-
దేశ సమైక్యతకు బీజేపీ పనిచేస్తుంది
సాక్షి, హైదరాబాద్: దేశంలో సమగ్రత, సమైక్యత కోసం భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చిన ప్రమాదకరమైన ఆర్టికల్ 370ని విభేదించిన డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ అప్పట్లో కేంద్రమంత్రి పదవి కి రాజీనామా చేశారని, తర్వాత భారతీయ జనసంఘ్ పేరుతో రాజకీయ పార్టీ పెట్టి ఆర్టికల్ 370కి వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టారని వివరించారు. దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించుకునేందుకు బలిదానం చేసిన చరిత్ర జనసంఘ్దన్నారు.శ్యామ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా బలిదాన్ దివస్ను పురస్కరించుకుని ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన చిత్రపటం వద్ద కిషన్రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఒకే దేశంలో రెండు రాజ్యాంగాలు, ఇద్దరు ప్రధానులు, రెండు జాతీయ చిహ్నా లు ఉండకూడదనే నినాదంతో ఆర్టికల్ 370 రద్దు కోసం ముఖర్జీ ఉద్యమించారని, అప్పట్లో దేశంలో జాతీయ జెండాగా త్రివర్ణ పతాకం ఉంటే, జమ్మూ కశ్మీర్కు ప్రత్యేక జెండా ఉండేదన్నారు.75 ఏళ్ల తర్వాత దేశంలో ప్రధాని మోదీ నాయకత్వంలో ముఖర్జీ లక్ష్యం నెరవేరిందన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి జమ్మూకశ్మీర్లో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నామన్నారు. బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షు డాక్టర్ కె.లక్ష్మణ్, ఇతర నేతలు పొంగులేటి సుధాకర్రెడ్డి, డాక్టర్ విజయ రామారావు, యెండల లక్ష్మీనారాయణ, చంద్రశేఖర్ తివారీ, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, డాక్టర్ కాసం వెంకటేశ్వర్లు, ఆకుల విజయ తదితరులు ఈ కార్యక్రమంలో శ్యామప్రసాద్ ముఖర్జీకి నివాళులర్పించారు. -
సింగరేణి ప్రైవేటీకరణ శుద్ధ అబద్ధం
-
సింగరేణిలో ఆర్థిక విధ్వంసంపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి సంస్థలో జరిగిన ఆర్థిక విధ్వంసం, దోపిడీల పై విచారణ జరిపించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర బొగ్గు, గనులశాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా సీఎస్ఆర్ ఫండ్స్ విని యోగం, సింగరేణి సంస్థ ద్వారా పలువురి విలాసా లకు చెల్లించిన బిల్లులు, ఇతర అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని అన్నారు. ఈ సంస్థలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నందున, దీనిపై విచారణ జరిపించాలని కోరుతూ బొగ్గు గనుల శాఖ మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాస్తానన్నారు. శనివారం మాజీ ఎంపీ పి.రాములు, మాజీ ఎమ్మెల్యే ప్రేంసింగ్ రాథోడ్, పార్టీ నాయ కులు ప్రదీప్కుమార్, కాసం వెంకటేశ్వర్లు, ఎస్. ప్రకాష్రెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు.గోదావరి తీర ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే‘సింగరేణికి సంబంధించిన పరిపాలన అంతా రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నందున కేంద్రం జోక్యం చేసుకోలేక పోయింది. బొగ్గు, సహజ వనరుల విషయంలో, సుప్రీంకోర్టు తీర్పు విషయంలో కేంద్రం ఓ రిఫరీగా విధివిధానాలు, పారదర్శకత తదితర అంశాలపైనే దృష్టి పెట్టగలదు. ఈ శాఖ మంత్రిగా నాకు కేవలం ఆరు రోజుల అనుభవమే ఉంది. సింగరేణిపై త్వరలోనే సమీక్ష నిర్వహించి సమస్యలపై సానుకూలంగా స్పందిస్తా.సింగరేణిని ప్రైవేటీకరిస్తామనడం శుద్ధ అబద్ధం. తప్పుడు ప్రచా రాలను నమ్మొద్దు. లోక్సభ ఎన్నికల్లో ఓటమితో నిరాశా, నిస్పృహలకు గురైన బీఆర్ఎస్ నేతలు ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారు. బొగ్గు ఉత్పత్తిని పెంచుకునేలా, ఉపాధి అవకాశాలను మరింత పెంచేలా చర్యలు తీసుకుంటాం. తెలంగాణలో గోదా వరి పరీవాహక ప్రాంతాల్లో జియోలాజికల్ సర్వే జరుపుతాం. ఈ దిశలో ఇప్పటికే హైదరాబాద్లోని సర్వే ఆఫ్ ఇండియాతో ప్రాథమిక చర్చలు జరిపాం’ అని కిషన్రెడ్డి తెలిపారు.పారదర్శకంగా బొగ్గు గనుల వేలం‘సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా అవినీతికి తావులేకుండా, పారదర్శకంగా కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేస్తోంది. ఇప్పటివరకు 9 రౌండ్లలో 107 బొగ్గు గనుల వేలం జరిగింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలకు సుమారు రూ.37 వేల కోట్ల ఆదాయం వచ్చింది. బొగ్గు గనుల వేలంతో 14 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదాయం లభిస్తుంది. ఇందులో కేంద్రం రూపాయి కూడా తీసుకోదు. ప్రస్తుతం ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం సకాలంలో జరపకపోతే కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించాలి. ఈనెలాఖరు వరకు సమయం ఉన్నందున ఒకవేళ రాష్ట్రం ఆక్షన్ చేయకపోతే తదుపరి చర్యలు తీసుకునే అధికారం కేంద్రానికి ఉంటుంది..’ అని కేంద్రమంత్రి వివరించారు. సింగరేణికి కేసీఆర్ మరణశాసనం‘సింగరేణి సంస్థకు మాజీ సీఎం కేసీఆర్ మరణ శా సనం రాశారు. ఆ సంస్థను పూర్తిగా ధ్వంసం చేసింది బీఆర్ఎస్సే. కేసీఆర్ కుటుంబం తమ రాజకీయ జోక్యంతో దివాళా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి సంస్థ అకౌంట్లో రూ. 3,500 కోట్ల డిపాజిట్లు ఉండేవి. కానీ కేసీఆర్ కుటుంబం ఇష్టారాజ్యంగా ఎడాపెడా సింగరేణిని రాజకీయ క్షేత్రంగా వాడుకుంది. కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా చెల్లింపులు జరపకపోవడంతో మార్చి 31 నాటికి టీఎస్జెన్కో సింగరేణికి రూ.8,056 కోట్లు బకాయి పడింది. బొగ్గు, విద్యుత్కు సంబంధించి సుమారు రూ.30 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. నాలుగున్నరేళ్ల తర్వాత తమ ప్రభుత్వం వస్తుందంటూ మాజీ మంత్రి కేటీఆర్ పగటి కలలు కంటున్నారు. ఆయన పట్ల సానుభూతి చూపాలి..’ అని కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ చేతల ప్రభుత్వం కాదు‘కాంగ్రెస్ మాటల పార్టీ తప్పితే.. చేతల ప్రభుత్వం కాదు. ఉద్యోగ నియామకాల విషయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తోంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం హామీ తప్పితే మిగతా హామీలను తుంగలో తొక్కారు’ అని కేంద్రమంత్రి విమర్శించారు.నీట్తో దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం‘నీట్ పరీక్షా పత్రం లీక్ అవలేదు. దేశవ్యాప్తంగా 4వేల కేంద్రాల్లో పరీక్ష జరిగితే, కేవలం నాలుగు సెంటర్లలో ఒక పేపర్కు బదులు మరో పేపర్ ఇచ్చారు. నీట్ విషయంలో కేంద్రానికి ఎలాంటి దురుద్దేశం లేదు. ఈ పరీక్ష కారణంగా దక్షిణాది రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతోంది. మోదీ ప్రభుత్వ హయాంలో ప్రాంతీయ భాషల్లోనూ పరీక్ష నిర్వహిస్తున్నాం. నీట్ విద్యార్థులకు న్యాయం చేసి, మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా పరీక్ష నిర్వహణకు కేంద్రం చర్యలు తీసుకుంటోంది..’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
కిషన్రెడ్డికి నీట్ సెగ
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి, సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఎన్టీఏను రద్దు చేయాలని నినాదాలు చేస్తూ విద్యార్థి సంఘాల నేతలు కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు.వివరాల ప్రకారం.. నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తాగింది. తాజాగా ఎన్ఎస్యూఐ నాయకులు, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ సహా మరికొందరు కాంగ్రెస్ కార్యకర్తలు శనివారం ఉదయం కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించారు. ఈ సందర్భంగా నీట్ పరీక్ష పేపర్ లీకేజీ, అవకతవకలపై ఎన్టీఏను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఇదే సమయంలో కేంద్రం తీరుకు వ్యతిరేకంగా, కిషన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం, పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని అంబర్పేట్ పోలీసు స్టేషన్కు తరలించారు. -
కాంగ్రెస్ ఇచ్చిన ఐటీఐఆర్ను బీజేపీ రద్దు చేసింది
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రానికి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజియన్ (ఐటీఐఆర్) ప్రాజెక్టును మంజూరు చేస్తే, బీజేపీ ప్రభుత్వం రద్దు చేసిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ యువతకు ఉద్యోగాలివ్వాలని అప్పట్లో తమ ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ప్రాజెక్టును ఇన్నాళ్లు అధికారంలో ఉన్న బీజేపీ మంత్రులు కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. శుక్రవారం గాం«దీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ నేతలు మెట్టుసాయికుమార్, కోట్ల శ్రీనివాస్లతో కలసి ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలకు దేవుడి పేరుతో రెచ్చగొట్టే ప్రసంగాలు ఇవ్వడం తప్ప బతుకుతెరువు కోసం ఉద్యోగాలు ఇప్పించడం తెలియదని అన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టుతో రాష్ట్ర యువతకు 15 లక్షల ఉద్యోగ అవకాశాలు దక్కేవని, కానీ ఆ ప్రాజెక్టును బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడంతో లక్షల కుటుంబాలు ఉద్యోగాలకు దూరమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ గడ్డ సేఫ్టీకి అడ్డా అని, అందుకే ఐటీఐఆర్ను సోనియాగాంధీ మంజూరు చేశారని చెప్పారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, బండి సంజయ్లు హైదరాబాద్ గడ్డపై ఐటీఐఆర్తో అడుగుపెట్టి ఉంటే ప్రజలు సంతోíÙంచే వారన్నారు. ఇప్పుడు కూడా ఐటీఐఆర్ ప్రాజెక్టును మళ్లీ తీసుకురావాల్సిన బాధ్యత ఆ ఇద్దరిదేనని, వారికి ఎప్పటికప్పుడు ఐటీఐఆర్ గురించి గుర్తుచేస్తుంటామని చెప్పారు. కాగా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరే అంశం తన పరిధిలోనిది కాదని, శాసనసభ వ్యవహారాల్లో తాను జోక్యం చేసుకోనన్నారు. -
‘ప్రైవేటు’తో సింగరేణి కుదేలు
సాక్షి, హైదరాబాద్: భూగర్భ గనులు, ఖనిజాల చట్టం (ఎంఎండీఏ)లోని సెక్షన్ 17ఏ(2) కింద సింగరేణి బొగ్గు గనుల సంస్థకు బొగ్గు గనులను రిజర్వేషన్ పద్ధతిలో కేటాయించేందుకు అవకాశం ఉందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం వేలంలో ప్రైవేటు కంపెనీలకు గనులను కేటాయించడం సింగరేణిని కుదేలు చేయడమేనని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని 2015లో కేంద్రం సవరించడంతో సింగరేణి ప్రాంతంలోని బొగ్గు నిల్వలపై అంతకుముందున్న లీజు హక్కులు, అధికారాలను సంస్థ కోల్పోయిందన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఓ హోటల్లో ప్రారంభించగా.. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భట్టి ఆయనతో మాట్లాడారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి... సింగరేణి ప్రాంతంలోని గనులను సంస్థకే కేటాయించేలా ప్రధాని మోదీతో మాట్లాడి ఒప్పించాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి విక్రమార్క విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో చొరవ చూపి ప్రధాని అపాయింట్మెంట్ తీసుకుంటే సీఎం రేవంత్రెడ్డి, తాను, ఇతర పారీ్టల నేతలతో కలిసి అఖిలపక్షంగా ఆయన్ను కలిసి విజ్ఞప్తి చేస్తామన్నారు. గత సర్కారు వేలంలో పాల్గొననివ్వలేదుచట్టంలోని సెక్షన్ 17ఏ(2) కింద తమకు అతిముఖ్యమైన సత్తుపల్లి–3, శ్రావణపల్లి, పీకే ఓసీ డీప్సైడ్, కోయగూడెం బ్లాక్–3 బొగ్గు బ్లాకులను కేటాయించాలని గతంలో సింగరేణి కోరగా వాటిని కూడా కేంద్రం వేలం వేయాలని నిర్ణయించడం బాధాకరమని భట్టి అన్నారు. ప్రభుత్వ సంస్థకు ప్రభుత్వాలు సహకరించకపోవడం విచారకరమని వ్యాఖ్యానించారు. వేలంలో పాల్గొనైనా ఈ గనులను దక్కించుకోవాల్సిన అవసరముండగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనాలోచితంగా సింగరేణి వేలంలో పాల్గొనకుండా చేసిందని విమర్శించారు.దీంతో సత్తుపల్లి–3 బ్లాక్ అవంతిక మైనింగ్ పరమైందని.. కోయగూడెం బ్లాక్–3 ఆరో మైనింగ్ అనే సంస్థ చేతుల్లోకి వెళ్లిపోయిందని చెప్పారు. సింగరేణి ప్రాంతంలోని ఇతర బ్లాకులను వేలంలో కేటాయించాలని కేంద్ర బొగ్గు శాఖ నిర్ణయించడం దురదృష్టకరమన్నారు. సత్తుపల్లి–3, కోయగూడెం–3 బ్లాకుల్లో ఇంకా ప్రైవేటు కంపెనీలు తవ్వకాలు ప్రారంభించలేదని, చట్టప్రకారం ఆ కేటాయింపులను రద్దు చేసి వాటిని తిరిగి సింగరేణికి కేటాయించాలని భట్టి కోరారు. ఇందుకు కేంద్ర ప్రభుత్వ ఆదాయంలో వాటా కింద 0.5 శాతాన్ని అదనంగా ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. సింగరేణిని కాపాడేందుకు అవసరమైతే చట్టంలో సవరణలు చేపట్టాలని కోరారు. మిగిలిన గనులను సింగరేణికే ఇవ్వాలి.. సింగరేణి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం గోదావరి–ప్రాణహిత లోయ ప్రాంతంలో సింగరేణికి 600 చ.కి.మీ.ల విస్తీర్ణంలో 44 మైనింగ్ లీజులు ఉన్నాయని భట్టి విక్రమార్క తెలిపారు. వాటిలో 388 చ.కి.మీ.ల విస్తీర్ణంలో ఉన్న 3,008 మిలియన్ టన్నుల బొగ్గును వెలిసితీసే అవకాశం ఇవ్వగా సింగరేణి 1,585 మిలియన్ టన్నుల బొగ్గునే వెలికితీసిందన్నారు. ఇంకా 1,422 మిలియన్ టన్నుల బొగ్గు తీయడానికి అవకాశం ఉందన్నారు. మిగిలిన 1,400 మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్న గనులను చట్టప్రకారం రిజర్వేషన్ కోటాలో సింగరేణికి కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఓ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి భట్టి అందజేశారు. సింగరేణి మూతబడే ప్రమాదంసింగరేణికి ప్రస్తుతం 39 గనులు, 42 వేల మంది కార్మికులు ఉన్నారని భట్టి చెప్పారు. రానున్న ఐదేళ్లలో 8 భూగర్భ గనులు, 3 ఓపెన్కాస్ట్ గను లు, ఆ తర్వాత 5 ఏళ్లలో మరో 5 భూ గర్భ గనులు, 6 ఓపెన్కాస్ట్ గనులు మూతపడతాయ ని ఆందోళన వ్యక్తం చేశారు. 2037–38 నాటికి మరో 5 గనులు మూతబడతాయన్నారు. మరో 15 ఏళ్లలో 8 గనులు, 8 వేల మంది కార్మికుల స్థాయికి సంస్థ పడిపోయి చివరకు మూతబడే ప్రమాదాన్ని ఎదుర్కొంటుందన్నా రు. తెలంగాణ ప్రాంత మంత్రులుగా, నాయకులుగా ఈ పరిణామాలను ఊహించలేమన్నారు. -
సింగరేణి గొంతు కోస్తున్నా వారికి బాధ, రంది లేవు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నేలపై కేంద్రం సింగరేణి గొంతు కోస్తున్నా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు బాధ, కేంద్ర మంత్రి కిషన్రెడ్డికి రంది లేకపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు మండిపడ్డారు. వారిద్దరికీ తెలంగాణ ప్రజలపై ప్రేమ, సింగరేణి కారి్మకులపై అభిమానం లేదని విమర్శించారు. సింగరేణి బొగ్గు బ్లాక్ల వేలంపై కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ మండిపడ్డారు.వేలాది మంది కార్మికుల పొట్టగొట్టి వందేళ్ల సింగరేణి భవిష్యత్తును చీకట్లోకి నెట్టి కిషన్రెడ్డి, భట్టి ఫొటోలకు పోజులివ్వడం బీజేపీ, కాంగ్రెస్ కుట్రలకు నిదర్శనమని దుయ్యబట్టారు. సిరుల గనికి మరణ శాసనం రాస్తూ వేలాది మంది కారి్మకుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం అంశం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇంటికి సీఎం వెళ్లి ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సహజ సంపదను చెరబట్టి కాంగ్రెస్, బీజేపీ ఆడుతున్న వికృత క్రీడను చరిత్ర క్షమించదని కేటీఆర్ వ్యాఖ్య. రేవంత్ మౌనం వెనుక ప్రశ్నలు... గతంలో సింగరేణి గనుల వేలాన్ని వ్యతిరేకించిన సీఎం రేవంత్రెడ్డి ప్రస్తుతం మౌనం వహించడం కాంగ్రెస్ అవకాశవాదానికి అద్దం పడుతోందని కేటీఆర్ విమర్శించారు. ఈ విషయంలో వైఖరి మార్చుకోవడం వెనుక ఒత్తిళ్లను రేవంత్ రాష్ట్ర ప్రజలకు వివరించాలన్నారు. నీతిలేని బీజేపీ నిర్ణయాల్లో కాంగ్రెస్ కూడా భాగమైందని కేటీఆర్ దుయ్యబట్టారు. అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లండి తెలంగాణ ప్రగతిప్రస్థానంపై బురదచల్లడం మా ని అభివృద్ధి యజ్ఞాన్ని ముందుకు తీసుకెళ్లాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి కేటీఆర్ సూచించారు. ప దేళ్లలో తెలంగాణ సాధించిన అభివృద్ధి నమూనా ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమంటూ ప్రపంచ ప్రఖ్యాత ఆంగ్ల మ్యాగజైన్ ‘ది ఎకానమిస్ట్’ప్రచురించిన కథనాన్ని ఆయన ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు. ఆ కథనంలో మ్యాగజైన్ పొందుపరిచిన గణాంకాలను కేటీఆర్ ప్రస్తావించారు. -
సింగరేణిపై ప్రధానితో చర్చిస్తా
సాక్షి, హైదరాబాద్: బొగ్గు గనుల వేలం ద్వారా సింగరేణి సంస్థకి నష్టం చేయాలనే ఆలోచన కేంద్ర ప్రభుత్వానికి ఎంతమాత్రమూ లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి సంస్థకు లాభం చేయాలన్న ఉద్దేశమే కేంద్రానికి ఉంటుందని అన్నారు. సింగరేణి ప్రాంతంలోని బొగ్గు గనులను సింగరేణి సంస్థకే కేటాయించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞ ప్తితో పాటు ఆయన లేవనెత్తిన ఇతర అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడి అవసరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.కేంద్ర బొగ్గు, గనుల శాఖ సీనియర్ అధికారులతో పాటు సింగరేణి సంస్థ అధికారులతో ఈ అంశాలపై చర్చిస్తానన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో బొగ్గు గనుల 10వ దఫా వేలం ప్రక్రియను శుక్రవారం నగరంలోని ఓ హోటల్లో కిషన్రెడ్డి ప్రారంభించారు. దేశ వ్యాప్తంగా 67 బొగ్గు గనుల వేలం ప్రక్రియను ఈ కార్యక్రమంలో ప్రారంభించగా, ఇందులో సింగరేణి ప్రాంతం పరిధిలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాకు కూడా ఉంది. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్రాభివృద్ధిలో సింగరేణి సంస్థకు ఉన్న ప్రాముఖ్యత ఈ ప్రాంత వాసిగా నాకు బాగా తెలుసు.అయితే సుప్రీంకోర్టు తీర్పు మేరకు దేశ వ్యాప్తంగా ఉన్న బొగ్గు గనుల వేలం నిర్వహిస్తున్నాం. బహిరంగ వేలంలో గనులు పొందిన ఇతర ప్రభుత్వ రంగ సంస్థలు.. కేటాయింపుల ద్వారా గనులు పొందడం కంటే ఎక్కువ లాభాన్ని పొందుతున్నాయి. దేశాభివృద్ధికి అవసరమైన బొగ్గు ఉత్పత్తిని పెంచడం, పారదర్శకతను తీసుకురావడం, రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి దోహదపడడమే వేలం లక్ష్యం. కేంద్రానికి ఆదాయం కోసం కాదు.ఓపెన్ రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో గనులను కేటాయిస్తుండడంతో రాష్ట్ర ప్రభుత్వాలే లబ్ధి పొందుతున్నాయి. 10 ఏళ్ల రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ కొరత ఉండేది. విద్యుత్ కోసం పారిశ్రామికవేత్తలు కూడా ధర్నాలు చేశారు. కానీ కేంద్రం అవలంభిస్తున్న విధానాలతోనే నేడు విద్యుత్ కొరత లేదు..’అని కిషన్రెడ్డి పేర్కొన్నారు. నైనీలో బొగ్గు ఉత్పత్తికి చర్యలు ‘సింగరేణి సంస్థకు 2015లో ఒడిశా రాష్ట్రంలో నైనీ బొగ్గు గని కేటాయించగా, అనేక సమస్యలతో ఇంకా ఉత్పత్తి ప్రారంభం కాలేదు. ఇటీవల ఆ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచి్చంది. అక్కడి సీఎంతో స్వయంగా మాట్లాడి నైనీ బొగ్గు బ్లాకులో సత్వరం ఉత్పత్తి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటా. సింగరేణి సంస్థ ఉత్పత్తి చేసే బొగ్గులో 15 శాతం నైనీలోనే ఉత్పత్తి కానుంది..’అని కేంద్రమంత్రి తెలిపారు. గుదిబండగా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్ణయాలు ‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సింగరేణికి గుదిబండగా మారాయి. సింగరేణి సంస్థను నష్టాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇతర ప్రభుత్వ రంగ బొగ్గు గనుల సంస్థలతో పోలి్చతే సింగరేణి సంస్థ ఉత్పత్తి తగ్గింది. సింగరేణి బొగ్గు గనుల సంస్థకు ఎలాంటి నష్టం జరగకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి, సింగరేణి కార్మికులకు మేలు చేకూరేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుంది. సింగరేణి కార్మికులతో కూడా మాట్లాతాం.సింగరేణి సంస్థలో కేంద్రానికి 49 శాతం వాటా ఉంది. సంస్థ విషయంలో మాకూ బాధ్యత ఉంది..’అని కిషన్రెడ్డి చెప్పారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్రదూబే, కార్యదర్శి అమ్రీత్లాల్ మీనా, సహాయ కార్యదర్శి ఎన్.నాగరాజు, సింగరేణి సంస్థ ఇన్చార్జి సీఎండీ ఎన్.బలరామ్, ఇంధన శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ తదితరులు పాల్గొన్నారు. అనంతరం కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘సింగరేణి’సమస్యల పరిష్కారానికి కృషి భట్టి విక్రమార్క చేసిన విజ్ఞప్తులకు సంబంధించి ఒకటి రెండు రోజుల్లో మరిన్ని విషయాలు చెబుతానని అన్నారు. ఢిల్లీకి వెళ్లిన తర్వాత తమ శాఖ అధికారులతో చర్చించి సింగరేణి సంస్థకు సంబంధించిన ఇతర సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెల్లకాగితాలపై రాసిస్తే బొగ్గు బ్లాకులు కేటాయించారని విమర్శించారు. తాము అత్యంత పారదర్శకంగా వేలం నిర్వహిస్తున్నామని చెప్పారు. -
సింగరేణి వేలం.. కార్మికులకు కిషన్ రెడ్డి భరోసా
-
సింగరేణి వివాదం.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: సింగరేణి ఒక్క రాష్ట్ర ప్రభుత్వానిదే కాదని.. కేంద్రానికి బాధ్యత ఉందని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సింగరేణిపై కేంద్రం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. రాబోయే రోజుల్లో సింగరేణిని అన్ని విధాలా ఆదుకుంటామని తెలిపారు. డిప్యూటీ సీఎం చెప్పిన విషయాలన్నింటిని పరిశీలిస్తాం. ఒడిశాలో గనుల వ్యవహారంపై అక్కడి ముఖ్యమంత్రితో మాట్లాడతాను. దేశమంతా ఒకే పాలసీ వర్తించేలా చొరవ తీసుకుంటాం’’ అని కిషన్రెడ్డి వెల్లడించారు.‘‘సింగరేణికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దీన్ని రాజకీయం చేయకూడదు. సింగరేణి కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. సింగరేణిపై తప్పుడు ప్రచారాలు మానుకోవాలి. కోల్ ఇండియా లిమిటెడ్కు ఇచ్చిన ప్రాధాన్యత సింగరేణికి కేంద్రం ఇస్తోంది. రెండు మైన్లు కేంద్రం దృష్టిలో ఉన్నాయి.. ఒడిశా నైనీ ప్రాజెక్టుపై త్వరలో నిర్ణయం ఉంటుంది. సింగరేణిలో కొన్ని సమస్యలు ఉన్నాయి.. వాటిని అధిగమిస్తాం’’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.‘‘రెండు, మూడు రోజుల్లో సింగరేణిపై మరింత స్పష్టత ఇస్తాం. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పొంతన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న పాలసీనే తెలంగాణలో అమలు అయ్యే అవకాశం. ఆక్షన్ అనేది ఓపెన్.. సింగరేణి మాత్రమే కాదు ఎవరైనా బిడ్డింగ్లో పాల్గొనవచ్చు‘‘ అని కిషన్రెడ్డి తెలిపారు. -
2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి: భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో సింగరేణి ప్రభుత్వ సంస్థ.. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరమని అన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది అంటూ భట్టి కామెంట్స్ చేశారు.కాగా, హైదరాబాద్లో శుక్రవారం పదో రౌండ్లో కోల్మైన్ యాక్షన్ను కేంద్రమంత్రి కిషన్రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భట్టి విక్రమార్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా భట్టి రాష్ట్ర ప్రభుత్వం తరఫున కిషన్రెడ్డికి విజ్ఞప్తి లేఖను అందించారు. అనంతరం భట్టి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి కాకుండా మొట్టమొదటిసారి కమర్షియల్ బొగ్గు గనుల వేలం ప్రక్రియను హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు. కిషన్ రెడ్డికి తెలంగాణ పరిస్థితులు బాగా తెలుసు.సింగరేణి సంస్థ తెలంగాణ రాష్ట్రానికి ఆయువు పట్టు, కొంగు బంగారం. సింగరేణి బొగ్గు వల్లే మన రాష్ట్రంలో థర్మల్ ప్లాంట్స్ నడుస్తున్నాయి. 130 ఏళ్ల అనుభవం ఉన్న సింగరేణి సంస్థకు కొత్త బ్లాక్లు కేటాయించాల్సిన అవసరం ఉంది. త్రైపాక్షిక ఒప్పందాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 1400 వందల మిలియన్ టన్నులు బొగ్గును తియ్యడానికి అవకాశం ఇంకా ఉంది.2015లో కొత్త చట్టం వల్ల సింగరేణి తనకు ఉన్న అర్హతలను కోల్పోయింది. సత్తుపల్లి, కోయగూడ, మరో రెండు బ్లాక్లను సింగరేణికి కేటాయించాలని కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంది. సింగరేణి ప్రభుత్వ సంస్థ. కేంద్రం సింగరేణికి సహకారం ఇవ్వకపోవడం బాధాకరం. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గతంలో ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి కోల్ బ్లాక్స్ వెళ్లాయి. రిజర్వేషన్లు పక్కన పెట్టీ ప్రైవేటీకరణ దిశగా వేలం పాట నడవడం వల్ల సింగరేణికి నష్టం. 2039 నాటికి సింగరేణి మూతపడే పరిస్థితి ఉంది.రిజర్వేషన్ కోటాలో బొగ్గు బ్లాక్లు కేటాయించాలి. రిజర్వేషన్ల అంశంలో కిషన్ రెడ్డి చొరవ చూపాలి. కిషన్ రెడ్డి అవకాశం ఇస్తే అఖిలపక్షంగా వచ్చి ప్రధానిని కలుస్తాం. సింగరేణి సంస్థకు కొత్త గనులు కేటాయించాల్సిన అవసరం ఉంది. సింగరేణి సంస్థ బతకాలి అంటే కొత్త గనులు కేటాయించడం ఎంతో అవసరం. సత్తుపల్లి, కొయగూడ బ్లాక్ల పాత లీజు రద్దు చేసి వాటిని సింగరేణికి కేటాయించాలని కోరుతున్నాం. సింగరేణి భవిషత్ కోసం మరో 0.5 పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సింగరేణి సంస్థను కాపాడేందుకు చట్టంలో మార్పులు చేయాలని కోరుతున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం..
-
ఎన్నికలు ఎప్పుడొచ్చినా 88 సీట్లలో గెలుస్తాం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడు జరిగినా 88 సీట్లలో గెలిచి తెలంగాణ గడ్డపై కాషాయ జెండా ఎగరేయడం ఖాయమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. శ్రీభాగ్యలక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 36 శాతం ఓట్లు సాధించి బీజేపీ సత్తా చాటిందని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన పార్టీ అభ్యర్థుల తరఫున, విజయం సాధించిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీల తరఫున పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా కార్యకర్తలకు శిరస్సు వంచి సెల్యూట్ చేస్తున్నానన్నారు. గురువారం రాత్రి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు యాదవ్ అధ్యక్షతన సన్మాన కార్యక్రమం, కృతజ్ఞతా సభను నిర్వహించారు. అంతకు ముందు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లి పార్టీ కార్యాలయం వరకు నగరంలోని ప్రధాన వీధుల మీదుగా దాదాపు మూడు గంటల పాటు కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఊరేగింపుగా తీసుకువచ్చారు. అనంతరం జరిగిన సన్మాన సభలో కిషన్రెడ్డి మాట్లాడారు. గ్రామాల్లో ప్రజలను సంఘటితం చేయాలి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా భగ భగమండిన ఎండల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎంతో కష్టపడి, అంకితభావంతో విజయం కోసం కృషి చేశారంటూ కిషన్రెడ్డి అభినందించారు. రాబోయే రోజుల్లో కూడా రాష్టంలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పార్టీ జెండా చేతబూని, గ్రామగ్రామాన అన్ని వర్గాల ప్రజలను సంఘటితం చేస్తూ ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. సమన్వయంతో పనిచేస్తాం: కె.లక్ష్మణ్ తొలుత బీజేపీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె.లక్ష్మణ్ మాట్లాడుతూ..పలువురు నేతల త్యాగాల పునాదులపై పార్టీ నిలబడిందని చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు.. అందరం సమన్వయంతో పనిచేసి రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావడం ద్వారా పార్టీ కోసం ›ప్రాణాలు అర్పించిన కార్యకర్తలకు నిజమైన నివాళి అందిస్తామని అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలకు ఘనంగా సన్మానం పార్టీ కార్యాలయంలో పండిట్ శ్యామ్ప్రసాద్ ముఖర్జీ చిత్రపటం వద్ద కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. తొలుత కె.లక్ష్మణ్ను కిషన్రెడ్డి, ఆ తర్వాత కిషన్రెడ్డిని లక్ష్మణ్ సన్మానించారు. అనంతరం బండి సంజయ్ను కిషన్రెడ్డి సత్కరించారు. నిజామాబాద్ ఎంపీ అర్వింద్ ధర్మపురి, మెదక్ ఎంపీ ఎం.రఘునందన్రావు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేష్, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణలను సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. కిషన్రెడ్డి, సంజయ్లు కలిసి ఎమ్మెల్యేలు ధన్పాల్ సూర్యనారాయణ, రామారావు పటేల్, పైడి రాకేష్రెడ్డి, పాల్వాయి హరీ‹Ùబాబు, కాటిపల్లి వెంకట రమణారెడ్డిలను సత్కరించారు. అమ్మవారి దయవల్లే గెలుపు: బండిగురువారం రాత్రి చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో కిషన్రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఇతర నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా బండి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వ చ్చిన వెంటనే పాతబస్తీలోని భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయాన్ని ‘గోల్డెన్ టెంపుల్’గా మారుస్తామని ప్రకటించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారు చాలా పవర్ ఫుల్ అని, అమ్మవారి దయవల్లే ఆనాడు ప్రజాసంగ్రామ యాత్ర విజయవంతమైందని అన్నారు. ఈ రోజు బీజేపీ తెలంగాణలో 8 ఎంపీ సీట్లు గెలిచిందని చెప్పారు. ఈ విషయంలో కార్యకర్తల కష్టం మరువలేనిదన్నారు. కార్యకర్తలతో పాటు బీజేపీపై నమ్మకం ఉంచిన తెలంగాణ ప్రజలందరికీ ఇదే నా సెల్యూట్ అని చెప్పారు. ఒకప్పటి సామాన్య కార్యకర్తలు ఇప్పుడు కేంద్ర మంత్రులుగా ఉండటం ఒక్క బీజేపీలోనే సాధ్యమని సంజయ్ అన్నారు. -
‘ఉక్కు’పాతర.. విశాఖ స్టీల్ ఆస్తుల అమ్మకాలు షురూ
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఓ వైపు కేంద్ర గనుల శాఖ మంత్రి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో జరగదని బాహాటంగా చెబుతుంటే.. మరోవైపు ప్లాంట్ని నిర్వీర్యంచేసే పనుల్ని చాపకింద నీరులా చేసుకుంటూపోతున్నారు. వర్కింగ్ క్యాపిటల్ కోసం విశాఖ స్టీల్ప్లాంట్ ఆస్తులను అమ్మకానికి పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అధికారం చేపట్టిన 10 రోజుల్లోనే ఎన్డీఏ సర్కారు.. స్టీల్ప్లాంటుపై ‘ఉక్కు’పాదం మోపుతున్నట్టు తెలుస్తోంది. స్టీల్ప్లాంట్ ఆస్తులు విక్రయించి.. దివాలా సంస్థగా చూపించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు పరిస్థితులను గమనిస్తే అర్థమవుతోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమించే పేరుతో ఆస్తుల వేలానికి ఏర్పాట్లు చేయడాన్ని గమనిస్తే ఈ అభిప్రాయం బలపడుతోంది. ముంబై, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై నగరాల్లో ఉన్న ఖరీదైన భవనాలు, స్టాక్యార్డుల విక్రయానికి రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఎఎన్ఎల్) బోర్డు ఆమోదం తెలిపి... తూతూ మంత్రంగా తుది అనుమతుల కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది.మూలధన సంక్షోభం పేరుతో..స్టీల్ప్లాంట్ బయట నిరర్థకంగా ఉన్న ఆస్తుల అమ్మకానికి సంస్థ యాజమాన్యం రంగం సిద్ధంచేసుకుంటోంది. మూలధన సంక్షోభాన్ని అధిగమిస్తూ.. పూర్తిస్థాయి ప్లాంట్ నిర్వహణ కోసం సొంతంగా నిధులు సమకూర్చుకునేందుకే ఆస్తుల వేలం ప్రక్రియ షురూ చేసింది. ఇటు ప్రజలు.. అటు ఉద్యోగుల ఆందోళనలు.. ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నిరసనలను ఎన్డీఏ ప్రభుత్వం ఏమాత్రం ఖాతరు చేయడంలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే స్టీల్ప్లాంట్ విక్రయించేందుకు ఉన్న అవకాశాలపైనే దృష్టిసారించింది. రెండ్రోజుల క్రితం కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ ఇప్పట్లో ఉండబోదని స్పష్టంచేశారు. అయినప్పటికీ ఎన్డీఏ ప్రభుత్వ చర్యలు మాత్రం ఇందుకు భిన్నంగా ఉన్నాయి. ఉన్న ఆస్తులన్నింటినీ విక్రయించేసి.. ప్లాంట్ విలువను శూన్యం చేసేందుకు సిద్ధమవుతోంది. రైతులు, ప్రజలు త్యాగాలు చేసి.. ‘విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు’ నినాదంతో పోరాడి సాధించుకున్న పరిశ్రమ ప్రైవేటీకరణకు శతవిధాలా యత్నిస్తోంది. ఎన్నికలు పూర్తయ్యేంత వరకూ స్తబ్దుగా ఉన్నా.. తాజాగా విశాఖ ఉక్కు స్థలాల అమ్మకాల వ్యవహారాన్ని మళ్లీ వేగవంతం చేశారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ప్రైవేటీకరణకు కొంత బ్రేక్ పడింది. ఇప్పుడు ప్రభుత్వం మారిన వెంటనే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కు తగ్గడంలేదు. నిజానికి.. పరిశ్రమకు ప్రత్యేకంగా గనులు కేటాయించి, ఆర్థిక భరోసా కల్పించి కష్టాల నుంచి గట్టెక్కించొచ్చు. సెయిల్లో విలీనం చేయడం మరో పరిష్కారం అని తెలిసినా, కేంద్రం ఆ పని కూడా చేయడంలేదు. ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నా ప్రైవేటీకరణకే మొగ్గు చూపుతూ ‘విశాఖ ఉక్కు’ ఊపిరి తీసేలా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు తెరపైకి తెచ్చిన ఉక్కు స్థలాల అమ్మకం వ్యవహారాన్ని తాజాగా వేగవంతం చేశారు. ఇందులో భాగంగా.. దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ఎఎన్ఎల్ ఆస్తుల వేలానికి సిద్ధమవుతోంది.బోర్డు సమావేశంలో వేలం అంశం!ఇదిలా ఉంటే.. ఇటీవల జరిగిన బోర్డు డైరెక్టర్ల సమావేశంలో ఆస్తుల విక్రయంపై ప్రధాన చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా విశాఖ స్టీల్ మెటీరియల్స్ నిల్వచేయడానికి హైదరాబాద్, చెన్నైలలో స్టాక్యార్డుల ఏర్పాటుకోసం కొనుగోలు చేసిన భూములతో పాటు ముంబై, ఢిల్లీ సహా వివిధ ప్రాంతాల్లో ఉన్న భవనాల్ని విక్రయించే అంశాలపై చర్చించినట్లు సమాచారం. దక్షిణాది, పశ్చిమ రాష్ట్రాల స్టీల్ వినియోగదారుల అవసరాల్ని మూడు దశాబ్దాల కాలంగా హైదరాబాద్, చెన్నైలోని స్టాక్యార్డులు తీరుస్తున్నాయి. ఇతర మెట్రో ప్రాంతాలతో పోలిస్తే.. ఈ స్టాక్ యార్డుల్లో హ్యాండ్లింగ్ చార్జీలు తక్కువగా ఉండటంతో ఎక్కువగా ఇక్కడే విక్రయాలు జరిగేవి. వీటిని విక్రయిస్తే అటు స్టీల్ప్లాంట్కు, ఇటు వినియోగదారులకు నష్టాలే తప్ప ఎలాంటి ఉపయోగంలేదు. ఈ మొత్తం ఆస్తుల మార్కెట్ విలువ రూ.476.18 కోట్లు ఉంటుందని అధికారులు లెక్కలు కట్టారు. నిరర్థక ఆస్తుల నెపంతో ఆస్తుల మానిటైజేషన్కు బోర్డు సూచనప్రాయంగా ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. మరోసారి ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుని కేంద్రానికి ప్రతిపాదనలు పంపించేందుకు బోర్డు సమాయత్తమవుతున్నట్లు సమాచారం.ఆదరిస్తే.., అద్భుతాలే కానీ..ఇటీవలే కొంతమేర లాభాలతో పాటు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేస్తూ స్టీల్ప్లాంట్ దూసుకుపోతోంది. సొంత గనులు కేటాయించి మూలధన సాయంచేస్తే ఉక్కు కర్మాగారం ఉరకలు వేసే అవకాశాలున్నా.. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం ప్రైవేటీకరణ వైపే మొగ్గు చూపుతుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్లాంటులో పూర్తి సామర్థ్యం మేరకు ఉక్కు ఉత్పత్తి చేయకుండా ఆస్తులను అమ్మడానికి ఆసక్తి చూపడంపైనా ఉద్యోగ, కార్మిక సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. స్థలాలు అమ్మితే విశాఖ ఉక్కు కష్టాలు తీరుతాయా అంటే ముడిసరుకు కొనుగోలు చేయడానికి, పేరుకుపోయిన అప్పులు తీర్చడానికి సైతం సరిపోవని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. జిందాల్ సంస్థతో ముడిసరుకు సరఫరాకు ఆర్థిక సాయానికి ఇటీవల ఒప్పందం కుదిరింది. ఆ మేరకు బీఎఫ్–3 ప్రారంభించినా, ముడిసరుకు సక్రమంగా అందక ఉత్పత్తి లక్ష్యం అందుకోలేకపోతోంది. నిత్యం మూడు బ్లాస్ట్ ఫర్నేస్ల ద్వారా 21 వేల టన్నులు ఉత్పత్తి చేసే అవకాశమున్నా, 14 వేల టన్నులకే పరిమితమవుతోంది. ఎన్ఎండీసీ ద్వారా ప్లాంటుకు ప్రతిరోజూ 6 రేక్ల ఇనుప ఖనిజం అందాలి. నాలుగు రేక్లకు మించి అందించడంలేదు. ఇప్పుడిస్తున్న ఇనుప ఖనిజం కేవలం రెండు ఫర్నేస్లకు మాత్రమే సరిపోతోంది. బీఎఫ్–3 పరిస్థితి ఏంటనే దానిపై ఉక్కు మంత్రిత్వ శాఖ దృష్టిసారించకుండా ఆస్తుల్ని విక్రయించేసి.. స్టీల్ప్లాంట్ని మోడువారేలా చేసి.. ప్రైవేటీకరణ చేయాలన్న లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఈ విషయాలు తెలిసినా టీడీపీ, జనసేన పార్టీలు.. పొత్తు పార్టీ బీజేపీపై ఒత్తిడి తీసుకురావడంలో పూర్తిగా విఫలమయ్యాయి. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నంత వరకూ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని కదిలించేందుకు భయపడిన బీజేపీ.. ఇప్పుడు మాత్రం వేగంగా పావులు కదుపుతోంది. -
రేపు 60 బొగ్గు బ్లాకుల వేలం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ సహా వివిధ రాష్ట్రాల్లోని 60 బొగ్గు బ్లాకుల కోసం 10వ రౌండ్ కమర్షియల్ బొగ్గు గనుల వేలాన్ని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్రెడ్డి ప్రారంభించనున్నారు. తెలంగాణలోని ఒక బొగ్గు గని, ఒడిశాలోని 16, ఛత్తీస్గఢ్ 15, మధ్యప్రదేశ్ 15, జార్ఖండ్ 6, పశ్చి మబెంగాల్ 3, బిహార్లోని 3, మహారాష్ట్రలోని ఒక బొగ్గు గనికి కేంద్ర ప్రభుత్వం వేలం నిర్వహించనుంది. ఈ నెల 21న హైదరాబాద్లో జరిగే ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్ చంద్ర దూబే, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, బొగ్గు శాఖ కార్యదర్శి అమృత్లాల్ మీనా తదితరులు పాల్గొంటారు. ఆర్థికాభివృద్ధి, ఉపాధి కల్పన కోసమంటూ.. బొగ్గు గనుల వేలానికి సంబంధించి కేంద్ర బొగ్గు శాఖ బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘ఈ వేలంలో 60 బొగ్గు బ్లాక్లను వేలం వేయనున్నారు. వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ బ్లాక్లు ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి కల్పనకు దోహదం చేస్తాయి. 10వ రౌండ్లో మొత్తం 60 బొగ్గు గనులు ఉండగా.. అందులో 24 గనుల్లో పూర్తిగా, మిగతా 36 గనుల్లో పాక్షికంగా అన్వేషణ జరిగింది.వేలంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగం వారికి సమాన అవకాశం ఉంటుంది. సొంత వినియోగం, విక్రయం సహా వివిధ ప్రయోజనాల ను పొందవచ్చు. ఎలాంటి పరిమితులు ఉండవు..’’అని పేర్కొంది. సులభతర వాణిజ్యం కోసం, బొగ్గు గనుల సత్వర నిర్వహణకు వీలుగా వివిధ అనుమతులు పొందేందుకు సింగిల్ విండో క్లియరెన్స్ సిస్టమ్ పోర్టల్ను రూపొందించినట్టు తెలిపింది. -
సింగరేణిని ప్రైవేటీకరించే ప్రశ్నే లేదు: కేంద్ర మంత్రి కిషన్రెడ్డి
సాక్షి, నూఢిల్లీ: సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే ప్రశ్నే లేదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి చెప్పారు. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుందని.. కేంద్ర ప్రభుత్వ పెత్తనమేదీ ఉండదని తెలిపారు. ఏపీలోని పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఉండదని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందన్నారు. బుధవారం కిషన్రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘సింగరేణి సంస్థను ప్రైవేటుపరం చేయాలనే ఆలోచన, ప్రతిపాదన ఏదీ లేదు. అది ఎన్నికల వేళ మాజీ సీఎం మదిలో పుట్టిన విష ప్రచారం. సింగరేణిలో 51 శాతం వాటా ఉన్న రాష్ట్ర ప్రభుత్వానిదే పెత్తనం ఉంటుంది. 49 శాతం వాటా ఉన్న కేంద్ర ప్రభుత్వానిది ఏమీ ఉండదు. దేశంలో 12 ప్రభుత్వ రంగ సంస్థలు (పీఎస్యూలు) ఉన్నాయి. దేనినైనా ప్రైవేట్ పరం చేశామా? అలాంటిది సింగరేణిని ఎలా చేస్తాం? ఎలాంటి పక్షపాతం వహించకుండా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ప్రధాని మోదీ సూచించారు. ఆ మేరకే నడుచుకుంటాం. సింగరేణిలో జరిగే అవినీతిని బోర్డు మీటింగుల్లో లేవనెత్తుతాం. దేశంలో బొగ్గు మాఫియా చాలా పెద్దది. ప్రధాని మోదీ వచ్చాక మాఫియా ఆగడాలు, అవినీతి తగ్గాయి. అక్కడ ఉక్కు ఫ్యాక్టరీ సాధ్యం కాదు బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఫీజిబులిటీ కాదు. అక్కడ లభించే ఇనుప ఖనిజంలో పరిశ్రమలకు సరిపడే నాణ్యత లేదు. ఫీజిబులిటీ లేకే ప్రాగా టూల్స్, ఐడీపీఎల్, ఆలి్వన్, హెచ్ఎంటీ బేరింగ్స్ వంటి పబ్లిక్ సెక్టార్ కంపెనీలు మూతపడ్డాయి. తెలిసి కూడా మరో ఫ్యాక్టరీ ఎలా పెడతాం? ఇది కోపంతోనో, రాజకీయ ప్రయోజనాల కోసమో తీసుకున్న నిర్ణయం కాదు. కానీ కేంద్ర ప్రభుత్వమే ఏర్పాటు చేయడం లేదంటూ అప్పటి సీఎం కేసీఆర్ ఆరోపించారు. బయ్యారంలో దొరికే ఖనిజాన్ని ఇంకే అవసరాలకు ఉపయోగించుకోవచ్చనే దానిపై అధికారులతో చర్చిస్తా. గనుల వేలంలో పాల్గొనక రాష్ట్రానికి నష్టం గనులు జాతీయ సంపద. అవి ప్రజలకే చెందాలన్న సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా పార్లమెంటులో చట్టం చేశారు. ఈ క్రమంలో గనుల వేలం పారదర్శకంగా జరుగుతోంది. గత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం వేలంలో పాల్గొనలేదు. దాంతో రాష్ట్ర ఖజానాకు చాలా నష్టం జరిగింది. అది ఎంతనే వివరాలు త్వరలో వెల్లడిస్తాం. ట్యాపింగ్ కేసును సీబీఐకి ఇవ్వాలి కొందరు రాష్ట్ర పోలీసులు తప్పు చేశారు. జడ్జీలు, పారిశ్రామికవేత్తలు, ఇతరుల వ్యక్తిగత వ్యవహారాలు కూడా తెలుసుకుని బ్లాక్ మెయిల్ చేశారు. వారి మీద రాష్ట్ర పోలీసులే విచారణ చేస్తే ఎలా? న్యాయం జరగదు. సీబీఐ లేదా హైకోర్టు జడ్జి పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరిపించాలి. ఇలాంటి అంశాలపై సమాజంలోని వ్యక్తులు పిటిషన్లు వేయాలి. పార్టీపరంగా మేం వేయం. నయీం ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి? ఏమున్నాయి? చట్టపరంగా ఎంత వసూలు చేశారనేది కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టాలి. ఇక మేడిగడ్డ, విద్యుత్ కొనుగోళ్ల వ్యవహారాలపై కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తోంది. ఈ రెండు అంశాలపై హైకోర్టు పర్యవేక్షణలో సీబీఐ విచారణ జరపాలి. కాళేశ్వరంపై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వెంటనే జరగదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటిదేమీ జరగదు. ఈ విషయం ఇంకా పెండింగ్లోనే ఉందని, రాద్ధాంతం చేయవద్దని గతంలోనే చెప్పాను. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అభ్యర్థన మేరకు మరో రూ.3 వేల కోట్లు ఆర్థిక సాయం అందిస్తున్నాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కు క్యాప్టివ్ మైన్స్ ఇవ్వాలన్న డిమాండ్పై ఇంకా అధికారికంగా రివ్యూ చేయలేదు. దీనిపై అధికారులతో చర్చిస్తా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా వేలంలో పాల్గొని బొగ్గు గనులు కొనుక్కోవచ్చు. పోలవరం మాది. అంటే కేంద్రానిది. దానిని పూర్తి చేసే బాధ్యత మేమే తీసుకుంటాం. అధ్యక్ష పదవిపై పార్టీ నిర్ణయిస్తుంది బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఎవరనేది పార్టీ నిర్ణయం. మంత్రి పదవి కంటే పార్టీ అధ్యక్ష పదవికే ఎక్కువ ప్రాధాన్యం. మంత్రివర్గంలో ఉన్న వారికి పార్టీ అధ్యక్ష పదవి ఇవ్వకూడదని రూల్ ఏమీ లేదు. యోగ్యత ఉన్నవారు ఎవరైనా మంత్రివర్గంలో ఉంటే.. రాజీనామా చేయించి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తారు. శివరాజ్ సింగ్కు ఇవ్వాలనుకుంటే రాజీనామా చేయిస్తారు. అందులో ఇష్యూ ఏమీ లేదు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా తాత్కాలికంగానే ఇచ్చారు. చాలా రాష్ట్రాల్లో కేంద్ర మంత్రులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులయ్యారు. జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్న వేళ నేను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా ఉన్నాను. ఆర్టికల్ 370 రద్దుకు ముందు అక్కడి పరిస్థితులపై పనిచేశా. ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునే ఇప్పుడు జమ్మూకశ్మీర్ ఎన్నికల ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చారని అనుకుంటున్నా. -
20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. సన్మాన కార్యక్రమం ఇలా... గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్టాప్ జీప్లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. మోదీకి ధన్యవాద సభ ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 21న అన్ని మండలాల్లో యోగా డే కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు. -
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఇంచార్జ్గా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
లోక్సభ ఎన్నికల్లో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకున్న బీజేపీ అగ్రనాయకత్వం.. త్వరలో జరగనున్న ఆయా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాలకు ఎన్నికల ఇంచార్జులు, సహ ఇంచార్జులుగా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు బాధ్యతలు అప్పగించింది.జమ్మూ కశ్మీర్ ఇన్చార్జీగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నియమించింది. కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ , కో-ఇన్ చార్జ్గా అశ్వని వైష్ణవ్, హర్యానా ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కో ఇన్చార్జ్గా విప్లవ కుమార్ దేవ్లను నియమించిన కేంద్రం జార్ఖండ్ ఎన్నికల ఇన్చార్జ్గా కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ , కో ఇన్చార్జ్గా అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మలను కేంద్రం ఖరారు చేసింది. -
అధికారులతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గనుల శాఖ అధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలోని శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గనుల శాఖ సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించారు. మైనింగ్ రంగంలో భారత్ను ఆత్మనిర్భర్గా మార్చేందుకు ఆటోమేషన్, ఇన్నొవేషన్, సుస్థిరత, అధునాతన సాంకేతికతలను అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. అంతకుముందు అధికారులు శాఖకు సంబంధించిన పలు అంశాలను కిషన్రెడ్డికి వివరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్చంద్ర దూబే, సీపీఎస్ఈలు, అనుబంధ కార్యాలయాల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్రెడ్డి వెంట కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కిషన్రెడ్డి, సతీశ్చంద్ర దూబేలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. -
కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన కిషన్ రెడ్డి
-
కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి శాస్త్రీభవన్లోని తన చాంజర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక, లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు, నేడు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. #WATCH | Bandi Sanjay takes charge as the Minister of State for Home in the North Block office of the Ministry of Home Affairs. pic.twitter.com/pdoM4O9k3V— ANI (@ANI) June 13, 2024 -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్పేయి కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్గా నియమితులయ్యారు.2019 లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్రెడ్డి తొలుత మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్పేయి కేబినెట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా? గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు. -
కాంగ్రెస్ ఓట్లు కూడా మాకే
-
ఏపీలో జోక్యం చేసుకుంటారా ?