‘గ్లూకోజ్‌ వాటర్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది’ Delhi Tutor Arrested for Giving Injections to Students to Improve Memory | Sakshi
Sakshi News home page

‘గ్లూకోజ్‌ వాటర్‌తో జ్ఞాపకశక్తి పెరుగుతుంది’

Published Mon, Feb 15 2021 2:14 PM | Last Updated on Mon, Feb 15 2021 2:16 PM

Delhi Tutor Arrested for Giving Injections to Students to Improve Memory - Sakshi

న్యూఢిల్లీ: జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్‌ అంటూ విద్యార్థులను, తల్లిదండ్రులను మోసం చేసిన ఓ ట్యూటర్‌ని ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. వివరాలు.. ఢిల్లీ మండవాలి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సందీప్‌ అనే​ వ్యక్తి నివాసం ఉంటున్నాడు. బీఏ రెండో సంవత్సరం చదువుతోన్న సందీప్‌ పాకెట్‌ మనీ కోసం చుట్టుపక్కల ఉన్న విద్యార్థులకు ట్యూషన్‌ చెప్పేవాడు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం సందీప్‌ తన దగ్గర జ్ఞాపకశక్తి పెరిగే ఇంజక్షన్‌ ఉందని.. అది తీసుకుంటే.. విద్యార్థుల మెమరీ పవర్‌ చాలా బాగా వృద్ధి చెందుతుందని నమ్మించాడు. అతడి మాటలు నమ్మిన విద్యార్థులు ఆ ఇంజక్షన్‌ను తీసుకునేందుకు ఎగబడ్డారు. 

ఈ క్రమంలో ఓ విద్యార్థి తల్లిదండ్రులకు దీని గురించి తెలిసింది. అసలు జ్ఞాపకశక్తి పెంచే ఇంజక్షన్‌ ఏంటి అంటూ వారు సందీప్‌ని ఆరా తీశారు. అతడు సెలైన్‌ వాటర్‌ని విద్యార్థులకు ఇస్తే.. అది వారి జ్ఞాపకశక్తిని పెంచుతుందని తెలిపాడు. ఈ విషయాన్ని తాను యూట్యూబ్‌లో చూశానని.. అందుకే విద్యార్థుల జ్ఞాపకశక్తిని పెంచడానికి తాను సెలైన్‌ని ఇచ్చానని వెల్లడించాడు. దీని గురించి విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సందీప్‌పై కేసు నమోదు చేసి.. అతడిని అదుపులోకి తీసుకున్నారు. 

చదవండి: అచ్చం ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాలోలా..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement