల భారం పడుతోంది. సివరేజ్... గ్రేటర్ నిధులు బ్రేవ్ జేఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా 2007లో రూ.244 కోట్ల అంచనాతో 320 కిలోమీటర్ల పొడవునా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (యూజీడీ) వ్యవస్థను ఏర్పాటు చేశారు. వీటిని అనుబంధంగా కార్పొరేషన్ పరిధిలో ఉత్పన్నమయ్యే మురుగునీటిని శుద్ధి చేసేందుకు సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. నరవలో 108 ఎంఎల్డీ సామర్థ్యంతో అతిపెద్ద ఎస్టీపీ నిర్మాణం పనులు చేపట్టారు. ప్రస్తుతం ఈ పనులు 50 శాతం మా త్రమే పూర్తయ్యాయి. మరోవైపు.. ఈ సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్లు నిర్వహణకు జీవీఎంసీ తల ప్రాణం తోకకొస్తోంది. వీటికి విద్యుత్ సరఫరా కోసం హెచ్టీ పవర్ సప్లై అవసరమవుతోంది. నిర్వహణ వ్యయం తడిసి మోపెడై కార్పొరేషన్ ఖజనాను ఖాళీ చేసేస్తోంది. జీవీఎంసీ నెత్తిన హైబ్రిడ్ ఎస్టీపీ శఠగోపం ఉన్న సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లతోనే సతమతమవుతున్న కార్పొరేషన్కు తాజాగా ప్రభుత్వం పరిపాలన పరమైన అనుమతులు మంజూరు చేసిన మరో హైబ్రిడ్ ఎస్టీపీ ప్రాజెక్టు గుదిబండలా మారనుంది. రూ.762 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్లాంటు నిర్మాణం చేపట్టనున్నారు. ఇందులో తొలి విడతగా రూ.412కోట్లతో పెందుర్తిలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. నరవలో సగం పనులు పూర్తయిన ఎస్టీపీని ఈ ప్రాజెక్టు ద్వారా అభివృద్ధి చేయాలని కార్పొరేషన్ భావిస్తోంది. రూ.412 కోట్లలో రూ.150 కోట్లు జీవీఎంసీ భరించాల్సింది. అప్పోసొప్పో చేసి ప్లాం టు పూర్తి చేసిందే అనుకున్నా.. ఈ భారీ ఎస్టీపీ నిర్వహణ ఖర్చుల మోత మోగిపోనుంది. ఈ హైబ్రిడ్ సివరేజ్ ట్రీ ట్మెంట్ ప్లాంట్ నిర్వహణకు ఏడాదికి రూ.100 కోట్లు అ య్యే అవకాశముందని జీవీఎంసీ అంచనా వేస్తోంది. అప్పుల ఊబిలోకి వెళ్లే ప్రమాదం ఈ ప్రాజెక్టులు ప్రారంభించాలంటే కార్పొరేషన్ అప్పుల బాట పట్టాల్సిందే. కొన్నేళ్లుగా ఆదాయ వనరులు పెరగకపోవడంతో... ఉన్న వాటితోనే సర్దుకుపోతున్న పరిస్థితి. రెండేళ్ల క్రితం వరకూ రూ.400 కోట్లు అప్పుగా ఉండగా.. ప్రస్తుతం వాటిని సగం మేరకు తీర్చేశారు. మిగిలిన రూ.198 కోట్లను చెల్లించేందుకు మూడు నెలలకోసారి రూ.3 నుంచి 4 కోట్లు చెల్లించాల్సి వస్తోంది. మిగిలిన జేఎన్ఎన్యూఆర్ఎం పనులు పూర్తి చేసేందుకు రూ.75 కోట్లు అప్పు తీసుకునేందుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ఇటీవలే జీవీఎంసీ అధికారులు లేఖ రాశారు. మరోవైపు.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో రూ.100 కోట్ల 14 వఆర్థిక సంఘం నిధుల్నీ కేంద్రం నిలిపేసింది. ఇవి వస్తాయన్న దీమాతో అభివృద్ధి పనులు పూర్తి చేసిన కార్పొరేషన్.. ఇప్పుడు దిక్కులు చూస్తూ.. జనరల్ ఫండ్స్పై ఆధారపడాల్సిన పరిస్థితి దాపురించింది. జీవీఎంసీకి వచ్చే ఆదాయ వనరుల్లో ప్రధానంగా ఉండే ఆస్తి పన్ను రూ.200 కోట్లు ఉద్యోగుల జీతాలకు సరిపోతున్నాయి. టౌన్ ప్లానింగ్ నుంచి రూ.100 కోట్లు, నీటి సరఫరా నుంచి సుమారు రూ.50 కోట్లు ఆదాయం వస్తున్నా.. సాధారణ పనులకు సరిపోతున్నాయి. 2007 నుంచి ఆస్తి పన్నుని, 2012 నుంచి ట్రేడ్ లైసెన్స్ ఫీజుల్ని పెంచలేదు. వీటిని పెంచేందుకు ప్రయత్నిస్తున్నా ప్రభుత్వం ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని నిరోధిస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రెండేళ్లలో గ్రేటర్ మళ్లీ రూ.400 కోట్ల అప్పుల్లోకి వెళ్లాల్సిన పరిస్థితే ఎదురవుతుందని జీవీఎంసీ అధికారిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ప్రజల అవసరాల కోసమే.. ప్రస్తుతం కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న అన్ని రకాల అభివృద్ధి పనులూ ప్రజల అవసరాల కోసమే చేపట్టాం. ప్రస్తుతం ఉన్న నిధులతో పనులు నిర్వహిస్తున్నాం. స్మార్ట్ సిటీ అన్నప్పుడు ఖర్చులు తప్పవు. ప్లాంట్ ద్వారా శుద్ధి చేసిన నీటిని పారిశ్రామిక అవసరాలకు అమ్మగా వచ్చిన నిధులతో ప్లాంట్ నిర్వహణ జరుగుతుంది. నగరాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దేందుకు కార్పొరేషన్ నిధులు ఖర్చు చెయ్యాలి. ప్రజలకు అన్ని సౌకర్యాలు సమకూర్చాల్సిన బాధ్యత కార్పొరేషన్పై ఉంది. – హరినారాయణన్, జీవీఎంసీ కమిషనర్ -
‘పుట్టా’కు టీటీడీ.. ‘వర్ల’కు ఆర్టీసీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలోని 17 కార్పొరేషన్లకు సీఎం చంద్రబాబు అధ్యక్షులను నియమించారు. టీటీడీ చైర్మన్గా పుట్టా సుధాకర్ యాదవ్, ఆర్టీసీ చైర్మన్గా వర్ల రామయ్యను ఖరారు చేశారు. ఆ జాబితాను పార్టీ రాష్ట్ర కార్యాలయం మంగళవారం విడుదల చేసింది. కొద్దిరోజుల క్రితం పార్టీలో చేరిన మాజీ సీఎం సోదరుడు నల్లారి కిశోర్కుమార్రెడ్డికి స్టేట్ ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవి లభించింది. కాపు కార్పొరేషన్ చైర్మన్ పదవిని మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడికి అప్పగించారు. -
‘సాగునీటి’కి మరో భారీ కార్పొరేషన్!
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన నిధుల సేకరణ కోసం మరో భారీ కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా ‘తెలంగాణ రాష్ట్ర వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్డబ్ల్యూఐసీ)’పేరిట కార్పొరేషన్ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గోదావరి నదిని సద్వినియోగం చేసుకొనేలా చేపట్టిన ప్రాజెక్టులకు భారీగా నిధులు అవసరమవుతున్న విషయం తెలిసిందే. దీంతో నిధుల సమీకరణ కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తోంది. దీనివల్ల వివిధ రుణ సంస్థలు, బ్యాంకుల నుంచి అవసరమైన మేరకు రుణాలు తెచ్చుకునేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయగా... తాజాగా మరో నాలుగు ప్రాజెక్టులకు కలిపి సంయుక్తంగా కార్పొరేషన్ ఏర్పాటుకు నీటి పారుదల శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. బడ్జెట్ సమావేశాలకు ముందు జరిగే కేబినెట్ భేటీలో దీనికి ఆమోదం తెలిపే అవకాశమున్నట్లు ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే రూ.25 వేల కోట్లు కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి నిధుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ‘కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ (కేఐపీసీ)’ను ఏర్పాటు చేసింది. ఆ కార్పొరేషన్ ద్వారా మూడు విడతల్లో రుణ సమీకరణ చేసింది. ఆంధ్రాబ్యాంకు, విజయా బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకుల ద్వారా మొత్తంగా రూ.24,780 కోట్ల రుణాలకు ఒప్పందాలు కుదరగా.. ఇప్పటికే రూ.6,299 కోట్ల మేర ఖర్చు చేశారు కూడా. తాజాగా దేవాదుల, తుపాకులగూడెం, సీతారామ, వరద కాల్వ ప్రాజెక్టులను కూడా శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రాజెక్టుల వ్యయాలు పెరగడంతో.. 6.21 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలనే లక్ష్యంతో రూ.9,423 కోట్లతో దేవాదుల ప్రాజెక్టును చేపట్టారు. అయితే ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు పెంచడంతో.. అంచనా వ్యయం రూ. 13,445.44 కోట్లకు పెరిగింది. ఇప్పటివరకు రూ.8,800 కోట్ల వరకు ఖర్చు చేయగా.. మరో రూ.4,700 కోట్ల మేర నిధులు అవసరం కానున్నాయి. దీనికితోడు ఇటీవలే ప్రాజెక్టు పరిధిలో అదనపు నీటి నిల్వ కోసం కొత్త రిజర్వాయర్ను ప్రతిపాదించారు. 10.78 టీఎంసీల సామర్థ్యంతో రూ.3,300 కోట్లతో వరంగల్ జిల్లా ఘణపూర్ మండలం లింగంపల్లి వద్ద దాన్ని నిర్మించేలా ప్రణాళికలు సిద్ధమయ్యాయి. అంటే దేవాదుల పూర్తికే రూ.8 వేల కోట్ల వరకు అవసరం కానున్నాయి. ఇక దేవాదుల దిగువన తుపాకులగూడెం బ్యారేజీని రూ.2,121 కోట్లతో చేపట్టగా.. మరో రూ.1,900 కోట్లు అవసరం. ఈ రెండు ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్ల మేర అవసరంకాగా.. రూ.5 వేల కోట్ల నుంచి రూ.7 వేల కోట్ల వరకు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. రీ-ఇంజనీరింగ్తో.. ఉమ్మడి ఖమ్మం జిల్లా సాగునీటి అవసరాలను తీర్చే సీతారామ ఎత్తిపోతల పథకాన్ని రీఇంజనీరింగ్ చేయడంతో.. అంచనా వ్యయం రూ.7,926 కోట్ల నుంచి రూ.13,384 కోట్లకు పెరుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టు పరిధిలో రూ.220 కోట్ల విలువైన పనులు మాత్రమే పూర్తయ్యాయి. వచ్చే రెండేళ్లలో కనీసం రూ.7 వేల కోట్ల మేర పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంటే ఈ ప్రాజెక్టుకు ఏటా రూ.3,500 కోట్లు అవసరం. దీంతో ఈ ప్రాజెక్టునూ కార్పొరేషన్ పరిధిలోకి తెచ్చి.. రూ.8 వేల కోట్ల మేర రుణం తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక వరద కాల్వ పనులను రూ.9,886 కోట్ల అంచనాతో చేపట్టగా.. ఇప్పటివరకు రూ.5,323 కోట్లు ఖర్చు చేశారు. మరో రూ.4,500 కోట్లు అవసరం కావడంతో దీన్ని కూడా కార్పొరేషన్ పరిధిలోకి చేర్చారు. మొత్తంగా నాలుగు ప్రాజెక్టులకు కలిపి రూ.20 వేల కోట్ల వరకు రుణాలను తీసుకోనున్నారు. -
రెండో హరిత విప్లవం లక్ష్యంగా..
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర రైతు సమన్వయ సమితి పేరిట కార్పొరేషన్ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్గదర్శకాలను కూడా జారీ చేసింది. ఇందులో వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి పార్థసారథి, శాఖ కమిషనర్ జగన్మోహన్, ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి, మార్కెటింగ్ డైరెక్టర్ లక్ష్మీబాయిలను డైరెక్టర్లుగా నియమించింది. కార్పొరేషన్కు రూ.200 కోట్లతో మూలధన నిధిని ఏర్పాటు చేసింది. ఇందులో గవర్నర్ పేరుతో రూ.199,99,99,300ను, మిగతా మొత్తాన్ని బోర్డు డైరెక్టర్ల పేరిట కేటాయించింది. అయితే కార్పొరేషన్కు డైరెక్టర్లను నియమించిన ప్రభుత్వం.. చైర్మన్ పోస్టును ప్రస్తుతానికి ఖాళీగా ఉంచింది. చైర్మన్ నియామకంతోపాటు పలువురు జిల్లా సమన్వయ సమితి సభ్యులను డైరెక్టర్లుగా నియమించనున్నారు. ఈ పేర్లను తరువాత ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రైతు సమన్వయ సమితి ఎండీగా వ్యవసాయ శాఖ కమిషనర్ కొనసాగనున్నారు. ఇవీ ప్రధాన మార్గదర్శకాలు.. ♦ రాష్ట్రంలో ప్రధానమైన వరి, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, నూనె గింజల పంటలకు అనుగుణంగా పంట కాలనీలను ఏర్పాటు చేయాలి. తద్వారా ఉత్పత్తి, ఉత్పాదకతను పెంచాలి. ♦ రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పండించిన ఆహార పదార్థాల సరఫరా. ♦ రైతు సమితుల సభ్యులకు శిక్షణ, క్షేత్రస్థాయి పర్యటనలు ఏర్పాటు చేయడం. అవసరమైతే ఇతర రాష్ట్రాలకు పంపడం. ♦ సన్న, చిన్నకారు రైతుల్లో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించి సాగు ఖర్చు తగ్గించడం. ♦ వ్యవసాయాభివృద్ధిలో సహకారం కోసం జాతీయ, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, నిపుణులు, ఐకార్ వంటి సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవడం. ఎప్పటికప్పుడు వారి సలహాలతో ముందుకు సాగడం. ♦ జాతీయ, అంతర్జాతీయ వ్యవసాయ, ఉద్యాన సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడం. ♦ రైతు ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం. ♦ సహకార సంఘాలను, రైతు శిక్షణ సంస్థలను/కేంద్రాలను బలోపేతం చేయడం. ♦ రాష్ట్ర గణాంక శాఖ/వ్యవసాయ, ఉద్యా నవర్సిటీల సహకారంతో ఏటా పంటల ఉత్పత్తిని అంచనా వేసి.. పంటల కొనుగోలుకు ఏర్పాట్లు చేయడం. ♦ రైతుల ఆదాయం పెంచేందుకు పంట కోతల అనంతర నష్టాలు తగ్గేలా చర్యలు చేపట్టడం. ఇందుకోసం ప్రాసెసింగ్, అదనపు విలువ జోడింపు వంటివి చేపట్టడం. స్థానిక అవసరాలకు అనుగుణంగా దిగుబడి సాధించడం. ♦ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గోదాములు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు. ♦ ప్రైవేటు పరిశ్రమలతో కలసి పీపీపీ పద్ధతిలో పనిచేయడం. వ్యాపారులు, ఇతర సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరపడం. ♦ ఇతర దేశాలు, రాష్ట్రాలకు ఆహార ఉత్పత్తులను ఎగుమతి చేసేందుకు కృషి. 30 జిల్లాలకు సంబంధించి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు రాష్ట్రంలో హైదరాబాద్ మినహా మిగతా 30 జిల్లాలకు సంబంధించి జిల్లా రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం మరో ఉత్తర్వు జారీ చేసింది. ఆయా జిల్లాల జాబితాలను ముఖ్యమంత్రి స్వయంగా పరిశీలించిన అనంతరం.. ఈ ఆదేశాలు జారీ అయ్యాయి. కార్పొరేషన్ లక్ష్యాలు, ఉద్దేశాలివీ.. ♦ వ్యవసాయ రంగాన్ని వేగంగా అభివృద్ధిపర్చడం ♦ వివిధ పంటల ఉత్పత్తి, ఉత్పాదకతలను పెంచడం ♦ రాష్ట్రంలో రెండో హరిత విప్లవం తరహాలో కీలక అడుగు వేయడం ♦ రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పించడం ♦ కేంద్ర సంస్థలతో కలిసి ఆయా పంటలను కొనుగోలు చేయడం ♦ మార్కెట్లో మద్దతు ధర లభించనపుడు జోక్యం చేసుకుని మంచి ధర అందేలా చూడడం ♦ ఆహార పంటల సేకరణ, నిల్వ, ప్రాసెసింగ్ చేపట్టడం ద్వారా రైతులకు మద్దతు ధర కల్పించడం ♦ నాణ్యమైన ఆహార ఉత్పత్తులను వినియోగదారులకు అందించడం ♦ అవసరమైతే సొంత ఔట్లెట్లను ఏర్పాటు చేయడం ♦ వ్యవసాయ, దాని అనుబంధ శాఖలతో కలసి పనిచేయడం -
పాలన గాడిన పడేనా..?
కరీంనగర్ కార్పొరేషన్ : కరీంనగర్ నగరపాలక సంస్థలో గాడితప్పిన పాలనను గాడిన పెట్టేందుకు ప్రక్షాళన మొదలైంది. కొన్నేళ్లుగా ఒకేచోట పాతుకుపోయిన ఉద్యోగులపై వేటు వేస్తున్నారు. విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నవారిని డిమోషన్ చేయడానికి కూడా వెనకాడడం లేదు. రెండేళ్లుగా స్మార్ట్సిటీ సాధనపైనే పూర్తిస్థాయిలో దృష్టిపెట్టిన బల్దియా.. ఉద్యోగులను పెద్దగా పట్టించుకోలేదు. దీంతో సిబ్బంది ఆడిందే ఆటగా నడుస్తోంది. దీనికితోడు పలువురికి రాజకీయ అండదండలు ఉండడంతో ఎక్కడివారక్కడే పాతుకుపోయారు. పనిచేయకున్నా ఫరవాలేదనే పరిస్థితికి వచ్చారు. ప్రస్తుతం స్మార్ట్సిటీ హోదా దక్కించుకుని, ఓడీఎఫ్గా గుర్తించబడిన నగరపాలక సంస్థలో ఉద్యోగుల పనితీరుపై దృష్టిసారించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులపై ప్రజల నుంచి ఫిర్యాదులు అందడం, సదరు ఉద్యోగులు పలు ఆరోపణలు వంటివి అధికారుల దృష్టికి వచ్చాయి. దీంతో కమిషనర్ శశాంక బల్దియా పాలనను గాడిన పెట్టేందుకు కొరడా ఝుళిపిస్తున్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న పలువురు ఉద్యోగులను డిమోషన్ చేసి, కంప్యూటర్ ఆపరేటర్లను అంతర్గత బదిలీలు చేశారు. కాగా ఐదేళ్లుగా బిల్ కలెక్టర్లను, కంప్యూటర్ ఆపరేటర్లను కదిలించిన సందర్భాలు లేవు. కారణం.. ఉత్తర్వులు వెలువడకముందే రాజకీయ ప్రమేయంతో ఆగిపోయిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో సాహసోపేత నిర్ణయంతో పలువురు ఉద్యోగులపై చర్యలు చేపట్టారు. దీంతో బల్దియా కార్యాలయంలో పనిచేస్తూ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తున్న ఉద్యోగుల్లో గుబులు మొదలైంది. ఆర్ఐ, బిల్ కలెక్టర్లకు డిమోషన్ నగరపాలక సంస్థకు గుండెకాయలాంటి రెవెన్యూ విభాగంలో నిలువెల్లా నిర్లక్ష్యం ఆవహించింది. ఇంటిపన్నుల వసూలు, అసెస్మెంట్లు, మోటేషన్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. వీటికితోడు ఇంటిపన్నుల వసూళ్లకు కదలకపోవడం ముఖ్య కారణంగా చెప్పవచ్చు. ఈ కారణాలను దృష్టిలో పెట్టుకుని పలుమార్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ఉద్యోగులను మందలించినా.. మార్పు రాకపోవడంతో వేటుపడింది. మున్సిపల్లో ఆర్ఐగా విధులు నిర్వహిస్తున్న ఆంజనేయులు క్లర్క్గా డిమోషన్ అయ్యారు. పన్నుల వసూలు విషయంలో నిర్ధేశించిన లక్ష్యాన్ని పూర్తిచేయకుండా గతంలో షోకాజ్ నోటీసులు అందుకున్నా పనితీరులో మార్పు కనిపించని బిల్కలెక్టర్లు నర్సయ్య, శశికుమార్, ప్రణీత్, మల్లేశంను విధుల నుంచి తొలగించారు. అదే బాటలో నడుస్తున్న మరికొంత మంది రెవెన్యూ సిబ్బందిపై కూడా త్వరలో వేటు పడుతుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఎట్టకేలకు కదిలిన సీట్లు కొద్ది సంవత్సరాలుగా ఆయా విభాగాల్లో పాతుకుపోయిన కంప్యూటర్ ఆపరేటర్ల సీట్లు ఎట్టకేలకు కదిలించారు. పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆపరేటర్లతోపాటు అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ఆపరేటర్లను సైతం అంతర్గత బదిలీలు చేశారు. ఆరోపణలు ఉన్నవారిని కాకుండా అందరినీ ఒకేగాటిన కట్టడంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఔట్సోర్సింగ్ ద్వారా నియామకమై ఒక సెక్షన్లో 15ఏళ్లుగా, మరో సెక్షన్లో 10 ఏళ్లుగా పనిచేస్తూ తమకు ఎదురులేదన్నట్లు ఉన్నవారికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. గతంలో ఎంతమంది కమిషనర్లు అంతర్గత బదిలీలకు ప్రయత్నించినా రాజకీ య ఒత్తిడి మేరకు వెనక్కితగ్గారు. ఈసారి కూడా రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒత్తిళ్లకు తలొగ్గుతారా..? ఉత్తర్వులకు కట్టుబడి ఉంటారా..? వేచి చూడాల్సిందే.. అధికారులపై చర్యలు లేవా..? నగరపాలక సంస్థలో చిన్న ఉద్యోగులపైనే కొరడా ఝుళిపిస్తున్నారని, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులపై చర్యలకు వెనుకాడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టెండర్లలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ... పలుమార్లు టెండర్ల రద్దుకు కారణమవుతున్న వారిపై, టౌన్ప్లానింగ్, రెవెన్యూ, ఇంజినీరింగ్ సెక్షన్లో అధికారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారని, వారిపై కూడా చర్యలు చేపట్టాలనే వాదనలు వినవస్తున్నాయి. ఏది ఏమైనా బల్దియాలో ఆరంభమైన ప్రక్షాళన అవినీతి, నిర్లక్ష్యపు ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. -
సహ‘కారమే’
పొత్తు తలనొప్పిగా మారిందా! ప్రచారానికి దూరంగానే బీజేపీ నాయకులు బోట్క్లబ్(కాకినాడ సిటీ) : కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ పొత్తు పేరుతో స్థానికంగా ఐక్యతా రాగం తీసినా ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. టీడీపీ నాయకులకు మద్దతుగా డివిజన్లో ప్రచారం చేసేందుకు బీజేపీ నాయకులు ససేమిరా! అంటున్నారు. ఇప్పటి వరకూ ప్రభుత్వ పథకాల్లో తమ వారు చెప్పిన వారికి ఒక్కరికీ కూడా ఏ పథకం అందకుండా చేసిన టీడీపీ నాయకులపై బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. ఎన్నికలు వచ్చే సరికి పొత్తు పేరు చెప్పి కలిసి పనిచేయడమంటే కుదరదని బీజేపీ నాయకులు తెగేసీ చెబుతున్నారు. తమను ఇప్పటి వరకు బద్ధవిరోధుల్లా చూసి ప్రస్తుతం మీ అవసరమ వచ్చిందని స్నేహగీతం పాడితే సరిపోతుందా? అని బీజేపీ కార్యకర్తలు, టీడీపీ నాయకులపై మండిపడుతున్నారు. తాము సీట్లు ఆశించి భంగపడ్డామని, సీట్లు తమకు ఇవ్వకుండా టీడీపీ తమకు అన్యాయం చేసిందని ఇది మనస్సులో పెట్టుకుని వారితో ప్రచారం చేయడమెలా అన్ని ప్రశ్నిస్తున్నారు. ఆది నుంచి అంతే కాకినాడ నగరంలో టీడీపీ, బీజేపీ నాయకులు ఎప్పుడూ సఖ్యత లేదు. కేవలం పార్టీ అధిష్టానం పొత్తు రాగం పాడింది తప్ప, క్షేత్రస్థాయిలో ఇరుపార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఎప్పుడు పొసగలేదు. నగరంలో రెండు దేవస్థానాల్లో బీజేపీ నాయకులకు పాలకవర్గసభ్యులుగా నియమించినా టీడీపీ నాయకులు వారితో ప్రమాణస్వీకారం చేయించకుండా అడ్డుకున్నారంటే ఆ రెండుపార్టీ కార్యకర్తల మధ్య విభేదాలు ఏమేరకు ఉన్నాయో వేరే చెప్పనవసరం లేదు. రాష్ట్ర దేవాదాయశాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు బీజేపీ నాయకుల వైపు నిలబడినా వారిని ఆలయంలోకి కూడా రానీయకుండా అడ్డుకున్నారు. నగరంలో బాలత్రిపుర సుందరి సమేత రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కర్రి పాపారావును, జగన్నాథపురంలోని వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో బీజేపీకి చెందిన కొక్కిలగడ్డ గంగరాజును పాలకవర్గ సభ్యులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినా స్థానిక టీడీపీ నాయకులు బీజేపీ వారిని దరిచేరనీయలేదు. దీనికి తోడు నగరంలో కేంద్రప్రభుత్వం మంజూరు చేసిన ప్రధానమంత్రి ఆవాస్యోజన0 పథకంలో మంజూరైన 4608 ఇళ్ల మంజూరులో కూడా టీడీపీ నాయకులు పెత్తనమే చెల్లింది. కేంద్ర ప్రభుత్వ పథకమైనా బీజేపీ నాయకులు సిఫారసులు చేసిన వారికి ఒక్కరికీ కూడా ఇళ్లు మంజూరు చేయలేదు. ఇవన్నీ దృష్టిలో ఉంచుకొని తాము ఏ ముఖం పెట్టుకొని టీడీపీ నాయకులతో కలిసి ప్రచారానికి వెళ్లేది లేదంటూ బీజేపీ నాయకులు వద్ద ఆ పార్టీ కార్యకర్తలు వాపోతున్నారు. పొత్తు.. తలనొప్పిగా మారింది బీజేపీ, టీడీపీ పొత్తు ఇప్పుడు తలనొప్పిగా మారింది. టీడీపీ అభ్యర్థులు బరిలో ఉన్న డివిజన్లో బీజేపీ నాయకులు అటువైపు తొంగిచూడడం లేదు. అలాగే ఇటు బీజేపీకి కేటాయించిన తొమ్మిది డివిజన్లలోనూ టీడీపీ నాయకులు కూడా ఎక్కడ కనిపించడం లేదు. ఇప్పటి వరకు ఒకరిపై ఒకరు కారాలు, మిరియాలు నూరుకొని కలిసి పనిచేయడం చాలా కష్టమని ఇరుపార్టీ నాయకులు చెప్పకనే చెబుతున్నారు. -
కార్పొరేషన్ ఎన్నికలకు సర్వం సన్నద్ధం
- 1300 మంది సిబ్బంది నియామకం - మద్యం, డబ్బు పంపిణీ నిరోధానికి బృందాలు కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల నిర్వహణకు నగరపాలక సంస్థ సర్వసన్నద్దమైంది. అభ్యర్థుల ప్రచారం ప్రారంభమైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తనా,నియమావళి, పోలింగ్ సహా వివిధ అంశాల్లో విధులు నిర్వర్తించేందుకు సుమారు 1300 మంది సిబ్బందిని నియమించారు. రిటర్నింగ్ అధికారులు, అసిస్టెట్ రిటర్నింగ్ అధికారులు, ప్రిసైడింగ్ అధికారులు, అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, ఇతర సిబ్బందికి గురువారం ఉత్తర్వులు కూడా పంపారు. దాదాపు 196 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేశారు. సమస్యాత్మక, అతిసమస్యాత్మక పోలింగ్ స్టేషన్లను గుర్తించేందుకు పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ యంత్రాంగం కసరతు చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళి కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. మరో వైపు ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ నిరోధానికి ప్లైయింగ్స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. ఇక కొత్తగా నియమించే జోనల్ అధికారులు, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి సంబంధించిన అధికారులకు మెజిస్టీరియల్ అధికారాలు ఇవ్వనున్నారు. ఇందుకు సంబంధించి న్యాయశాఖ ఆమోదానికి పంపారు. ఇక ఎన్నిక నిర్వహణకు సంబంధించి ఈ నెల 19 నుంచి 22 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. అందుబాటులో ఉన్న 400 ఈవీఎంలను మొదటి విడత పరిశీలన పూర్తి చేశారు. బ్యాలెట్ పత్రాల ప్రింటింగ్ కూడా సిద్ధం చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీలో సామాజిక సమతూకం
- అభ్యర్థుల ఎంపికలో సముచిత ప్రాధాన్యం - అన్ని వర్గాలకూ సమన్యాయం - పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల ఎంపికలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సమతూకాన్ని పాటించి అన్ని వర్గాలకూ సమన్యాయం చేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీలతోపాటు కమ్మ, వైశ్య, ముస్లిం వర్గాలకు కూడా సీట్లు కేటాయించింది. ప్రధానంగా బీసీ, ఎïస్సీల్లోని ఉపకులాలను గుర్తించి ఆయా వర్గాలకు అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. ఇందు కోసం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంపీ వి.విజయసాయిరెడ్డి సమక్షంలో జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, మరో సీనియర్ నేత, మాజీ మత్రి బొత్స సత్యనారాయణ, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి కసరత్తు చేశారు. కాకినాడ కార్పొరేషన్ పరిధిలో ఉన్న సామాజిక వర్గాలు, రిజర్వేషన్లు, ప్రాంతాలవారీగా ప్రాతినిధ్యాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైఎస్సాఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు, పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కాకినాడ సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్ భాగస్వామ్యంతోపాటు వివిధ సర్వేల ద్వారా సమర్థులైన అభ్యర్థులతోపాటు సామాజికపరంగా అ«ధ్యయనం చేశారు. ఓసీ కేటగిరీలో కాపులకు 17 స్థానాలు కేటాయించారు. బీసీ వర్గాల్లోని తూర్పు కాపులకు రెండు, శెట్టిబలిజలకు 4, మత్స్యకార వర్గాల్లోని అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, జాలర్లకు ఐదు సీట్లు ఇచ్చారు. కమ్మ సామాజిక వర్గానికి 2, షెడ్యూల్డ్ తెగలకు చెందిన ఎరుకుల కులస్తులకు (ఎస్టీ)1, ఎస్సీలకు 4 స్థానాలు కేటాయించారు. వెనుకబడిన తరగతులకు సంబంధించి ఉపకులాలైన వెలమ, గవర, ఉప్పర, శెట్టి బలిజలకు తగిన రీతిలో అభ్యర్థిత్వాలను ఖరారు చేశారు. వైశ్య, ముస్లింలకు ఒకొక్కటి, రెడ్దిక కులానికి మూడు స్థానాలు కేటాయించారు. ఇలా అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థిత్వాలను నిర్ణయించడంతో కార్పొరేషన్ పరిధిలోని అన్ని వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వైపు సమర్థతకు పెద్దపీట వేస్తూ అన్ని సామాజిక వర్గాలకూ సమన్యాయం చేసిన సీట్ల కేటాయింపులతో రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీకి మరింత అదనపు బలాన్ని చేకూరుతుందన్న ఆశాభావం పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. -
ఎమ్మెల్యే కొండబాబుకు షాక్
♦ ఎమ్మెల్యే కొండబాబుకు షాక్ ♦ వ్యూహాత్మకంగా దెబ్బకొట్టిన మంత్రులు ♦ అలకవహించిన కొండబాబు ♦ తన వద్దకు వచ్చిన మేయర్ అభ్యర్థిపై అగ్రహం ♦ టీడీపీ, బీజేపీకి రెబెల్స్ పోటు సాక్షి ప్రతినిధి, కాకినాడ : టీడీపీలో రగడ మొదలలైంది. మంత్రులు, ఎమ్మెల్యే కొండబాబు మధ్య చిచ్చు రేగింది. వ్యూహాత్మకంగా మంత్రులు దెబ్బకొట్టారు. ఇప్పుడా బాధను తట్టుకోలేక ఎమ్మెల్యే రగిలిపోతున్నారు. తనను కాదని కార్పొరేషన్ అభ్యర్థును ఎలా గెలిపిస్తారో చూస్తానంటూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. ఇప్పుడిది చినికి చినికి గాలివానలా మారింది. ఇదెక్కడికి దారితీస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రెబెల్స్ సెగ తాకింది. ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం చూపుతారోనన్న భయం పట్టుకుంది. మిత్రపక్షాలకు రెబెల్స్ షాక్... టీడీపీలో అసంతృప్తి భగ్గుమంది. మిత్రపక్షమైన బీజేపీకి షాక్ తగిలింది. ఇప్పుడా రెండు పార్టీలూ కోలుకోలేని స్థితిలో ఉన్నాయి. బీజేపీకి కేటాయించిన 9, 27, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు తిరుగుబాటు అభ్యర్థులుగా కొనసాగుతున్నారు. టీడీపీ కేటాయించిన 28, 35 డివిజన్లలో వేసిన టీడీపీకి చెందిన ఎమ్మెల్యే అనుచరులు రెబల్ రేసులో నిలబడ్డారు. ఆయా వార్డుల్లో రెబెల్ పోటు ఉండటంతో గెలుపుపై ఆశలు వదులుకోవల్సిన పరిస్థితులు నెలకున్నాయి. ఇది చాలదన్నట్టు ఇప్పుడు ఎమ్మెల్యే కొండబాబు తలనొప్పి వచ్చి పడింది. కొండబాబుకు చెక్ పెట్టిన మంత్రులు... కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు (కొండబాబు)కు పార్టీ అధిష్టానం చెక్ పెట్టింది. అభ్యర్ధుల ఎంపికలో కొండబాబుకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు బీపారంలు ఇచ్చే చివరి వరకు నటించిన మంత్రులు యనమల రామకృష్ణుడు, నిమ్మకాయల చిన రాజప్ప వ్యూహాత్మకంగా వ్యవహరించి ఎమ్మెల్యేకు కోలుకోలేని దెబ్బకొట్టారు. మొదటి నుంచీ మేయర్ అభ్యర్థిగా జ్యోతుల ఇందిరను ఎంపిక చేయాలని కొండబాబు సూచించగా దానికి అంగీకరించినట్లు చెప్పుకొచ్చిన మంత్రులు ఆఖరి నిమిషంలో మరొకర్ని తెరపైకి తెచ్చి ఇందిరకు షాక్ ఇచ్చారు. 47వ డివిజన్కు చెందిన జ్యోతుల ఇందిరను తీసుకొచ్చి 40వ డివిజన్లో ఎమ్మెల్యే కొండబాబు నామినేషన్ వేయించారు. మేయర్ అభ్యర్ధిగా దాదాపు ఆమెకు సానుకూలత వ్యక్తం చేసినట్టు మంత్రులు వ్యూహాత్మకంగా వ్యవహరించారు. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజుకొచ్చేసరికి జ్యోతుల ఇందిరను కాదని 40 డివిజన్ అభ్యర్థిగా సుంకర సాగర్ భార్య సుంకర శివ ప్రసన్నను ఖరారు చేశారు. ఆమెనే టీడీపీ మేయర్ అభ్యర్థిగా ప్రతిపాదించి బీపారం అందజేశారు. కొండబాబు సూచించిన జ్యోతుల ఇందిర కాపు సామాజిక వర్గానికి చెందినది కాదనే వాదనను తెరపైకి తీసుకువచ్చిన దేశం నేతలు చివరి నిమిషంలో నాటకీయంగా మేయర్ అభ్యర్థిని మార్చడంతో చేసేదేమీ లేక జ్యోతుల ఇందిర తన నామినేషన్ను ఉపసంహరించుకున్నారు. కొండబాబు కోరిన అన్ని డివిజన్లలో ఆయన సూచించిన అభ్యర్థులకు బదులు బీజేపీకి కేటాయించారు. అలాగే 29వ డివిజన్లో కొండబాబు అనుచరునికి బదులుగా వేరే వ్యక్తికి బీఫారం అందజేయడంతో అభ్యర్థుల ఎంపికలో తనకు ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేసిన కొండబాబు అలిగి ఇంటికి వెళ్లిపోయారు. మేయర్ అభ్యర్థిపై ఆగ్రహం మేయర్ అభ్యర్థిగా టీడీపీ ప్రకటించిన సుంకర సాగర్ తన భార్యతో కలిసి బీఫారం తీసుకుని కొండబాబు దగ్గరకు వెళ్లగా తనను కాదని అభ్యర్థులను ఎంపిక చేశారని...ఎలా గెలుస్తారో నేనూ చూస్తానంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. తన దగ్గరకు రావాల్సిన అవసరం లేదని, టిక్కెట్టు ఎవరు ఇచ్చారో వారి దగ్గరకే వెళ్లండంటూ ఇంట్లోకి రానివ్వకుండా పంపేసినట్టు సమాచారం. బుధవారం సాయంత్రం నుంచి కొండబాబు కినుక వహించినట్లు చెబుతున్నారు. ప్రస్తుతం కొండబాబును బుజ్జగించే ప్రయత్నాలు బెడిసికొట్టడంతోతోపాటు తనకు జరిగిన అవమానాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళతానని కొండబాబు చెబుతున్నట్టు తెలిసింది. -
ఉత్కంఠ... ఉరుకులు... పరుగులు
♦ నామినేషన్ల చివరి రోజు హైడ్రామా ♦ అభ్యర్థులకు బి ఫారాలు అందజేత ♦ బరిలో మొత్తం అభ్యర్థులు 241 మంది... ♦ నేటి నుంచి ఊపందుకోనున్న ప్రచారం కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల్లో నామినేషన్ల చివరి రోజైన ఆదివారం తీవ్ర ఉత్కంఠకు దారితీసింది. అప్పటికే ఆశావాహులు నామినేషన్లు దాఖలు చేయడం...అభ్యర్థిత్వాల ఖరారుపై కసరత్తులు కొనసాగుతున్న నేపద్యంలో అభ్యర్థులతోపాటు నాయకులకు కూడా టెన్షన్ తప్పలేదు. అభ్యర్థిత్వాలను ఖరారు చేయడంతో ఆగమేఘాలపై మధ్యాహ్నం మూడు గంటల లోపు బి-ఫారాలను అందజేసే పనిలో కొందరు నిమగ్నమైతే... రెబల్స్గా ఉండిపోతారన్న భయంతో అప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులతో ఉపసంహరింపచేసే దిశగా మరికొంత మంది ఉరుకులు...పరుగులు పెట్టారు. చివరి క్షణం వరకూ బి - ఫారం అందజేత, నామినేషన్ల ఉపసంహరణపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అధికారికంగా అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక రెబల్స్గా ఉంటారన్న భయంతో కొంతమందిని పార్టీ నేతలు బుజ్జగింపులపర్వం కూడా కొనసాగించారు. భవిష్యత్తులో మంచి పదవులిస్తామంటూ నచ్చజెప్పడం వంటి సంఘటనలు కూడా చోటుచేసుకున్నాయి. బరిలో 241 మంది... నామినేషన్ల ఉపసంహరణ అనంతరం కాకినాడ నగరపాలక సంస్థ ఎన్నికల్లో 241 మంది బరిలో నిలిచారు. మొత్తం 449 నామినేషన్లు దాఖలుకాగా బుధవారం నాటికి 209 మంది నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. చివరి రోజైన బుధవారం ఒక్కరోజే 158 మంది నామినేషన్లు వెనక్కి తీసుకున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి 48 మంది, టీడీపీ నుంచి 39, కాంగ్రెస్ 17, టీడీపీ మిత్రపక్షమైన బీజేపీ నుంచి 9 మంది, సీపీఎం 2, సీపీఐ 2, బీఎస్పీ 4, శివసేన 1 కలిపి 122 మంది ప్రధాన పార్టీ అభ్యర్థులు రంగంలో నిలిచారు. మిగిలిన 119 మంది స్వతంత్య్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ తుది జాబితా... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంగళవారం 40 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. మిగిలిన 8 మంది అభ్యర్థుల జాబితాను పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.విజయసాయిరెడ్డి బుధవారం పత్రికలకు విడుదల చేశారు. ఆ ఎనిమిది మందిలో వాసిరెడ్డి సూరిబాబు (1), సంగిశెట్టి జాహ్నవి(2), గుర్రాల వెంకటేష్ (స్టీఫెన్, 3), పేర్ల జోగారావు (16), కోనాడ సత్యనారాయణ (18 ), వాసిరెడ్డి వరలక్ష్మి (28) బోరా అరుణ(33), రమణాతి మురళి (49) వార్డుల్లో బరిలో నిలిచారు. -
రెబెల్.. గుబుల్..
–కార్యకర్తలను కాదన్నందుకు తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం –సీట్ల కేటాయింపులో మాట నెగ్గించుకున్న యనమల –ఎమ్మెల్యే బాధితుల వరుసలో జ్యోతుల ఇందిర –బీజేపీ డివిజన్లలో బరిలోకి టీడీపీ రెబల్ అభ్యర్థులు భానుగుడి(కాకినాడ) : పార్టీల అభ్యర్థుల ఎంపిక ముగిసింది. పలు డివిజన్లలో టీడీపీ రెబల్ అభ్యర్థులు బరిలో ఉండడం ఆ పార్టీకి తలనొప్పిగా మారింది. టీడీపీలో బడాబాబులు, నేతల అనుయాయులతో జాబితా సిద్ధం చేయడంపై అభ్యర్థులు గుర్రుగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా డివిజన్ల వారీగా ఎమ్మెల్యేను నమ్ముకుని మోసపోయిన వారు సైతం ఆ పార్టీకి తగిన బుద్ధి చెబుతామంటున్నారు. 29వ డివిజన్లో సీటును ఆశించిన యాళ్ల పట్టాభి, వాసిరెడ్డి రామచంద్రరావు టీడీపీ రెబల్గా బరిలో నిలిచారు. ఆ డివిజన్లో విస్తృత ప్రచారం చేస్తూ పార్టీలో తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగానే వెల్లబుచ్చుతున్నారు. దీంతో ఈ డివిజన్లో తేదేపా అభ్యర్థినిగా పోటీచేస్తున్న ఆ పార్టీ సీటీ ప్రెసిడెంట్ సుంకర తిరుమల కుమార్ భార్య సుంకర పావని గెలుపు కష్టం కానుంది. 28వ డివిజన్లో ఎమ్మెల్యేను నమ్ముకుని నట్టేట మునిగిన పినిశెట్టి సతీష్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. 35వ డివిజన్ సీటును బీజేపీకి కేటాయించడంతో కొండాబత్తుల ప్రసాదరావు ఆ పార్టీ తరఫున బరిలో నిలిచారు. దీంతో ఎప్పటి నుంచే టీడీపీ పార్టీ కార్యక్రమాలు సొంత ఖర్చులతో నిర్వహించిన రమా ఆప్టికల్స్ రాంబాబు ఈ డివిజన్లో టీడీపీ రెబల్గా నిలిచారు. 9వ డివిజన్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థి కంపర రమేష్, బీజేపీ జిల్లా పార్టీ అధ్యక్షుడు యెనిమిరెడ్డి మాలకొండయ్య బీజేపీ తరపున బరిలో ఉన్నారు. ఇక్కడ టీడీపీ రెబల్ అభ్యర్థిగా శీకోటి అప్పలకొండ బరిలో నిలిచారు. ఈ విషయమై బీజేపీ నాయకులు కాస్త సీరియస్ ఉన్నారు. సీట్లు కేటాయించినట్టే కేటాయించి తేదేపా అభ్యర్థులను బరిలో ఉంచిందని అ«ధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్టు తెలిసింది. ఎమ్మెల్యే ఇంటివద్దా? బి ఫారాలిచ్చేది? ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ఇంటి వద్ద అభ్యర్థులకు బీ ఫారాలు ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశమైంది. పార్టీ కార్యాలయంలో ఇవ్వకుండా ప్రాబల్యాన్ని నిలుపుకొనేందుకు ఎమ్మెల్యే ఈ తరహా కార్యక్రమాలు చేస్తున్నారంటున్నారు. జిల్లా టీడీపీ అధ్యక్షుడు నామన రాంబాబును నామమాత్రానికైనా లెక్కలోకి తీసుకోకుండా ఒంటెత్తుపోకడలతో వనమాడి వ్యవహరించడంపై కార్యకర్తల్లో ఆగ్రహం నెలకొంది. సుంకరకు సీటు.. ఇందిరకు వెన్నుపోటు ఆర్థిక మంత్రి అనుచరుడు సుంకర విద్యాసాగర్ భార్య సుంకర శివప్రసన్నకే 40 డివిజన్ టీడీపీ సీటు కేటాయించడం ప్రస్తుతం హాట్టాఫిక్గా మారింది. తన సొంత డివిజన్ అయిన 47వ డివిజన్ను వదులుకుని ఎమ్మెల్యే వనమాడిని నమ్మి 40వ డివిజన్లో అభ్యర్థిత్వాన్ని దాఖలు చేసిన జ్యోతుల ఇందిర తీవ్ర భంగపాటుకు గురైంది. డివిజన్లో మేయర్ అభ్యర్థిని ఇందిరనే టాక్ రావడంతో ప్రచారం సైతం ఇందిర అనుచరులు వేగవంతం చేశారు. సీటు కేటాయింపు విషయానికొచ్చేసరికి ఆర్థిక మంత్రి చక్రం తిప్పడంతో కొండబాబు ఇందిర పేరును సమావేశంలో ప్రస్తావించేందుకు సంకోచించినట్టు సమాచారం. టిడీపీ అభ్యర్థుల రెండో జాబితా: టీడీపీ 48 డివిజన్లకు సంబంధించి బీజేపీకి తొమ్మిది డివిజన్లు కేటాయించగా 34 డివిజన్లకు తొలిజాబితా విడుదల చేసిన విషయం తెలిసిందే. 13వ డివిజన్కు సంబంధించి ఒమ్మి బాలకామేశ్వరరావు, 21వ డివిజన్కు సుల్తాన్బేగం, 49వ డివిజన్కు పి.ఉషారాణి, 40వ డివిజన్ సుంకర శివప్రసన్న, 50వ డివిజన్ పాలిక త్రిమూర్తులకు కేటాయించి బుధవారం బీ ఫారాలు అందించారు. కరపత్రాలు, జెండాల పంపిణీ జిల్లా టీడీపీ కార్యాలయంలో 50 డివిజన్లలో ఎన్నికలు జరుగుతున్న 48 డివిజన్లకు సంబంధించి జెండాలు, ప్లెక్సీలు, కరపత్రాలు ఇతరత్రా సామగ్రిని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం రాత్రి ఆఘమేఘాల మీద సరఫరా చేశారు.