-
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది- బండి సంజయ్
-
బీఆర్ఎస్ బాటలోనే కాంగ్రెస్ నడుస్తోంది: బండి సంజయ్
కరీంనగర్ టౌన్: ఎమ్మెల్యేల ఫిరాయింపులు, నిధుల కేటాయింపు, సింగరేణి ప్రైవేటీకరణ దుష్ప్రచారం సహా అన్ని అంశాల్లోనూ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. నిధుల కేటాయింపు, అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో బీజేపీ ఎమ్మెల్యేల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం వివక్ష చూపడం దుర్మార్గమన్నారు. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ప్రజలు ఓట్లేస్తేనే గెలిచారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరిస్తే పరిస్థితి ఎట్లుంటుందో ఆలోచించాలని సూచించారు. కరీంనగర్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. తెలంగాణ అభి వృద్ధి లక్ష్యంగా తాము ముందుకు సాగుతున్నా మని, అందులో భాగంగా రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్ ఎంపీలు తమ వద్దకు వస్తే సహకరిస్తున్నా మని తెలిపారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు మాత్రమే నిధులిచ్చి బీజేపీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోవడం సరికాదన్నారు. కేంద్రం పార్టీలకఅతీతంగా ఎంపీలకు నిధులిస్తుందని, అన్ని రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని స్పష్టం చేశారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇలాగే చేస్తే ప్రజలు బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. పవన్కల్యాణ్ తన ప్రతిపాదనను బీజేపీ ముందుంచారని, దీని పై జాతీయ అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షులు సహా పార్టీ నాయకత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. టీ 20 ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడం సంతోషకరమని, 140 కోటమంది ఆనందంతో ఉన్నారని తెలిపారు. -
తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు.. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల ప్రోత్సాహం సరైన పద్దతి కాదు. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకునే అవసరం మాకు లేదు అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పుకొచ్చారు.కాగా, బండి సంజయ్ ఆదివారం కరీంనగర్లోని మహాశక్తి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం, సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో సింగరేణిని ప్రైవేటుపరంగా చేస్తున్నామని మాట్లాడటం హాస్యాస్పదం. సింగరేణిలో కేంద్రానిది 49 శాతం వాటా ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి 51 శాతం వాటా ఉంది. ఈ వాటాతో కేంద్రం ఎలా ప్రైవేటుపరం చేస్తుంది.అలాగే, రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడం సరికాదు. గతంలో బీఆర్ఎస్ నడిచిన బాటలోనే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం పయనం కొనసాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేలున్న నియోజకవర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడం లేదు. మరి మేము కూడా అలాగే ఆలోచిస్తే అనే విషయాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించాలి. మేము ఇతర పార్టీల ఎంపీలను, ఎమ్మెల్యేలను మా పార్టీలో కలుపుకునే అవసరం మాకు లేదు. జనసేనతో పొత్తు అంశం మా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ అధ్యక్షుడు చూసుకుంటారు’ అని అన్నారు.ఇదే సమయంలో టీ20 ప్రపంచకప్లో భారత్ విజయంపై బండి సంజయ్ స్పందిస్తూ..‘వరల్డ్కప్ గెలుచుకున్న భారత జట్టుకు శుభాకాంక్షలు. ప్రతీ భారతీయుడు తామే విజయం సాధించినంత గొప్ప అనుభూతిని ఈ విక్టరీ అందించింది’ అని కామెంట్స్ చేశారు. -
కాంగ్రెస్ ఇకనైనా కుటిలరాజకీయాలు, చీకటి ఒప్పందాలు మానాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ ఇకనైనా కుటిల రాజకీయాలు, చీకటి ఒప్పందాలు వీడి ప్రతిపక్షంగా ప్రజల పక్షాన నిలబడాలని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ సూచించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రజాసమస్యలపై అర్థవంతంగా చర్చకు సహకరించి పరిష్కారమార్గాలు సూచించాలని ఒక ప్రకటనలో కోరారు. దేశాన్ని అస్థిరపరిచి, బలహీనపరిచేందుకు విదేశీ శక్తుల పాత్ర ఉందనే సాకుతో అధికారాన్ని నిలుపుకునేందుకు నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించారని గుర్తుచేశారు. ‘ఆ చీకటి అధ్యాయానికి 50 ఏళ్లు. ఎమర్జెన్సీపాలన దేశానికి ఓ మాయని మచ్చ.ప్రజల గొంతునొక్కి కాంగ్రెస్ చేసిన అరాచకాలు, అధికార దాహానికి ఎమర్జెన్సీ నిదర్శనం’ అని మండిపడ్డారు. అధికారం కోసం ఇందిరాగాంధీని మించి ఆమె మనవడు రాహుల్గాంధీ దురాలోచన చేస్తున్నారని ఆరోపించారు. వివిధ దేశాల్లో పర్యటిస్తూ ‘ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది’ అనే ముసుగులో రాహుల్ పాశ్చాత్య దేశాల జోక్యాన్ని నిస్సిగ్గుగా కోరుతూ దేశ ప్రతిష్టను దెబ్బతీసేందుకు యత్నించారని ధ్వజమెత్తారు. గతంలో ప్రతిపక్ష ప్రభుత్వాలను కూల్చేందుకు 99 సార్లు 356 ఆర్టికల్ను దుర్వినియోగం చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని దుయ్యబట్టారు.తెలుగురాష్ట్రాల్లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా పోరాడిన డీఎస్పీరెడ్డి, జంగారెడ్డి, వి.రామారావు, జూపూడి యజ్ఞనారాయణ, పీవీ.చలపతిరావు, వెంకయ్య నాయుడు, సీహెచ్.విద్యాసాగర్రావు, ఇంద్రసేనారెడ్డి, ఇంకా సంఘ్ పరివార్ కార్యకర్తలను అరెస్ట్ చేసిన చరిత్ర కాంగ్రెస్దేనని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చి రిజర్వేషన్లు రద్దు చేస్తుందని ఎన్నికల్లో తప్పుడు ప్రచారం చేసి ఓట్లు పొందాలని చూసినా, కాంగ్రెస్కు దేశ ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు. అయినా ఆ పార్టీ నేతలు తీరు మారలేదని బండిసంజయ్ విమర్శించారు. -
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను పరామర్శించిన బండి సంజయ్
-
సీబీఐ విచారణ కోరే దమ్ముందా?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: సింగరేణిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ కోరే దమ్ముందా? అంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. శుక్రవారం కరీంనగర్లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. సీబీఐ విచారణ జరిపితే గత ప్రభుత్వ నిర్వాకంతోపాటు సింగరేణి దుస్థితికి కారకులెవరో తేలిపోతుందన్నారు.సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని, ప్రధాని మోదీ ప్రకటించిన తర్వాత కూ డా కాంగ్రెస్, బీఆర్ఎస్ మళ్లీ తప్పుడు ప్రచా రం చేస్తూ ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయ ని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లేకుండా కేంద్ర ప్రభుత్వం సింగరేణిని ప్రైవేటీకరించడం అ సాధ్యమని స్పష్టం చేశారు. మోదీ రామగుండం వచ్చినప్పుడు సింగరేణిని ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారని, సింగరేణిలో కేంద్రానిది 49% వాటా, రాష్ట్రానిది 51% ఉందన్నారు. అట్లాంటప్పడు సింగరేణి ప్రైవేటీకరించడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సింగరేణి ఈ దుస్థితికి రావడానికి ప్రధాన కారణం నాటి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వమే అన్నారు. తాడిచర్లలో ఏపీ జెన్కోకు ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం ప్రైవే ట్ వారికి అప్పగించింది నిజం కాదా? సింగరేణి ని ప్రైవేటీకరించిందే కేసీఆర్ అని ఆరోపించా రు. నాగర్కర్నూల్ ఘటన దారుణం ఇల్లందకుంట: నాగర్కర్నూల్ జిల్లాలో చెంచు మహిళపై జరిగిన దారుణం సభ్యసమాజం సిగ్గు పడేలా ఉందని బండి సంజయ్ వ్యాఖ్యానించా రు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరుతూ దందాలు చేçస్తున్న క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా వత్తాసు పలుకుతున్నారని రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు.అడ్వొకేట్ కమిషనర్ ముందు హాజరవ్వండికేంద్రమంత్రి బండికి హైకోర్టు ఆదేశం సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్పై అడ్వొకేట్ కమిషనర్ కె.శైలజ (రిటైర్డ్ జడ్జి) ముందు హాజరుకావాలని కేంద్రమంత్రి బండి సంజయ్ను హైకోర్టు ఆదేశించింది. కమిషనర్ ముందు సాక్ష్యం చెప్పకుంటే పిటిషన్పై విచారణ ను ముగిస్తామని స్పష్టం చేస్తూ తదిపరి విచారణను జూలై 8కి వాయిదా వేసింది. 2018 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి గంగుల కమలాకర్ బీఆర్ఎస్ తరపున పోటీ చేసి విజయం సాధించారు.అఫిడవిట్లో గంగుల తప్పుడు వివరాలిచ్చారని, నిరీ్ణత ఖర్చుకు మించి ఎక్కువ ఖర్చు చేశారని, ఆయన ఎన్నికల చెల్లదంటూ తీర్పు ఇవ్వాలని పేర్కొంటూ బండి సంజయ్ హైకోర్టులో 2019, జనవరిలో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో సంజయ్ క్రాస్ ఎగ్జామినేషన్ కు పలుమార్లు గైర్హాజరయ్యారు. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ ముగించినా.. సంజయ్ న్యాయవాది విజ్ఞప్తి మేరకు తిరిగి వాదనలు ప్రారంభించింది. ఈ పిటిషన్పై జస్టిస్ జి.రాధారాణి శుక్రవారం మరోసారి విచా రణ చేపట్టారు. ఈ వారమే బండి సంజయ్ కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టారని, బిజీ షె డ్యూల్ కారణంగా సాక్ష్యం ఇచ్చేందుకు హాజరుకాలేకపోయారని విచారణ వాయిదా వేయాలని ఆయన తరపు న్యాయవాది కోరారు. -
వచ్చే శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా పాతడం ఖాయం..
-
కరీంనగర్ నేలను తాకి ప్రణమిల్లిన బండి సంజయ్
-
కేంద్ర మంత్రి పదవి కార్యకర్తల భిక్షే
సాక్షిప్రతినిధి,కరీంనగర్: కరీంనగర్ ప్రజలు, కార్యకర్తలు పెట్టిన భిక్షతోనే తనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి దక్కిందని బండి సంజయ్ అన్నారు. ‘‘కార్యకర్తలారా..ఆనాడు నాతో కలిసి మీరు కేసీఆర్ మూర్ఖపు పాలనపై పోరాడితే లాఠీదెబ్బలు తిన్నరు.. కేసులు ఎదుర్కొన్నారు..జైళ్లకు వెళ్లారు..రక్తం చిందించారు... ప్రజాసంగ్రామయాత్రలో నాతో కలిసి అడుగులో అడుగు వేసుకుంటూ కష్టాలు లెక్క చేయకుండా 155 రోజులు 1600 కిలోమీటర్లకుపైగా నడిచారు.పార్టీ బలోపేతానికి ఎంతో కష్టపడ్డారు..అందుకే ఈరోజు నాకీ పదవి వచ్చింది..ఈ పదవి మీరు పెట్టిన భిక్షే.. ప్రజలు, కార్యకర్తలకే ఈ పదవిని అంకితమిస్తున్నా’’అని సంజయ్ పేర్కొన్నారు. కేంద్రమంత్రి అయ్యాక బుధవారం తొలిసారి కరీంనగర్కు వచ్చిన బండి సంజయ్కు అడుగడుగునా అపూర్వ స్వాగతం లభించింది. ఈ సందర్భంగా కరీంనగర్లో సంజయ్ మీడియాతో మాట్లాడారు. కార్పొరేటర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగానంటే ఇది కేవలం బీజేపీవల్లే సాధ్యమైందని, మహాశక్తి అమ్మవారి ఆశీస్సులు అండగా ఉన్నాయన్నారు. నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ కార్యకర్తలపై ప్రయోగించిన లాఠీదెబ్బలతోపాటు జైలుకు పంపడం ద్వారా నాకు గుర్తింపు వచ్చిందని చెప్పారు. కేంద్ర మంత్రి పదవిని తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేయడం కోసం ఉపయోగిస్తానని స్పష్టం చేశారు. రాజన్నకు కోడె మొక్కు చెల్లింపు వేములవాడ: ‘ఎన్నికల్లో ఇచ్చిన మాటకు కట్టుబడి రాజన్న ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి నేనేంటో చూపిస్తా’ అని బండి సంజయ్కుమార్ అన్నారు. దేవుడిని మోసం చేస్తే తగిన శాస్తి జరుగుతుందనడానికి కేసీఆర్ ప్రభుత్వమే నిదర్శనమన్నారు. బుధవారం రాత్రి వేములవాడ రాజన్నను దర్శించుకున్నారు.కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రూ.400 కోట్లతో రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చి దేవుడికే శఠగోపం పెట్టిన చరిత్ర కేసీఆర్ సర్కార్దేనని విమర్శించారు. ‘సెల్యూట్ తెలంగాణ’ పేరిట కేంద్ర మంత్రులు, ఎంపీలకు నేడు సన్మానం సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో గురువా రం కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్లతోపాటు పార్టీ ఎంపీలకు సన్మానం చేయనున్నారు. కేంద్ర బొగ్గు, గను ల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక కిషన్రెడ్డి తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం సా యంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కేంద్ర మంత్రులు, ఎంపీలను ర్యాలీగా పార్టీ కార్యాలయం వరకు తీసుకురానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట పార్టీ ఎంపీలు ఎమ్మెల్యే లు, ఎమ్మెల్సీని సత్కరిస్తారు. అనంతరం లోక్సభ ఎన్నికల్లో పార్టీ తరఫున 8 మంది ఎంపీలను గెలిపించినందుకు ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ సభను నిర్వహిస్తారు. తర్వాత చారి్మనార్ భాగ్యలక్ష్మి అమ్మవారి దేవాలయంలో నిర్వహించే ‘మహా హారతి’కార్యక్రమంలో వీరంతా పాల్గొంటారు. -
కేంద్ర హోం మంత్రిగా కరీంనగర్ లో బండి సంజయ్ మొదటి స్పీచ్
-
జస్టిస్ నర్సింహారెడ్డిని వైదొలగాలనడం ముమ్మాటికీ ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: చట్టబద్ధ విచారణ కమిషన్నే తప్పుపట్టేలా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వైదొలగాలని మాజీ సీఎం కేసీఆర్ ఇచి్చన రాతపూర్వక వివరణ, బెదిరింపులతో కూడిన లేఖ ముమ్మాటికీ ధిక్కరణకు నిదర్శనమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తే సరిపోయేదని, అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుబట్టి చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ సూచించడం దారుణమన్నారు.‘ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవస రం ఉంది’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్తో సహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.సీఎంగా పనిచేసిన కేసీఆర్కు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన కమిషన్కు కనీస గౌర వం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిషన్ ఏర్పాటే తప్పు అని అనుకుంటే...దీనిపై ముందే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు మరిచారా? తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీ, ధైర్యసాహసాలను కేసీఆర్ ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పిదాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)పై నెట్టేసి కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. ‘ఈఆర్సీ నిర్ణయాలను నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. నాటి కేసీఆర్ సర్కార్ విధానపరమైన నిర్ణయాలు, వాటి ఆధారంగా జరిగిన అవి నీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతున్నారు తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీ ని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు’అని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ పేర్కొనడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉంటూ ఉస్మానియా వర్సిటీ లో వేసిన ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీ సులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ నర్సింహారెడ్డి అని తెలిపారు. తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారనే దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమన్నారు.నాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా... ప్రెస్మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్ధిపొందాలనుకుని భావిస్తే... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని సంజయ్ ప్రశ్నించారు. -
రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్కు చుగ్ శుభాకాంక్షలు తెలిపారు. హోం శాఖకు మంచిపేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని తరుణ్ చుగ్ ఆకాంక్షించారు. అరగంట పాటు జరిగిన వారిద్దరి భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందని చుగ్ పేర్కొన్నారు. బండికి శుభాకాంక్షల వెల్లువ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎనీ్వఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే.. కరీంనగర్ తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బండి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తరుణ్ చుగ్తో భేటీ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ -
అలవికాని హామీలు.. కాంగ్రెస్పై తరుణ్చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. -
బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
-
కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ బాధ్యతల స్వీకరణ
సాక్షి, ఢిల్లీ: కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. కిషన్రెడ్డి శాస్త్రీభవన్లోని తన చాంజర్లో బాధ్యతలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఇక, లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కిషన్ రెడ్డి రెండోసారి విజయం సాధించిన విషయం తెలిసిందే. 2019లో కిషన్ రెడ్డి హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు, నేడు బీజేపీ కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా హోంశాఖ సహాయమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. పదవీ బాధ్యతల కార్యక్రమానికి హాజరై బండి సంజయ్కు జగద్గురు శంకరాచార్య హంపి విరూపాక్ష విద్యారణ్య పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతి స్వామీజీ ఆశీస్సులు అందించారు. భద్రతా కారణాల రీత్యా కార్యకర్తల అట్టహాసం, నాయకుల సందడి లేకుండా ఒంటరిగానే బండి సంజయ్ ఛార్జ్ తీసుకున్నారు. #WATCH | Bandi Sanjay takes charge as the Minister of State for Home in the North Block office of the Ministry of Home Affairs. pic.twitter.com/pdoM4O9k3V— ANI (@ANI) June 13, 2024 -
రేపు కేంద్రమంత్రులుగా కిషన్రెడ్డి, సంజయ్ బాధ్యతలు
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రుల బాధ్యతల స్వీకారానికి ముహూర్తాలు ఖరారయ్యాయి. ఈనెల 13న ఉదయం 11 గంటల కు జి.కిషన్రెడ్డి కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి గా శాస్త్రి భవన్లోని ఆ శాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించనున్నారు. కేంద్ర హోంశాఖ సహా య మంత్రిగా బండి సంజయ్ నార్త్ బ్లాక్లోని తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించనున్నారు.తెలుగు రాష్ట్రాలకు చెందిన కేంద్రమంత్రులు సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం తర్వాత బాధ్యతలు స్వీకరించే అవకాశముంది. కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రిగా రామ్మోహన్ నాయు డు, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్ గురువారం లేదా శుక్రవారం, శ్రీనివాస వర్మ శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. -
అమిత్ షాను కలిసిన ఈటల.. బీజేపీ అధ్యక్షుడి పగ్గాలు?
బీజేపీ నేత, మల్కాజ్గిరి లోక్ సభ ఎంపీ ఈటల రాజేందర్ సోమవారం ఢిల్లీలో కేంద్రమంత్రి అమిత్ షాను కలిశారు. కేంద్రమంత్రిగా ప్రమాణం చేసిన అమిత్ షాకు శుభాకాంక్షలు తెలిపారు.కాగా కేంద్రంలో మోదీ మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరుణంలో తెలంగాణ నుంచి ఎద్దరు ఎంపీలకు మంత్రి పదవులు వరించిన విషయం తెలిసిందే. సికింద్రాబాద్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్లకు కేంద్ర మంత్రి పదవులు వరించాయికిషన్రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నారు. బీజేపీలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాల్లోనే ఉంటుందని, కిషన్రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈటలకు తెలంగాణ బీజేపీ పగ్గాలు అప్పగించవచ్చని కథనాలు వస్తున్నాయి. అయితే కేంద్ర ప్రభుత్వంలో పదవిని ఆశించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు ఆశాభంగం తప్పలేదు. ఆయన్ని బుజ్జగించేందుకుగానూ కాషాయపార్టీ బీజేపీ రాష్ట్రాధ్యక్ష పదవిని ఈటలకు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆయన అమిత్ షాను కలిశారు. తాజా పరిణామాల నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. -
తెలుగు కేంద్ర మంత్రులపై సీఎం రేవంత్రెడ్డి ఆసక్తికర ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కేంద్రంలో మూడోసారి ప్రధానిగా నరేంద్రమోదీ ప్రమాణస్వీకారం ఆదివారం అట్టహాసంగా జరిగింది. మోదీతోపాటు 72 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసింది తెలిసిందే. తాజాగా వీరిని ఉద్దేశిస్తూ.. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ నుంచి ఎంపికైన కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఏపీ నుంచి రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, బూపతిరాజు శ్రీనివాస వర్మకు రేవంత్ అభినందనలు తెలిపారు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుంచి తెలుగు రాష్ట్రాలకు రావాల్సిన నిధులు, పథకాలు, ప్రాజెక్టుల సాధనకు వీరంతా కృషి చేయాల్సిందిగా కోరుతున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ట్విటర్లో ట్వీట్ చేశారుతెలుగురాష్ట్రాల నుండి కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ జి. కిషన్ రెడ్డి, శ్రీ బండి సంజయ్ కుమార్, శ్రీ కె.రామ్మోహన్ నాయుడు, శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్, శ్రీ భూపతిరాజు శ్రీనివాస వర్మ కు శుభాకాంక్షలు. విభజన చట్టంలోని అంశాల అమలు, కేంద్రం నుండి తెలుగు రాష్ట్రాలకు…— Revanth Reddy (@revanth_anumula) June 10, 2024కాగా మోదీ కేబినెట్లో అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, నిర్మల సీతారామన్, నితిన్ గడ్కరీ, జైశంకర్ మరోసారి మంత్రులుగా కొనసాగుతున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి అయిదుగురు మంత్రి పదవులు దక్కాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్రమంత్రులుగాప్రమాణ స్వీకారం చేశారు.కిషన్రెడ్డి, రామ్మోహన్లకు కేబినెట్ పదవులు దక్కగా.. బండి సంజయ్, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మలకు సహాయ బెర్తులు దక్కాయి. మొత్తం 30 కేబినెట్, 5 స్వతంత్ర, 36 మంది సహాయ మంత్రులు మోదీ 3.0 కేబినెట్లో కొలువుదీరారు. 11 బెర్తులతో ఎన్డీఏ భాగస్వాములకు సముచిత ప్రాధాన్యం లభించింది. -
గల్లీ నుంచి ఢిల్లీకి..
-
కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రిగా..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కేంద్ర మంత్రి అవకాశం వచ్చిన బండి సంజయ్ కూడా ఒక సాధారణ కార్యకర్త నుంచి అంచెలంచెలుగా ఎదిగినవారే. విద్యార్ధి దశ నుంచే ఆర్ఎస్ఎస్లో పనిచేశారు. తర్వాత ఏబీవీపీలో పలు పదవుల్లో కొనసాగారు. కరీంనగర్ అర్బన్ సహకార బ్యాంక్ డైరెక్టర్గా పనిచేశారు. బీజేపీ అగ్రనేత ఎల్కే అద్వానీ సురాజ్ రథయాత్రలో వెహికల్ ఇన్చార్జిగా పనిచేశారు. కరీంనగర్లో 2005 నుంచి వరుసగా మూడుసార్లు కార్పొరేటర్గా గెలిచారు. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రెండు సార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా.. ఓటమితో రెండోస్థానంలో నిలిచారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా సంచలన విజయం సాధించారు. ⇒ 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజ య్ నియమితులయ్యారు. ఈ సమయంలో పా ర్టీని పరుగులు పెట్టించారు. దుబ్బాక ఉప ఎన్ని క, జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీని విజయపథాన నడిపించారు. ⇒ ప్రజా సమస్యలపై పలుమార్లు సంజయ్ ఆందోళనలు అందరి దృష్టిని ఆకర్షించాయి. ఇంటర్ ఫలితాల వివాదం, 317 జీవో, టెన్త్ పేపర్ లీకేజీ వంటి అంశాలపై ఆందోళనలు చేశారు. ⇒ పలు పరిణామాల నేపథ్యంలో 2023లో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పుకొన్నా రు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, తర్వా త జాతీ య కిసాన్మోర్చా ఇన్చార్జిగా నియమితులయ్యారు. ⇒ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేసినా ఓటమి చవిచూశారు. ⇒ తాజా లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ ఎంపీగా రెండోసారి విజయం సాధించారు. కేంద్ర మంత్రి పదవికి ఎంపికయ్యారు. దీంతో కరీంనగర్ బీజేపీ శ్రేణులు సంబురాలు చేసుకున్నాయి.పేరు : బండి సంజయ్కుమార్ పుట్టిన తేదీ : 11–07–1971 తల్లిదండ్రులు : కీ.శే.నర్సయ్య–శకుంతల భార్య : బండి అపర్ణ (బ్యాంకు ఉద్యోగి) పిల్లలు : సాయి భగీరథ్, సాయి సుముఖ్ కులం : మున్నూరు కాపు (బీసీ–డి) పార్టీలో హోదా : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిరాష్ట్ర ప్రగతి కోసం కృషి చేస్తా.. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నాపై నమ్మ కముంచి కేంద్ర మంత్రివర్గంలో చోటు కల్పించిన ప్రధాని మోదీకి, జాతీయ నాయకత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు నాకు లభించిన పదవి కార్యకర్తల కృషి ఫలితమే. నాపై నమ్మకం ఉంచి కరీంనగర్ ప్రజలు రెండోసారి భారీ మెజారిటీతో గెలిపించడం వల్లే కేంద్రమంత్రిగా అవకాశం లభించింది. కేంద్ర మంత్రిగా వచ్చిన అవకాశాన్ని రాష్ట్ర ప్రగతి కోసం, కరీంనగర్ లోక్సభ స్థానం అభివృద్ధి కోసం వినియో గిస్తా. రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సహాయ సహ కారాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నా. – బండి సంజయ్, కేంద్ర మంత్రి -
విధేయతకు పెద్దపీట!
సాక్షి, హైదరాబాద్/సాక్షి, న్యూఢిల్లీ: పార్టీ పట్ల విశ్వాసం, విధేయతే గీటురాయిగా తెలంగాణ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలకు కేంద్ర మంత్రులుగా చాన్స్ దక్కింది. జి.కిషన్రెడ్డి కేబినెట్ మంత్రిగా, బండి సంజయ్ సహాయ మంత్రిగా నియమితుల య్యారు. ఇందులో కిషన్రెడ్డి రాష్ట్ర రాజధానిలోని సికింద్రాబాద్ నుంచి గెలవగా.. సంజయ్ ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ నుంచి విజయం సాధించారు. ఇద్దరూ కూడా తమ నియోజకవర్గాల్లో వరుసగా రెండోసారి ఎంపీగా గెలిచినవారే. మోదీ మూడో కేబినెట్లో రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం లభించడం పట్ల బీజేపీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.రాష్ట్రంలో పట్టుసాధించడంతో..2019లో బీజేపీ తెలంగాణలో 4 ఎంపీ సీట్లను గెలుచుకున్న విషయం తెలిసిందే. దీంతో రాష్ట్రం నుంచి కిషన్రెడ్డికి తొలుత కేంద్ర సహాయ మంత్రిగా పదవి వరించింది. తర్వాత కేంద్ర కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ అందింది. తాజా లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు గెలిచారు. వీరిలో కిషన్రెడ్డి, సంజయ్, ధర్మపురి అర్వింద్, కొండా విశ్వేశ్వ ర్రెడ్డి, గోడెం నగేశ్ రెండోసారి ఎంపీలుగా గెలవగా.. డీకే అరుణ, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు తొలిసారి లోక్సభకు ఎన్నికయ్యారు.\కేంద్ర కేబినెట్లో చోటు కోసం కిషన్రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్. డీకే అరుణ మధ్య పోటీ నెలకొంది. మిగతా వారు కూడా పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ జాతీయ నాయకత్వం గట్టి కసరత్తే చేసింది. పార్టీకి ముందు నుంచీ విధేయులుగా ఉండటం, రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంలో కిషన్రెడ్డి, సంజయ్ల కృషి దోహదపడటాన్ని పరిగణనలోకి తీసుకుంది.అనుభవం, సీనియారిటీతో..కిషన్రెడ్డి నాలుగు సార్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా సేవలు అందించారు. గత కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. కరోనా టైంలో కేంద్రమంత్రిగా ఢిల్లీ కేంద్రంగా కంట్రోల్ రూంలో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. అధిష్టానానికి నమ్మిన బంటుగా ఉ న్నారు. కేంద్రమంత్రిగా, రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ.. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో, లోక్సభ ఎన్నికల్లో పార్టీకి సీట్లు పెరగడానికి కృషి చేశారు. ఈ అంశాలన్నీ కలసివచ్చి కిషన్రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి వరించింది.దూకుడుగా పార్టీ బలోపేతంతో..2019లో కరీంనగర్ ఎంపీగా సంచలన విజయం సాధించిన బండి సంజయ్.. పార్టీ రాష్ట్ర అధ్యక్షు డిగా నియామకమైన తర్వాత దూకుడుగా వ్యవహ రించారు. అప్పట్లో అధికార బీఆర్ఎస్ను, కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలో పెట్టేలా పోరాటాలు చేశారు. పార్టీపై తనదైన ముద్ర వేశారు. పలుమార్లు మోదీ, అమిత్ షాలతో శభాష్ అనిపించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ ఇంత బలోపేతం కావడానికి బండి సంజయ్ కూడా కారణమని ఆ పార్టీ శ్రేణులు చెప్తుంటాయి. దీనికితోడు తొలి నుంచీ ఆర్ఎస్ఎస్లో కొనసాగడం, పార్టీ పట్ల విధేయత వంటివి కూడా బండి సంజయ్కు కలసివచ్చాయి. కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది.ఏపీ నుంచి ముగ్గురికి..ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు ఎంపీలకు కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. ఎన్డీయే కూటమిలోని పొత్తు మేరకు ఇద్దరు టీడీపీ ఎంపీలకు అవకాశం వచ్చింది. ఇందులో మూడు సార్లు ఎంపీగా గెలిచిన రామ్మోహన్నాయుడు, తొలిసారి గెలిచిన పెమ్మ సాని ఉన్నారు. ఇక బీజేపీ ఎంపీ శ్రీనివాసవర్మకు కేంద్ర కేబినెట్లో చోటు దక్కింది. 1991 నుంచీ పార్టీలో పనిచేస్తున్న ఆయన సీనియారిటీ, విధేయతను దృష్టిలో పెట్టుకొని అవకాశం ఇచ్చారు. మొత్తంగా ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురికి కేంద్ర మంత్రి పదవులు లభించడం గమనార్హం.ఉదయం ఫోన్లు.. మధ్యాహ్నం తేనీటి విందు..ఆదివారం ఉదయం పది గంటల నుంచే మంత్రులుగా ఎంపికైన ఎంపీలకు ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి ఫోన్లు వెళ్లాయి. మధ్యాహ్నం నుంచే అందుబాటులో ఉండాలని ఆ ఎంపీలకు సమాచారం ఇచ్చారు. లోక్ కల్యాణ్ మార్గ్లోని ప్రధాని నివాసంలో భేటీకి రావాలని సూచించారు. దీంతో కిషన్రెడ్డి, బండి సంజయ్, ఇతర ఎంపీలు అక్కడికి చేరుకున్నారు. కేంద్ర మంత్రులుగా ఎంపికైన అందరినీ ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా అభినందించారు.మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ప్రధాని తేనీటి విందు ఇచ్చారు. తర్వాత పలు అంశాలపై మార్గనిర్దేశం చేశారు. ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా పనిచేయాలని, 100 రోజుల ఎజెండాను అమలు చేయాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని సూచించారు. తర్వాత అంతా రాష్ట్రపతి భవన్లో ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వెళ్లారు.హిందీలో ప్రమాణ స్వీకారంకేంద్ర మంత్రులుగా కిషన్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరూ హిందీలో ఈశ్వరుని సాక్షిగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరు ప్రమాణం చేస్తున్న సమయంలో కార్యక్రమానికి హాజ రైన కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ అంటూ పెద్దపె ట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రం నుంచి ఎంపీలు డీకే అరుణ, గోడెం నగేశ్, ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, రఘునందన్రావుతో పాటు బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి హాజరయ్యారు. -
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రం
ఎన్నికల వరకే రాజకీయాలు.. ఎన్నికల తర్వాత అభివృద్ధిపై దృష్టి సారిస్తామని బీజేపీ ఎంపీ బండి సంజయ్ అన్నారు.కేంద్రమంత్రివర్గంలోకి తెలంగాణ బీజేపీ నుంచి ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్కు అవకాశం లభించింది. ఆదివారం సాయంత్రం ప్రధానిగా మోదీతో పాటు సుమారు 30 మంది కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. వీరిలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి, బండిసంజయ్లు ఉన్నారు. ఈ మేరకు పీఎంవో నుంచి వారికి సమాచారం వచ్చింది.ఈ సందర్భంగా ఎంపీ బండి సంజయ్ కేంద్రంలో సహాయ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేయడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రిగా ఒక రోడ్డు మ్యాప్ తయారు చేసుకొని పనిచేస్తా. కష్టపడి పనిచేస్తే పదవులు వస్తాయి అనే దానికి ఇదే సంకేతం.వికసిత్ భారత్ లక్ష్యంగా పనిచేస్తాం. ఎన్నికల వరకే రాజకీయాలు. ఎన్నికల తర్వాత అభివృద్దే తారక మంత్రంగా పనిచేస్తామని బండి సంజయ్ స్పష్టం చేశారు. -
బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవి
-
కేంద్రమంత్రిగా బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: నరేంద్ర మోదీ 3.0 కేబినెట్లో తెలంగాణా నుంచి ఇద్దరికి చోటు దక్కింది. కిషన్ రెడ్డితో పాటు బండి సంజయ్కు అవకాశం దక్కింది. తెలంగాణలో బీజేపీ పుంజుకోవడానికి కీలకంగా వ్యవహరించిన బండి సంజయ్.. ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో రెండోసారి కరీంనగర్ నుంచి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన భారీ మెజార్టీతో విజయం సాధించారు. కాగా, ఆదివారం ఉదయం నరేంద్ర మోదీ తన నివాసంలో కొత్త మంత్రులకు తేనీటి విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు(ఆదివారం) రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.సంజయ్కు కేంద్ర మంత్రి పదవి.. కరీంనగర్లో సంబరాలుబండి సంజయ్ను కేంద్ర మంత్రి పదవి వరించడంతో కరీంనగర్లో బీజేపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. సంజయ్ ఇంటివద్ద, ఎంపీ కార్యాలయం వద్ద సంబరాలు మిన్నంటాయి. సంజయ్ తల్లి శకుంతల సాక్షి టీవీతో మాట్లాడుతూ, సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం తల్లిగా గర్వంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. సంజయ్ చాలా కష్టపడి ఈ స్థాయికి రావడం సంతోషంగా ఉందని.. ఇది మాపై మరింత బాధ్యతను పెంచిందని ఆయన భార్య అపర్ణ సంతోషం వ్యక్తం చేశారు.బండి సంజయ్ వ్యక్తిగత ప్రొఫైల్పుట్టిన తేదీ:11-7-1971తల్లిదండ్రులు: (కీ.శే. బండి నర్సయ్య) - శకుంతల.అక్క :శైలజ అన్నలు : బండి శ్రవణ్ కుమార్ బండి సంపత్ కుమార్భార్య: బండి అపర్ణ(ఎస్.బి.ఐ ఉద్యోగిని)పిల్లలు: సాయి భగీరత్, సాయి సుముఖ్కులం: మున్నూరుకాపు,(బి.సి-'డి')ప్రస్తుత బాధ్యతలు:బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగతంలో చేపట్టిన బాధ్యతలు:బాల్యం నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవకుడిగా..అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్లో పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా..కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో రెండు పర్యాయాలు (1994-1999; 1999-2003) డైరెక్టర్గా..బీజేపీ జాతీయ కార్యాలయం, ఢిల్లీలో ఎన్నికల ప్రచార ఇంచార్జ్గా భారతీయ జనతా యువమోర్చా పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా, జాతీయ కార్యదర్శిగా సేవలందిస్తూ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు చేపట్టారు. BJP రాష్ట్ర అధికార ప్రతినిధిగా కూడా పని చేశారు. అద్వానీ చేపట్టిన సురాజ్ రథ యాత్రలో వెహికల్ ఇంచార్జ్గా, కరీంనగర్ నగర పాలక సంస్థగా ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గా, రెండవసారి అదే 48వ డివిజన్ నుంచి భారీ మెజారిటీతో హ్యాట్రిక్ విజయం సాధించారు.వరుసగా రెండు పర్యాయాలు కరీంనగర్ నగర బీజేపీ అధ్యక్షునిగా2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి, 52,000 వేల పై చిలుకు ఓట్లు సాధించి రెండవ స్థానంలో నిలిచారు.2019 ఎన్నికల్లో తిరిగి బీజేపీ తరపున కరీంనగర్ శాసనసభ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేసి 66009 ఓట్లను సంపాదించి రెండవ స్థానంలో ఉండగా, రాష్ట్రంలో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థుల్లో ప్రథమ స్థానంలో నిలిచారు.2019 పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీచేసి, టీఆర్ఎస్ కంచుకోటను బద్దలు కొట్టి 96వేల పైచిలుకు ఓట్లతో ఘనవిజయం సాధించారు.2019లో ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నియామకం2019లో అర్బన్ డెవలప్మెంట్ పార్లమెంట్ కమిటీ మెంబర్గా నియామకం2019లో టొబాకో బోర్డు మెంబర్గా నియామకం.2019లో మైనారిటీ అఫైర్స్ స్టేట్ లెవెల్ కమిటీ మెంబర్గా నియామకం2020లో ఎయిమ్స్ బీబీనగర్ బోర్డు మెంబర్గా నియామకం2020లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం2023లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియామకం2023 అసెంబ్లీ ఎన్నికల్లో 89000 ఓట్లు సాధించారు2024లో జాతీయ కిసాన్ మోర్చా ఇంఛార్జ్గా నియామకం2024 పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ ఎంపీగా 2 లక్షల 25 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలుపు -
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు.