-
ఇండిగో కీలక ప్రకటన.. బెంగళూరు నుంచి అబుదాబి డైరెక్ట్ ఫ్లైట్
ప్రముఖ ఎయిర్లైన్ సంస్థ ఇండిగో.. అబుదాబీకి పెరుగుతున్న ప్రయాణికుల సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగష్టు 1నుంచి బెంగళూరు - అబుదాబి మధ్య డైరెక్ట్ ఫ్లైట్ ప్రారంభించనున్నట్లు ప్రకటించింది.భారతీయ ప్రయాణికులకు సేవలందించడం మాత్రమే కాదు, అంతర్జాతీయ పర్యటనను కూడా సులభతరం చేయడానికి ఇండిగో ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో ఇండిగో వారానికి ఆరు సార్లు బెంగళూరు నుంచి అబుదాబికి, అబుదాబి నుంచి బెంగళూరుకు ఫ్లైట్స్ నడపడానికి సిద్ధమైంది.బెంగళూరు నుంచి 6E 1438 విమానం మంగళవారం మినహా ప్రతి రోజూ రాత్రి 9:25 గంటలకు బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయం నుంచి బయలుదేరి రాత్రి 11:30 గంటలకు అబుదాబి చేరుకుంటుంది. అదే విధంగా బుధవారం మినహా అబుదాబి నుంచి అర్ధరాత్రి 12:30 గంటలకు బయలుదేరి 6E 1439 విమానం మరుసటి రోజు ఉదయం 5:45 గంటలకు కెంపెగౌడ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతుంది.బెంగళూరు నుంచి అబుదాబి వెళ్లాలనుకునే వారికి ఇండిగో చేసిన ప్రకటన ఓ గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సంస్థ తన పరిధిని ఎప్పటికప్పుడు విస్తరిస్తూ.. ప్రజలకు తమదైన రీతిలో సేవలందిస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను బట్టి తన సర్వీసును మరింత పెంచనున్నట్లు సమాచారం. -
స్టార్టప్ ట్రబుల్స్: ఈ బెంగళూరు కంపెనీలో 80% తొలగింపు
నిధుల లేమి భారతీయ స్టార్టప్ కంపెనీలను పట్టిపీడిస్తోంది. దీని ప్రభావం అందులో పనిచేస్తున్న లక్షలాది ఉద్యోగులపై పడుతోంది. దీంతో గత్యంతరం లేని ఆయా కంపెనీలు లేఆఫ్ల పేరుతో సగానికి సగం ఉద్యోగులను వదిలించుకుంటున్నాయి.ఏకంగా 80 శాతం మంది తొలగింపుపట్టు నూలు ఉత్పత్తుల వ్యాపారం నిర్వహించే బెంగళూరుకు చెందిన రేషామండి అనే స్టార్టప్ సిరీస్ బీ ఫండింగ్ పొందడంలో విఫలమవడంతో ఏకంగా 80 శాతం మంది ఉద్యోగులను తొలగించింది. ఏడాదిగా కంపెనీ తన కార్యకలాపాలను క్రమంగా తగ్గిస్తూ వస్తోంది. గతేడాది జనవరిలో ఈ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య 500 ఉండగా అది ఈ సంవత్సరం చివరి నాటికి 100కు పడిపోయింది. వీరిలో దాదాపు 300 మంది ఉద్యోగులు తమ తుది బకాయిలు, జీతాల కోసం ఎదురు చూస్తున్నారని సమాచారం.2020లో ఏర్పాటైన రేషామండి క్రియేషన్ ఇన్వెస్ట్మెంట్స్, ఓమ్నివోర్, వెంచర్ క్యాటలిస్ట్స్ వంటి ఇన్వెస్టర్ల నుంచి 40 మిలియన్ డాలర్లకు పైగా ఈక్విటీ నిధులను సేకరించింది. వెంచర్ డెట్ ఇన్వెస్టర్లు, రుణదాతల నుంచి కంపెనీ దాదాపు రూ.300 కోట్ల రుణాన్ని పొందింది. దీని తరువాత ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంది. గతేడాది జూన్ నుంచి ఉద్యోగుల తొలగింపునకు దారితీసింది.10 వేల మందికి ఉద్వాసనఈ ఏడాది ఆరంభం నుంచి స్టార్టప్ లేఆఫ్స్ పరిశ్రమకు ఆందోళన కలిగిస్తున్నాయి. పునర్నిర్మాణం, నిధులపై పరిమితులు, ఇతర కారణాలతో 2024లో ఇప్పటివరకూ భారతీయ స్టార్టప్లు 10,000 మంది ఉద్యోగులను తొలగించాయి. ఫ్లిప్కార్ట్, ఓలా, స్విగ్గీ, పేటీఎం తదితర టాప్ కంపెనీలు ఈ ఏడాది వివిధ విభాగాల్లో భారీగా ఉద్యోగాల కోతను ప్రకటించాయి. ఆర్బీఐ నిషేధం తర్వాత పేటీఎంలో కష్టాలు మొదలయ్యాయి. ఈ ఏడాది 5,000 నుంచి 6,300 ఉద్యోగులను ఈ కంపెనీ తొలగించి ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి.మరోవైపు ఉద్యోగాల కోతలు, జీతాల జాప్యం వంటి పలు అంశాలతో బైజూస్ సతమతమవుతోంది. ఇక స్విగ్గీ దాదాపు 400 మంది ఉద్యోగులను తొలగించగా, భవీష్ అగర్వాల్ నేతృత్వంలోని ఓలా 600 మందిని తొలగించనుంది. ఇదిలా ఉంటే చాలా స్టార్టప్లు సైలెంట్ లేఆఫ్స్ పాటించాయి. అయితే 2024లో లేఆఫ్స్ ఉన్నప్పటికీ, పరిశ్రమలు నెమ్మదిగా వృద్ధిని, రికవరీ సంకేతాలను చూపుతున్నాయని, ఈ ఏడాది నియామకాలు పెరిగే అవకాశం ఉందని నివేదికలు సూచిస్తున్నాయి.మెరుగుపడుతున్న నిధుల సమీకరణ2024 ప్రథమార్ధంలో భారతీయ టెక్నాలజీ స్టార్టప్ లు 4.1 బిలియన్ డాలర్లు నిధులు సమీకరించాయి. 2023 ద్వితీయార్ధంతో పోలిస్తే ఇది 4 శాతం ఎక్కువ. కానీ అంతకు ముందు 2023 ప్రథమార్ధంతో పోలిస్తే ఇది ఇప్పటికీ 13 శాతం. అయినప్పటికీ టెక్ స్టార్టప్ ల్యాండ్ స్కేప్ లో ప్రపంచవ్యాప్తంగా అత్యధిక నిధులు సమకూరుస్తున్న దేశాల్లో భారత్ నాలుగో స్థానంలో కొనసాగుతోంది. -
అమెజాన్లో ఆర్డర్.. పార్శిల్ నుంచి బుసలు కొడుతూ బయటకు వచ్చిన పాము
బెంగళూరు : ఆన్లైన్లో ఆర్డర్ పెడుతున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. వినియోగదారులకు కావాల్సిన వస్తువుల్ని అందించే విషయంలో ఈకామర్స్ కంపెనీలు ట్రెండ్ను మార్చినట్లు తెలుస్తోంది. ఇన్ని రోజులు స్మార్ట్ఫోన్ బదులు సబ్బుబిళ్ల, ఇటుక బిళ్లలు పంపించడం రివాజు. కానీ ఇప్పుడు పాముల్ని డెలివరీ చేస్తున్నాయని వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంగళూరులోని సర్జాపూర్కు చెందిన భార్యభర్తలు ఐటీ ఉద్యోగులు. కాలక్షేపం కోసం ఇంట్లో వీడియోగేమ్ ఆడుకునే ఎక్స్బాక్స్ను అమెజాన్ కంపెనీ యాప్లో ఆర్డర్ పెట్టారు. ఆర్డర్ రానే వచ్చింది. ఎంతో ఉత్సాహంతో సదరు కంపెనీ నుంచి వచ్చిన పార్శిల్ ఓపెన్ చేసే ప్రయత్నించారు. కానీ దంపతుల్ని షాక్కి గురి చేస్తూ పార్శిల్లో నుంచి ఓ పాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. ఈ ఊహించని పరిణామంతో కంగుతిన్న టెక్కీలు తమకు ఎదురైన చేదు అనుభవాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో ‘రెండు రోజుల క్రితం ఎక్స్బాక్స్ కంట్రోలర్ను ఆర్డర్పెట్టాం. ఆ ఆర్డర్ వచ్చింది. కానీ దాన్ని ఓపెన్ చేస్తే ఓపాము బయటపడింది. అందుకు డెలివరీ బాయే సాక్ష్యం అని తెలిపారు. అదృష్టవశాత్తూ పాము ప్యాకేజింగ్ టేపుకు ఇరుక్కుపోయింది. ప్రమాదం అయినప్పటికీ తాము చెబుతున్నది నిజమా? కాదా? అని తెలుసుకునేందుకు అమెజాన్ ప్రతినిధులు మమ్మల్ని 2 గంటల పాటు హోల్డ్లో ఉంచారని వాపోయారు. ఆ తర్వాతే స్పందించారని అన్నారు. స్పందించిన అమెజాన్కస్టమర్ వీడియోపై స్పందిస్తూ, కంపెనీ ట్వీట్ చేసింది.మీకు కలిగిన అసౌకర్యానికి మేం చింతిస్తున్నాం. వివరాల్ని పూర్తిగా పరిశీలించిన తగిన న్యాయం చేస్తాం అని అమెజాన్ ప్రతినిధులు స్పందించారు. -
బెంగళూరులో ఓ ఇల్లు.. అలాంటి జంటలకే ప్రాధాన్యం!
దక్షిణాదిలో అత్యంత రద్దీ నగరంగా పేరొందిన బెంగళూరు ఖరీదైన ఇంటి అద్దెలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ యువకులకు, ముఖ్యంగా బ్యాచిలర్లకు ఇళ్లు, ఫ్లాట్లు దొరకడం కష్టం. అద్దెకు వచ్చే వారి నేపథ్యం, అకడమిక్ మార్కుల ఆధారంగా కూడా ఇల్లు ఇస్తున్న సంఘటనలు ఇక్కడ కొత్తేమీ కాదు.మెట్రో నగరంలో అద్దె ఇళ్ల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రియమ్ సారస్వత్ అనే స్టార్టప్ వ్యవస్థాపకుడు విభిన్నమైన ప్రతిపాదనతో ముందుకు వచ్చారు. బెంగళూరులోని తన ఇంటిని అద్దెకు ఇస్తున్న ఆయన "బ్యాచిలర్స్, లివ్-ఇన్ కపుల్స్" కు ప్రాధాన్యత ఇస్తున్నారు.వూష్ కో ఫౌండర్ ప్రియమ్ సారస్వత్ ఈ మేరకు తన సోషల్ మీడియా పోస్ట్ చేశారు. బెంగళూరులోని హర్లూర్ రోడ్డులో కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని హోమ్ టూర్ చేశారు. ఇది హెచ్ఎస్ఆర్ లేఅవుట్కు సమీపంలో ఉంది. "నేను హర్లూర్ రోడ్లో (హెచ్ఎస్ఆర్ లేఅవుట్కు చాలా దగ్గరగా) లో ఈ అందమైన ఇంటిని కొనుగోలు చేశాను. ఇందులో అద్దెకు ఉండేవారి కోసం చూస్తున్నాను. బ్యాచిలర్స్ లేదా లివ్-ఇన్ జంటలకు ప్రాధాన్యం ఉంటుంది" అని ఆయన ‘ఎక్స్’లో రాసుకొచ్చారు. I purchased this beautiful house at Harlur Road (Very close to HSR Layout) and now looking for tenants to occupy asap 🏡😇Bachelors or Live-In couples preferred ( My way of giving back to the community 😉) Dm if you are interested and RT for good karma ✌️ pic.twitter.com/d7pcC53GI8— Priyam Saraswat (@priyamsaraswat) June 13, 2024 -
బెంగళూరుకు డ్రైవర్లెస్ మెట్రో..
భారతదేశంలోని ప్రధాన నగరాల్లో మెట్రో సేవలు అందుబాటులో ఉన్నాయి. కాగా త్వరలోనే డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఈ సేవలు మొదటిసారి బెంగళూరులో ప్రారంభం కానుంది.ఇప్పటికే బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ చైనా నుంచి ఆరు కోచ్లను దిగుమతి చేసుకుంది. దీనిని టెస్ట్ చేయడానికి ప్రత్యేకంగా ఎల్లో లైన్ కూడా సిద్ధం చేస్తున్నట్లు సిగ్నలింగ్ టెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే.. రీసెర్చ్ డిజైన్స్ అండ్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్ (RDSO) ఆసిలేషన్ ట్రయల్స్తో సేఫ్టీ టెస్ట్ వంటివి నిర్వహించడం కూడా జరుగుతుంది.బెంగళూరులో డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభించడానికి బొమ్మసంద్ర నుంచి ఆర్వీ రోడ్ వరకు ఎల్లో లైన్ సిద్ధం చేశారు. ఇది జయదేవ హాస్పిటల్, సిల్క్ బోర్డ్ జంక్షన్, ఎలక్ట్రానిక్స్ సిటీలను కలుపుతూ వెళుతుంది. ఇది మొత్తం 18.82 కిలోమీటర్ల విస్తరణలో ఉందని అధికారులు పేర్కొన్నారు.అన్ని విధాలా టెస్టింగ్ పూర్తయిన తరువాత.. 2024 డిసెంబర్ చివరి నాటికి డ్రైవర్లెస్ మెట్రో సర్వీస్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇది 16 స్టేషన్లను కలిగి ఉంటుందని సమాచారం. ఈ మెట్రో సర్వీస్ ప్రారంభమైన తరువాత సిల్క్ బోర్డ్, ఎలక్ట్రానిక్స్ సిటీలలో ఉద్యోగం చేసే ఐటీ ఎంప్లాయిస్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. -
బెంగళూరు రేవ్ పార్టీ కేసు.. పోలీస్ డాగ్స్కు అరుదైన గౌరవం
బెంగళూరు: సినీ ప్రముఖులు పాల్గొని సంచలనం సృష్టించిన రేవ్ పార్టీ కేసులో ఇవాళ ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. డ్రగ్స్ను పట్టించిన స్నిఫర్ డాగ్స్పై ప్రశంసలు గుప్పించిన బెంగళూరు సీపీ దయానంద.. వాటికి సన్మానం చేశారు.హెబ్బాగోడిలో ఓ వ్యాపారవేత్తకు చెందిన ఫామ్ హౌస్లో మే 19వ తేదీన బర్త్ డే పార్టీ ముసుగులో రేవ్ పార్టీ జరుగుతుందన్న సమాచారం అందుకుని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు దాడులు చేశారు. అయితే రేవ్ పార్టీని భగ్నం చేసిన వెంటనే K9 స్నిఫర్ డాగ్స్ను రంగంలోకి దించారు.ఐదు స్నిఫర్ డాగ్స్ ఆ ప్రాంతంలో వాసన చూసి.. చివరకు చెట్ల పొదల్లో దాచిన డ్రగ్స్ను కనిపెట్టాయి. దీంతో ఆ ఐదు డాగ్స్ను నగర సీపీ దయానంద పరేడ్ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారిప్పుడు.From rave bust to parade honors! Shoutout to Mailu, Ram, Bhumi, Rana, and Mickey for their top-notch detection skills in Hebbagodi. Honoured by the Commissioner in today's monthly parade.#PawsOnDuty pic.twitter.com/BvubLmNXLp— Bengaluru Paw Patrol (@BLRK9Cops) June 7, 2024 -
నటి హేమ అరెస్ అదనపు కేసులు నమోదు
-
బెంగళూరులో కుండపోత.. 133ఏళ్ల రికార్డు బ్రేక్
బెంగళూరు: కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో ఆదివారం(జూన్2) రికార్డుస్థాయిలో భారీ వర్షం పడింది. 133 ఏళ్ల తర్వాత ఒక్కరోజులోనే 111.1మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై కొత్త రికార్డు క్రియేట్ చేసింది. 1891 సంవత్సరంలో జూన్16న బెంగళూరులో ఒక్కరోజులోనే కురిసిన 101.6 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డు ఆదివారం పడిన వర్షంతో చెరిగిపోయింది. నైరుతి రుతుపవనాలు రావడంతోనే ఈస్థాయిలో భారీ వర్షం కురిసిందని వాతావరణ శాఖ తెలిపింది.తాజాగా బెంగళూరు నగరానికి వాతావరణశాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. జూన్ 3నుంచి5వరకు ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. గరిష్ట ఉష్ణోగ్రతలు 31-32, కనిష్ట ఉష్ణోగ్రతలు 20-21 డిగ్రీలుగా నమోదవుతాయని వెల్లడించింది. -
ముందస్తు బెయిల్ ఇవ్వండి: కోర్టుకు ప్రజ్వల్ రేవణ్ణ
బెంగళూరు: మహిళలపై లైంగిక దౌర్జన్యం ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు ప్రజాప్రతినిధుల కోర్టులో బుధవారం(మే29) ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. ప్రజ్వల్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కోర్టు పోలీసులకు నోటీసులు జారీ చేసింది. గురువారమే బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సిందిగా ప్రజ్వల్ తరపు న్యాయవాది కోరగా కౌంటర్ దాఖలు చేయడానికి సిట్ సమయం కోరింది. దీంతో జడ్జి సంతోష్ గజానన్ విచారణను మే 31కి వాయిదా వేశారు. లైంగిక దౌర్జన్యం వీడియోలు వెలుగు చూసిన తర్వాత ఏప్రిల్లో ప్రజ్వల్ విదేశాలకు పారిపోయారు. ప్రస్తుతం జర్మనీలో ఉన్న ప్రజ్వల్ మే31న భారత్ వస్తానని ఇప్పటికే ఒక వీడియో సందేశం విడుదల చేశారు. తాజాగా కోర్టు ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణను 31కే వాయిదా వేయడంతో ఆయన ఆరోజు వస్తారా మళ్లీ ఏదైనా తేదీ ప్రకటిస్తారా అనేదానిపై సందిగ్ధత నెలకొంది.ప్రజ్వల్ ఎన్డీఏ కూటమి తరపున జేడీఎస్ పార్టీ నుంచి హసన్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేశారు. రెండో విడత లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఏప్రిల్ 26న కర్ణాటకలో పోలింగ్ ముగిసింది. -
రేవ్ పార్టీ కేసులో నటి హేమకు మరోసారి నోటీసు
శివాజీనగర: ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు నటి హేమకు సీసీబీ పోలీసులు మరో నోటీసు జారీ చేశారు. సోమవారం విచారణకు రావాలని మొదటిసారి నోటీసు పంపగా, జ్వరం వచ్చినందున రాలేనని హేమ తెలిపారు. మంగళవారం రెండో నోటీస్ ఇచ్చి విచారణకు రమ్మని చెప్పారు. రేవ్ పార్టీ ఏర్పాటు చేసిన వాసు, అరుణ్, సిద్ధికి, నాగబాబుతో పాటుగా ఐదుగురికి మే 27న 10 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కోర్టు ఆదేశించింది. దీంతో మంగళవారం నుంచి వారిని సీసీబీ విచారణ చేపట్టింది. రేవ్ పార్టీ, డ్రగ్స్ సరఫరా వెనక ఉన్న వారిని తెలుసుకునే లక్ష్యంగా వీరిని పోలీసులు ప్రశ్నించనున్నారు. -
‘సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి’
నెల్లూరు, సాక్షి: బెంగళూరు రేవ్ పార్టీకి, ఆ కేసు నిందితులకు.. తనకు ఎలాంటి సంబంధాలు లేవని ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మరోమారు స్పష్టం చేశారు. టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఆరోపణలు చేయడంతో తాజాగా కాకాణి మరోసారి మీడియా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో సోమిరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారాయన. సోమిరెడ్డిది నీచమైన చరిత్ర. అలాంటి చరిత్ర నాకైతే లేదు. రిసార్ట్ ఓనర్ గోపాల్రెడ్డితో నాకు సంబంధాలు ఉన్నాయని సోమిరెడ్డి అంటున్నారు. దానికి ఒక్క ఆధారమైనా చూపించగలరా?. రాజకీయంగా ఎదుర్కొనేలేకే ఈ చౌకబారు ఆరోపణలు. సోమిరెడ్డి చీకటి కోణాలు చాలానే ఉన్నాయి. పురాతన పంచలోహ విగ్రహాలను అమ్మేందుకు సోమిరెడ్డి విదేశాలకు వెళ్లారు. నేను చేస్తున్నవి ఆరోపణలు కావు.. పచ్చి నిజాలు. సోమిరెడ్డి వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేశారు. బెంగళూరు రేవ్ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదు. డ్రగ్స్ ఆరోపణల నేపథ్యంలో.. శాంపిల్స్ ఇవ్వడానికి నేను రెడీ. సోమిరెడ్డికి దమ్ముంటే నా ఛాలెంజ్ను స్వీకరిస్తారా?. నా పాస్ పోర్ట్ నా దగ్గరేదే ఉంది. ఇదివరకే మీడియా సమావేశం పెట్టి ఈ విషయాన్ని చెప్పా. అయినా ఆయన పదే పదే అదే ఆరోపణ చేస్తున్నారు. రేవ్ పార్టీతోగానీ, ఆ కేసు నిందితులకి నాకు ఎలాంటి సంబంధాలు లేవు. నా కారు స్టిక్కర్ వాడకంపై ఇదివరకే పోలీసులకు ఫిర్యాదు చేశాం అని కాకాణి మరోసారి స్పష్టత ఇచ్చారు. -
టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ ప్రకంపనలు
-
రేవ్ పార్టీ.. హేమతో పాటు ఈ బ్యూటీ కూడా.. ఇంతకీ ఎవరంటే? (ఫోటోలు)
-
బెంగుళూరులోని ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపు
ముంబై: ప్రముఖ నగరాల్లో బాంబు బెదిరింపులు కలవరపెడుతున్నాయి. పాఠశాలలు, బస్టాండ్లు, ఎయిర్పోర్టులు, హాస్పిటల్స్, ప్రముఖుల నివాసాలు.. ఇలా ప్రతిచోటా బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. ఇటీవల ఢిల్లీలోని, హస్పిటల్స్, తీహార్ జైలుకు బాంబు బెదిరింపు మెయిల్ అందిన విషయం తెలిసిందే.తాజాగా కర్ణాటక రాజధాని బెంగళూరులోని మూడు ప్రముఖ హోటళ్లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు. హోటల్ ఒట్టేరాతో సహా మరో రెండింటికి మెయిల్ ద్వారా బెదిరింపులు వచ్చినట్లు బెంగళూరు ఆగ్నేయ డీసీపీ పేర్కొన్నారు. నేడు ఆ హోటళ్లు పేల్చివేస్తామని దీనిలో హెచ్చరించినట్లు చెప్పారు.బెదిరింపు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలంలో బాంబు స్క్వాడ్, బాంబు డిటెక్షన్ బృందాలను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు గుర్తించలేదని, తనిఖీలు కొనసాగుతున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా బుధవారమే దేశ రాజధాని ఢిల్లీలోని నార్త్ బ్లాక్కు బెదిరింపు మెయిల్ వచ్చింది. కేంద్ర హోంశాఖ కార్యాలయం ఇందులోనే ఉంది. అయితే అక్కడ ఎటువంటి అనుమానిత వస్తువులు గుర్తించలేకపోవడంతో బెదిరింపు బూటకమని తేలింది. ఇక గతంలోనూ బెంగళూరులోని 40కి పైగా పాఠశాలలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం విదితమే. -
బెంగళూరు: రేవ్పార్టీ ముసుగులో వ్యభిచార దందా?
బెంగళూరు, సాక్షి: తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన రేవ్ పార్టీ కేసులో దర్యాప్తు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ పార్టీ మాటున సెక్స్ రాకెట్ కూడా నిర్వహించి ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. డ్రగ్స్ దొరకడం, పైగా డబ్బును విపరీతంగా ఖర్చు చేసి ఈ రేవ్ పార్టీ నిర్వహించడంతో ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని బెంగళూరు పోలీసులు నిర్ణయించారు. బెంగళూర్ ఎలక్ట్రానిక్స్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో రేవ్ పార్టీ జరిగింది. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ పేరుతో బర్త్డే పార్టీ ముసుగులో ఈ పార్టీ నిర్వహించారు. ఇందుకోసం నిర్వాహకులు రూ.2 లక్షల ఎంట్రీ ఫీజు తీసుకుని 200 మందిని ఆహ్వానించారు. ఈ పార్టీలోతెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటకకు చెందిన క్రికెట్ బుకీలు, సినీ పరిశ్రమకు చెందిన పలువురు నటీనటులు(తెలుగు సినీ, సీరియల్ ప్రముఖులు సైతం) పాల్గొన్నారు. ఆదివారం ఉదయమే కొందరు రిసార్ట్ నుంచి వెళ్లిపోయారు. మిగిలిన వాళ్లు అర్ధరాత్రి జరిగిన పార్టీలో పాల్గొన్నారు. మరోవైపు దొరికిన వంద మందిలో 30 మంది యువతులే ఉన్నారు. నిర్వాహకులే వాళ్ల కోసం టికెట్లు వేసి విమానాల్లో రప్పించినట్లు తెలుస్తోంది. దీంతో రేవ్ పార్టీలో వ్యభిచార దందా నిర్వహించి ఉంటారని, నిర్వాహకులు కూడా సెక్స్ రాకెట్ నడుపుతున్నట్లు పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్టీ నిర్వహకుల నేర చరిత్ర పై కూపి లాగుతున్నారు.ఇదీ చదవండి: బెంగళూరు రేవ్ పార్టీలో చిత్తూరు టీడీపీ నేతలు!మరోవైపు.. ఈ కేసులో ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు. పార్టీలో ఎండీఎంఏ, కొకైన్, హైడ్రో గంజా, ఇతర మాదకద్రవ్యాలను వినియోగించారు. దీంతో ఈ కేసును ఎలక్ట్రానిక్స్ పోలీస్ స్టేషన్ నుండి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ నార్కోటిక్ విభాగానికి బదిలీ చేశారు. శాంపిల్స్ ఫలితాలు ఇవాళేడ్రగ్స్ తీసుకున్నారనే అనుమానాల మధ్య పార్టీకి హాజరైన వాళ్ల నుంచి శాంపిల్స్ను సేకరించారు పోలీసులు. వీటి ఫలితాలు ఇవాళ సాయంత్రం కల్లా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఈ పార్టీలో తాను లేనని తెలుగు సినీ నటి హేమ చెబుతున్నప్పటికీ.. పోలీసులు మాత్రం ఆమె వాదనను ఖండిస్తున్నారు. ఆమె కూడా పార్టీలో పాల్గొన్నారంటూ ఓ ఫొటోను విడుదల చేశారు. అంతేకాదు ఆమె కూడా శాంపిల్స్ ఇచ్చారని ప్రకటించారు. -
రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు
బనశంకరి: బెంగళూరు నగర శివారులోని హెబ్బగోడిలో ఓ ఫాంహౌస్లో జరిగిన రేవ్పార్టీపై సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని నగర పోలీస్ కమిషనర్ బి.దయానంద్ తెలిపారు. ఈ పార్టీలో తెలుగు సినీ నటులు ఉన్నారని, అయితే ప్రజాప్రతినిధులెవరూ పాల్గొనలేదన్నారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘రేవ్ పార్టీలో తెలుగు సినీనటి హేమ ఉన్నారు. సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ అని ఈ రేవ్పార్టీకి పేరుపెట్టారు. ఆదివారం సాయంత్రం నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు పార్టీ నిర్వహించాలనుకున్నారు. పార్టీలో ఎండీఎంఏ పిల్స్, హైడ్రో గాంజా, కొకైన్ ఇతర మాదకద్రవ్యాలు విక్రయించారు. రేవ్పార్టీలో పాల్గొన్న వారి పేర్లలో హేమ పేరు వినబడగానే ఆమె జాగ్రత్త పడి, ఫాంహౌస్ ఖాళీ స్థలంలోకి వెళ్లి నేను ఆ పార్టీలో లేను, హైదరాబాద్లో ఫాంహౌస్లో ఉన్నాను అని చెప్పింది. ఆమె వీడియో గురించి కూడా దర్యాప్తు చేస్తున్నాం. ..పార్టీలో పాల్గొన్న వారందరికీ వైద్యపరీక్షలు చేపట్టాం, నివేదిక అందిన వెంటనే చర్యలు తీసుకుంటాం. రేవ్పార్టీ జరిగిన స్థలం బెంగళూరు రూరల్లోని హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలోకి రావడంతో కేసును ఎల్రక్టానిక్ సిటీ పీఎస్ నుంచి హెబ్బగోడి పీఎస్కు బదిలీ చేశాం. డ్రగ్స్ విసిరేశారు: రేవ్పార్టీలో వందమందికి పైగా పాల్గొన్నారు. దాడి సమయంలో మాదక ద్రవ్యాలు లభించాయి. కొందరు దొరికిపోతామనే భయంతో స్విమ్మింగ్పూల్, టాయ్లెట్ తదితర స్థలాల్లోకి డ్రగ్స్ విసిరేశారు, వాటిని వెతకడానికి జాగిలాలను ఉపయోగించాం. రణదీర్, మహమ్మద్సిద్దికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబులను అరెస్టు చేసి విచారిస్తున్నాం. పార్టీలో సిద్దిక్, రణ«దీర్, రాజ్బావ డ్రగ్స్ విక్రయించారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో సీసీబీ అదికారులు దాడి చేశారు. నటి హేమ కూడా పార్టీలో ఉంది. ఆమె రక్తనమూనాలు సేకరించి ల్యాబ్కు పంపించాం. ప్రతి ఒక్కరిని విచారించి సీసీబీ వాంగ్మూలం సేకరిస్తుంది. అందరితో పాటు హేమకు కూడా నోటీసులు జారీ చేసి తదుపరి విచారణకు పిలుస్తాం’అని దయానంద్ తెలిపారు.నిందితుల అరెస్ట్రేవ్పార్టీకి కారకులంటూ ఐదుగురు నిందితులను బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు రణధీర్, మహ్మద్ సిద్ధికి, వాసు, అరుణ్కుమార్, నాగబాబును నగర న్యాయస్థానం ముందు మంగళవారం హాజరు పరచి, పరప్పన అగ్రహార కేంద్ర కారాగారానికి తరలించారు. వీరంతా హైదరాబాద్కు చెందిన వారని గుర్తించామని నగర పోలీసు కమిషనర్ దయానంద్ వెల్లడించారు. రేవ్పార్టీలో ఎండీఎంఏ మాత్రలు, హైడ్రోగాంజా, కొకైన్, ఇతర మత్తు పదార్థాలు విక్రయించారని వివరించారు.వాసుది విజయవాడబెంగుళూరు డ్రగ్స్ పార్టీ వెనుక ఏపీ మూలాలు ఉన్నట్లు తేలింది. పార్టీ నిర్వాహకుడు లంకపల్లి వాసు స్వస్థలం విజయవాడగా పోలీసులు ధృవీకరించారు. గతంలో విజయవాడ కేంద్రంగా పలు వివాదాల్లో భాగమైన వాసు.. క్రికెట్ బెట్టింగ్లో ఆరితేరాడు. విజయవాడ కేంద్రంగా క్రికెట్ బుకీ వ్యవస్థ నడిపిస్తున్నట్లు గుర్తించారు. విజయవాడలో ఈ మధ్యే ఖరీదైన స్థలాలు కొన్న వాసు గ్యాంగ్.. బెంగుళూరు పార్టీ కేంద్రంగా రేవ్ పార్టీలను నిర్వహిస్తున్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. -
తప్పుడు ఆరోపణలపై యాంకర్ శ్యామల పరువు నష్టం దావా
-
బెంగళూరు రేవ్ పార్టీ లో తెలుగు రాష్ట్రాల ప్రముఖులు!
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర శివార్లలోని ఓ ఫామ్హౌస్లో ఆదివారం రాత్రి నుంచి తెల్లవారుజాము వరకు జరిగిన రేవ్ పార్టీ లో బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు ప్రముఖులు కూడా పాల్గొన్నట్టు అందుతున్న సమాచారం కలకలం రేపుతోంది. పుట్టినరోజు వేడుకల పేరిట ఎల్రక్టానిక్ సిటీ సింగేనా అగ్రహారలో ఉన్న ఫార్మ్హౌస్లో ఈ రేవ్ పార్టీ జరిగింది. ఈ మేరకు అందిన పక్కా సమాచారంతో సీసీబీ యాంటీ నార్కోటిక్స్ విభాగం అధికారులు డీసీపీ శ్రీనివాసగౌడ నేతృత్వంలో రేవ్ పార్టీపై దాడి చేశారు. మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు సుమారు 100 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 25 మందికి పైగా యువతులున్నట్టు అధికారులు చెప్పారు. ఇదిలా ఉండగా, ఐదుగురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. వారికి వైద్య పరీక్షలు రేవ్పార్టీ జరిగినట్లు బెంగళూరు పోలీసులు ధ్రువీకరించారు. అయితే పార్టీలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నదీ వెల్లడించలేదు. అదనపు పోలీస్ కమిషనర్ డాక్టర్ చంద్రగుప్తా సోమవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన సైతం జారీ చేశారు. రేవ్ పార్టీ కి సంబందించి ఐదుగురిని అరెస్టు చేశామని, ఎల్రక్టానిక్ సిటీ పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. పాల్గొన్నవారిని అదుపులోకి తీసుకున్నామని, రక్తం నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నామన్నారు. రేవ్పార్టీలో 100 మంది ఉన్నారని, డాగ్స్కా్వడ్ను పిలిపించి తనిఖీలు చేపట్టామని, కొన్ని మాదకద్రవ్యాలు లభించాయని వివరించారు. ‘సన్సెట్ టు సన్రైజ్ విక్టరీ’ పేరిట రేవ్ పార్టీ జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. సుమారు 15.56 గ్రా. ఎండీఎంఏ, 6.2 గ్రా. హైడ్రో గంజాయి, కొకైన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. జీఆర్ ఫార్మ్హౌస్లో పార్టీ హెబ్బగోడి పోలీస్స్టేషన్ పరిధిలో కాన్కార్డు యజమాని గోపాలరెడ్డి పేరిట ఉన్న జీఆర్ ఫార్మ్హౌస్లో ఈ పార్టీ జరిగింది. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని నిర్వహించినట్లు తెలిసింది. ఈ పార్టీ కోసం విమానాన్ని ఏర్పాటు చేసినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖ నటీనటులు, మోడళ్లు, టెక్కీలు పాల్గొన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.50 లక్షల వరకు వ్యయం నగరం నడిబొడ్డున ఇంత పెద్దయెత్తున రేవ్ పార్టీ నిర్వహిస్తే పోలీసుల నుంచి ఇబ్బందులు రావొచ్చని భావించి నగర శివార్లలో నిర్వహించినట్లు సమాచారం. ఈ ఒక్కరోజు పార్టీ కోసం సుమారు రూ.30 లక్షల నుంచి రూ. 50 లక్షల మేర ఖర్చు చేసినట్లు తెలిసింది. దాడి చేసేందుకు వచి్చన పోలీసులను గమనించగానే నిర్వాహకులు తలుపులు మూసేశారు. అయితే వారు బలవంతంగా తలుపులు తెరిచి లోపలకు వెళ్లారు. అప్పటికే కొందరు డ్రగ్స్ను దాచి పెట్టారు. కొంతమంది తమ వద్ద ఉన్న మాదకద్రవ్యాలను టాయిలెట్ కమోడ్లలో వేసి ఫ్లష్ చేశారు. కాగా పోలీసులు ఫార్మ్హౌస్ను క్షుణ్ణంగా గాలించారు.ముగ్గురు డ్రగ్ పెడ్లర్లతో పాటు నిర్వాహకుడు వాసు, మరొకరు ఇలా.. మొత్తం ఐదు మందిని అరెస్టు చేశారు. వాసు పుట్టినరోజు పార్టీ నిర్వాహకులు అరుణ్, సిద్దిఖి, రణబీర్, నాగబాబులను అదుపులోకి తీసుకున్నారు. పరప్పన అగ్రహార పోలీసుస్టేషన్లో ఈ పార్టీ కి అనుమతులు తీసుకున్నట్లు వాసు చెబుతున్నప్పటికీ అది అవాస్తవమని తెలుస్తోంది. పార్టీ కి వచి్చన వారు ఫార్మ్హౌస్ లోపలికి వెళ్లాలంటే సెక్యూరిటీ పాస్వర్డ్ చెప్పేలా ఏర్పాటు చేసినట్లు సమాచారం. రేవ్ పార్టీలో తెలుగు నటులు హేమ, శ్రీకాంత్, డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా పాల్గొన్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.అయితే తాము ఆ పార్టీలో పాల్గొనలేదని వీడియో బైట్ల ద్వారా వారు వివరణ ఇచ్చారు. అయితే హేమ మాత్రం పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఆమె విడుదల చేసిన వీడియో హైదరాబాద్లో తీసింది కాదని, ఆ ఫార్మ్హౌస్ లోపలే హేమ వీడియో బైట్ ఇచి్చనట్లు ఆమె ధరించిన దుస్తుల ఆధారంగా అనుమానిస్తున్నారు. నేను నా ఇంట్లోనే ఉన్నా: శ్రీకాంత్ బెంగళూరు రేవ్ పార్టీ తో తనకు ఎలాంటి సంబంధం లేదంటూ టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ చెప్పారు. ఈ మేరకు తన ఇంట్లో నుంచే ప్రత్యేకంగా వీడియోను విడుదల చేశారు. ‘నేను హైదరాబాద్లోని మా ఇంట్లోనే ఉన్నాను. నేను బెంగళూరు రేవ్ పార్టీ కి వెళ్లినట్లు, పోలీసులు అరెస్టు చేశారనే వార్తలతో కొందరు నాకు ఫోన్ చేశారు. నేను కూడా వీడియో క్లిప్స్ చూశా. కొంతమంది మీడియా మిత్రులు నాకు ఫోన్ చేసి క్లారిటీ తీసుకున్నారు. కొన్నింటిలో మాత్రం నేను వెళ్లాననే వార్తలు వచ్చాయి.అవి చూసి నేను, మా కుటుంబ సభ్యులందరం నవ్వుకున్నాం. అలా వార్తలు రాసిన వాళ్లు తొందపడటంలో తప్పులేదనిపించింది. ఎందుకంటే రేవ్ పార్టీలో దొరికిన అతనెవరో కానీ, కొంచెం నాలాగే ఉన్నాడు. నేనే షాకయ్యా. నేను రేవ్ పార్టీ లకు, పబ్స్కు వెళ్లే వ్యక్తిని కాను. రేవ్ పార్టీ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. దయచేసి తప్పుడు కథనాలను నమ్మొద్దు..’ అని శ్రీకాంత్ విజ్ఞప్తి చేశారు. నేను హైదరాబాద్లోనే చిల్ అవుతున్నా..: సినీ నటి హేమ బెంగళూరులో నన్ను అరెస్ట్ చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కానీ నేను హైదరాబాద్లోనే ఉన్నా. ఓ ఫామ్హౌస్లో చిల్ అవుతున్నా. బెంగళూరులో ఎలాంటి పార్టీ కి వెళ్లలేదు నన్ను అనవసరంగా ఇందులోకి లాగుతున్నారు. నాపై వస్తున్న వార్తల్లో నిజం లేదు. -
అది పచ్చ బ్యాచ్ పనే.. రేవ్ పార్టీ కథనాలపై కాకాణి ఫైర్
నెల్లూరు, సాక్షి: సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి భయంతోనే టీడీపీ నేతలు, వాళ్ల అనుకూల మీడియా తనపై లేనిపోని దుష్ప్రచారం చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డి మండిపడ్డారు. బెంగుళూరు రేవ్ పార్టీలో తన పేరు తెర మీదకు రావడం వెనుక కుట్ర దాగుందని మండిపడ్డారాయన. ‘‘ఓ కారుకు నా పేరిట ఉన్న ఎమ్మెల్యే స్టిక్కర్ ఉందనే నెపంతో నాపై బురద జల్లడం సరికాదు. ఇదంతా టీడీపీ వాళ్ల ప్రచారమే. వైఎస్సార్సీపీ రాష్ట్రంలో మరోసారి ప్రభంజనం సృష్టించనున్నట్టు స్పష్టంగా వారికి అర్ధమైపోయింది. ఓటమి భయంతోనే పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత నాపై పనిగట్టుకొని ఆరోపణలు చేస్తున్నారు. .. రేపవ్ పార్టీలో పట్టుబడ్డ కారుతో కానీ, ఆ కారు ఓనర్తో కానీ, ఆ కారులో ప్రయాణించిన వారితో కానీ నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కారు రిజిస్ట్రేషన్ విజయవాడకు చెందిన తుమ్మల వెంకటేశ్వరరావు పేరిట ఉంది. అతనెవరో కూడా నాకు తెలియదన్నారు. పైగా ఈ కారుకున్న ఎమ్మెల్యే స్టిక్కర్ జిరాక్స్ కాపీ. నా ప్రమేయం లేకుండా ఎమ్మెల్యే స్టిక్కర్ వినియోగించడంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశా. రేవ్ పార్టీ వ్యవహారంపై బెంగుళూరు నార్కోటిక్ పోలీసులు కేసు నమోదు చేశారు. సమగ్ర దర్యాప్తు జరిపి దోషులపై చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా అని మంత్రి కాకాణి మీడియాతో అన్నారు. -
రేవ్పార్టీ కేసులో ట్విస్ట్
బెంగళూరు, సాక్షి: నగరంలో వెలుగు చూసిన రేవ్ పార్టీలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజకీయ, సినీ ప్రముఖులు ఇందులో పాల్గొన్నట్లు పక్కా సమాచారం అందుతోంది. వాళ్ల నుంచి బెంగళూరు నార్కొటిక్స్ విభాగం శాంపిల్స్ సేకరించగా.. అసలు ఈ రేవ్ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు బెంగళూరు పోలీసులు.ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ కలకలం రేగింది. ఆదివారం అర్ధరాత్రి బర్త్ డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించగా.. పోలీసులు దాడి చేశారు. ఈ రేవ్ పార్టీలో మందుతో పాటు పెద్ద ఎత్తున డ్రగ్స్ వాడకం కూడా జరిగింది. పట్టుబడ్డ వాళ్లలో సినీ, రాజకీయ ప్రముఖులు కూడా ఉన్నారు.సదరు జీఆర్ ఫామ్హౌస్ హైదరాబాద్ కాన్కార్డ్ సంస్థకు గోపాల్ రెడ్డికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్కు చెందిన వాసు అనే వ్యక్తి ఈ పార్టీని ఏర్పాటు చేసినట్లు, విమానంలో యువతీయువకులను తరలించినట్లు పోలీసులు నిర్ధారించారు. తెల్లవారుజామున 3 వరకు జరుగుతున్న రేవ్ పార్టీపై పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. రేవ్ పార్టీలో పోలీసులకు భారీగా డ్రగ్స్, కోకైన్ లభ్యమయ్యాయి. కర్ణాటక, తెలుగు రాష్ట్రాలకు చెందిన వంద మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్టీలో 25 మందికి పైగా యువతులు ఉన్నారు. సుమారు 15 విలువైన కార్లను పోలీసులు సీజ్ చేశారు. రేవ్ పార్టీలో తెలుగు సీనీ ఇండస్టీకి చెందిన వారు ఉన్నట్లు బయటకు రావడం కలకలం రేపుతోంది. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు బెంగళూరు సీసీబీ పోలీసులు. ఆ కథనాల్ని ఖండించిన కాకాణిరేవ్పార్టీలో దొరికిన ఓ కారుతో ఏపీ మంత్రి కాకాణి గోవర్థన్కు సంబంధం ఉన్నట్లు కొన్ని మీడియా సంస్థలు వార్తలు ప్రచురిస్తున్నాయి. దీనిపై ఆయన స్పందించారు. బెంగళూర్ రేవ్ పార్టీలో దొరికిన కారుతో నాకు సంబంధం లేదు. కారుపై స్టిక్కర్ ఒరిజినాలా? ఫొటో కాపీనా? అనేది పోలీసులే తేలుస్తారు. 2023తో ఆ స్టిక్కర్ కాలపరిమితి ముగిసింది అని కాకాణి అన్నారు.నాకు సంబంధం లేదు: సినీ నటి హేమ‘‘నేను హైదరాబాద్ లోనే ఉన్నాను. నాకు బెంగుళూరు రేవ్ పార్టీ తో సంబంధం లేదు. అనవసరంగా నన్ను లాగుతున్నారు. కన్నడ మీడియా, సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదు’’ అని సినీ నటి హేమ ప్రకటించారు. అయితే హేమ ప్రకటన చేసిన కాసేపటికే పోలీసులు ట్విస్ట్ ఇచ్చారు. ఆమె పార్టీలో పాల్గొందంటూ బెంగళూరు పోలీసులు ఒక ప్రకటన ఇచ్చినట్లు తెలుస్తోంది.రాజకీయ ప్రముఖులు సైతంబెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడ్డ వంద మందిలో 70 మంది పురుషులు, 30 మంది యువతులు ఉన్నారు. అయితే వీళ్లలో సినీ ప్రముఖులతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సైతం ఉన్నట్లు సమాచారం. వాసు అనే వ్యక్తి పేరు మీద ఈ పార్టీ జరగ్గా.. అసలు ఈ పార్టీ వెనుక ఎవరున్నారనేది తేల్చే పనిలో ఉన్నారు. ప్రస్తుతం పట్టుబడ్డ వాళ్ల నుంచి శాంపిల్స్ సేకరించే పనిలో ఉంది బెంగళూరు నార్కోటిక్స్ విభాగం. -
ఫోటో అదుర్స్! దెబ్బకు కస్టమర్ బేరం ఆడకుండా కొనాల్సిందే!
బెంగళూరు కూరగాయల మార్కెట్లోని ఒక ఫొటో ట్రెండ్గా మారింది. చాలా షాప్లలో ఆ ఫొటోను గోడలకు వేలాడదీస్తున్నారు. లెక్క ప్రకారం అయితే షాప్లలో అభిమాన తారల పోస్టర్లు కనిపిస్తాయి. బెంగళూరు కూరగాయల మార్కెట్లోని టొమాటో స్టాల్లో వేలాడదీసిన పెద్ద ఫొటోలో ఒక మహిళ గుడ్లురుముతూ కోపంగా చూస్తుంటుంది. ఏ కారణం వల్ల ఇట్టి టెర్రిఫిక్ ఫొటోను వేలాడదీశారు అనే గండికోట రహస్యం గురించి తెలియకపోయినా ఈ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ఊహించుకున్నవారికి ఊహించుకున్నంత మహదేవా’ అన్నట్లుగా ఒక్కొక్కరూ ఒక్కో రకంగా ఈ ఫొటోకు భాష్యం చెబుతున్నారు. ‘బేరం అడుతున్నావా! అదేం కుదరదు. చచ్చినట్లు కొనాల్సిందే... అని కస్టమర్ని బెదిరిస్తున్నట్లుగా ఉంది’ అని ఒక యూజర్ కామెంట్ పెట్టాడు. I am so glad I stepped out today pic.twitter.com/nJx6PZUuUV— Niharika 🌌 (@Niharika__rao) May 10, 2024 (చదవండి: కరెంట్తో పనిలేకుండానే వాటర్ని కూల్ చేసుకునే సిపుల్ టెక్నిక్!) -
జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
బెంగళూరు: మహిళ కిడ్నాప్ కేసులో మాజీ మంత్రి, మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణకు బెంగళూరు కోర్టు రిమాండ్ విధించింది. ఆరు రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్కు పంపింది. రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డ మహిళను కిడ్నాప్ చేశారని రేవణ్ణపై కేసు నమోదైంది. ఈ కేసులో రేవణ్ణను ఇటీవలే సిట్ అరెస్టు చేసింది. తన తల్లిని కిడ్నాప్ చేయడమే కాక ఆమెపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారని కిడ్నాప్కు గురైన మహిళ కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో రేవణ్ణపై కేసు నమోదైంది. -
జేపీ నడ్డాకు పోలీసుల సమన్లు
బెంగళూరు: రిజర్వేషన్లపై సోషల్ మీడియలో అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాలవ్యాకు బెంగళూరు పోలీసులు సమన్లు జారీ చేశారు. అభ్యంతరకర పోస్టు పెట్టిన కేసులో తమ ముందు విచారణకు హాజరవ్వాలని సమన్లలో కోరారు. కాగా, ఇటీవలే కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేసిన కేసులో తెలంగాణ కాంగ్రెస్ సోషల్ మీడియా కార్యకర్తలను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు సమన్లు ఇవ్వగా ఆయన తన రాతపూర్వక సమాధానాన్ని న్యాయవాది ద్వారా పంపారు. -
‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
బెంగళూరు: సంచలనం రేపిన జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్య వీడియోలపై జేడీఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి స్పందించారు. అభ్యంతరకర వీడియోలున్న 25 వేల పెన్డ్రైవ్లను పంచడం వెనుక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఉన్నారని మండిపడ్డారు. తొలుత ఏప్రిల్ 21న బెంగళూరు రూరల్ నియోజకవర్గంలో ఒక పెన్డ్రైవ్ను రిలీజ్ చేశారన్నారు. వాట్సాప్ ఛానల్ సృష్టించి మరీ వీడియోలు కావాల్సిన వారు ఛానల్ను ఫాలో అవ్వాలని కోరారని చెప్పారు. దీనిపై ఏప్రిల్ 22న తమ పార్టీ పోలింగ్ ఏజెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశాడన్నారు. సిట్తో న్యాయం జరుగుతుందన్న నమ్మకం తనకు లేదన్నారు. తప్పు చేసిన వారికి చట్టం ప్రకారం పడాల్సిందేనని స్పష్టం చేశారు. వీడియోలు పంచినవారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. పోలీసు అధికారుల సాయంతోనే పెన్డ్రైవ్లను పంచినట్లు తమకు సమాచారం ఉందన్నారు. జేడీఎస్ ఎంపీ అభ్యర్థులు ముగ్గురు ఓడిపోతారన్న సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలు గుర్తొస్తే ఇప్పడు అనుమానం వేస్తోందన్నారు. -
‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
దేశాన్ని విడిచి వెళ్లాలా? అంటూ బెంగళూరు ఇన్ఫ్రా, వాతావారణంపై ఆంత్రప్రెన్యూర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చకు దారి తీశాయి. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి కేరాఫ్ అడ్రస్గా నిలిచిన బెంగళూరు ఇప్పుడు తీవ్ర నీటి సమస్యను ఎదుర్కొటోంది. ఈ తరుణంలో బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మోమో మీడియా కో-ఫౌండర్, క్రియేటీవ్ హెడ్ అనంత్ శర్మ బెంగళూరు నగరంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.బెంగళూరులో మౌలిక సదుపాయాలు, వాతావరణం, నీటి సమస్యపై ఎక్స్ వేదికపై అనంత్ శర్మ స్పందించారు. శర్మ తాను ముంబై లేదా పూణే షిఫ్ట్ అవ్వడం మంచిదా లేకా దేశం విడిచిపెట్టి వెళ్లడం మంచిదా అంటూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. Bangalore looks like it's gonna go to the dogs in another 5 years with bad infra bad weather and bad water. Is Mumbai or Pune worth shifting to or should I just leave India?— Anant (@AnantNoFilter) May 3, 2024‘బాడ్ ఇన్ఫ్రా, బ్యాడ్ వెదర్, బ్యాడ్ వాటర్. నేను ముంబై లేదా పూణేకు షిఫ్ట్ అవ్వాలా? లేదా? దేశం విడిచి వెళ్లాలా? అంటూ నెటిజన్ల అభిప్రాయాల్ని కోరారు. అయితే ఈ ట్వీట్పై నెటిజన్లు తమదైన శైలిలో స్పందించారు. ఎక్కువ మంది నెటిజన్లు తన అభిప్రాయంతో ఏకీభవించారు. కొందరు మరో ప్రాంతానికి షిఫ్ట్ అవ్వండి అంటూ సలహా ఇస్తే.. మరికొందరు మాత్రం బెంగళూరులో సానుకూల అంశాలను చర్చించారు. మీకు ఆర్థిక స్థోమత ఉంటే వదిలేయండి అంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేయగా.. బెంగుళూరుతో ఉన్న వ్యవస్థాగత సమస్య ఏమిటంటే ప్రజలు దీనిని వలస నగరంగా భావించడం. ఓటు బ్యాంకుగా మారితే తప్ప నగరాన్ని మార్చాలని ఎవరూ కోరుకోరని నిట్టూర్చాడు.