![18 killed, four injured as mini goods vehicle plunges into valley in Chhattisgarh](/sites/default/files/styles/webp/public/article_images/2024/05/21/vechile.jpg.webp?itok=KGNd7JDp)
వ్యాన్ లోయలో పడి 19 మంది మృతి
దుమ్ముగూడెం: చత్తీస్గఢ్ రాష్ట్రంలోని కబిర్ధామ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వ్యాన్ అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ఘటనలో 19 మంది ప్రాణాలు కోల్పోగా మరో నలుగురు గాయాలపాలయ్యారు.
మృతుల్లో 18 మంది మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. కభీర్దామ్ జిల్లాలోని సెమ్హరా గ్రామానికి చెందిన గిరిజనులు తునికాకు సేకరణ కోసం సమీపంలోని అడవికి వెళ్లారు. తిరిగి వస్తుండగా వారు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్ కుక్దూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని బహపానీ గ్రామ సమీపంలో బంజారి ఘాట్లో అదుపుతప్పి 20 అడుగుల లోతున్న లోయలో పడింది.
Comments
Please login to add a commentAdd a comment