-
తగ్గిన ప్రపంచ నం1 కంపెనీ విక్రయాలు.. భారత్లో మాత్రం..
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ ఐఫోన్ విక్రయాలు తగ్గుతున్నట్లు తెలిసింది. మార్చి 2024తో ముగిసిన త్రైమాసికంలో యాపిల్ ఐఫోన్ విక్రయాలు 10 శాతం తగ్గినట్లు కంపెనీ చెప్పింది. దాంతో కంపెనీ ఆదాయం 4 శాతం క్షీణించిందని చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుక్ తెలిపారు.గడిచిన త్రైమాసికంలో ప్రపంచవ్యాప్తంగా ఐఫోన్ విక్రయాలు తగ్గుతుంటే ఇండియాలో మాత్రం వీటికి ఆదరణ పెరుగుతుందని చెప్పారు. ఇండియాలో రికార్డు స్థాయిలో విక్రయాలు పెరిగినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇండియాలో యాపిల్ ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ ఉంది. భారత్లో స్థిరంగా రెండంకెల వృద్ధి నమోదవుతోంది. ఇక్కడ రికార్డుస్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ముందుగా కంపెనీ ఆశించినమేరకు అంచనాలను అధిగమిస్తున్నాం’ అని అన్నారు.యాపిల్ సంస్థ ముంబై, దిల్లీలో రెండు అవుట్లెట్లను ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నట్లు తెలిసింది. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది.ఇదీ చదవండి: దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదవుతోంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి చర్చలు జరుపుతున్నట్లు తెలిసింది. అయితే గతేడాది జూన్లో వెలువడిన బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
దిగ్గజ కంపెనీల మధ్య రూ.1.66లక్షల కోట్ల ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచంలోని టాప్ టెక్ దిగ్గజ కంపెనీల మధ్య ఒప్పందం జరిగినట్లు కోర్టు పత్రాల ద్వారా బట్టబయలైంది. యాపిల్ సఫారి బ్రౌజర్లో గూగుల్ డిఫాల్ట్ సెర్చ్ ఇంజిన్గా ఉండటానికి 2022లో 20 బిలియన్ డాలర్లు(రూ.1.66లక్షల కోట్లు) చెల్లించినట్లు గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ ఇంక్. తెలిపింది. గూగుల్కు వ్యతిరేకంగా కోర్టులో దాఖలైన యాంటీట్రస్ట్ దావాలో ఈ విషయం వెలుగుచూసింది.ఆన్లైన్ ప్రకటనల ఆదాయం కోసం గూగుల్ సెర్చ్ ఇంజిన్ చట్టవిరుద్ధంగా గుత్తాధిపత్యాన్ని కలిగి ఉందని యూఎస్ కోర్టులో గతంలో యాంటీట్రస్ట్ వ్యాజ్యాలు దాఖలయ్యాయి. ఈ కేసులో రెండు టెక్ దిగ్గజాల మధ్య ఒప్పందం జరిగినట్లు ఇటీవల తేలింది. విచారణ జరుపుతున్న న్యాయ శాఖ ఏడాది చివర్లో ఈ అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసింది.ఇటీవల జరిగిన విచారణలో రెండు కంపెనీల మధ్య ఒప్పందం జరిగిందని ధ్రువీకరించాయి. ఇందుకోసం జరిగిన చెల్లింపుల మొత్తాన్ని బహిర్గతం చేయకుండా చూడాలని భావించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. కోర్టు విచారణలో నంబర్లు వెల్లడించకుండా ఈ ఒప్పందానికి గూగుల్ ‘బిలియన్లు’ చెల్లించినట్లు యాపిల్ చెప్పింది. యాపిల్ డిఫాల్ట్ బ్రౌజర్గా ఉన్నందుకు సెర్చ్ ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయంలో 36 శాతం గూగుల్ యాపిల్కు చెల్లిస్తున్నట్లు తెలిసింది.కోర్టు పత్రాల వల్ల యాపిల్కు వస్తున్న ఆదాయమార్గాల గురించి కూడా స్పష్టత వచ్చినట్లయింది. 2020లో యాపిల్ నిర్వహణ ఆదాయంలో దాదాపు 17.5 శాతం గూగుల్ నుంచి సమకూరిందేనని అంచనా. గూగుల్ డిఫాల్ట్ ఒప్పందాల్లో యాపిల్ డీల్ అత్యంత ముఖ్యమైంది. యూఎస్లో అధికంగా ఉపయోగించే స్మార్ట్ఫోన్ సెర్చ్ ఇంజిన్ సఫారి బ్రౌజర్ కావడంతో గూగుల్కు ఈ ఒప్పందం ప్రధానంగా మారింది. 2002లో సఫారీ బ్రౌజర్లో గూగుల్ను ఉచితంగా ఉపయోగించేందుకు యాపిల్ మొదట అంగీకరించింది. కానీ సెర్చ్ ప్రకటనల ఆదాయం పెరుగుతున్న కొద్దీ దాన్ని ఇరు కంపెనీలు పంచుకోవాలని నిర్ణయించుకున్నాయి. మే 2021 నాటికి సఫారి బ్రౌజర్లో డిఫాల్ట్ సెర్చ్ఇంజిన్ కోసం యాపిల్కు నెలకు 1 బిలియన్ డాలర్లు(రూ.8300 కోట్లు) కంటే ఎక్కువే చెల్లించిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.ఇదీ చదవండి: బేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లుసెర్చ్ ఇంజిన్లో గూగుల్తో పోటీపడుతున్న బింగ్ను యాపిల్ డిఫాల్ట్బ్రౌజర్గా ఉండేలా చూడాలని మైక్రోసాఫ్ట్ సంస్థ చాలానే ప్రయత్నించింది. కోర్టులో దాఖలైన పత్రాల ప్రకారం..సఫారీలో బింగ్ను డిఫాల్ట్గా ఉంచడానికి కంపెనీ తన ప్రకటనల ఆదాయంలో 90 శాతం యాపిల్కు ఇవ్వడానికి మైక్రోసాఫ్ట్ సిద్ధ పడింది. -
యాపిల్కు ఆదాయం సమకూర్చడంలో భారత్ టాప్
యాపిల్ భారత్లో తన ఆదాయాన్ని పెంచుకుంటుంది. కేవలం రెండు అవుట్లెట్ల ద్వారా 2024 ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.190-రూ.210 కోట్ల ఆదాయం సమకూరినట్లు తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అవుట్లెట్ల్లో ఇదే రికార్డు ఆదాయమని కంపెనీ తెలిపింది. ముంబై, దిల్లీలో రెండు యాపిల్ స్టోర్లు ప్రారంభించిన విషయం తెలిసిందే. వీటిలో యాపిల్ అమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఈ స్టోర్లు ప్రారంభించిన నాటినుంచి నెలవారీ సగటు అమ్మకాలు స్థిరంగా రూ.16 కోట్లు-రూ.17 కోట్లుగా నమోదవుతున్నాయని కంపెనీ తెలిపింది. ఇదీ చదవండి: కొత్త సౌండ్బాక్స్లు ప్రారంభించిన పేటీఎం.. ప్రత్యేకతలివే.. ముంబై స్టోర్ యాపిల్ బీకేసీ ఆదాయం దిల్లీ స్టోర్ యాపిల్ సాకెట్ కంటే కొంచెం అధికంగా నమోదైంది. త్వరలో భారత్లో మరో మూడు స్టోర్లను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. పుణె, బెంగళూరుతోపాటు దిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో ఈ అవుట్లెట్లను ఏర్పాటు చేయడానికి యాపిల్ చర్చలు జరుపుతోందని తెలిసింది. అయితే గతేడాది జూన్లో బ్లూమ్బెర్గ్ నివేదిక ప్రకారం.. యాపిల్ తన స్టోర్లను విస్తరించే ఆలోచన లేదని కథనాలు వెలువడ్డాయి. కానీ 2024లో సమకూరిన ఆదాయాల నేపథ్యంలో భారత్లో మరిన్ని స్టోర్లను విస్తరించాలని అనుకుంటున్నట్లు తెలిసింది. -
భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందిస్తున్న నం.1 కంపెనీ
ప్రపంచ దిగ్గజ సంస్థ యాపిల్ భారత్లో సోలార్ సొల్యూషన్స్ అందించేందుకు పునరుత్పాదక ఇంధన సంస్థ క్లీన్మాక్స్తో జాయింట్ వెంచర్ను ఏర్పాటు చేసింది. ఈ సంయుక్త సంస్థ భారతదేశంలోని ఆరు పారిశ్రామిక ప్రదేశాల్లో 14.4 మెగావాట్ల సోలార్ రూఫ్టాప్లను అమర్చింది. తాజాగా రెండు కంపెనీలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన సోలార్ రూఫ్టాప్లతో 2.07 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారాలను తగ్గించవచ్చని భావిస్తున్నారు. ఇదీ చదవండి: భారీ ఆర్డర్లకు కొత్త విద్యుత్తు వాహనాలు ఇండియాలో యాపిల్ తన కార్పొరేట్ కార్యకలాపాలను పెంపొందించుకునేందుకు ఈ భాగస్వామ్యం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసింది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీపై అవగాహన కలిగిస్తూ పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను పెంచడమే ఈ భాగస్వామ్యం లక్ష్యమని క్లీన్మాక్స్ తెలిపింది. -
భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం.. ఎందుకంటే..
ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ భారత్లో కార్యకలాపాలపై ఆసక్తిగా ఉందని తెలుస్తుంది. తాజాగా ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ సరఫరా చేసేందుకు భారత కంపెనీలతో యాపిల్ ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు తెలిసింది. ఈమేరకు కొన్ని మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. ఐఫోన్ కెమెరా మాడ్యుల్స్ తయారీకి టాటా గ్రూప్నకు చెందిన టైటాన్ కంపెనీతో, మురుగప్ప గ్రూప్తో యాపిల్ చర్చలు జరుపుతున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఒకవేళ ఈ ఒప్పందం కుదిరితే కుపెర్టినో కంపెనీ తన కార్యకలాపాలను చైనాతోపాటు భారత్లో విస్తరించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ కుపెర్టినో కంపెనీ చైనాలో ఐఫోన్ కెమెరాలను తయారుచేస్తోంది. ఈ ఒప్పందానికి సంబంధించి మరో 5-6 నెలల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. టైటాన్ గడియారాలు, ఇతర ఆభరణాల తయారీలో ప్రత్యేకత చాటుకుంటోంది. చెన్నై ప్రధాన కార్యాలయంగా ఉన్న మురుగప్ప గ్రూప్నకు ఇంజినీరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, కెమికల్స్ రంగంలో 100 ఏళ్ల అనుభవం ఉంది. ఈనేపథ్యంలో ఈ కంపెనీతో ఒప్పందం ఖరారు చేసుకోవచ్చని పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ఎలక్ట్రానిక్స్, కాంపోనెంట్స్ రంగంలో తన వ్యాపారాన్ని విస్తరించాలని నోయిడాకు చెందిన కెమెరా మాడ్యూల్ తయారీ సంస్థ మోషిన్ ఎలక్ట్రానిక్స్లో మురుగప్ప గ్రూప్ 76% వాటాను కొనుగోలు చేసింది. బెంగళూరు ప్రధాన కార్యాలయంగా ఉన్న టైటాన్ కంపెనీ ఇంజినీరింగ్, ఆటోమేషన్లో సేవలందిస్తోంది. హై ప్రెసిషన్ కాంపోనెంట్ తయారీ, ఇంజినీరింగ్ డిజైన్ సర్వీస్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. రక్షణ, ఏరోస్పేస్ వంటి పరిశ్రమల్లోను సేవలందిస్తోంది. యాపిల్ జనవరి నివేదిక ప్రకారం.. 2024-25 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత్లో దాదాపు రూ.1 లక్ష కోట్ల విలువైన ఐఫోన్లను తయారుచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దాంతో స్థానికంగా ఆ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకున్న కంపెనీల ఉత్పత్తి సామర్థ్యం పెరిగింది. ఇండియాలో తయారవుతున్న దాదాపు 70 శాతం ఐఫోన్లు ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఇది మరింత పెరిగి అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: ప్రపంచంలోని రద్దీ ఎయిర్పోర్ట్ల్లో భారత విమానాశ్రయం కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా యాపిల్ భారత్లో తయారీకి ముందుకు వచ్చింది. అందులో భాగంగా ఇప్పటికే ఫాక్స్కాన్, పెగాట్రాన్, విస్ట్రాన్ వంటి ఎలక్ట్రానిక్స్ కంపెనీలతో కలిసి పనిచేస్తోంది. -
‘తప్పు చేశాం.. మళ్లీ చేస్తాం..10వేల డాలర్లు ఇస్తాం..’
భారత కస్టమర్ పేరును వక్రీకరిస్తూ కెనడాకు చెందిన ‘డీబ్రాండ్’ కంపెనీ చేసిన ట్వీట్పై విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో చేసేదేమిలేక కంపెనీ క్షమాపణలు చెబుతూ గుడ్విల్ కింద 10వేల డాలర్లను ఆఫర్ చేసింది. ఇకనుంచి కస్టమర్లపై జోకులు వేసేముందు మరింత జాగ్రత్తగా ఉంటామని చెప్పడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. భువన్ చిత్రాంశ్ అనే భారత వ్యక్తి ఇటీవల కెనడాకు చెందిన డీబ్రాండ్ అనే ఎలక్ట్రానిక్స్ యాక్సెసరీస్ కంపెనీ నుంచి యాపిల్ మ్యాక్బుక్ స్క్రీన్పై భాగంలో ఉండే కవర్ను కొనుగోలు చేశారు. రెండు నెలలు అవ్వకముందే ఆ కవర్ రంగు వెలిసిపోయింది. దాంతో ‘ఎక్స్’ వేదికగా కంపెనీ అధికారిక అకౌంట్ను ట్యాగ్ చేస్తూ తన సమస్య తెలిసేలా ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారంపై డీబ్రాండ్ విచిత్రంగా స్పందించింది. అతడి పేరు చిత్రాంశ్.. అయితే ‘షిట్ రాష్’ అని విపరీతార్థం వచ్చేలా రాసింది. అతడి పేరులోని అక్షరాలను అలా మార్చి రాయడంపట్ల నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తూ ట్వీట్ చేశారు. భారతీయుడి పేరుపై వెటకారపు వ్యాఖ్యలు చేయడం తగదంటూ తీవ్రంగా స్పందించారు. చిత్రాంశ్ కంపెనీ ట్వీట్కు ప్రతిస్పందనగా భారత్ కస్టమర్లపై కొన్ని రాసిస్ట్ కంపెనీల దృక్పథం ఎలా ఉందో తెలిసిపోయిందని తెలియజేస్తూ పీఎం మోదీ, కామర్స్ మినిస్టర్ పీయుష్గోయల్ అకౌంట్ను ట్యాగ్ చేశాడు. ఇదీ చదవండి: కొత్త ఏఐ ల్యాప్టాప్లు.. ప్రత్యేకత ఏంటో తెలుసా.. దాంతో కంపెనీ స్పందించి కస్టమర్ పేరును వక్రీకరించామని అంగీకరించింది. దీన్ని అతిపెద్ద తప్పిదంగా భావిస్తూ క్షమాపణ కోరింది. గుడ్విల్ కింద 10,000 డాలర్లు చిత్రాంశ్కు ఆఫర్ చేసింది. అయితే, ఇలా కస్టమర్లతో సరదాగా జోకులు వేయడం దాదాపు దశాబ్దకాలంగా చేస్తున్నామని కంపెనీ తెలిపింది. ఇలా యూజర్లపై సరదాగా జోకులు వేయడం మాత్రం ఆపబోమని చెప్పింది. అంతటితో ఆగకుండా తర్వాత 10,000 డాలర్లను అందుకోబోయేది మీలో ఒకరు కావచ్చంటూ ట్వీట్ చేసింది. Well that escalated quickly. 1. Yes - we made fun of a guy's name. It was a huge fumble. 2. We apologized to him directly and offered him $10,000 as a gesture of goodwill. 3. We've been poking fun at customers on social media for over a decade now. We're not going to stop, but… — dbrand (@dbrand) April 10, 2024 -
Apple: స్పైవేర్ దాడులు జరగొచ్చు
న్యూఢిల్లీ: ప్రభుత్వ మద్దతున్న సైబర్ నేరగాళ్లు మీ ఐఫోన్ తదితర యాపిల్ ఉత్పత్తులపై సైబర్దాడులు చేయొచ్చని గతంలో హెచ్చరించి తీవ్ర చర్చకు తెరలేపిన యాపిల్ సంస్థ తాజాగా మరోమారు అలాంటి హెచ్చరికనే చేసింది. పెగాసస్ తరహా అత్యంత అధునాతనమైన స్పైవేర్ దాడులు కీలకమైన పాత్రికేయులు, కార్యకర్తలు, రాజకీయవేత్తలు, దౌత్యవేత్తలను లక్ష్యంగా చేసుకుని జరగొచ్చని యాపిల్ ఏప్రిల్ పదో తేదీ ఒక ‘థ్రెట్’ నోటిఫికేషన్లో పేర్కొంది. ‘‘కొనుగోలుచేసిన అధునాతన స్పైవేర్తో సైబర్ దాడులు జరిగే అవకాశాలను ముందే పసిగట్టి యూజర్లకు సమాచారం ఇవ్వడం, వారిని అప్రమత్తం చేయడం కోసం థ్రెట్ నోటిఫికేషన్లను రూపొందించాం. సాధారణ సైబర్నేరాల కంటే ఈ దాడులు చాలా సంక్షిష్టమైనవి. అత్యంత తక్కువ మందినే లక్ష్యంగా చేసుకుంటారు కాబట్టి ఎవరిపై, ఎందుకు దాడి చేస్తారో చెప్పడం కష్టం. అయితే దాడి జరిగే అవకాశాన్ని మాత్రం ఖచ్చితంగా అంచనావేసి ముందే యూజర్లను అప్రమత్తం చేస్తాం’’ అని థ్రెట్ నోటిఫికేషన్లో యాపిల్ హెచ్చరించింది. సార్వత్రిక ఎన్నికలకు సంసిద్ధమవుతున్న భారత్సహా 60 దేశాల్లోని యూజర్లకు యాపిల్ ఈ నోటిఫికేషన్లు పంపించింది. ఇజ్రాయెల్ తయారీ పెగాసస్ స్పైవేర్ సాయంతో మొబైల్ ఫోన్కు వాట్సాప్ ద్వారా మిస్డ్కాల్ ఇచ్చి కూడా ఆ ఫోన్ను సైబర్నేరగాళ్లు తమ నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ‘‘ఎవరైనా యూజర్ను సైబర్నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటే ముందే గుర్తించి ఆ యూజర్ను హెచ్చరిస్తాం. ఐఫోన్ను సైబర్భూతం నుంచి కాపాడాలంటే దానిని లాక్డౌన్ మోడ్లో పెట్టుకోవచ్చు. అప్పుడు ఆ ఫోన్లో ఫింగర్ఫ్రింట్ సెన్సార్, ఫేఫియల్ రికగ్నీషన్, వాయిస్ రిగ్నీషన్ ఏవీ పనిచేయవు. ఒకవేళ మనమే మళ్లీ వాడుకోవాలంటే పిన్ లేదా పాస్కోడ్ లేదా ప్యాట్రన్ సాయంతోనే మళ్లీ ఫోన్ను పనిచేసేలా చేయొచ్చు’’ అని యాపిల్ సూచించింది. ఒక సర్వే ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 49 శాతం సంస్థలు తమ ఉద్యోగుల డివైజ్లపై సైబర్ దాడులు/ ఉల్లంఘన ఉదంతాలను పసిగట్ట లేకపోతు న్నాయి. భారత్లో లెక్కిస్తే మొబైల్ మాల్వే ర్ సాయంతో సగటు వారానికి 4.3 శాతం సంస్థలపై సైబర్ దాడులు జరుగుతు న్నాయి. అదే ఆసియాపసిఫిక్ ప్రాంతంలో అయితే గత ఆరు నెలల్లో సగటును 2.6 శాతం సంస్థలపై సైబర్ దాడులు చోటుచేసుకున్నాయి. -
చైనాకు యాపిల్ షాక్.. 5 లక్షల జాబ్స్ మనకే..!
ప్రీమియం ఫోన్లు, ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు తయారు చేసే ప్రముఖ కంపెనీ యాపిల్ చైనాకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. తమ చైనా ఆధారిత సప్లయి చైన్లో సగభాగాన్ని భారత్కు తరలించి వచ్చే మూడు సంవత్సరాలలో తమ భారతీయ ఉద్యోగుల సంఖ్యను 5 లక్షలకు పెంచాలని యోచిస్తోందని ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. స్థానిక విలువ జోడింపుపై దృష్టి సారించిన యాపిల్.. దేశీయ విలువ జోడింపును 11-12 శాతం నుంచి 15-18 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతర్జాతీయ మార్కెట్గా, ఆర్అండ్డీ హబ్గా ఎదుగుతున్న భారత్ ప్రాముఖ్యతకు అనుగుణంగా యాపిల్ ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం, దేశంలో స్థానిక విలువ జోడింపు 14 శాతంగా ఉంది. ఇది చైనాకు చెందిన 41 శాతం కంటే చాలా తక్కువ. యాపిల్ గత రెండు సంవత్సరాలుగా భారతదేశంలో తన ఉనికిని గణనీయంగా పెంచుకుంది. తయారీ, రిటైల్ రెండింటిపైనా దృష్టి సారించింది. దేశంలో మొదట్లో పాత ఐఫోన్ మోడల్లు అసెంబుల్ చేయగా, ఇప్పుడు ఐఫోన్ 15 మోడళ్లను కూడా తయారు చేస్తోంది. 2024 ఆర్థిక సంవత్సరంలో యాపిల్ భారతదేశంలో 14 బిలియన్ డాలర్ల విలువైన ఐఫోన్లను అసెంబుల్ చేసిందని నివేదికలు సూచిస్తున్నాయి. యాపిల్ కంపెనీ ఫాక్స్కాన్, పెగాట్రాన్ అనే రెండు ప్రధాన తయారీ భాగస్వాములను కలిగి ఉంది. వీటి ద్వారా వరుసగా 67 శాతం, 17 శాతం ఐఫోన్లు అసెంబుల్ అవుతున్నాయి. అదనంగా కర్ణాటకలోని విస్ట్రాన్ ప్లాంట్ను నిర్వహిస్తున్న టాట్ గ్రూప్ 6 శాతం ఐఫోన్లను అసెంబుల్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అసెంబుల్ చేస్తున్న ఏడు ఐఫోన్లలో ఒకటి ఇప్పుడు భారతదేశంలోనే అసెంబుల్ అవుతోంది. -
యాపిల్ ఐఫోన్ల తయారీ.. టాటా గ్రూప్ మరో కీలక నిర్ణయం
ప్రముఖ డైవర్సిఫైడ్ దిగ్గజం టాటా గ్రూప్ కీలక నిర్ణయం తీసుకుంది. ఐఫోన్ల తయారి కంపెనీ పెగట్రాన్తో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఐఫోన్ల తయారీ కోసం బెంగళూరులోని విస్ట్రాన్ ప్లాంట్ను కొనుగోలు చేసిన టాటా ఎలక్ట్రానిక్స్.. తాజా పెగట్రాన్తో సంప్రదింపులు జరగడం ఆసక్తికరంగా మారింది. అయితే టాటా ఎలక్ట్రానిక్ పెగట్రాన్లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనుందని, ఇందుకోసం ఆ సంస్థతో చర్చలు జరుపుతున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఎన్నికలు పూర్తయిన తర్వాత డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సమాచారం. కాగా, దీనిపై పెగట్రాన్ గానీ, టాటా ఎలక్ట్రానిక్స్ గానీ స్పందించేందుకు నిరాకరించాయి. -
భారత్లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..?
