ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు Prime Minister Narendra Modi presents gifts for world countries presidents | Sakshi
Sakshi News home page

ప్రపంచ దేశాల నాయకులకు మోదీ అపురూప బహుమానాలు

Published Sat, Aug 26 2023 6:17 AM | Last Updated on Sat, Aug 26 2023 6:17 AM

Prime Minister Narendra Modi presents gifts for world countries presidents - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాలో బ్రిక్స్‌ సదస్సుకు హాజరైన ప్రపంచ దేశాల అధినేతలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇచ్చిన కానుకలు వారి మనసుల్ని దోచుకున్నాయి. భారతీయ సాంస్కృతిక వైవిధ్యం, ఘనమైన వారసత్వం ఉట్టిపడే కళారూపాలు, సంప్రదాయ వస్తువుల్ని  కానుకగా ఇచ్చారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్‌ రమఫోసాకు మన తెలంగాణలో తయారైన కళాకృతులైన కూజా ఆకారంలో ఉండే రెండు పింగాణి పాత్రలను (సురాహి) కానుకగా ఇచ్చారు.

కర్ణాటకకు చెందిన బిద్రీ అనే లోహకళతో రూపొందించే ఈ పాత్రలపై వెండితో నగిషీలు చెక్కారు. సిరిల్‌ సతీమణికి నాగాలాండ్‌లో ఆదివాసీలు తయారు చేసిన శాలువాను బహుమానంగా ఇచ్చారు.  ఇక బ్రెజిల్‌ అధ్యక్షుడు లూయిజ్‌ ఇనాషియో లాలూ డా సిల్వాకు మధ్యప్రదేశ్‌కు చెందిన గోండ్‌ పెయింటింగ్స్‌ను కానుకగా ఇచ్చారు. గ్రీసు ప్రధాని కరియాకోస్‌కు ఛత్తీస్‌గఢ్‌ కళాకృతులైన ఇత్తడితో తయారు చేసిన డోక్రాను, ఆయన సతీమణికి మేఘాలయలో తయారైన శాలువాను కానుకగా ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement