సాక్షి, బంజారాహిల్స్: సీఎం కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఐపీసీ సెక్షన్ 504, 506 కింద కేసు నమోదు చేశారు. శ్రీకృష్ణానగర్లో నివసించే మాదాసు రవితేజ అనే వ్యాపారి ఇచి్చన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సీఎం కేసీఆర్ను ఉద్దేశించి క్యూన్యూస్లో ‘నీకు దమ్ముంటే నాదగ్గరికి రా’ అని తీన్మార్ మల్లన్న సవాల్ విసరడం తనను షాక్కు గురి చేసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు సాధారణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని ఆరోపించారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Breadcrumb
జూబ్లీహిల్స్: తీన్మార్ మల్లన్నపై కేసు
Published Fri, Aug 27 2021 9:16 PM | Last Updated on Fri, Aug 27 2021 10:01 PM
Related news by tags
-
రన్నరప్ రాజా రిత్విక్
జాతీయ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ రెండో పతకాన్ని సాధించాడు. ర్యాపిడ్ ఫార్మాట్లో కాంస్య పతకం నెగ్గిన రిత్విక్ గురువారం నాసిక్లో జరిగిన బ్లిట్జ్ ఫార్మాట్లో రన్నరప్గా నిలిచి రజత పతకం సాధించాడు. నిర్ణీత 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో రిత్విక్ 9 పాయింట్లు సాధించి రెండో స్థానంలో నిలిచాడు. రిత్విక్ మొత్తం 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, నాలుగింటిని ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలిచాడు. 9.5 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) చాంపియన్గా నిలిచాడు. -
Chess Championship: రాజా రిత్విక్కు కాంస్యం
సాక్షి, హైదరాబాద్: జాతీయ ర్యాపిడ్ చెస్ చాంపియన్షిప్లో తెలంగాణ గ్రాండ్మాస్టర్ రాజా రిత్విక్ కాంస్య పతకం సాధించాడు. నాసిక్లో బుధవారం ముగిసిన ఈ టోర్నీలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత రిత్విక్ 8.5 పాయింట్లతో మరో ఏడుగురితో కలిసి ఉమ్మడిగా రెండో స్థానంలో నిలిచాడు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా... ఆరోణ్యక్ ఘోష్ (రైల్వేస్)కు రెండో ర్యాంక్, రిత్విక్కు మూడో ర్యాంక్ దక్కాయి. 9 పాయింట్లతో దీప్తాయన్ ఘోష్ (రైల్వేస్) విజేతగా నిలిచాడు. రిత్విక్ ఆడిన 11 గేముల్లో ఏడింటిలో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్లో ఓడిపోయాడు. కాంస్యం నెగ్గిన రిత్విక్ను తెలంగాణ రాష్ట్ర చెస్ సంఘం అధ్యక్షుడు కేఎస్ ప్రసాద్ అభినందించారు. ఈ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన కార్తీక్ వెంకటరామన్, నూతక్కి ప్రియాంక 13వ, 14వ ర్యాంక్ల్లో నిలిచారు. సహజ శుభారంభం నాగ్పూర్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య మహిళల టర్నీలో హైదరాబాద్ అమ్మాయి సహజ యామలపల్లి శుభారంభం చేసింది. బుధవారం జరిగిన సింగిల్స్ తొలి రౌండ్లో సహజ 3–6, 6–1, 6–1తో భారత్కే చెందిన వైదేహి చౌదరీని ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. న్యూజిలాండ్తో భారత్ తొలి పోరు లుసానె (స్విట్జర్లాండ్): పారిస్ ఒలింపిక్స్ పురుషుల హాకీ ఈవెంట్ షెడ్యూల్ను బుధవారం విడుదల చేశారు. పూల్ ‘బి’లో ఉన్న భారత జట్టు తమ తొలి మ్యాచ్ను జూలై 27న న్యూజిలాండ్తో ఆడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. గత టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకం నెగ్గిన భారత జట్టు తమ రెండో మ్యాచ్ను జూలై 29న అర్జెంటీనాతో (సాయంత్రం గం. 4:15 నుంచి)... మూడో మ్యాచ్ను జూలై 30న ఐర్లాండ్తో (సాయంత్రం గం. 4:45 నుంచి)... నాలుగో మ్యాచ్ను ఆగస్టు 1న బెల్జియంతో (మధ్యాహ్నం గం. 1:30 నుంచి)... ఐదో మ్యాచ్ను ఆగస్టు 2న ఆ్రస్టేలియా తో (సాయంత్రం గం. 4:45 నుంచి) ఆడుతుంది. -
నైనా ఖాతాలో ఐదో విజయం
సాక్షి, హైదరాబాద్: జాతీయ అండర్–13 చెస్ చాంపియన్షిప్ బాలికల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నైనా గొర్లి వరుసగా ఐదో విజయం నమోదు చేసి అజేయంగా నిలిచింది. బుధవారం జరిగిన నాలుగో రౌండ్లో వైజాగ్కు చెందిన నైనా 60 ఎత్తుల్లో మీరా సింగ్ (ఢిల్లీ)పై, ఐదో రౌండ్లో 80 ఎత్తుల్లో ఆముక్త (ఆంధ్రప్రదేశ్)పై గెలిచింది. ఐదో రౌండ్ తర్వాత నైనా ఐదు పాయింట్లతో మరో ముగ్గురితో కలిసి ఉమ్మడిగా అగ్రస్థానంలో ఉంది. తెలంగాణకు చెందిన సంహిత పుంగవనం, బి.కీర్తిక 4.5 పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో ఉన్నారు. ఓపెన్ విభాగంలో తెలంగాణ కుర్రాడు చల్లా సహర్ష ఐదో రౌండ్ తర్వాత 4.5 పాయింట్లతో మరో ఎనిమిది మందితో కలిసి రెండో ర్యాంక్లో ఉన్నాడు. -
‘గ్రాండ్మాస్టర్’ రాజా రిత్విక్
సాక్షి, హైదరాబాద్: ప్రతి చెస్ క్రీడాకారుడు గొప్ప ఘనతగా భావించే గ్రాండ్మాస్టర్ (జీఎం) టైటిల్ హోదాను తెలంగాణ కుర్రాడు రాజవరం రాజా రితి్వక్ అందుకున్నాడు. హంగేరిలోని బుడాపెస్ట్లో జరుగుతున్న వెజెర్కెప్జో గ్రాండ్మాస్టర్ (జీఎం) చెస్ టోర్నమెంట్లో 17 ఏళ్ల రాజా రితి్వక్ జీఎం హోదా ఖరారు కావడానికి అవసరమైన 2500 ఎలో రేటింగ్ పాయింట్ల మైలురాయిని దాటాడు. బుడాపెస్ట్లోనే గత వారం జరిగిన టోరీ్నలో రితి్వక్ విజేతగా నిలిచి మూడో జీఎం నార్మ్ను సాధించాడు. అయితే అప్పటికి అతని ఎలో రేటింగ్ 2496గా ఉండటంతో గ్రాండ్మాస్టర్ హోదా ఖరారు కాలేదు. ఈనెల 15న మొదలైన వెజెర్కెప్జో టోర్నీలో 2496 ఎలో రేటింగ్తో బరిలోకి దిగిన రితి్వక్ నాలుగో రౌండ్లో ఫినెక్ వచ్లావ్ (చెక్ రిపబ్లిక్)పై 57 ఎత్తుల్లో గెలిచాడు. దాంతో అతని ఖాతాలో ఐదు ఎలో పాయింట్లు చేరి రేటింగ్ 2501కు చేరింది. ఫలితంగా ఇప్పటికే మూడు జీఎం నార్మ్లను సాధించిన రితి్వక్ జీఎం టైటిల్ ఖరారు కావడానికి అవసరమైన 2500 రేటింగ్ను కూడా అందుకోవడంతో భారత్ తరఫున 70వ గ్రాండ్మాస్టర్ అయ్యాడు. వరంగల్ జిల్లాకు చెందిన రాజా రిత్విక్ ఆరేళ్ల ప్రాయంలో చెస్ పట్ల ఆకర్షితుడయ్యాడు. రితి్వక్ తండ్రి ఆర్.శ్రీనివాసరావు యూనివర్సిటీ స్థాయిలో చెస్ ఆడారు. తొలుత వరంగల్లో స్థానిక కోచ్ బొల్లం సంపత్ వద్ద ఓనమాలు నేర్చుకున్న రిత్విక్ ఆ తర్వాత హైదరాబాద్లోని కె.నరసింహా రావు వద్ద తన ఆటతీరుకు మెరుగులు దిద్దుకున్నాడు. గత నాలుగేళ్లుగా ఎన్.వి.ఎస్. రామరాజు వద్ద శిక్షణ తీసుకుంటున్న రిత్విక్ ప్రస్తుతం సికింద్రాబాద్లోని భవాన్స్ శ్రీ రామకృష్ణ విద్యాలయంలో 12వ తరగతి చదువుతున్నాడు. పతకాల పంట... 2012లో కామన్వెల్త్ చాంపియన్íÙప్లో అండర్–8 విభాగంలో రజతం సాధించి అందరి దృష్టిని ఆకర్షించిన రితి్వక్ అటునుంచి వెనుదిరిగి చూడలేదు. 2013లో, 2015లో ఆసియా స్కూల్స్ టోరీ్నలో.. 2018లో ఆసియా యూత్ చాంపియన్íÙప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. 2017 జూన్లో జాతీయ అండర్–13 చాంపియ న్íÙప్లో చాంపియన్గా అవతరించిన రిత్విక్ అదే ఏడాది అక్టోబర్లో జరిగిన జాతీయ అండర్–17 చాంపియన్షిప్లోనూ విజేతగా నిలిచాడు. ఓవరాల్గా రితి్వక్ ఇప్పటివరకు జాతీయస్థాయిలో మూడు స్వర్ణాలు, రెండు రజ తాలు... అంతర్జాతీయస్థాయిలో 10 స్వర్ణాలు, రెండు రజతాలు, ఒక కాంస్యం సాధించాడు. గ్రాండ్మాస్టర్ హోదా సంపాదించినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ టైటిల్తో మరింత ఉత్సాహంతో ముందుకు సాగుతాను. 2600 ఎలో రేటింగ్ అందుకోవడమే నా తదుపరి లక్ష్యం. భవిష్యత్లో ఏనాటికైనా వరల్డ్ చాంపియన్ కావాలన్నదే నా జీవిత లక్ష్యం. –రాజా రిత్విక్ తెలంగాణ నుంచి గ్రాండ్మాస్టర్ అయిన మూడో ప్లేయర్ రిత్విక్. గతంలో హర్ష భరతకోటి, ఎరిగైసి అర్జున్ ఈ ఘనత సాధించారు. తెలుగు రాష్ట్రాల నుంచి గ్రాండ్ మాస్టర్ హోదా పొందిన ఎనిమిదో ప్లేయర్ రిత్విక్. గతంలో పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, హారిక, లలిత్బాబు, కార్తీక్ వెంకటరామన్ (ఆంధ్రప్రదేశ్) ఈ ఘనత సాధించారు. -
రష్యా జీఎంపై రాజా రిత్విక్ గెలుపు
సాక్షి, హైదరాబాద్: టెట్రాసాఫ్ట్ మారియట్ ఇంటర్నేషనల్ గ్రాండ్మాస్టర్ చెస్ టోర్నమెంట్లో తెలంగాణ క్రీడాకారుడు ఐఎం రాజా రిత్విక్ అద్భుత విజయం నమోదు చేశాడు. శుక్రవారం జరిగిన ఐదో రౌండ్ గేమ్లో తనకన్నా ఎంతో మెరుగైన క్రీడాకారుడు రష్యాకు చెందిన గ్రాండ్మాస్టర్ సావ్చెంకో బోరిస్పై రాజా రిత్విక్ 60 ఎత్తుల్లో గెలుపొందాడు. ఐదు రౌండ్ల అనంతరం రష్యాకు చెందిన ఐఎం ట్రియాపిస్కో అలెగ్జాండర్ 5 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఇతర బోర్డుల్లో కార్తికేయన్ (తమిళనాడు)పై ట్రియాపిస్కో అలెగ్జాండర్ (రష్యా), ఉత్కల్ రంజన్ (ఒడిశా)పై తుఖోవ్ ఆడమ్ (ఉక్రెయిన్), మనీశ్ కుమార్ (ఒడిశా)పై లక్ష్మణ్, భరత్ కల్యాణ్ (తమిళనాడు)పై రత్నాకరణ్ (కేరళ), శేఖర్ చంద్ర (ఒడిశా)పై భరత్ కుమార్ రెడ్డి (ఆంధ్రప్రదేశ్), కౌస్తువ్ ఖండు (పశి్చమ బెంగాల్)పై కవింద అఖిల (శ్రీలంక), డి సిల్వా (శ్రీలంక)పై శంతను (మహారాష్ట్ర), రాజు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్ (తెలంగాణ), అజయ్ (ఆంధ్రప్రదేశ్)పై వరుణ్ (ఆంధ్రప్రదేశ్), శ్రీహిత్ రెడ్డి (తెలంగాణ)పై రాజేశ్ (ఒడిశా), జయకుమార్ (మహారాష్ట్ర)పై కార్తీక్ (తెలంగాణ), సురేంద్రన్ (తమిళనాడు)పై రహమాన్ (బంగ్లాదేశ్) గెలుపొందారు.
Related News by category
-
ఎస్సీల ఉపవర్గీకరణపై సుప్రీం జస్టీస్ మిత్తల్ కీలక వ్యాఖ్యలు
ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల వర్గీకరణకు సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం పచ్చజెండా ఊపింది. అత్యంత వెనుకబడిన ఉప కులాలకు ఊతమిచ్చేందుకు వీలుగా రాష్ట్రాలు ఆయా రిజర్వేషన్లను వర్గీకరణ చేసుకోవచ్చని తెలిపింది. రాజ్యాంగంలోని 14వ, 341వ ఆర్టికల్లు ఈ ఉప కోటాకు అడ్డంకి ఏమీ కాదని తేల్చింది. ఈ మేరకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం గురువారం (ఆగస్ట్1న) చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది.ఈ తీర్పును వెలువరించే సమయంలో ఏడుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనంలో ఒకరైన జస్టిస్ పంకజ్ మిత్తల్ 51 పేజీల ప్రత్యేక తీర్పులో కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ల విధానానికి తాజా పునఃపరిశీలన అవసరమని, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన ప్రజల అభ్యున్నతికి కొత్త పద్ధతులు అవసరమని అన్నారు.రాజ్యాంగ పాలనలో కుల వ్యవస్థ లేదని, అణగారిన వర్గాలకు, అణగారిన ఎస్సీ,ఎస్టీ,ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఉద్దేశ్యంతో తీర్పును వెలువరించినట్లు చెప్పారు. దేశం కుల రహిత సమాజంగా మారిందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. పైన పేర్కొన్నవర్గాలకు చెందిన వ్యక్తుల ప్రమోషన్, లేదా ఇతర ప్రయోజనాలు, ప్రత్యేకాధికారం వంటివి కులం ప్రాతిపదికన కాకుండా నివాసం స్థితి, ఆర్థిక కారకాలు, జీవన స్థితి,వృత్తి ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉన్న సౌకర్యాల ఆధారంగా ప్రమాణాలై ఉండాలని జస్టిస్ పంకజ్ మిత్తల్ తెలిపారు. -
రైళ్లలో అందుబాటులోకి బేబీ బెర్తులు: మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: రైళ్లలో బేబీ బెర్తులను ప్రయోగాత్మకంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ రాజ్యసభలో శుక్రవారం(ఆగస్టు2) వెల్లడించారు. రైల్వే కోచ్లలో బేబీ బెర్త్లను అమర్చే ఆలోచన ఉందా అని ఓ ఎంపీ అడిగిన ప్రశ్నకు వైష్ణవ్ సమాధానమిచ్చారు. లక్నో మెయిల్లో రెండు బేబీ బెర్త్లను పైలట్ ప్రాజెక్టు కింద తీసుకువచ్చామన్నారు.మెయిల్లోని ఒక బోగీలో రెండు లోయర్ బెర్త్లకు బేబీ బెర్త్లను అమర్చామని తెలిపారు. దీనిపై ప్రయాణికుల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు. అయితే సీట్ల వద్ద సామాన్లు పెట్టుకునే స్థలం తగ్గిపోవడం, సీట్ల మధ్య దూరం తగ్గిపోవడం లాంటి సమస్యలొచ్చాయన్నారు. అయితే ప్రయాణికుల కోచ్లలో మార్పులు చేయడమనేది నిరంత ప్రక్రియ అని మంత్రి అన్నారు. కాగా,రైళ్లలో లోయర్ బెర్త్లకు అనుబంధంగా ఉండే బేబీ బెర్త్లపై తల్లులు తమ పిల్లలను పడుకోబెట్టుకోవచ్చు. దీనివల్ల ఒకే బెర్త్పై స్థలం సరిపోక ఇబ్బందిపడే బాధ తల్లిపిల్లలకు తప్పుతుంది. -
సభలో మహాభారత కథలొద్దు: స్పీకర్ ఓంబిర్లా ఆగ్రహం
న్యూఢిల్లీ: స్పీకర్ ఓంబిర్లా ఒడిషాకు చెందిన ఎంపీపై శుక్రవారం(ఆగస్టు2) లోక్సభలో మండిపడ్డారు. ఒడిషా బీజేపీ ఎంపీ ప్రదీప్ పురోహిత్ కేంద్ర ఆయుష్ మంత్రిని ఓ ఆయుర్వేద కాలేజీపై ప్రశ్నిస్తూ అక్కడి మూలికల చరిత్రను వివరించబోయారు. దీనికి విసుగు చెందిన స్పీకర్ మహాభారత కథలు వద్దు. ప్రశ్నలడగండి. ఈ మధ్య సభలో మహాభారతం గురించి చెప్పడం ఫ్యాషన్గా మారింది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సభలో అడగాలనుకున్న విషయాలు సూటిగా అడగాలని, కథలు చెప్పొద్దని చురకలంటించారు. -
వయనాడ్లో 100 ఇళ్లు కట్టిస్తాం : రాహుల్ గాంధీ
కేరళ వయనాడ్ విషాదంపై కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కీలక నిర్ణయం తీసుకున్నారు. కొండచరియల కారణంగా సర్వం కోల్పోయిన బాధితులకు కాంగ్రెస్ పార్టీ తరుఫున 100 ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. వయనాడ్ జిల్లాలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 300లు దాటింది. దాదాపు 300 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. వారి కోసం సైన్యం, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. బాధితుల్ని పరామర్శించేందుకు వయనాడ్లో రాహుల్ గాంధీ, ఆయన సోదరి ప్రియాంక గాంధీలు పర్యటిస్తున్నారు. ఈ సందర్భాంగా వియనాడ్ విషాదంపై రాహుల్ విచారం వ్యక్తం చేశారు. ఇలాంటి విషాదం తానెక్కడ చూడలేదన్న ఆయన..బాధితులకు అండగా నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. -
రావూస్ కోచింగ్ సెంటర్ కేసు.. సీబీఐకి అప్పగించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని రావూస్ సివిల్స్ కోచింగ్ సెంటర్ భవనం సెల్లార్లో వరద పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన కేసు దర్యాప్తును ఢిల్లీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి ప్రత్యేక అధికారిని నియమించాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్కు యాక్టింగ్ సీజే మన్మోహన్, జస్టిస్ తుషార్రావులతో కూడిన ధర్మాసనం సూచించింది. ఇంత పెద్ద ఘటనలో దర్యాప్తు నిష్పక్షపాతంగా జరిగిందని సమాజానికి భరోసా ఇచ్చేందుకే కేసు సీబీఐకి అప్పగిస్తున్నట్లు కోర్టు తెలిపింది. ముగ్గురు విద్యార్థులు భవనం కింద వరద నీటిలో మునిగి మృతి చెందడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్, పోలీసులపై ఢిల్లీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు ఇలాంటి ఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.ఇంకా నయం.. వరద నీటిని అరెస్టు చేయలేదు..విధులు సరిగా నిర్వహించకపోవడంపై ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులను కోర్టు మందలించింది. కోచింగ్ సెంటర్ భవన నిర్మాణ అనుమతులు ఇచ్చిన అధికారులను విచారించకుండా ఘటన జరిగిన సమయంలో కోచింగ్సెంటర్ పక్కనుంచి వెళ్లిన కారు నడిపిన వ్యక్తిని అరెస్టు చేయడమేంటని పోలీసులకు కోర్టు చివాట్లు పెట్టింది. దయతలచి భవనం కిందకు వచ్చిన వరద నీటిని అరెస్టు చేయకుండా వదిలిపెట్టారని పోలీసులపై కోర్టు సెటైర్లు వేయడం గమనార్హం.
Advertisement
Comments
Please login to add a commentAdd a comment