రెండో రోజు పార్లమెంట్‌కు 4, అసెంబ్లీకి 6 నామినేషన్లు - | Sakshi
Sakshi News home page

రెండో రోజు పార్లమెంట్‌కు 4, అసెంబ్లీకి 6 నామినేషన్లు

Published Sat, Apr 20 2024 2:05 AM | Last Updated on Sat, Apr 20 2024 2:05 AM

-

తుమ్మపాల: నామినేషన్ల పర్వంలో రెండో రోజు శుక్రవారం అనకాపల్లి లోక్‌సభ స్థానానికి నలుగురు, 4 శాసనసభ స్థానాలకు ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పార్లమెంటు స్థానానికి కోన గురువయ్యయాదవ్‌ (సమాజ్‌వాదీ పార్టీ), కర్రి విజయలక్ష్మి (పిరమిడ్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా), నమ్మి అప్పలరాజు (భారత చైతన్య యువజన పార్టీ), గవిరెడ్డి రమ (స్వతంత్ర) కలెక్టరేట్‌లో జిల్లా ఎన్నికల అధికారి వారి వద్ద నామినేషన్‌ సమర్పించారు. అసెంబ్లీ స్థాలకు యలమంచిలి నియోజకవర్గం నుంచి ప్రస్తుత ఎమ్మెల్యే యు.వి.రమణమూర్తిరాజు (వైఎస్సార్‌సీపీ) నామినేషన్‌ వేశారు. అనకాపల్లిలో జనసేన పార్టీ తరపున కొణతాల రామకృష్ణ, నర్సీపట్నంలో టీడీపీ అభ్యర్థి చింతకాయల అయ్యన్నపాత్రుడు, మాడుగులలో టీడీపీ నాయకులు పైలా ప్రసాదరావు, పైలా ఈవీఎస్‌ నాయుడు, స్వతంత్ర అభ్యర్థి కరణం తిరుపతిరావు నామినేషన్లు దాఖలు చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement