Munugode By Polls: Harish Rao Comments On Kishan Reddy And Bandi Sanjay - Sakshi
Sakshi News home page

Minister Harish Rao: మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు కన్ఫర్మ్

Published Mon, Oct 31 2022 11:52 AM | Last Updated on Mon, Oct 31 2022 3:02 PM

Minister Harish Rao Comments On Kishan Reddy And Bandi Sanjay - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: బీజేపీ నేతలు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ చెప్పేవన్నీ అబద్ధాలేనని మంత్రి హరీష్‌రావు మండిపడ్డారు. సోమవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అబద్ధాలు చెప్పడం బీజేపీ డీఎన్‌ఏగా మారిందని దుయ్యబట్టారు.
చదవండి: Hyderabad: ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఆ రూట్లలో వెళ్లొద్దు.. ఇదిగో ఇలా వెళ్లండి..

‘‘ప్రజలపై భారం మోపిందెవరో ప్రజలకు తెలుసు. దొడ్డిదారిన ప్రభుత్వాలను కూలగొట్టిన చరిత్ర బీజేపీది. రాజ్యసభ ఎంపీలను బీజేపీ విలీనం చేసుకోలేదా?. కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ గోబెల్స్‌ ప్రచారం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నిన్నటి సీఎం కేసీఆర్ సభ తర్వాత మునుగోడులో టీఆర్‌ఎస్‌ గెలుపు కన్ఫర్మ్ అయిందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement