సానుకూల ధోరణితో విధులను స్వీకరించాలి | Tasks Should Be Adopted With A Positive Attitude Says DGP Mahender Reddy | Sakshi
Sakshi News home page

సానుకూల ధోరణితో విధులను స్వీకరించాలి

Published Thu, Jan 30 2020 2:57 AM | Last Updated on Thu, Jan 30 2020 2:58 AM

Tasks Should Be Adopted With A Positive Attitude Says DGP Mahender Reddy - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగరీత్యా నిర్వర్తించే ప్రతీ పనిని సానుకూల ధోరణితో స్వీకరించినప్పుడే పోలీసుల విధి నిర్వహణకు సార్థకత చేకూరుతుందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో (టీఎస్‌పీఏ) బుధవారం జరిగిన ట్రైనీ ఇన్‌స్పెక్టర్లు, ఏఎస్‌ఐల శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ.. సమాజంలోని ప్రతి వ్యక్తి ఆత్మగౌరవం దెబ్బతినకుండా విధులు నిర్వహించాలని పేర్కొన్నారు. చట్టాలకు లోబడి ధనిక, పేద తేడా లేకుండా సేవలను అందించాలని పోలీసు అధికారులకు సూచించారు. మన అధికారాలు సామాన్య ప్రజల సేవలకు ఉపయోగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో లా అండ్‌ ఆర్డర్‌ అడిషనల్‌ డీజీ జితేందర్, పోలీస్‌ అకాడమీ డైరెక్టర్‌ వీకే సింగ్, అకాడమీ జాయింట్‌ డైరెక్టర్‌ కె.రమేష్‌ నాయుడు, డిప్యూటీ డైరెక్టర్‌ బి.నవీన్‌ కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement