-
ఏపీలో జోక్యం చేసుకుంటారా ?
-
ఏపీలో దాడులపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి సీరియస్
న్యూఢిల్లీ, సాక్షి: ఇక నుంచి దేశంలో వికసిత్ భారత్ ఎజెండాగా పనిచేస్తామని మరోసారి కేంద్ర మంత్రిగా ఎన్నికైక బీజేపీ సీనియర్, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అంటున్నారు. తెలంగాణతో పాటు ఏపీలో తాజా రాజకీయ పరిణామాలపైనా సోమవారం ఢిల్లీలో సాక్షితో ఆయన ఎక్స్ క్లూజివ్గా మాట్లాడారు. ‘‘ఎన్నికలైపోయాయి, ఇక ప్రతిపక్షాలన్నీ అభివృద్ధికి సహకరించాలి. వికసిత్ భారత్ ఎజెండా పనిచేస్తాం. పేద ప్రజలకు కోట్లాది ఇల్లు నిర్మిస్తాం. తెలంగాణకు 10 లక్షల కోట్ల రూపాయల నిధులు తెచ్చాం. తెలంగాణకు నేను నిధులు తీసుకురాలేదనే వారు మూర్ఖులు. అలాంటి మూర్ఖుల మాటలకు జవాబు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రీజినల్ రింగ్ రోడ్డుకు రాష్ట్రం తరఫున నిధులను జమ చేయడం లేదు. కేంద్రం ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం భూమి ఇవ్వడం లేదు’’ అని విమర్శించారాయన. .. రాబోయే రోజుల్లో తెలంగాణలో 88 సీట్లు టార్గెట్గా పని చేస్తామని, తెలంగాణలో కచ్చితంగా అధికారాన్ని సాధిస్తామని అంటున్నారాయన. వచ్చేసారి తెలంగాణలో అసెంబ్లీ , లోక్సభ ఎన్నికల ఒకేసారి జరుగుతాయి. నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. తెలంగాణలో అసెంబ్లీ సీట్లు పెరగబోతున్నాయి అని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ చేస్తున్న బీఆర్ఎస్ ఓటు బదిలీ ఆరోపణలపై స్పందిస్తూ.. తెలంగాణ ఒక పార్టీ గుత్తాధిపత్యం నడవదు. కాంగ్రెస్ పార్టీ అవగాహన లేకుండా .. తెలివి తక్కువగా మాట్లాడుతోంది. మాకు బీఆర్ఎస్తో పాటు కాంగ్రెస్ ఓట్లు కూడా బదిలీ అయ్యాయి’’ అని అన్నారు. ఇక ఏపీలో కొనసాగుతున్న రాజకీయ ఉద్రిక్తతలపైనా ఆయన స్పందించారు. ఏపీలో ఎన్నికల తర్వాత దాడులు మంచిది కాదు. అలాంటి దాడులను క్షమించే ప్రసక్తి లేదు. ఆ తరహా దాడులపై జీరో టాలరెన్స్ తో వ్యవహరిస్తాం’’ అని కేనంద్ర మంత్రి కిషన్రెడ్డి హెచ్చరించారు. -
తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ట్వీట్ చేశారుతెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు…— Revanth Reddy (@revanth_anumula) June 10, 2024కాగా మోదీ కేబినెట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.కిషన్రెడ్డి, రామ్మోహన్లకు కేబినెట్ పదవులు దక్కగా.. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది. -
గల్లీ నుంచి ఢిల్లీకి..
-
గంగాపురం కిషన్రెడ్డి అనే నేను..
సికింద్రాబాద్: మోదీ నేతృత్వంలో ఆదివారం కొలువుదీరిన కేంద్ర ప్రభుత్వంలో గ్రేటర్కు మరోసారి ప్రాధాన్యం దక్కింది. ఇక్కడి నుంచి మొన్నటి లోక్సభ ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు ఎంపీలు మోదీ కేబినెట్లో బెర్తు కోసం పోటీ పడగా.. సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డిని మరోదఫా కేంద్ర మంత్రి పదవి వరించింది. కేంద్రంలో వరుసగా మూడుసార్లు ఏర్పడిన మోదీ సర్కారులో సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ప్రాధాన్యం లభించడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక 2014లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కింది. అప్పట్లో ఆయన మూడేళ్లపాటు కారి్మక, ఉపాధి శాఖ మంత్రిగా పనిచేశారు. ఆ తర్వాత కిషన్రెడ్డి రెండుమార్లు ఎంపీగా వరుస విజయాలు సాధించారు. 2019లో మొదటిసారి ఎంపీగా గెలిచిన కిషన్రెడ్డి మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. రెండేళ్ల అనంతరం జరిగిన కేంద్ర మంత్రివర్గ విస్తరణలో సాంస్కృతిక, పర్యాటక శాఖ కేబినెట్ మంత్రిగా పదోన్నతి పొందారు. ఎంపీగా రెండో విజయాన్ని నమోదు చేసుకున్న ఆయన తాజాగా మరోసారి నరేంద్ర మోదీ కేబినెట్లో కొలువుదీరారు. ఇద్దరితో పోటీపడి.. బీజేపీలో సహజంగా జోడు పదవులు ఉండవని చెబుతుంటారు. రెండేళ్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కేంద్ర మంత్రిగా కిషన్రెడ్డి జోడు పదవులను నిర్వహిస్తూ వస్తున్నారు. ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కేంద్రమంత్రిగా ఉన్న కిషన్రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కట్టబెట్టారు. ఒకసారి కేంద్ర మంత్రిగా పని చేసి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్రెడ్డి కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ కొత్త మంత్రివర్గంలో కిషన్రెడ్డితో పాటు మరో ఇద్దరు ఎంపీలు పోటీపడ్డారు. మల్కాజిగిరి, చేవెళ్ల లోక్సభ స్థానాల నుంచి ఎంపీలుగా గెలిచిన ఈటల రాజేందర్, విశ్వేశ్వర్రెడ్డిలు కేంద్ర మంత్రి పదవిని ఆశించారు. అయినప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డికి మోదీ కేబినెట్లో స్థానం లభించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి మరో బీసీ ఎంపీకి సీనియారిటీ ప్రాతిపదికన కేంద్ర మంత్రి పదవి ఇస్తున్న క్రమంలో త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని కిషన్రెడ్డి నుంచి తప్పించనున్నట్టు సమాచారం. కేంద్ర మంత్రి పదవి ఆశించి భంగపడ్డ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవిని అధిష్టానం అప్పగించనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర మంత్రులు అవుతారని.. మూడుసార్లు వరుసగా ఏర్పాటైన నరేంద్ర మోదీ ప్రభుత్వాల్లో సికింద్రాబాద్ ఎంపీలకు మంత్రి పదవులు లభించాయి. ఈ పరిణామం పట్ల సికింద్రాబాద్ ప్రాంత ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ఎస్ఎస్ భావజాలంతో బీజేపీలో దశాబ్దాలుగా అంకితభావంతో పని చేసి నేతలుగా బండారు దత్తాత్రేయ, కిషన్రెడ్డిలు పేరుప్రఖ్యాతులు సంపాదించారు. అద్వానీతో కలిసి దత్తాత్రేయ, మోదీతో కలిసి కిషన్రెడ్డి పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో పనిచేసిన అనుభవం ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిని ఎంపీలుగా గెలిపించుకుంటే కేంద్ర మంత్రులు అవుతారన్న ప్రచారాలను ఇక్కడి బీజేపీ నేతలు బలంగా చేస్తూ వస్తున్నారు. ఈ ప్రచారం కూడా ఇక్కడ బీజేపీ అభ్యర్థుల విజయానికి దోహదం చేస్తున్నాయి. ఈటలకు తప్పని నిరాశమేడ్చల్: మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్కు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కుతుందని ఆయన అనుచరులు, రాజకీయ విశ్లేషకులు భావించారు. కానీ.. ఆయనకు నిరాశే ఎదురైంది. సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలుగా గెలిచిన కిషన్రెడ్డి, బండి సంజయ్లకు కేంద్ర మంత్రులుగా చోటు దక్కడంతో కొంత నిరాశకు గురయ్యారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా, మంత్రిగా రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన ముద్ర వేసి కీలక నేతగా ఆయన ఎదిగారు. ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఈటల బీజేపీలో చేరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించడంతో ఈటల రాజేందర్ పేరు తెరపైకి వచి్చంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టింది. ఈటల రాజేందర్ గజ్వేల్, హుజురాబాద్ స్థానాల నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటి.. అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి చెందడం, బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి రాకపోవడంతో ఈటల మల్కాజిగిరి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యరి్థగా పోటీ చేసి గెలుపొందారు. కేంద్ర మంత్రి కావాలని ఆశించారు. ఈటల ఎంపీగా గెలవగానే ఆయనకు ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రధాన నాయకులందరూ మరుసటి రోజే ఢిల్లీకి తరలివెళ్లారు. తమ నాయకుడు మంత్రి అవుతున్నారని జోరుగా ప్రచారం చేశారు. మీడియాలో సైతం ఈటల రాజేందర్ కేంద్ర మంత్రి పదవి రేసులో ఉన్నారని కథనాలు ప్రసారమయ్యాయి. కాగా.. ఆదివారం ప్రధాని మోదీ కేబినెట్లో సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేంద్ర మంత్రులుగా ప్రకటనలు రావడంతో ఈటల రాజేందర్ ఆశలు అడియాసలే అయ్యాయి. కాగా.. ఈటలకు బీజేపీ తెలంగాణ రాష్ట అధ్యక్షుడి బాధ్యతలు అప్పగించే అవకాశముంది. -
ఆర్ఎస్ఎస్ నుంచి అంచలంచెలుగా..
సాక్షి, హైదరాబాద్: వరుసగా రెండోసారి కేంద్ర మంత్రిగా అవకాశం దక్కించుకున్న సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిషన్రెడ్డి.. సామాన్య కార్యకర్త నుంచి ఈ స్థాయికి ఎదిగారు. విద్యార్థి దశలోనే ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. తర్వాత భారతీయ జన సంఘ్లో, జనతా పారీ్టలో చేరారు. 1977లో యువమోర్చా నాయకుడిగా పనిచేశారు. 1980లో బీజేపీ ఏర్పాటయ్యాక అందులో చేరారు. భారతీయ యు వమోర్చా (బీజేవైఎం) రంగారెడ్డి జిల్లా కన్వి నర్గా నియమితులయ్యారు.అంచెలంచెలుగా బీజేవైఎం జాతీయ అధ్యక్షుడిగా ఎదిగారు. ఆ సమయంలో ఉగ్రవాద నిర్మూలన కోసం రాజకీయేతర సంస్థ ‘వరల్డ్ యూత్ కౌన్సిల్ అగైనెస్ట్ టెర్రరిజం’ను స్థాపించారు. తర్వాత రాష్ట్ర బీజేపీలో కార్యదర్శిగా, కోశాధికారిగా, ప్రధాన కార్యదర్శిగా, నాలుగు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా (రెండుసార్లు ఉమ్మడి ఏపీలో, రెండుసార్లు తెలంగాణలో) పనిచేశారు. 2004లో హిమాయత్నగర్ సెగ్మెంట్ నుంచి, 2009, 2014లలో అంబర్పేట నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. బీజేపీ శాసనసభాపక్ష నేతగా పనిచేశారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. 2019 ఏప్రిల్లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ ఎంపీగా గెలిచారు. మోదీ ప్రభుత్వంలో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రిగా చాన్స్ దక్కించుకున్నారు. రెండేళ్ల తర్వాత కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ లభించించింది. కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖలతోపాటు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల బాధ్యతలను నిర్వహించారు. సుదీర్ఘకాలం పార్టీలో కొనసాగడం, జాతీయ నాయకత్వంతో సన్నిహిత సంబంధాలు ఉండటం ఆయనకు కలసివచ్చింది.పేరు : గంగాపురం కిషన్రెడ్డి పుట్టినతేదీ : 15–06–1960 తల్లిదండ్రులు : స్వామిరెడ్డి, ఆండాళమ్మ (రైతు కుటుంబం) భార్య : కావ్యారెడ్డి పిల్లలు : వైష్ణవి, తన్మయ్ కులం : రెడ్డి పార్టీలో హోదా : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుఆ ఘనత బీజేపీదే సాక్షి, న్యూఢిల్లీ : సాధారణ కార్యకర్తలకు కేంద్ర మంతివర్గంలో చోటు కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీదే అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. ఇలాంటి సంస్కృతి ఒక్క బీజేపీలో మినహా దేశంలోని ఏ పార్టీలోనూ లేదన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణం చేసిన అనంతరం ఆయన సాక్షితో మాట్లాడారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి, సహాయమంత్రి పదవులు ఇచ్చిన ప్రధాని మోదీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ‘రెండోసారి కేంద్ర మంతి పదవి దక్కడంతో నా బాధ్యత మరింత పెరిగింది. ప్రధాని నాకు ఇచి్చన బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహిస్తా’ అని చెప్పారు. -
విధేయతకు పెద్దపీట!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. జి.కిషన్రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా.. సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పట్టుసాధించడంతో..2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్రెడ్డి, గోడెం నగేశ్ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు.\కేంద్ర కేబినెట్లో చోటు కోసం కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్రెడ్డి, సంజయ్ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.అనుభవం, సీనియారిటీతో..కిషన్రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది.దూకుడుగా పార్టీ బలోపేతంతో..2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్ఎస్ఎస్లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.ఏపీ నుంచి ముగ్గురికి..ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.ఉదయం ఫోన్లు.. మధ్యాహ్నం తేనీటి విందు..ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అభినందించారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.హిందీలో ప్రమాణ స్వీకారంకేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హాజరయ్యారు. -
కేంద్రమంత్రిగా కిషన్ రెడ్డి.. మోదీకి కృతజ్ఞతలు
తెలంగాణకు ఒక క్యాబినెట్, ఒక సహాయమంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మోదీ కేబినెట్లో కేంద్రమంత్రిగా ప్రమాణం స్వీకారం చేయనున్న కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీలో నిఖార్సైన కార్యకర్తకు మంత్రి పదవి ఇచ్చారని ప్రశంసలు కురిపించారు. తెలుగు రాష్ట్రాలలో (ఏపీ నుంచి ఒకరు, తెలంగాణ నుంచి ముగ్గురు) బీజేపీ కార్యకర్తలకు మంత్రి పదవి దక్కడం బీజేపీ సిద్ధాంత బలానికి నిదర్శనమని అన్నారు.వారసత్వ రాజకీయ బలం లేకున్నా సిద్ధాంతాన్ని నమ్ముకొని నిలబడ్డామన్న కిషన్ రెడ్డి..తెలంగాణలో స్వతంత్రంగా 8 స్థానాలు సాధించామన్నారు. 36 శాతం ఓట్లతో బీజేపీలో కొత్త చరిత్ర సృష్టించాం. నియోజకవర్గాల పునర్విభజన జరగబోతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో 88 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అందరూ కష్టపడి రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని సూచించారు. మోదీ సారధ్యంలో రాబోయే రోజుల్లో మూడు కోట్ల ఇళ్లు నిర్మిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మమరోవైపు తొలిసారి కేంద్రమంత్రి వర్గంలో అడుగుపెట్టిన ఏపీ బీజేపీ ఎంపీ శ్రీనివాస్ వర్మ సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంగా బీజేపీలో పని చేస్తున్నాను.ప్రతి కార్యకర్త నా విజయం కోసం పనిచేశారు.కష్టపడి పనిచేసే కార్యకర్తకు తప్పనిసరిగా అవకాశం వస్తుందనే దానికి నేను నిదర్శనం. రాబోయే రోజుల్లో పార్టీ పటిష్టతకు కృషి చేస్తామని వెల్లడించారు. -
కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కేనా?
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలోని మోదీ ప్రభుత్వంలో మొదటి దశలో గ్రేటర్ నుంచి మంత్రి పదవి దక్కేదెవరికి? అన్నది హాట్ టాపిక్గా మారింది. ఆదివారం ప్రధాన మంత్రిగా మోదీ మూడోసారి ప్రమాణం స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు కేబినెట్ మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్న నేపథ్యంలో నగరం నుంచి మోదీతో పాటు ప్రమాణం చేసే అదృష్టవంతుడెవరన్నది బీజేపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతోంది. రాజధాని నగరమైన హైదరాబాద్ పరిసరాల నుంచి ఎంపీలుగా గెలిచిన ముగ్గురిలో ఒకరికి కేబినెట్ బెర్త్ ఖాయంగా తెలుస్తోంది. అయితే.. అది ఎవరిని వరించనుందన్నదే ఆసక్తికరంగా మారింది. సికింద్రాబాద్ నుంచి కిషన్రెడ్డి, మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, చేవెళ్ల నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంపీలుగా గెలుపొందడం తెలిసిందే. వీరిలో కిషన్రెడ్డి రెండో పర్యాయం గెలిచారు. ప్రస్తుతం పార్టీ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగానూ వ్యవహరిస్తున్న ఆయన పదవీకాలం త్వరలోనే ముగియనుంది. ఈ నేపథ్యంలో కిషన్రెడ్డికే కేంద్ర మంత్రివర్గంలో తొలి దశలోనే అవకాశం లభించనుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. మరోవైపు కిషన్రెడ్డికి ఈసారి పార్టీ జాతీయ అధ్యక్ష పదవి లభించనుందనే ఊహాగానాలు కూడా సాగుతున్నాయి. అయినప్పటికీ.. తొలుత మంత్రి పదవి అయితే ఇస్తారని, అంతే కాకుండా అధ్యక్ష పదవి కంటే మంత్రిగానే ఆయనకు ప్రాధాన్యమిస్తారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ జట్టులో ఆయనతో పాటు ప్రమాణం చేసే మంత్రుల జాబితాలో కిషన్రెడ్డి పేరు ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్టేట్ బాస్గా ఈటల? దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం, ప్రస్తుతం సీఎంగా ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సిట్టింగ్ ఎంపీ స్థానంలో గెలిచిన ఈటల రాజేందర్కు తగిన గుర్తింపునిచ్చేందుకు మంత్రిపదవి ఇస్తారనే అభిప్రాయాలున్నా, తొలిదశలో కిషన్రెడ్డికి మంత్రి పదవి ఇచ్చి, ఈటలకు రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించలరన్న అభిప్రాయాలు ఉన్నాయి. కిషన్రెడ్డి కంటే ముందు పార్టీ రాష్ట్ర చీఫ్గా ఉన్న బండి సంజయ్ బీసీ కావడంతో త్వరలో నియమించే కొత్త అధ్యక్ష పదవి కూడా బీసీలకే ఇస్తారని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అందులో భాగంగా ఈటలకు ఆ అవకాశం కలి్పస్తారని చెబుతున్నారు. ఏ పారీ్టలో ఉన్నా క్షేత్రస్థాయిలో పర్యటనలు, కేడర్ను కలుపుకుపోవడం, సమన్వయం చేయడం వంటి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవి లభించే అవకాశాలు ఎక్కువని రాజకీయ వ్యాఖ్యాతలు చెబుతున్నారు. -
కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకే పెద్దపీట!
ఢిల్లీ: కేంద్రంలో కొలువుదీరబోయే ఎన్డీయే ప్రభుత్వ మంత్రివర్గంలో తెలుగు రాష్ట్రాలకు పెద్దపీట దక్కనున్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ తన స్థానాల్ని డబుల్ చేసుకోగా.. ఏపీలోనూ కూటమి ద్వారా మంచి ఫలితాన్నే రాబట్టుకోగలిగింది. దీంతో తెలంగాణ నుంచి ఇద్దరు లేదా ముగ్గురికి, అలాగే ఏపీ నుంచి ఐదారుగురికి కేబినెట్లో చోటు దక్కవచ్చనే సంకేతాలు అందుతున్నాయి.తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం కనిపిస్తోంది. అయితే బీసీ కోటాలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్కు మంత్రి పదవి దక్కవచ్చనే ప్రచారం ఊపందుకుంది. ఇక.. మహిళా కోటాలో మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణకు కేంద్ర సహాయ మంత్రి పదవి దక్కే అవకాశాలున్నాయి. ఇక.. కేంద్ర కేబినెట్లో బెర్త్ ఆశిస్తున్న ఈటల రాజేందర్కు.. తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చనే చర్చ ఆ పార్టీలో నడుస్తోంది.ఏపీ బీజేపీ నుంచి రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరికి, సీఎం రమేష్కు మంత్రివర్గంలో చాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది. జనసేన నుంచి బాలశౌరికి సహయ మంత్రి పదవి దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా కూటమిలో కీలకంగా మారిన టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు, రాయలసీమ నుంచి పార్థసారధికి మంత్రివర్గంలో ఛాన్స్ దక్కనున్నట్లు తెలుస్తోంది.మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు..ఎన్డీయే భాగస్వామి పక్షాల అధినేతలతో విడివిడిగా శుక్రవారం జేపీ నడ్డా, అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. మంత్రివర్గంలో కోరుకుంటున్న పదవులు, స్థానాలపై నేతలు చర్చించారు. ఇవాళ కూడా మంతివర్గ కూర్పుపై కసరత్తు కొనసాగుతోంది. టీడీపీ, జేడీ(యూ)కు అధిక ప్రాధాన్యం కలిగిన శాఖలు దక్కే అవకాశం కనిపిస్తోంది. టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్కు కేబినెట్లో ఛాన్స్ లభించనుంది. మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు లభించే అవకాశం ఉన్నట్లు సమాచారం. మంత్రివర్గం రేసులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు ఉన్నారు.రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడే మంత్రిత్వ శాఖలు తీసుకుంటామని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు అన్నారు. పట్టణాభివృద్ధి, జలవనరుల శాఖ, పరిశ్రమల శాఖలను టీడీపీ ఆశిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక.. జనసేన నుంచి బాలశౌరికి సహాయ మంత్రి అవకాశం లభించనున్నట్లు సమాచారం. ఏపీ బీజేపీ కోటాలో పురందేశ్వరికి మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. మంత్రి పదవి కోసం ముమ్మరంగా సీఎం రమేష్ లాబీయింగ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర మంత్రివర్గంలో ఎన్డీయే పక్ష పార్టీలు భాగస్వామ్యం కానున్నాయి. కీలకమైన హోమ్, ఆర్థిక, రక్షణ విదేశాంగ శాఖలు బీజేపీకే కేటాయించనున్నట్లు సమాచారం. మూడు మంత్రి పదవులు, రెండు సహాయ మంత్రి పదవులను టీడీపీ కోరుతున్నట్లు తెలుస్తోంది.టీడీపీకి లోక్సభ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు.. జేడీ(యూ) మూడు మంత్రి పదవులు కోరుతున్నట్లు తెలుస్తోంది. శివసేన, ఎన్సీపీ, ఆర్ఎల్డీకి ఒక్కొక్క మంత్రి పదవి కేటాయించనున్నట్లు సమాచారం. దీంతో పాటు బీహార్ ప్రత్యేక హోదా ప్రకటించాలని సీఎం నితీశ్ కుమార్ కోరుతున్నారు. -
కేంద్ర మంత్రి పదవి ఎవరిని వరించేనో!!
సాక్షి, హైదరాబాద్: త్వరలో కొలువుదీరనున్న కేంద్ర మంత్రివర్గంలో గ్రేటర్ ఎంపీల్లో ఎవరికి చోటు దక్కుతుందోనని అటు బీజేపీ నేతల్లో, ఇటు ప్రజల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో గ్రేటర్ పరిధిలో బీజేపీ నుంచి ముగ్గురు ఎంపీలు ఎన్నికయ్యారు. వీరిలో ఒకరికి కేంద్రమంత్రి పదవి గ్యారంటీ అనే అభిప్రాయాలున్నాయి. గెలిచిన నేతల అభిమానులు మాత్రం ఇద్దరికి మంత్రి పదవులిచి్చనా ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదంటున్నారు. పదవి ఖాయమే.. కానీ.. నగరానికి చెందిన బండారు దత్తాత్రేయకు వాజపేయీ, మోదీ హయాంల్లోనూ మంత్రి పదవులు లభించాయి. కేంద్ర సహాయమంత్రి, కేబినెట్ మంత్రి పదవుల్ని ఆయన నిర్వర్తించారు. అలాగే ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ నుంచి రెండో పర్యాయం ఎంపీగా గెలిచిన కిషన్రెడ్డికి సైతం గత మోదీ ప్రభుత్వ హయాంలో తొలుత సహాయ, తర్వాత కేబినెట్ మంత్రి పదవులు వరించాయి. దత్తాత్రేయ కీలకమైన పట్టణాభివృద్ధిశాఖ, కారి్మకశాఖల మంత్రిగానూ పనిచేశారు. కిషన్రెడ్డి తొలుత హోంశాఖ సహాయ మంత్రిగా, అనంతరం పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రిగా పనిచేశారు. ఈ నేపథ్యంలో ఈసారీ రాజధాని పరిధిలోని వారికి మంత్రి పదవి ఖాయంగా లభించనుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. అయితే వీరిలో ఎవరిని ఆ పదవి వరించనుందన్నది ఉత్కంఠ కలిగిస్తోంది. ఓసీకైతే కిషన్రెడ్డి.. బీసీకైతే ఈటల.. కిషన్రెడ్డికే మరోసారి మంత్రిగా అవకాశం కలి్పస్తారని భావిస్తున్న వారితోపాటు మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్కు అవకాశం లభించవచ్చని భావిస్తున్న వారూ ఉన్నారు. టీఆర్ఎస్ ఉద్యమ సమయం నుంచీ రాజకీయాల్లో ఆయన క్రియాశీలపాత్ర వహించడం, అన్నివర్గాల వారిని కలుపుకొని పోయే తత్వం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవడంతో పాటు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహించిన మల్కాజిగిరి నుంచి గెలిచినందున అధిష్టానం ఆయనకు తగిన ప్రాధాన్యమిస్తుందని చెబుతున్నారు. వివిధ సమీకరణాలు, రాష్ట్రంలో గెలిచిన ఇతర ప్రాంతాల వారినీ పరిగణనలోకి తీసుకుంటే.. నగరం నుంచి ఓసీకి ఇవ్వాలనుకుంటే కిషన్రెడ్డికి, బీసీకి ఇవ్వాలనుకుంటే రాజేందర్కు మంత్రి పదవి లభించగలదని భావిసున్నవారు ఉన్నారు. క్యూలో ‘కొండా’ సైతం.. కాగా.. చేవెళ్ల నుంచి గెలిచిన కొండా విశ్వేశ్వర్రెడ్డికి సైతం మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఈటల రాజేందర్కు మంత్రిగా లేదా పార్టీ రాష్ట్ర శాఖ పగ్గాలు అప్పగించే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. గెలిచిన ఎంపీలు సైతం ఎవరికి వారుగా తమకు మంత్రి పదవి లభించగలదనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకీ మంత్రి పదవి ఎవరిని వరించనుందన్నది తేలాలంటే ప్రకటించేంతవరకు ఆగాల్సిందే. -
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాలు గెలుస్తాం: కిషన్రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రానున్నరోజుల్లో రాష్ట్రంలో బలమైన రాజకీయశక్తిగా ఎదుగుతామని, అధికారంలోకి వచ్చేందుకు సమష్టిగా కృషి చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 88 స్థానాల్లో విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ శూన్యత ఏర్పడిందని, ప్రజలు ప్రత్యామ్నాయశక్తిగా బీజేపీని చూస్తున్నారని తెలిపారు. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆరునెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసం, బీఆర్ఎస్ ఉనికి కోల్పోయాయని దుయ్యబట్టారు. ప్రజల గుండెచప్పుడై సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు. ఉమ్మడి రాష్ట్రం నుంచి చూస్తే.. ఇప్పటి వరకు బీజేపీ తొలిసారి గణనీయమైన స్థానాలు సాధించిందని తెలిపారు. కాంగ్రెస్ తొండిఆట ఆడింది బీజేపీ మూడోసారి గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తారని, రిజర్వేషన్లు తొలగిస్తారని అసత్య ప్రచారం చేసి ఎన్నికల్లో కాంగ్రెస్పార్టీ తొండిఆట ఆడిందని కిషన్రెడ్డి అన్నారు. అమిత్షా వీడియోను మార్ఫింగ్ చేసి దిగజారుడు రాజకీయాలు చేసిందని మండిపడ్డారు. ఇంత చేసినా ప్రజలు బీజేపీ వైపే మొగ్గుచూపారని చెప్పారు. ప్రజలను మోసం చేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటే అని అన్నారు. ఆ పార్టీ మోసాలను ఎండగతామని, ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణతో ముందుకెళతామని తెలిపారు. బెదిరించినా, భయపెట్టినా విజయం సాధించాం లోక్సభ ఎన్నికల్లో సీఎం రేవంత్రెడ్డి బెదింరిపులకు పాల్పడినా, భయపెట్టినా ఆయన సొంత జిల్లాతోపాటు, మల్కాజిగిరిలోనూ బీజేపీ విజయం సాధించిందని కిషన్రెడ్డి తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ సొంత జిల్లా, బీఆర్ఎస్కు కంచుకోటలాంటి మెదక్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసినా బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు విజయం సాధించారని చెప్పారు. తెలంగాణలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో 47 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి ఆధిక్యం ప్రదర్శించిందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల శాతం 39 కాగా.. ఇప్పుడు 40 శాతానికి పెరిగిందని చెప్పారు. ఈ ఎన్నికలు ఆరు నెలల పాలనకు రెఫరెండంగా ప్రకటించుకున్న కాంగ్రెస్ పార్టీ ఒక్క శాతం ఓట్లు మాత్రమే అదనంగా సాధించిందని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో 8 చోట్ల గెలిచి 6 చోట్ల రెండో బలమైన ప్రత్యామ్నాయంగా నిలిచామని చెప్పారు. సికింద్రాబాద్లో కాంగ్రెస్ గుర్తుపై మజ్లిస్ పోటీ చేసినట్టు ఉందని, నాంపల్లి నియోజకవర్గాన్ని గమనిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని కిషన్రెడ్డి ఆరోపించారు. రామమందిరం రాజకీయఅంశం కాదు దేశంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాల ఆధారంగానే బీజేపీ ఎన్నికలకు వెళ్లిందని, రామమందిరం రాజకీయ అంశం కాదని కిషన్రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. భిన్న సంస్కృతులు, భిన్న భాషలకు నిలయమైన దేశంలో హ్యాట్రిక్ విజయం సాధించి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడం చాలా గొప్ప విషయం అన్నారు. ప్రధానిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న మోదీకి కిషన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, పురందేశ్వరిలకు శుభాకాంక్షలు తెలిపారు. -
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కిషన్రెడ్డి?
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్తో సమానంగా 8 ఎంపీ సీట్లు గెలుచుకున్న బీజేపీ మరింత బలపడే చర్యల్లో భాగంగా కేంద్ర కేబినెట్ కూర్పులో రాష్ట్రానికి ప్రాధాన్యత కలి్పస్తుందని పార్టీ నేతలు విశ్వసిస్తున్నారు. ఇందులో భాగంగా రెడ్డి లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన ఒకరికి కేంద్ర కేబినెట్ పదవితోపాటు ఓ మహిళ, ఓ బీసీ నేతకు కేంద్ర సహాయ మంత్రి పదవి లభించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటిదాకా కేంద్ర మంత్రిగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డికి మరోసారి కేబినెట్ హోదా లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు.అయితే ఆయన్ను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కూడా నియమించే అవకాశాలున్నాయనే చర్చ కూడా పార్టీలో సాగుతోంది. వెంటనే జాతీయ స్థాయిలో అధ్యక్ష మార్పు జరపకపోతే ముందుగా కిషన్రెడ్డిని కేబినెట్లోకి తీసుకొని 6 నెలలు లేదా సంవత్సరం తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడిని చేయొచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఢిల్లీలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంలో ఉన్నా లేకున్నా పార్టీ బాధ్యతలు నిర్వర్తిస్తూనే ఉంటానని పేర్కొనడం ఈ చర్చకు ఊతమిస్తోంది.ఓసీ, మహిళా కోటాలో డీకే అరుణకు, పారీ్టపట్ల విధేయుడిగా రెండోసారి ఎంపీగా సీనియారిటీ దృష్ట్యా బండి సంజయ్, రాష్ట్రంలో దాదాపు పాతికేళ్లుగా రాజకీయవేత్తగా, మంత్రిగా ఉన్న సుదీర్ఘ అనుభవం దృష్ట్యా ఈటల రాజేందర్కు మంత్రి పదవులు దక్కుతాయని ఊహాగానాలు సాగుతున్నాయి. అయితే, ఉమ్మడి ఏపీలో, ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక క్షేత్రస్థాయిలో బీజేపీ అంతగా బలపడలేదు. ముఖ్యంగా గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల్లో పార్టీపరంగా ప్రజాప్రతినిధుల ప్రాతినిధ్యం కూడా అంతంతగానే ఉంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో సత్సంబంధాలు, స్థానిక పరిచయాలున్న ఈటల రాజేందర్ను కేంద్ర మంత్రిగా కంటే కూడా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని చేసి పార్టీ బలోపేతానికి ప్రథమ ప్రాధాన్యతనిస్తారనే చర్చ సాగుతోంది. -
బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు
-
తెలంగాణలో భవిష్యత్తు బీజేపీదే: కిషన్రెడ్డి
న్యూఢిల్లీ: తెలంగాణ లోక్ సభ ఎన్నికలో బీజేపీ మంచి ఫలితాలు సాధించిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్రెడ్డి అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీజేపీని నమ్మి తెలంగాణ ప్రజలు 8 సీట్లలో గెలిపించారు. తెలంగాణలో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి. నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపడుతుండటం సంతోషకరం. కాంగ్రెస్, బీఆర్ఎస్ను కాదని బీజేపీ పట్ల తెలంగాణ ప్రజలు విశ్వాసం చూపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించారు. తెలంగాణలో బీజేపీ బలపడటం ఒక ఆరంభం మాత్రమే. తెలంగాణలో బీజేపీ బలం పెరిగింది. ఇకపై భవిష్యత్తు మాదే. తెలంగాణలో పదేళ్లలో పది లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. కాంగ్రెస్ విష ప్రచారం చేసింది. కాంగ్రెస్ గెలిచిన స్థానాల్లో ఆ పార్టీకి పోలింగ్ శాతం తగ్గింది.సీఎం రేవంత్రెడ్డి గతంలో గెలిచిన మల్కాజిగిలో మాకు 4 లక్షల మెజార్టీ వచ్చింది. కంచుకోట మెదక్లో వందల కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీనే గెలిచింది. సికింద్రాబాద్లో కాంగ్రెస్ పేరుతో మజ్లిస్ పోటీ చేసింది. 8 చోట్ల మేం గెలిచాం. ఆరేడు స్థానాలో రెండో స్థానంలో నిలిచాం. బీఆర్ఎస్ 14 చోట్ల మూడో స్థానానికే పరిమితమైంది ’’అని కిషన్రెడ్డి అన్నారు. -
ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ: కిషన్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీపై కాంగ్రెస్ విష ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలు విశ్వసించలేదని, రాష్ట్రంలో పార్టీ బలాన్ని పెంచుకుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తారని తప్పుడు ప్రచారం చేసినప్పటికీ ప్రజలు నమ్మలేదని, పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసి తెలంగాణలో 8 స్థానాలు సాధించామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను ఓడించి కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గత ఆరు నెలలుగా బీఆర్ఎస్ సర్కార్ చేసినట్టే చేస్తోందని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రజలకు ఒక ఆశాదీపంగా బీజేపీ కనిపించిందన్నారు. పార్లమెంట్ ఫలితాలు వెలువడ్డాక మంగళవారం రాత్రి పార్టీ కార్యాలయంలో కిషన్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రజల గొంతుకగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకొని, తెలంగాణలో బీజేపీ రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతుందని ధీమాను వ్యక్తంచేశారు. ‘బీజేపీని ప్రజలు ఆశీర్వదించారు. మోదీ పట్ల సంపూర్ణ విశ్వాసం ఉంచారు. మేము ఓటమి పొందిన సీట్లలో కూడా మా పారీ్టకి గతంకన్నా ఎక్కువగా ఓట్లు వచ్చాయి’అన్నారు. ‘బీఆర్ఎస్ పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ఆ పార్టీ కంచుకోట మెదక్లో కూడా బీజేపీ జెండా ఎగురవేసింది’అని చెప్పారు. ‘ఈ ఎన్నికలు రెఫరెండం అని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.. 50 శాతం సీట్లు కూడా రాలేదు... ప్రజలకు ఇప్పుడు ఏం చెబుతారు’అని ఆయన ప్రశ్నించారు. బీజేపీని ఆదరించిన ఓటర్ మహాశయులకు కృతజ్ఞతలు చెప్పారు. బీజేపీని మరింత బలోపేతం చేస్తాం.. సికింద్రాబాద్: రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ బలీయమైన శక్తిగా ఎదుగుతుందని కిషన్రెడ్డి ప్రకటించారు. సికింద్రాబాద్ నుంచి రెండోసారి విజయం సాధించిన కిషన్రెడ్డి మంగళవారం సాయంత్రం ఓయూలోని కౌంటింగ్ కేంద్రానికి వచ్చారు. పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికల అధికారి నుంచి ధృవీకరణ పత్రం అందుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 8 పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం గొప్ప పరిణామమని, ఇంకొన్ని సీట్లు గెలవాల్సి ఉన్నప్పటికీ విపక్షాల ఒత్తిళ్ల కారణంతో చేజారాయన్నారు. రానున్న రోజుల్లో రాష్ట్ర పారీ్టపైనే ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. -
సిగ్గుందా? రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి ఫైర్
-
బీఆర్ఎస్కు10 ఏళ్ళు పట్టింది.. కాంగ్రెస్కు 5 ఏళ్ల పాలన గగనం: కిషన్ రెడ్డి
సాక్షి, ఖమ్మం: సీఎం రేవంత్కు రైతుల కంటే ఎన్నికలే ముఖ్యమని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు,కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కనీస సౌకర్యాలు లేవని, తడిసిన, మొలకెత్తిన ధాన్యాన్ని సైతం ప్రభుత్వం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణమాఫీ చేస్తమన్నారు.. ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరుతో బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వడం లేదని తెలిపారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోతే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారనిపేర్కొన్నారు. ఖమ్మం నగరంలోని శ్రీశ్రీ హోటల్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ హామీలను, గ్యారంటీలను ఏ ఒక్కటి అమలు చేసే పరిస్థితిలో లేదని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, రెండు పార్టీలకు నైతిక విలువలు లేవన్నారు. బీజేపీ పార్టీకి అనుకూలంగా, ప్రజలు సానుకూలంగా స్పందించారని, డబుల్ డిజిట్తో విజయకేతనం ఎగురవేస్తామనే ఆశాభావంతో ఉన్నామని తెలిపారు.బీజేపీని ఏ విధంగా ఆదరించబోతున్నారో లోక్ సభ ఎన్నికలో చూడబోతున్నారు. కేసీఆర్ పాలనపై విసిగిపోవడంతో కాంగ్రెస్ పార్టీని ప్రజలు సమర్ధించారు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9న మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ఇప్పుడు అగస్ట్కు ఎందుకు వాయిదా వేశారో చెప్పాలి. పాత రుణాలు చెల్లించక పోవడంతో కొత్త రుణాలను బ్యాంకులు ఇవ్వడం లేదని, రైతులు వ్యవసాయానికి పెట్టుబడి ఎక్కడ నుంచి తెచ్చుకోవాలో సీఎం రేవంత్ చెప్పాలి.రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది, 45 రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయలేకపోతున్నారో చెప్పాలి. తెలంగాణలో 80 శాతం దొడ్డు బియ్యం ను రైతులు పండిస్తారు. బాయిల్ రైలి కొనేందుకు మోదీ ముందుకొచ్చారు. వచ్చే సీజన్కు బోనస్ ఇస్తామనడం హాస్యాస్పదంగా ఉంది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. బీబఆర్ఎస్ సమాధి కావడానికి 10 ఏళ్ళు పట్టింది. కాంగ్రెస్ పార్టీకి 5 ఏళ్ల పాలన గగనం.ఎకరానికి 15 వేలు, కౌలు రైతుకు 12 వేలు.. ధాన్యం బోనస్ పైన 500 వందలు ఇస్తానని చెప్తున్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్లు ఆడించే బాధ్యతను కేంద్రం తీసుకుంది. ఆరు గ్యారంటీలలో బోనస్ కూడా ఒకటి అని సోనియాగాంధీ ప్రకటించింది. రైతులతో ఎందుకు చెలగాటం అడుతోందో చెప్పాలి. మహిళలకు 2,500,నిరుద్యోగుల 4 వేల నిరుద్యోగ భృతి ఇవ్వకుండా ఓట్లు వేయించుకున్నారు. విద్యార్థుల కు 5 లక్షల గ్యారంటీ కార్డు కు అతిగతి లేకుండా పోయింది. ప్రశ్నించేందుకు బిజెపి పార్టీ కి ఓటు వేయాలి. పట్టభద్రులు ఆలోచించి బీజేపీ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. -
రైతులకు రేవంత్ మోసం.. ప్రతిపక్షాలు ఫైర్
-
కాంగ్రెస్, బీఆర్ఎస్ డీఎన్ఏ ఒక్కటే
హనుమకొండ/భువనగిరి: కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల డీఎన్ఏ ఒక్కటేనని, ఆ రెండు పార్టీలు ఒక్క తాను ముక్కలేనని, జెండాలే వేరని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి దుయ్యబ ట్టారు. శనివారం హనుమకొండ, భువనగిరిలో జరిగిన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. హనుమకొండలో కేజీ టు పీజీ యాజమాన్యాల ఆత్మీయ సమ్మేళనం, బీజేపీ ఉమ్మడి వరంగల్ జిల్లా కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం జరిగింది. సమావేశంలో కిషన్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. 2004లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపించగా, బీఆర్ఎస్ అధికారంలో వచ్చాక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారని, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అదే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారని విమర్శించారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం జీతాలు ఇవ్వడానికి రింగ్రోడ్డును అమ్మిందని, ఐదు నెలల ముందు మద్యం టెండర్లు నిర్వహించిందని, హైదరాబాద్లో స్థలాలు అమ్మిందని ఆయన ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ జీతాలు ఇవ్వడానికి తంటాలు పడుతోందని విమర్శించారు. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్రెడ్డిపై ఉందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ డబుల్ డిజిట్ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ప్రేమేందర్రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్రావు, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా బీజేపీఅసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే శక్తి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేదని కిషన్రెడ్డి విమర్శించారు. కేసీఆర్పై ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ను ప్రజలు అదరించారు తప్ప.. అభిమానంతో ఆ పార్టీకి ఓట్లు వేయలే దన్నారు. భువనగిరి జిల్లా కేంద్రంలోని వివేరా హోటల్లో జరిగిన నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల బీజేపీ సన్నాహక సమావేశానికి కిషన్రెడ్డి హాజరై మాట్లాడారు. తెలంగాణలో ఇక నుంచి ఏ ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఫలితం ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు కోసం ప్రజలతో కలిసి పోరాడతామని చెప్పారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను గెలుపొందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమావేశంలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి, ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
రాములమ్మ ఆలోచనలు ఏంటి? కాంగ్రెస్లో కొనసాగుతారా.. లేక?
సినీ హీరోయిన్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయశాంతి క్రమంగా ప్రజలకు దూరం అవుతున్నారు. అనేక పార్టీలు మారిన రాములమ్మ ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు. అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తూ తన ఉనికి చాటుకుంటున్నారు. తాజాగా బీజేపీ నేత కిషన్రెడ్డి కామెంట్స్ మీద ట్వీట్ చేసి సోషల్ మీడియాలో వైరల్గా మారారు. ఇంతకీ రాములమ్మ ఆలోచనలు ఏంటి? ఆమె కాంగ్రెస్లో కొనసాగుతున్నారా? లేక మరో గూటికి చేరాలనుకుంటున్నారా? లేడీ సూపర్ స్టార్గా పేరు తెచ్చుకున్న విజయశాంతి ఒకప్పుడు అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండే. 1998లో పార్లమెంట్ ఎన్నికల సమయంలో బీజేపీతో రాజకీయ అరంగేట్రం చేసిన విజయశాంతి కమలం, కాంగ్రెస్ పార్టీలకు రెండు సార్లు రాజీనామాలు చేసి, మళ్ళీ చేరారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి తర్వాత ఆ పార్టీని గులాబీ పార్టీలో విలీనం చేాశారు. కేసీఆర్తో వచ్చిన విభేదాల కారణంగా కాంగ్రెస్లో చేరిపోయారు. కొన్ని రోజులు హస్తం పార్టీలో యాక్టీవ్ గానే ఉన్నా.. ఆతర్వాత కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని రెండోసారి బీజేపీలో చేరారు. బీజేపీ నాయకత్వం సీనియర్గా ఆమెకు గుర్తింపు ఇచ్చినా కొద్ది రోజులకే మళ్ళీ హస్తం గూటికి వచ్చారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్లో చేరిన విజయశాంతి పలు జిల్లాల్లో విస్తృతంగా ప్రచారం చేాశారు. ఎన్నికల అనంతరం ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ దగ్గర నుంచి లోక్ సభ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు ఆరు నెలల పాటు విజయశాంతి పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించలేదు. కానీ అడపాదడపాగా సోషల్ మీడియా వేదికగా పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు విజయశాంతి. తాజాగా సోషల్ మీడియాలో విజయశాంతి పెట్టిన పోస్ట్ మరోసారి చర్చకు దారితీసింది.బీఆర్ఎస్ మీద కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వాఖ్యలకు కాంగ్రెస్ నేతగా విజయశాంతి కౌంటర్ ఇవ్వడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ట్వీట్ చేసారు. కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదని, ఆత్మగౌరవం, పోరాట తత్వం దక్షిణాది రాష్ట్రాల సహజ లక్షణమంటూ కిషన్ రెడ్డికి గట్టి కౌంటర్ ఇచ్చారు. దక్షిణాది స్వీయ గౌరవ అస్థిత్వాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు బీజేపీ అర్థం చేసుకోలేక పోయిందంటూ చురకలు అంటించారు విజయశాంతి. అయితే కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ను విమర్శిస్తే విజయశాంతి స్పందించడమే ఇప్పుడు చర్చకు దారితీసింది.చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విజయశాంతి ప్రస్తుత పోస్ట్ చూస్తుంటే మళ్ళీ బీఆర్ఎస్ వైపు చూస్తున్నారా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతోంది. కిషన్ రెడ్డి వాఖ్యలను బీఆర్ఎస్ నేతలే పట్టించుకోలేదు అలాంటిది కాంగ్రెస్ నేత అయిన విజయశాంతికి ఏమవసరం అని పార్టీలో చర్చ జరుగుతోంది. మొత్తానికి సొంత పార్టీని ఇరకాటంలో పెట్టడంలో విజయశాంతి స్టైలే వేరనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -
తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు: కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ: రిజర్వేషన్లపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. రిజర్వేషన్లు రద్దు చేసే శక్తి ఎవరికీ లేదని తెలిపారు. తెలంగాణలో బీజేపీకి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయని చెప్పారు. అందరినీ ఆశ్చర్యపరిచే ఫలితాలు ఉంటాయన్నారు. సీఎం రేవంత్ రెడ్డి తమపై దుష్ప్రచారం చేసినా, ప్రజలు బీజేపీని విశ్వసించారని పేర్కొన్నారు. మజ్లిస్ వ్యవహరించిన తీరు కూడా బీజేపీకి అనుకూలంగా మారిందన్నారు.తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అవతరించనుందని అన్నారు కిషన్ రెడ్డి. రాష్ట్రంలో ఇచ్చిన ఏ హామీనీ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయట్లేదని విమర్శించారు. పెళ్లి చేసుకుంటే తులం బంగారం ఇస్తామన్నారు.. ఎవరికి ఇచ్చారని ప్రశ్నించారు. మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం మినహా ఏ గ్యారంటీ అమలు కావడం లేదని దుయ్యబట్టారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీకి చెల్లించాల్సిన బకాయిలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లించట్లేదని ధ్వజమెత్తారు.డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని మాట తప్పారు, ఇప్పటికైనా సీఎ రేవంత్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ గడ్డుకాలంలో ఉందన్నారు. అడుగడుగునా హామీలపై కాంగ్రెస్ను నిలదీస్తామని చెప్పారు. రేవంత్ పాలన మొదలుపెట్టకుండానే పరీక్ష అంటున్నారని, వచ్చే ఎన్నికల్లో వ్యతిరేక ఫలితాలు వస్తే రేవంత్ ఏం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిశ్శబ్ద విప్లవం వచ్చిందన్నారు.చదవండి: ఆడ రాక పాత గజ్జెలు.. సీఎం రేవంత్పై హరీశ్రావు సెటైరికల్ ట్వీట్ Live: Press Meet, 6 Ashoka Road, New Delhi. https://t.co/lynyvwj2XR— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) May 15, 2024 -
10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి తక్కువలో తక్కువ పది సీట్లు గెలుస్తామని, ఓటర్ల నుంచి అంచనాలకు మించి స్పందన వ్యక్తమైనందున 12 స్థానాల్లో గెలిచినా ఆశ్చర్యం లేదనే ధీమా రాష్ట్ర బీజేపీలో వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాని మోదీ ‘వేవ్’ స్పష్టంగా కనిపించిందని ముఖ్యనేతలు అభిప్రాయపడ్డారు. నాలుగు సిట్టింగ్ ఎంపీ సీట్లతోపాటు విజయావ కాశాలు అంతగా లేదని మొదట్లో భావించిన సీట్లలోనూ బీజేపీ సత్తా చాటుతుందని పేర్కొ న్నారు.నాగర్కర్నూల్, వరంగల్, పెద్దపల్లి వంటి సీట్లు కూడా వస్తాయని, ఎన్నడూ ఊహించనంత స్థాయిలో ఫలితాలు వస్తాయని ధీమా వ్యక్తంచేశారు. పోలింగ్ సందర్భంగా ప్రజలు బీజేపీని, మోదీని చూశారని, అభ్యర్థులు ఎవరనేది కూడా చూడలేదన్నారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో కేంద్రమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అధ్యక్షతన ముఖ్యనేతలతో నిర్వహించిన సమా వేశంలో ఓటింగ్ సరళిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాలు, నియోజకవర్గాల్లోని పరిస్థితులను నాయకులు వివరించారు. ఈ భేటీలో మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్, బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్ తివారీ (సంస్థాగత), బంగారు శ్రుతి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్ ఎన్నికలపై చర్చపార్టీ కార్యాలయంలో నల్లగొండ–వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఈనెల 27న జరగనున్న ఉపఎన్నికపై సన్నాహక సమావే శం జరిగింది. పోలింగ్కు సమయం తక్కువగా ఉన్నందున ఈ మూడు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇన్చార్జీలను నియమించుకుని, అన్ని మండలాల్లో పార్టీ నాయకులు పర్యటించేలా కార్యాచరణను సి ద్ధం చేశారు. ఈ ఎన్నిక కోసం ఎన్.రామచంద్రరా వును ఇన్చార్జీగా నియమించారు. పార్టీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్రెడ్డి బరిలో ఉన్న ఈ ఎన్నికకు సంబంధించిన కసరత్తు అంతా ఉమ్మడి నల్లగొండ జిల్లా కేంద్రంగా నిర్వహించాలని నిర్ణయించారు. -
డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తాం
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ అధినాయ కత్వం ఊహిస్తున్నట్లే తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా బీజేపీకి సానుకూల వాతావరణం కనిపించిందని, ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక రాష్ట్రంలో బీజేపీ కొత్త రాజకీయ శక్తిగా అవతరిస్తుందన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాల్లో బీజేపీకి ఓటు వేశారని, మహిళలు, యువత ఆదరించారని, పట్టణప్రాంతంలోనూ తమ పార్టీకే ఓట్లు పడ్డాయని చెప్పారు. ఓటింగ్ శాతంతో సంబంధం లేకుండా సికింద్రాబా ద్లో బీజేపీ గెలుపులో ఎలాంటి అనుమానం లేదన్నారు.పట్టణప్రాంతాల్లో పోలింగ్ కాస్త తగ్గినా.. పోలైన ఓట్లు బీజేపీకి అనుకూలంగా ఉన్నట్లు సమాచారం ఉందన్నారు. సోమవారం పోలింగ్ సమయం ముగిశాక పార్టీ కార్యాలయం లోకిషన్రెడ్డి మీడియాతో మాట్లా డారు. రాహుల్ గాంధీ, రేవంత్రెడ్డి రెచ్చ గొట్టినా ప్రజలు, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సంయమనంతో వ్యవహరించారని, లేకపోతే అగ్గిరగిలేదన్నారు.సికింద్రాబాద్, ఆదిలాబాద్ తదితరచోట్ల కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి గోబెల్స్ ప్రచారం చేసినా బీజేపీని ప్రజ లు ఆదరించారన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇతర పార్టీలకు వేసిన వారంతా.. ఈసారి బీజేపీకి మద్దతుగా నిలిచారని చెప్పారు. రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, ఓటేసిన ప్రజలు, అధికారులు, అన్ని పార్టీల కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. జూన్ 4 తర్వాత కాంగ్రెస్ హామీలపై కార్యాచరణఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ గ్యారంటీలు, హామీల అమలుకు బీజేపీ కార్యాచరణ సిద్ధం చేసుకుని పోరాడుతుందని కిషన్రెడ్డి చెప్పారు. ‘ఎన్నికలను ప్రజాస్వామ్య పండుగలా జరుపుకోవాలని ప్రధాని మోదీ చెప్పారని నేను చెబితే దానిపైనా ఫిర్యాదుచేశారు. మోదీ పేరు ఎత్తకుండా నిషేధం ఉందా? సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారు.ప్రతిదానికీ మోదీని చాలెంజ్ చేశారు. మోదీపై విమర్శలు గుప్పించడం ద్వారా పెద్దనాయకుడు కాలేరని ఆయన గ్రహించాలి. ప్రధాని అయ్యాక పెళ్లి చేసుకుందామని రాహుల్ అనుకున్నట్టున్నారు. ఆయన ప్రధాని అయ్యే పరిస్థితి లేదు. ఎవరు ఏమిటనేది జూన్ 4న ఫలితాలతో తేలిపోతుంది’ అని కిషన్రెడ్డి పేర్కొన్నారు.ఓటర్ల జాబితాల్లో సంస్కరణలు తేవాలి‘ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాలకు సంబంధించి సంస్కరణలు తీసుకురావాలి. ఓటరు లిస్టును ప్రభుత్వం వెరిఫికేషన్ చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఓటర్ లిస్టులను తనిఖీ చేసి, చనిపోయినవారి ఓట్లను తొలగించాలి. జూబ్లీహిల్స్లో ఒక వర్గం వారివి వేల ఓట్లు తొలగించారు. వేల ఓట్లను డిలీట్ అని పేర్కొన్న జాబితాను ఆదివారం రాత్రే మాకు ఇచ్చారు. కుట్రపూరితంగా ఈ తొలగింపు జరిగింది. కొన్నిచోట్ల ఓటరు స్లిప్పులు ఇచ్చినా ఓట్లు లేవని తిప్పిపంపించారు.మా అబ్బాయి ఓటు ఎక్కడో, నా ఓటు ఎక్కడో ఉంటుంది. దీనిపై కేంద్రమంత్రిగా లేఖ రాసినా చర్యలు తీసుకోలేదు. ఓటర్ల వివరాలతో ఆధార్ కార్డును అనుసంధానం చేస్తే బాగుండేది. రానున్న రోజుల్లో దీనిపై ఆలోచించి మార్పులు చేయాల్సిన అవసరం ఉంది’ అని చెప్పారు. విమోచన అధికారికం‘ప్రతిఏటా సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాలను అధికారికంగా నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. పసుపుబోర్డు, టెక్స్టైల్ బోర్డు వంటి వాటిని మోదీ తెలంగాణకు ఇచ్చారు. మోదీ మళ్లీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టాక త్వరలోనే ఆయన చేతుల మీదుగా వీటిని ప్రారంభిస్తాం’ అని కిషన్రెడ్డి తెలిపారు. -
మోదీ ‘ఉల్లంఘన’లపై వివరణ ఇవ్వండి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో నిర్వహించిన బహిరంగసభలు, రోడ్షోల్లో చేసిన ప్రసంగాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ చేసిన ఫిర్యాదులపై కేంద్ర ఎన్నికల సంఘం స్పందించింది. అయితే, ప్రధాని మోదీకి బదులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి నుంచి వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. ప్రధాని మోదీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన అంశంపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. గడువు పొడిగించాలని బీజేపీ కోరగా, ఈసీ మరింత సమయం ఇచ్చిది. మోదీ ఏమన్నారంటే..: నారాయణపేట, ఎల్బీ స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనగా, చిన్నపిల్లలతో ప్లకార్డులు ప్రదర్శింపజేశారని కాంగ్రెస్ ఈసీకి ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి అని, ఆ పార్టీ భారత దేశ ఎన్నికల్లో గెలవాలని పాకిస్థాన్ కోరుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగాలపై ఈసీకి ఫిర్యాదు చేసినట్టు టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ ‘సాక్షి’కి తెలిపారు.కాగా, రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు కోడ్ ఉల్లంఘన, విద్వేషకర ప్రసంగాల విషయంలో వివిధ రాజకీయ పార్టీల నుంచి వివరణ కోరుతూ మొత్తం 13 నోటీసులను జారీచేసినట్టు అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ పార్టీలైతే ఆయా పార్టీల రాష్ట్ర అధ్యక్షులకు నోటీసులు జారీచేయగా, ప్రాంతీయ పార్టీలైతే వాటి అధ్యక్షులకు నేరుగా నోటీసులిచ్చారు.