ఉద్యోగులు చేస్తున్న పనికి కేవలం జీతం ఇచ్చి ఇంటికి పంపించకుండా వారికి మౌలికసదుపాయాలు కల్పించడంపై ప్రముఖ కంపెనీలు దృష్టిసారిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ప్రపంచ నం.1 కంపెనీ అయిన యాపిల్ తన ఉద్యోగులకు ఏకంగా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. ఈమేరకు ఇండస్ట్రీయల్ హౌజింగ్ మోడల్స్ పేరుతో ఇప్పటికే చైనా, వియత్నాం వంటి దేశాల్లో అమలులో ఉన్న ఈ విధానాన్ని భారత్లో ప్రవేశపెట్టబోతున్నట్లు అధికారులు తెలిపారు. గడిచిన రెండున్నరేళ్లలో ఇండియాలో 1.5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు యాపిల్ వర్గాలు తెలిపాయి. వీరికి ఇళ్లు నిర్మించేలా కంపెనీ చర్యలు తీసుకోబోతున్నట్లు అధికారులు చెప్పారు. భారత్లో యాపిల్ ఉత్పత్తులను తయారుచేస్తున్న ఫాక్స్కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, సాల్కాంప్ వంటి సంస్థలు తమ ఉద్యోగుల కోసం గృహాలను నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘యాపిల్ ఆవాస్ యోజన’ పేరుతో గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభించనున్నట్లు వార్తాకథనాల ద్వారా తెలిసింది. ఈ పథకం కింద దాదాపు 78,000 యూనిట్లు ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. అందులో గరిష్ఠంగా తమిళనాడులోనే 58,000 యూనిట్ల ఇళ్ల కేటాయింపులు జరగనున్నాయి. స్టేట్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు (సిప్కాట్) సహకారంతో ఆ రాష్ట్రంలో ఇళ్లు నిర్మిస్తారని ప్రభుత్వ అధికారులు తెలిపారు. టాటా గ్రూప్తోపాటు ఎస్పీఆర్ ఇండియా నుంచి ఈ పథకానికి సహకారం అందనుందని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు 10-15% నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి రానున్నాయి. మిగిలినవి రాష్ట్ర ప్రభుత్వాలు, పారిశ్రామికవేత్తల నుంచి సేకరించనున్నట్లు తెలిసింది. మార్చి 31, 2025లోపు గృహాల నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యంగా పెట్టుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పథకంతో ముఖ్యంగా మహిళలకు అధికంగా లబ్ధి చేకూరనుందని పేర్కొన్నారు. చాలా మంది ఉద్యోగులు ప్రస్తుతం అద్దె గృహాల్లో నివసిస్తున్నారు. వారు తమ కార్యాలయాలకు చేరుకోవడానికి చాలాసేపు ప్రయాణించాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు భద్రతా సవాళ్లను ఎదుర్కొంటున్నారు. కంపెనీ ఉత్పాదకతతోపాటు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. భారత్లో ప్రధాన ఐఫోన్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్కాన్ తన 41,000 మంది ఉద్యోగుల కోసం 35,000 ఇళ్లను నిర్మించనుంది. వీరిలో 75శాతం మహిళలే ఉండడం గమనార్హం. టాటా ఎలక్ట్రానిక్స్ తన ఉద్యోగుల కోసం హోసూర్ ఫెసిలిటీలో 11,500 ఇళ్లను నిర్మిస్తుంది. యాపిల్ కోసం పవర్ అడాప్టర్లు, ఎన్క్లోజర్లను ఉత్పత్తి చేసే సాల్కాంప్ 3,969 యూనిట్లను ఏర్పాటు చేయనుంది. ఇదీ చదవండి: పుష్పరాజ్.. బ్రాండింగ్లో తగ్గేదేలే.. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకంలో భాగంగా స్థానిక కంపెనీలతో కలిసి టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన ఉత్పత్తులను భారత్లో తయారుచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. -
హోమ్ రోబోటిక్స్ విభాగంలోకి ప్రపంచ నం.1 కంపెనీ..?
ప్రపంచ నం.1 కంపెనీ యాపిల్ నిత్యం టెక్నాలజీలో మార్పులు చేస్తూ తమ వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేస్తోంది. అందులో భాగంగానే ‘ప్రాజెక్ట్ టైటన్’తో ఆటో మొబైల్ రంగంలో అడుగుపెట్టాలనుకుంది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ స్మార్ట్ కార్ ప్రాజెక్ట్ను నిలిపేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించింది. దాన్ని రద్దుచేసుకున్నట్లు చెప్పిన కొద్ది రోజుల్లోనే మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్కు తెరతీయనున్నట్లు తెలిసింది. ఈమేరకు హోమ్ రోబోటిక్స్ విభాగంలో అడుగుపెట్టేందుకు యాపిల్ సిద్ధమవుతుందని కొన్ని మీడియా సంస్థల్లో కథనాల ప్రచురితమయ్యాయి. హోమ్ రోబోటిక్స్లో భాగంగా యాపిల్ తీసుకురానున్న ఈ రోబో ఇంటి యజమానిని అనుసరిస్తూ పనులు చేయడంలో సాయపడుతుంది. వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొనాల్సి వచ్చినప్పుడు డిస్ప్లే చూపిస్తుంది. ఈ రోబో రెండు చేతులు, ఒక డిస్ప్లేతో రానున్నట్లు తెలుస్తోంది. యాపిల్ హార్డ్వేర్ ఇంజినీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ విభాగాలు ఈ ప్రాజెక్ట్పై పని చేయనున్నాయని సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఇంకా ఆరంభ దశలోనే ఉందని, అయితే దీనిపై యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదని బ్లూమ్బర్గ్ నివేదించింది. ఇదీ చదవండి: మిమిక్రీ టూల్ను పరిచయం చేసిన ప్రముఖ ఏఐ సంస్థ యాపిల్ సంస్థ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి భారీగా ఖర్చు చేస్తూ ఉంటుంది. ప్రాజెక్ట్ వల్ల భవిష్యత్తులో ఎలాంటి ప్రయోజనాలుండనున్నాయో అంచనా వేస్తుంది. తీరా ప్రాజెక్ట్ తుది దశకు చేరినా అవసరం లేదనుకుంటే దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తుంది. ఈ తరహాలో స్మార్ట్ కారు, డిస్ప్లే ప్రాజెక్టులను యాపిల్ పక్కనపెట్టిన విషయం తెలిసిందే. ఒకవేళ కంపెనీ నుంచి ఈ ప్రాజెక్ట్కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడినా ఏ మేరకు తుదిదశకు చేరుకుని ఉత్పత్తి వరకు చేరుకుంటుందోనని పలువురు టెక్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. -
యాపిల్లో 600 మంది ఉద్యోగులకు ఉద్వాసన
వాషింగ్టన్: టెక్ దిగ్గజం యాపిల్ 600 మందికి పైగా ఉద్యోగులను తొలగించింది. మే 27 నుంచి తొలగింపు వర్తిస్తుందంటూ మార్చి 28న 614 మంది వర్కర్లకు పంపిన లేఖలో యాపిల్ పేర్కొంది. ఈ ఉద్యోగులంతా శాంటా క్లారాలోని ఎనిమిది కార్యాలయాల్లో పని చేస్తున్నారు. కోవిడ్–19 తర్వాత యాపిల్ ఇంత భారీ స్థాయిలో ఉద్వాసనలకు తెర తీయడం ఇదే ప్రథమం. కోవిడ్ సమయంలో భారీగా రిక్రూట్మెంట్ చేపట్టిన చాలా మటుకు టెక్ కంపెనీలు గత రెండేళ్లుగా పెద్ద యెత్తున ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్నాయి. -
Apple Security Alert: యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరికలు
యాపిల్ యూజర్లకు భారత ప్రభుత్వ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ సీఈఆర్టీ-ఇన్ కీలక సూచన చేసింది. యాపిల్ ఉత్పత్తులైన ఐఫోన్, మాక్బుక్స్,ఐపాడ్స్, విజన్ ప్రో హెడ్సెట్లు వినియోగిస్తున్న యూజర్లకు హై-రిస్క్లో ఉన్నారని హెచ్చరించింది. నేరస్తులు సైబర్ దాడులు చేసేందుకు వినియోగించే ఆర్బిటరీ కోడ్ యాపిల్ ఉత్పత్తుల్లో గుర్తించినట్లు సీఈఆర్టీ తెలిపింది. సైబర్ నేరస్తులు వినియోగించే ఈ ఆర్బిటరీ కోడ్ కారణంగా యాపిల్ సాఫ్ట్వేర్, హార్డ్వేర్లకు తీవ్రనష్టం వాటిల్లే అవకాశం ఉందని వెల్లడించింది. ముఖ్యంగా యాపిల్ సఫారీ వెర్షన్ ప్రైయర్ టూ 17.4.1, యాపిల్ మాక్ఓఎస్ వెంచురా వెర్షన్ ప్రైవర్ టూ 13.6.6, యాపిల్ మాక్ ఓస్ సోనోమా వెర్షన్ ప్రైవర్ టూ 14.4.1, యాపిల్ ఓఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 1.1.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఓస్ వెర్షన్ ప్రైయర్ టూ17.4.1, యాపిల్ ఐఓఎస్ అండ్ ఐపాడ్ ఎస్ వెర్షన్ ప్రైయర్ టూ 16.7.7లపై ప్రతి కూల ప్రభావం ఎక్కువ ఉందని సూచించింది. టెక్ నిపుణుల అభిప్రాయం మేరకు ఐఫోన్ ఎక్స్ఎస్, ఐపాడ్ ప్రో 12.9 అంగుళాలు, ఐపాడ్ ప్రో 10.5 అంగుళాలు, ఐపాడ్ ప్రో 11 అంగుళాలు, ఐపాడ్ ఎయిర్, ఐపాడ్ మినీ వినియోగదారులు 17.4కి ముందు ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లను వినియోగిస్తుంటే వాటిపై సైబర్ దాడుల ప్రభావం ఎక్కువగా ఉండనున్నట్లు సమాచారం. అదనంగా, ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్, ఐఫోన్ ఎక్స్, ఐఫాడ్ 5, ఐపాడ్ ప్రో 9.7-అంగుళాల,12.9-అంగుళాల 1వ తరం ఐపాడ్ ప్రోలను వినియోగిస్తున్న యూజర్లు తమ పరికరాలను ఐఓఎస్, ఐపాడ్ఓస్ వెర్షన్లు 16.7.7 లేదా తర్వాతి వెర్షన్లకు అప్డేట్ చేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు చెబుతున్నారు. -
యాపిల్ కొత్త ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలా..?
ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ యాపిల్ కొత్త ఆవిష్కరణలు తీసుకురావడానికి సిద్ధమైంది. ఏటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే యాపిల్ వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్(WWDC) తేదీలను ప్రకటించింది. ఈ కార్యక్రమంలో వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తీసుకురానున్న కొత్త సాఫ్ట్వేర్ ఫీచర్లు, ఉత్పత్తుల గురించి యూజర్లకు పరిచయం చేస్తుంటుంది. ఈ ఏడాది కాన్ఫరెన్స్ను వర్చువల్ వేదికగా జూన్ 10 నుంచి జూన్14 వరకు నిర్వహించనున్నట్లు కంపెనీ తెలిపింది. ప్రస్తుత టెక్ ప్రపంచంలో ఏఐ హవా అంతాఇంతా కాదు. ఈ నేపథ్యంలో యాపిల్ తీసుకురానున్న సాఫ్ట్వేర్ అప్డేట్లలో ఏఐ ఫీచర్లను జోడించే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. క్లౌడ్ ఆధారిత జనరేటివ్ ఏఐ ఫీచర్ను తీసుకొచ్చేందుకు గూగుల్, బైదూ.. వంటి ఏఐ సంస్థలతో భాగస్వామ్యం గురించి సమాచారం అందొచ్చని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి. ఇక iOS 18, iPadOS 18, macOS 15, watchOS 11, tvOS 18లో కొత్త ఆపరేటింగ్ సిస్టమ్స్ (OS) వివరాలను పరిచయం చేస్తారని తెలిసింది. ఐపాడ్ ఎయిర్, ఓఎల్ఈడీ ఐపాడ్ ప్రోలో కొత్త మోడల్స్ను లాంచ్ చేసే అవకాశం ఉందని అంచనా. యాపిల్ నిర్వహించనున్న కాన్ఫరెన్స్ ఆన్లైన్ అయినప్పటికీ మొదటి రోజు వ్యక్తిగతంగా వెళ్లి హాజరయ్యే అవకాశం ఉందని సంస్థ తెలిపింది. ఆసక్తి ఉన్న వాళ్లు యాపిల్ డెవలపర్ యాప్, కంపెనీ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఇదీ చదవండి: ఐటీ చెల్లింపులపై క్లారిటీ ఇచ్చిన కేంద్రం -
లిక్కర్ స్కాం కేసులో ఈడీ దూకుడు..
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. మద్యం పాలసీ కేసుకు సంబంధించి మరిన్ని ఆధారాల్ని సేకరించేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా సీఎం కేజ్రీవాల్ ఉపయోగించిన ఐఫోన్ను పరిశీలించనుంది. ఇందుకోసం ఐఫోన్ లాక్ను ఓపెన్ చేయించుందుకు ఈడీ అధికారులు ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ కంపెనీని ఆశ్రయించనున్నారు. పలు నివేదికల ప్రకారం.. లిక్కర్ కేసు విచారణ నిమిత్తం ఈడీ అధికారులు సీఎం కేజ్రీవాల్ వ్యక్తిగత ల్యాప్ట్యాప్, డెస్క్ట్యాప్లను స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు మరో నాలుగు ఫోన్లను జప్తు చేశారు. ఆ సమయంలో ఫోన్లు స్విచ్ఛాప్ చేసి ఉన్నాయి. అయితే విచారణ సమయంలో ఆ ఫోన్ల పాస్వర్డ్లను చెప్పేందుకు కేజ్రీవాల్ ఒప్పుకోలేదు. దీంతో ఈడీ అధికారులు కేజ్రీవాల్ ఫోన్ లాక్లను ఓపెన్ చేయించేందుకు యాపిల్ సంస్థను సంప్రదించనున్నట్లు సమాచారం. విచారణకు సహకరించని కేజ్రీవాల్ గత గురువారం కేజ్రీవాల్ కస్టడీని పొడిగించాలని ఈడీ ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టును కోరింది. తమ రిమాండ్లో ఉన్న కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపింది. ‘కేజ్రీవాల్ నుండి రికవరీ చేసిన మొబైల్ ఫోన్ పాస్వర్డ్ను వెల్లడించలేదు. అతను సహకరించకపోతే, మేం ఆ ఫోన్లను (సాంకేతికంగా) తెరవాల్సి ఉంటుంది. మేం అడిగిన ప్రశ్నలకు నేరుగా సమాధానం ఇవ్వడం లేదు. కాబట్టి, కేజ్రీవాల్ రిమాండ్ పొడిగించాలని కోర్టును కోరింది. దీంతో కోర్టు ఏప్రిల్ 1వరకు పొడిగించింది. రేపటితో కేజ్రీవాల్ ఈడీ రిమాండ్ ముగియనుంది. కేజ్రీవాల్ ఐఫోన్ చుట్టూ దర్యాప్తు ఈలోపే కేజ్రీవాల్ మద్యం పాలసీ కేసుకు సంబంధించి ఆధారాల్ని సేకరించేందుకు ఈడీ సిద్ధమైంది. కేజ్రీవాల్ ఐఫోన్ పాస్వర్డ్లను ఓపెన్ చేసి ఆధారాల్ని సేకరించేందుకు యాపిల్ సంస్థను ఆశ్రయించింది. ఫోన్లో ఆప్ ‘ఎన్నికల వ్యూహం’ ఎన్నికలకు ముందు పొత్తుల వివరాలను ఈడీ గోప్యంగా ఉంచనుంది. -
రిపేరుకే రెండు లక్షలు..! అసలు ఈ యాపిల్ ప్రొడక్ట్ ధర ఎంతుంటుంది..?
-
ఆపిల్ సైడర్ వెనిగర్ వాడుతున్నారా? ఈ జాగ్రత్తలు మస్ట్!
బరువు తగ్గడం నుంచి చర్మం, జుట్టు సంరక్షణ దాకా ఆపిల్ సైడర్ వెనిగర్ ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పచ్చళ్లు, మెరినేడ్స్ లాంటి వాటిల్లో కూడా విరివిగా వాడతారు. అయితే దీనిని తరచుగా ఉపయోగించడం మంచిదేనా? దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆపిల్ సైడర్ వెనిగర్(ACV) ఆపిల్ జ్యూస్ ఈస్ట్తో కలిపి పులియబెట్టి తయారు చేస్తారు. ఎక్కువగా డ్రెస్సింగ్, మెరినేడ్స్, పచ్చళ్ళలో వాడతారు. యాపిల్ సైడర్ వెనిగర్లో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. చర్మం, జుట్టు సంరక్షణ కోసం ఉపయోగిస్తారు.అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల దుష్ర్పభావాలు కూడా ఉన్నాయి. ఆపిల్ సైడర్ వెనిగర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల చర్మంపై దద్దుర్లు, చికాకు కలుగుతాయి. అందుకే దీని ఉపయోగించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోవాలి. ఈస్ట్ ఆపిల్లోని చక్కెరను ఆల్కహాల్గా మారుస్తుంది. ఇది జీర్ణక్రియను ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మధుమేహంతో బాధపడేవారికి సమస్యలొస్తాయి. అలాగే గ్యాస్ట్రోపరేసిస్తో బాధపడేవారిలో కడుపులోని నరాలు సరిగ్గా పనిచేయవు. గ్యాస్ట్రోపరేసిస్ (గుండెల్లో మంట, ఉబ్బరం వికారం) లక్షణాలు, టైప్-1డయాబెటీస్, ఇన్సులిన్ తీసుకునేవారిలో జీర్ణం ఆలస్యమవుతుంది కొన్ని మూత్రవిసర్జన మందులు, మధుమేహం మందులు, డిగోక్సిన్ ఇన్సులిన్-స్టిమ్యులేటింగ్ మందులు వాడేవారికి ఆపిల్ సైడర్ వెనిగర్తో రియాక్షన్ రావచ్చు. సుదీర్ఘ కాలం పాటు దీన్ని తీసుకుంటే బ్లడ్లో పొటాషియం స్థాయిలు ప్రభావితవుతాయి. తద్వారా ఎముకల బలహీనత రావచ్చు. దీంట్లోని ఎసిడిక్ యాసిడ్ మూలంగా పళ్ల ఎనామిల్ పాడయ్యే అవకాశం. పిల్లల్లో గొంతుమంట వచ్చే అవకాశం. తలపై ఆపిల్ సైడర్ వెనిగర్ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల కూడా సమస్యలు వస్తాయి. ఆపిల్ సైడర్ వెనిగర్( తరచుగా వాడటం వల్ల నల్లటి జుట్టు వాడిపోతుంది స్కాల్ప్ ఇన్ఫ్లమేషన్ పెరగవచ్చు. ఈ నేపథ్యంలో చర్మం లేదా జుట్టుకు వాడేటపుడు మోతాదు నియంత్రణ పాటించాలి. ఒక గ్లాసు నీటిలో 1 టీస్పూన్ కంటే ఎక్కువ ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించ కూడదు. రోజుకు గరిష్టంగా 2 టేబుల్ స్పూన్లు (30 ఎంఎల్) మించ కూడదు. దీనికి అలర్జీలు సాధారణంగా రావు. ఒకవేళ వస్తే మాత్రం వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. -
ఉద్యోగులను తొలగించనున్న ప్రపంచ నం1 కంపెనీ.. కారణం..
ప్రపంచ నంబర్1 కంపెనీ యాపిల్ తయారుచేస్తున్న ఐఫోన్లు, వాచ్లకు ఉన్న క్రేజ్ తెలిసిందే. అలాంటి విలువైన కంపెనీలో ఉద్యోగం అంటే ఇక వేరే చెప్పనక్కర్లేదు. కానీ, యాపిల్ తన ఖర్చులు తగ్గించుకునేందుకు ఉద్యోగులను తొలగిస్తోందని వార్తలొస్తున్నాయి. యాపిల్ సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మూసేయాలని నిర్ణయానికి వచ్చినట్లు కొన్ని మీడియా కథనాల ద్వారా తెలిసింది. మీడియా కథనాల ప్రకారం.. యాపిల్ స్మార్ట్ వాచ్ డిస్ప్లే డిజైనింగ్ అండ్ డెవలపింగ్ ప్రాజెక్టును మూసేయనుంది. దాంతో కంపెనీ ఆ ప్రాజెక్టులో పని చేస్తున్న ఉద్యోగులకు లేఆఫ్లు ఇవ్వబోతుంది. కొంత కాలం క్రితమే మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్ల తయారీని కంపెనీ నిలిపేసింది. మైక్రో ఎల్ఈడీ టెక్నాలజీతో కూడిన స్క్రీన్లు, విజువల్స్ ఎంతో మెరుగ్గా ఉండటంతో అందరూ ‘యాపిల్ వాచ్’ కొనుగోలు చేస్తున్నారు. అయితే, డిస్ ప్లే తయారీ ఖర్చు ఎక్కువ కావడంతో యాపిల్ తన డిస్ ప్లే ఇంజినీరింగ్ టీంలో మార్పులు చేయనుందని సమాచారం. ఈ నేపథ్యంలో అమెరికా, ఆసియా ఖండాల్లోని ఆపిల్ యూనిట్లలో డజన్ల కొద్దీ ఉద్యోగులను తొలగించనుంది. అయితే సరిగ్గా ఎంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నారనే దానిపై కంపెనీ ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. డిస్ప్లే డెవలప్మెంట్ ప్రాజెక్టును మూసేయడానికి ముందే ఉద్యోగులను ఇతర ప్రాజెక్టులు, కంపెనీల్లో తమకు వీలైన కొలువు వెతుక్కునేందుకు సంస్థ అనుమతి ఇచ్చినట్లు తెలిసింది. కానీ అందరికీ ఆ అవకాశం ఉండదు కాబట్టి మిగతా వారిని ఇంటికి సాగనంపేందుకు కంపెనీ సిద్ధమైనట్లు మీడియా కథనాల సారాంశం. ‘టైటన్’ను పక్కన పెట్టిన యాపిల్ యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించిందని ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికినట్లైంది. ఇదీ చదవండి: భారత్లో భారీ నిక్షేపాలు.. తేలిగ్గా, దృఢంగా మార్చే ధాతువు గతేడాది భారీగా లేఆఫ్స్ లు ప్రకటించిన టెక్ కంపెనీలు..2024లో కూడా అదే పరంపర కొనసాగిస్తున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే 50 వేల మంది ఉద్యోగులను తొలగించాయి. కంపెనీ పునర్వవస్థీకరణ, ఖర్చుల తగ్గింపు, అప్డేటెడ్ టెక్నాలజీ వినియోగం, కొత్త వ్యాపారంలోకి ప్రవేశించడం వంటి కారణాలతో ప్రపంచవ్యాప్తంగా సాఫ్ట్ వేర్, హెల్త్ రంగంలోని కంపెనీలు ఉద్యోగులపై వేటువేస్తున్నాయి. -
ఇప్పటికీ తన విధానమే పాటిస్తున్నాం..: బిల్గేట్స్
యాపిల్ సహ వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో స్టీవ్ జాబ్స్కు టెక్ ప్రపంచంలో ఎల్లప్పుడూ ప్రత్యేకస్థానం ఉంటుంది. కంపెనీ సమావేశాలు ఏర్పాటు చేసినా, కొత్త ఉత్పత్తులు విడుదలైనా ఆయన చేసే ప్రసంగం, తన వ్యవహారశైలి అందరినీ కట్టిపడేసేది. తాజాగా ఇదే విషయాన్ని మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ వెల్లడించారు. బహిరంగ వేదికలపై స్టీవ్ జాబ్స్లా తాను వ్యవహరించలేనని, ఆయన చాలా సహజంగా ప్రవర్తిస్తూ ఎదుటి వారిని తన మాటలతో ఆకట్లుకునేవారని గేట్స్ ఓ పాడ్కాస్ట్లో తెలిపారు. ఈ సందర్భంగా బిల్గేట్స్ మాట్లాడుతూ.. ‘స్టీవ్ జాబ్స్ చాలా సహజంగా ఉంటారు. స్టేజ్పై మాట్లాడటానికి ముందు ఆయన రిహార్సల్స్ చూడటం ఎంతో సరదాగా ఉంటుంది. కొన్నిసార్లు వేదికపై మాట్లాడుతుంటే అప్పటికప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకున్నట్లు అనిపిస్తుంది. ఆ స్థాయిని నేను ఎప్పటికీ అందుకోలేను. మైక్రోసాఫ్ట్ ప్రారంభించిన తొలి నాళ్లలో వాటి ఉత్పత్తుల గురించి వివిధ రకాల వ్యక్తులకు వివరించడమే కీలక ప్రక్రియగా ఉండేది. విద్య, వైద్యం, ఏఐకి సంబంధించి మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల గురించి అభిప్రాయ సేకరణ కోసం ఇప్పటికీ కొన్నిసార్లు స్టీవ్ జాబ్స్ అనుసరించే కమ్యూనికేషన్ విధానాన్నే పాటిస్తున్నాం’ అని చెప్పారు. కంపెనీకి సంబంధించి నూతన ఉత్పత్తుల విడుదలతో పాటు, ఇతర సమావేశాల్లో ప్రసంగించేందుకు స్టీవ్ చాలా రోజుల ముందు నుంచి సిద్ధమయ్యేవారట. ఈ విషయాన్ని 2015లో విడుదలైన ‘బికమింగ్ స్టీవ్ జాబ్స్’ అనే పుస్తకంలో రచయితలు బ్రెంట్ ష్లెండర్, రిక్ టెట్జెలీలు వెల్లడించారు. తామా గతంలో ఒక రోజంతా స్టీవ్ జాబ్స్తో ఉన్నామని పుస్తకంలో తెలిపారు. ఇదీ చదవండి: క్రెడిట్ కార్డులు వాడుతున్నారా..? కీలక మార్పులు చేసిన బ్యాంకులు చిన్న ప్రజెంటేషన్ కోసం ఆయన ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని, స్లైడ్స్కు ఎలాంటి రంగులు వాడాలి? స్టేజ్పై తన వ్యవహారశైలి ఎలా ఉండాలి? ఎక్కడ స్పాట్ లైట్ పడాలి? ఇలా ప్రతి విషయంలో ఎంతో ప్రణాళికతో వ్యవహరించేవారని వివరించారు. -
సలాడ్స్ తయారీలో ఇబ్బందా..? ఇక స్లైస్ డివైస్తో క్లియర్..!
ఆరోగ్యాన్నిచ్చే ఆహారంలో సలాడ్స్ ముందువరుసలో ఉంటాయి. కానీ సలాడ్స్ను తయారు చేసుకోవడమంటేనే బద్ధకమా? అయితే వెంటనే ఈ స్లైస్ డివైస్ని తెచ్చుకోండి. ఏ పండునైనా ఒకే ఒక్క నిమిషంలో స్లైసెస్గా చేసిపెడుతుంది. ఉడికించిన గుడ్లు, యాపిల్, బనానా వంటి పండ్లనైతే ఒకేసారి ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. అందుకు వీలుగా మధ్యలో ఒక వైపు మందంగా ఉండే స్టెయిన్లెస్ స్టీల్ డివైడర్ స్టాండ్ అమర్చి ఉంటుంది. దాని సాయంతో పండ్లను ముక్కలుగా కట్ చేసుకోవచ్చు. మరోవైపు కూడా అదేమాదిరి మరో షేప్లో డివైడర్ ఉంటుంది. దీన్ని వినియోగించుకోవడం.. క్లీన్ చేసుకోవడం రెండూ సులభమే. కిచెన్లో చిన్న ప్లేస్లో కూడా దీన్ని సర్దొచ్చు. స్థలం పెద్దగా ఆక్రమించదు. దీని ధర 7 డాలర్లు (రూ.580). ఇవి చదవండి: ఆటోమేటిక్ ప్రెజర్ సర్ఫేస్ మెషిన్ -
యాపిల్ కార్ల తయారీ లేనట్టేనా..?
ప్రపంచవ్యాప్తంగా ఆటోమొబైల్ రంగంలో ఎలక్ట్రిక్ కార్లతో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అందుకు అనుగుణంగా పలు దిగ్గజ ఆటోమొబైల్ సంస్థలతో పాటు స్మార్ట్ ఫోన్ కంపెనీలు సైతం ఎలక్ట్రిక్ కార్లను తయారు చేసే పనిలో పడ్డాయి. యాపిల్, షావోమీ వంటి ప్రముఖ మొబైల్ పోన్ తయారీ కంపెనీలు సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను తయారుచేస్తున్నాయనే వార్తలు ఇప్పటివరకు వచ్చాయి. అయితే తాజాగా యాపిల్ కంపెనీ తాను తయారుచేస్తున్న కార్లకు సంబంధించిన కీలక ప్రకటన చేసింది. యాపిల్ తన ప్రతిష్టాత్మకమైన కారు ప్రాజెక్టును ఎట్టకేలకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అటానమస్ డ్రైవింగ్ సామర్థ్యం కలిగిన కారు విడుదల ప్రణాళికలను యాపిల్ పక్కన పెట్టింది. ఈ మేరకు గత దశాబ్దకాలంగా ‘టైటన్’ పేరిట పనిచేస్తున్న రహస్య ప్రాజెక్టుకు స్వస్తి పలికింది. ఈ విషయాన్ని అంతర్గత సమావేశంలో ఉద్యోగులకు ఇటీవల కంపెనీ తెలియజేసింది. ఈ విషయంపై ఇప్పటి వరకు యాపిల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ప్రాజెక్టులో పనిచేసిన సిబ్బందిని యాపిల్ ఇతర బాధ్యతల్లోకి బదిలీ చేయనుంది. వీరిలో మెజారిటీ సభ్యులు కృత్రిమ మేధ విభాగానికి పనిచేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ 2014 నుంచి ఈ ప్రాజెక్టుపై పనిచేస్తోంది. కానీ, ఇప్పటి వరకు కారు ఎలా ఉంటుందో వెల్లడించలేదు. కానీ, సిలికాన్ వ్యాలీ రోడ్లపై దాన్ని పరీక్షించినట్లు పలుసార్లు వార్తలు వచ్చాయి. యాపిల్ వంటి సంస్థ ఇలాంటి కీలక ప్రాజెక్టును పక్కన పెట్టడంపై టెక్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యాపిల్ కొత్త ఆవిష్కరణల్లో వెనకబడిందనే వాదన టెక్ వర్గాల్లో కొంతకాలంగా వినిపిస్తోంది. ఐఫోన్లలోనూ పెద్దగా మార్పులేమీ ఉండట్లేదనే విమర్శలు ఉన్నాయి. టిమ్కుక్ సారథ్యంలో కంపెనీ చెప్పుకోదగ్గ స్థాయిలో కొత్త ఉత్పత్తులను తీసుకురాలేదనే విశ్లేషణలు వెలువడుతున్నాయి. గత ఐదు సంవత్సరాల్లో కంపెనీ పరిశోధన, అభివృద్ధిపై బిలియన్ డాలర్లు వెచ్చించినట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్.. ఇకపై ఆ కష్టం తీరినట్టే.. 2014లో యాపిల్ ఈ ‘ప్రాజెక్ట్ టైటాన్’ను తీసుకొచ్చింది. కానీ అంతర్గత కలహాలు, నాయకత్వ లోపాల కారణంగా యాపిల్కు ఎలక్ట్రిక్ కార్లను తయారు చేయడం సాధ్యం కాలేదు. అందుకే 2016లో కార్ల తయారీకి స్వస్తి చెప్పింది. 2020లో మరోసారి ఎలక్ట్రిక్ కార్లను తయారు చేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 2022లో యాపిల్ సంస్థ సెల్ఫ్ డ్రైవింగ్ కార్లను వాహనదారులకు పరిచయం చేయనున్నట్లు మరోసారి తెలిపింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. -
ఐఫోన్ పోగొట్టుకున్నారా? ..సుప్రీం కోర్టు కీలక తీర్పు!
దొంగతనాలకు గురైన ఐఫోన్లకు సంబంధించి భారత సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ తీర్పులో కస్టమర్లు పోగొట్టుకున్న ఐఫోన్లను కనుగొనడంలో యాపిల్ ఇండియా బాధ్యతకు సంబంధించిన కీలక సమస్యను దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రస్తావించింది. యాపిల్ సంస్థకు వ్యతిరేకంగా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ ఇచ్చిన ఆదేశాలను రద్దు చేస్తూ తస్కరణకు గురైన ఐఫోన్లను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేసే బాధ్యత యాపిల్ కంపెనీకి లేదని అత్యున్నత న్యాయస్థానం పేర్కొందని లైవ్ లా అనే వార్తా సంస్థ నివేదించింది. వినియోగదారుల కమిషన్ ఆదేశాలపై యాపిల్ ఇండియా దాఖలు చేసిన అప్పీల్ను న్యాయమూర్తులు విక్రమ్ నాథ్, సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం విచారించింది. థెఫ్ట్ ఇన్సూరెన్స్తో ఐఫోన్ను కొనుగోలు చేసిన వినియోగదారుడు తన ఫోన్ చోరీకి గురైనట్లు పోలీసులకు, యాపిల్ ఇండియాకు ఫిర్యాదు చేయడంతో ఈ కేసు ప్రారంభమైంది. అయితే పోయిన ఐఫోన్ను ట్రాక్ చేయడానికి ఆపిల్ ఇండియా ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో వినియోగదారుడు ఫిర్యాదు దాఖలు చేయడంతో జిల్లా వినియోగదారుల ఫోరమ్ బాధితుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ నిర్ణయంపై యాపిల్ ఇండియా ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్కు అప్పీల్ చేసింది. దొంగతనానికి గురైన ఫోన్ను ప్రత్యేక గుర్తింపు సంఖ్యలతో ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఐఫోన్ తయారీదారుగా యాపిల్ ఇండియాకు ఉందని ఒడిశా స్టేట్ కన్స్యూమర్ కమిషన్ తీర్పు పేర్కొంది. ఈ తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ యాపిల్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ఒడిశా రాష్ట్ర వినియోగదారుల కమిషన్ ఆదేశాన్ని అన్యాయమని పేర్కొంటూ దానిని తోసిపుచ్చింది. అయితే బాధితుడికి యాపిల్ ఇండియా పరిహారాన్ని పరిగణనలోకి తీసుకుంటూనే దొంగతనానికి గురై ఫోన్లను కనుగొనవలసిందిగా ఆపిల్ ఇండియాను కోరడం అసమంజసమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
యాపిల్, గూగుల్ ప్లేస్టోర్కు పోటీగా ఫోన్పే యాప్ స్టోర్..? ప్రత్యేకతలివే..
భారత డిజిటల్ ప్రయాణంలో సరికొత్త అధ్యాయానికి ఫిన్టెక్ కంపెనీ ఫోన్పే తెరతీసింది. తాజాగా ఫోన్పే ఇండస్ యాప్స్టోర్ను దిల్లీ వేదికగా బుధవారం ఆవిష్కరించింది. 45 విభాగాల్లో 2 లక్షలకుపైగా యాప్స్, గేమ్స్ను ఈ యాప్స్టోర్లో పొందుపరిచింది. తెలుగు, ఇంగ్లిష్, హిందీ సహా 12 భాషల్లో వినియోగదారులు తమకు కావాల్సిన యాప్స్ను ఇందులో సర్చ్ చేయవచ్చు. ఇన్-యాప్ కొనుగోళ్లపై గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్స్టోర్లు 15-30% వరకు ఫీజు వసూలు చేస్తున్నాయి. అయితే డెవలపర్లు 2025 ఏప్రిల్ 1 వరకు యాప్ లిస్టింగ్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. తర్వాత ఇన్–యాప్ బిల్లింగ్ కోసం తమకు నచ్చిన థర్డ్పార్టీ పేమెంట్ గేట్వేను ఎంచుకునే వెసులుబాటును తీసుకొచ్చారు. ఫోన్పే యాప్ లేదా ఇండస్యాప్స్టోర్.కామ్ నుంచి ఇండస్ యాప్స్టోర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ‘మొబైల్ యాప్ మార్కెట్లో మరింత పోటీకి ఈ యాప్స్టోర్ నాంది పలికింది. ఇది మరింత శక్తివంతమైన భారతీయ డిజిటల్ పర్యావరణ వ్యవస్థను రూపొందించడంలో సహాయపడుతుంది’ అని ఫోన్పే సీఈవో, ఫౌండర్ సమీర్ నిగమ్ తెలిపారు. ఇదీ చదవండి: పూర్తి మహిళా సిబ్బందితో కార్యకలాపాలు.. ఎక్కడో తెలుసా.. ఇ-మెయిల్ ఖాతాతో సంబంధం లేకుండా మొబైల్ నంబర్తో లాగిన్ అయ్యే విధానాన్ని ఈ యాప్ స్టోర్ తీసుకొచ్చింది. ఇప్పటికే నోకియా, లావా వంటి కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. 2023లో మొబైల్ యాప్లపై 1.19 లక్షల కోట్ల గంటలను భారతీయులు గడిపినట్లు కొన్ని సర్వేల ద్వారా తెలిసింది. 2021లో నమోదైన 95,400 కోట్ల గంటలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. యాప్ల డౌన్లోడ్ల విషయంలో ప్రపంచంలోనే మనదేశం అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. -
ఐఫోన్ నీళ్లలో పడిందా.. ఈ ఒక్కటి చేయండి - యాపిల్ సలహా
మనం రోజు ఉపయోగించే స్మార్ట్ఫోన్ నీటిలో పడినప్పుడు చాలామంది చేసేపని దాన్ని తీసి వెంటనే తుడిచి ఓ బియ్యం సంచిలోనో లేక డబ్బాలోనో ఉంచి, కొంత సమయం వేచి ఉన్న తరువాత దానికి మళ్ళీ ఛార్జింగ్ పెడతారు. అయితే ఈ విధానం 'ఐఫోన్'ల విషయంలో అమలు చేయకూడదని యాపిల్ కంపెనీ పేర్కొంది. ఐఫోన్ నీళ్లలో పడితే దాన్ని బియ్యం సంచిలో ఉంచకూడదని, అలా చేస్తే బియ్యంలో ఉండే సూక్ష్మ రేణువులు ఫోన్లోకి చేసే అవకాశం ఉంది, తద్వారా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంటుందని యాపిల్ కంపెనీ పేర్కొంది. నీళ్లలో ఐఫోన్ పడితే దాన్ని దానిలోకి చేరిన నీటిని మెల్లగా బయటకు తీయడానికి కిందివైపు ఉన్న డివైజును నెమ్మదిగా/సున్నితంగా కొట్టాలి. ఆ తరువాత గాలి వీచే ప్రదేశంలో ఉంచాలి. ఓ అరగంట తరువాత కేబుల్తో ఛార్జ్ చేయాలి. ఇదీ చదవండి: కంటెంట్ క్రియేటర్ల కోసం బెస్ట్ ల్యాప్టాప్స్ ఇవే! ధరలు ఎలా ఉన్నాయంటే? నిజానికి ఫోన్లోకి చేరిన నీరు బయటకు రావడానికి ఒక రోజు సమయం కూడా పట్టొచ్చు. దీనిని లిక్విడ్ డిటెక్షన్ అలర్ట్ సాయంతో ఫోన్ పరిస్థితిని తెలుసుకోవచ్చు. ఇంకా ఏదైనా అనుమానం ఉంటే దాన్ని యాపిల్ అధీకృత సర్వీస్ ప్రొవైడర్ వద్దకు తీసుకెళ్లాలని సంస్థ సూచించింది. -
లాంచ్కు ముందే ఐఫోన్ 16 వివరాలు లీక్!
యాపిల్ కంపెనీ ఎప్పటికప్పుడు మార్కెట్లో కొత్త ఉత్పత్తులను లాంచ్ చేస్తూనే ఉంది. ఇందులో భాగంగానే కంపెనీ త్వరలో ఐఫోన్ 16 సిరీస్ లాంచ్ చేయడానికి సిద్ధమవుతోంది. ఈ ఫోన్ లాంచ్ కావడానికి ముందే.. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. ఇప్పటి వరకు లీక్ అయిన వివరాల ప్రకారం, ఐఫోన్ 16 సిరీస్ మొత్తం 5 వేరియంట్లలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని సమాచారం. వీటి ధరలు రూ.58 వేలు నుంచి రూ.91 వరకు ఉండవచ్చని తెలుస్తోంది. ఇవి ఖచ్చితమైన ధరలు కాదు, కంపెనీ ఈ ఐఫోన్ 16 లాంచ్ చేసే సమయంలో అధికారిక ధరలను వెల్లడిస్తుంది. ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఉన్న ఇతర మోడల్స్ కంటే కూడా ఎక్కువ అప్డేట్స్ పొందుతుందని, కొత్త వేరియంట్స్ కూడా అందుబాటులో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. వీటిలో 6.1 ఇంచెస్, 6.7 ఇంచెస్ డిస్ప్లేలు ఉంటాయని సమాచారం. కొత్త ఐఫోన్ 16లో సింగిల్ పిల్ షేప్లో కెమెరా ఉండే అవకాశం ఉంది. ఇవన్నీ ఎంతవరకు వాస్తవమని విషయం తెలియాల్సి ఉంది. డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా దాని మునుపటి మోడల్స్ కంటే అద్భుతంగా ఉంటుందని భావించవచ్చు. అయితే ఇందులో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయనేది అధికారికంగా తెలియాల్సి ఉంది. కంపెనీ ఈ ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లను ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో లాంచ్ చేసే అవకాశం ఉంది.