-
యూట్యూబ్ చానల్ను ప్రారంభించిన రాఘవేంద్రరావు.. కారణమిదే!
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ఎన్నో అద్భుతమైన సినిమాలను తెరకెక్కించి తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. భక్తిరస చిత్రాలు తెరకెక్కించడంలో అయినా, రొమాంటిక్ పాటలు చిత్రీకరించడంలో అయినా ఆయనది ప్రత్యేక శైలి. ఎంతోమంది నటుల్ని ఇండస్ట్రీకి పరిచయం చేసి స్టార్ స్టేటస్ అందించారు. ముఖ్యంగా హీరోయిన్స్ను అందంగా చూపించడంలో రాఘవేంద్రరావు తర్వాతే ఎవరైనా అనేలా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్నారు. దశాబ్దాలుగా తన సినిమాలతో అలరిస్తున్న రాఘవేంద్రరావు తాజాగా మరో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘కేఆర్ఆర్ వర్క్స్’ పేరుతో యూట్యూబ్ చానెల్ను ప్రారంభించిన ఆయన ఇప్పుడు కొత్తవారిని వెండితెరకు పరిచయం చేయనున్నారు. ఎంతో టాలెంట్ ఉండి సరైన ప్లాట్ఫామ్ కోసం ఎదురుచూస్తున్న సామాన్యులకు ఇదొక చక్కని అవకాశం. కాగా ఈ చానల్ను దర్శకధీరుడు రాజమౌళి లాంచ్ చేయడం విశేషం. ఈ సందర్భంగా రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో మందిని పరిచయం చేశారు. ఎంత చేసినా అతని తపన ఆగలేదు. ఇప్పుడు మరింత మందిని వెండితెరకు పరిచయం చేసేందుకు సిద్ధమయ్యారు అంటూ రాఘవేంద్రరావుపై ప్రశంసలు కురిపించారు. -
Saurabh Maurya: విజయ సౌరభం
మంచి ప్యాకేజీతో ఉద్యోగ అవకాశం వచ్చినప్పటికీ సొంతంగా ఏదైనా స్టార్టప్ ప్రారంభించాలనేది సౌరభ్ మౌర్య కల. అయితే తన దగ్గర అమ్మ పంపించిన అయిదువేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. ఆ డబ్బుతో సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్ కొన్నాడు. స్టార్టప్లు స్టార్ట్ చేసి కోటీశ్వరుడిగా ఎదిగి, ఎంతోమందికి రోల్మోడల్ కావడానికి అవసరమైన ప్రయాణం ఈ సెకండ్ హ్యాండ్ సెల్ఫోన్ నుంచే మొదలైంది! ఉత్తర్ప్రదేశ్లోని జౌన్పుర్ అనే చిన్నగ్రామంలో పుట్టి పెరిగాడు సౌరభ్ మౌర్య. పేదరికంలో ఉన్నప్పటికీ తన పిల్లలను అప్పు చేసైనా పెద్ద చదువులు చదివించాలనుకునేవాడు తండ్రి. సౌరభ్ ఇద్దరు అన్నలు చదువులో మందుండేవారు. పై చదువుల కోసం వారిని బెనారస్కు పంపాడు తండ్రి. మొదటి ప్రయత్నంలో ఇద్దరు ‘ఐఐటీ–జెఇఇ’లో ఉత్తీర్ణులయ్యారు. ముగ్గురు పిల్లలు పెద్ద చదువులు చదివి, పెద్ద ఉద్యోగాలు చేయాలని కలలు కనేవారు తల్లిదండ్రులు. అయితే సౌరభ్ పరిస్థితి వేరు. తనకు పెద్ద ఉద్యోగం చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలనేది కల. కంప్యూటర్ స్టోర్ అనేది ఆ కలలలో ఒకటి. మొదటి ప్రయత్నంలో ‘ఐఐటీ– జెఇఇ’లో ఫెయిలయ్యాడు సౌరభ్. ‘నేను ఫెయిలయ్యాను అనే బాధ కంటే తల్లిదండ్రులను బాధ పెట్టాను అనే ఆలోచన నన్ను ఎక్కువగా బాధ పెట్టింది’ అంటున్న సౌరభ్ కష్టపడి చదివి రెండో ప్రయత్నంలో సక్సెస్ అయ్యాడు. ఐఐటీ–బెనారస్ కాలేజీలోకి వెళ్లిన తరువాత తనకొక కొత్త ప్రపంచం పరిచయం అయింది. తనలాగే ఆలోచించే ఎంతోమందితో పరిచయం ఏర్పడింది. మరో వైపు ఏదైనా సొంతంగా చేయాలనే ఆలోచనలు మనసులో సుడులు తిరుగుతున్నాయి. జేబు ఖర్చుల కోసం 6–8 తరగతులకు ట్యూషన్స్ చెప్పడం మొదలుపెట్టాడు. జేబుఖర్చుల మాట ఎలా ఉన్నా పోను పోను ‘బోధన’ అనేది తనకొక ప్యాషన్గా మారింది. తల్లి పంపించిన అయిదువేలతో సెకండ్హ్యాండ్ సెల్ఫోన్ కొనడంతో తన కెరీర్ మొదలు పెట్టడానికి మొదటి అడుగు పడింది. కొద్దిరోజులకు యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. ఐఐటీ–జెఇఇ పరీక్షలో విఫలమైన తాను రెండో ప్రయత్నంలో ఎలా విజయం సాధించింది మొదలు ఐఐటీకి సంబంధించిన ఎన్నో విషయాలను ఈ యూట్యూబ్ చానల్ ద్వారా చెప్పడం మొదలుపెట్టాడు. ఈ చానల్కు మంచి ఆదరణ లభించడంతో సౌరభ్లో ఉత్సాహం వెల్లువెత్తింది. నాలుగు సంవత్సరాల అనుభవం తరువాత స్టాక్ మార్కెట్ ట్రేడర్గా సక్సెస్ అయ్యాడు. ‘ఐఐటీయన్ ట్రేడర్’ పేరుతో ట్రేడింగ్ స్ట్రాటజీస్, టెక్నికల్ ఎనాలసిస్...మొదలైన ఆన్లైన్ కోర్సులు ప్రారంభించి సక్సెస్ సాధించాడు. చిన్న వ్యాపారమైనా సరే, సొంతంగా మొదలుపెడితే చాలు అనుకున్న సౌరభ్ 11–12 తరగతుల విద్యార్థులు ‘ఐఐటీ–జెఇఇ’ లక్ష్యాన్ని ఛేదించడానికి అవసరమైన బలమైన పునాదిని ఏర్పాటు చేయడానికి ప్రారంభించిన ‘రైట్–ర్యాంకర్స్’ స్టార్టప్, ఆన్లైన్ స్టాక్మార్కెట్ ఎడ్యుకేషన్ స్టార్టప్ ‘ఐఐటీయన్ ట్రేడర్స్’ సక్సెస్ సాధించి తనను 22 కోట్ల క్లబ్లోకి చేర్చాయి. ‘ఏదైనా సాధించాలనే పట్టుదల ఉన్నప్పుడు డబ్బు, వనరుల కొరత ఎప్పుడూ అడ్డంకి కాదు. ఒకసారి మీరు కూడా ప్రయత్నించి చూడండి’ అంటున్నాడు 22 సంవత్సరాల సౌరభ్ మౌర్య. -
అలీ కూతురి పెళ్లి వీడియో వచ్చేసింది.. ఎంత గ్రాండ్గా జరిగిందో..
ప్రముఖ కమెడియన్, నటుడు అలీ కూతురు ఫాతిమా ఇటీవలె పెళ్లిపీటలెక్కిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఘనంగా జరిగిన ఈ వివాహానికి చిరంజీవీ, నాగార్జున సహా పలువురు ప్రముఖులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇప్పటికే ఫాతిమా పెళ్లికి సంబంధించన ఫోటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే అలీ సినిమాలు ,టీవీ షోల ద్వారా అలరిస్తుండా, ఆయన భార్య జుబేదా అలీ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. ఈమె యూట్యూబ్ ఛానల్కు ఇప్పడు సుమారు 6లక్షల 91వేల సబ్స్రైబర్లు ఉన్నారు. కూతురి పెళ్లి షాపింగ్ దగ్గరి నుంచి హల్దీ, పెళ్లి కూతుర్ని చేయడం సహా ప్రతి వీడియోను ఆమె అభిమానులతో షేర్ చేస్తుంటుంది. ఇక జుబేదా అలీ యూట్యూబ్ వీడియోలకు బాగానే ఫాలోయింగ్ ఉంది. ఆమె ఏ వీడియో పోస్ట్ చేసినా లక్షల్లో వ్యూస్ వస్తాయి. తాజాగా కూతురు ఫాతిమా పెళ్లి ఎలా జరిగింది? మండపం దగ్గరికి తీసుకొచ్చిన్నప్పటి నుంచి పెళ్లి తంతులో కూతురు ఎమోషనల్ అయిన క్షణాల వరకు.. వీడియో రూపంలో మన ముందుకు తీసుకొచ్చారు. మరి టాలీవుడ్ ప్రముఖులు విచ్చేసిన అలీ కూతురి పెళ్లి ఎంత ఘనంగా జరిగిందో వీడియోలో చూసేయండి. -
నరేష్, పవిత్ర ఫిర్యాదు.. యూట్యూబ్ జర్నలిస్టుకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: సినీనటులు నరేశ్, పవిత్రా లోకేశ్ల వ్యక్తిగత జీవితంపై పలు వార్తలను టెలికాస్ట్ చేసిన ‘ఇమండి రామారావు’ చానల్ జర్నలిస్టు రామారావుకు సైబర్క్రైం పోలీసులు నోటీసులు జారీచేశారు. తమపై ఇష్టానుసారంగా వార్తలను ప్రసారం చేస్తూ తమ ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారంటూ నటులు నరేశ్, పవిత్ర ఇటీవల సైబర్క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు రామారావుకు నోటీసులిచ్చారు. మరిన్ని చానళ్లు కూడా ఈ వార్తలను ప్రసారం చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు వారికి కూడా నోటీసులిచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ వార్తల వెనుక రమ్య రఘుపతి ప్రమేయం ఉన్నట్లు నిర్ధారణ అయితే ఆమెకు కూడా నోటీసులిచ్చేందుకు వెనుకాడబోమని సైబర్క్రైం పోలీసులు తెలిపారు. చదవండి: అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ -
యూజర్లకు బంపరాఫర్.. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్!
యూట్యూబ్(Youtube).. అటు ఆన్లైన్ ఇటు ఆఫ్లైన్ ఎక్కడ విన్నా ఈ పేరే వినపడుతోంది. విభిన్నమైన కంటెంట్లతో పాటు తమలోని టాలెంట్ని ప్రదర్శించేందుకు అనువైన వేదికగా మారింది యూట్యూబ్. అందుకే పిల్లలు, టీనేజర్లు అనే తేడాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలను తన వైపు తిప్పుకున్న అతిపెద్ద వీడియో ప్లాట్ఫాంగా అవతరించింది. ప్రస్తుతం ఈ ప్రముఖ సంస్థ తన యూజర్ల కోసం వెల్కమ్ ప్రోగ్రామ్ను అందిస్తోంది. అది కూడా కేవలం పది రూపాయలకే యూట్యూబ్ ప్రీమియం మూడు నెలల సబ్స్క్రిప్షన్ను ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ ఆఫర్ ఎంతకాలం అందుబాటులో ఉంటుందో కంపెనీ వెల్లడించలేదు. దీంతో ఈ ఆఫర్ పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుందని తెలుస్తోంది. రూ.10కే మూడు నెలల సబ్స్క్రిప్షన్ యూట్యూబ్లో మనకి కావాల్సిన వీడియోలను వీటితో పాటు పలు సర్వీస్లు కూడా ఉచితంగా చూసే వెసలుబాటు కల్పిస్తోంది. కానీ యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium) అనేది సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అంటే నగదు చెల్లిస్తేనే ఈ సేవలను పొందగలం. ఇందులో యాడ్-ఫ్రీ వీడియో ఎక్స్ ఫీరియన్స్, వీడియోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. వీడియోలను ఆఫ్లైన్లో ప్లే చేయడం, బ్యాక్గ్రౌండ్లో వీడియోలను ప్లే చేయడం, YouTube Musicకు మెంబర్షిప్ వంటి అనేక ఇతర ఫీచర్లను YouTube Kids యాప్పై అందిస్తుంది. ప్రస్తుతం యూట్యూబ్ ప్రకటించిన ఆఫర్ ప్రకారం ఈ సేవలన్నీ కేవలం పది రూపాయలకే మూడు నెలల పాటు పొందచ్చు. అయితే ఇక్కడ గమనించాల్సిన ఇంకో విషయం ఏమిటంటే, YouTube తీసుకొచ్చిన ఈ ఆఫర్ మొదటిసారిగా యూట్యూబ్ రెడ్ (YouTube Red), మ్యూజిక్ ప్రీమియం (Music Premium), యూట్యూబ్ ప్రీమియం (YouTube Premium), గూగుల్ ప్లే (Google Play) సబ్స్క్రైబర్లకు మాత్రమే చెల్లుబాటు అవుతుందని పేర్కొంది. ఈ ఆఫర్ కాలం పూర్తయిన తర్వాత యూట్యూబ్ ప్రీమియం ఫీచర్లను పొందాలంటే నెలకు రూ.129 చెల్లించాలి. మరో విషయం ఏమిటంటే రూ.10 ఆఫర్ ముగియడానికి 7 రోజుల ముందు సబ్స్క్రైబర్కు YouTube గుర్తుచేస్తుంది, తద్వారా వారు సభ్యత్వాన్ని కొనసాగిస్తారా లేదా నిలిపివేస్తారా అనేది వారే నిర్ణయించుకోవచ్చు. చదవండి: భారత్లో తొలిసారి, కొత్త వాషింగ్ మెషీన్ వచ్చిందోచ్.. నోటితో చెప్తే ఉతికేస్తుంది! -
ఏడు కోట్ల మంది వీక్షకులు.. మంగారాణి యూట్యూబ్ చానల్.. లెసెన్స్.. అదుర్స్
కంబాలచెరువు(రాజమహేంద్రవరం)తూర్పుగోదావరి: స్థానిక శ్రీనాగరాజా నగరపాలక సంస్థ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మోటూరి మంగారాణి అరుదైన ఘనత సాధించారు. విద్యార్థులకు సులువైన బోధన దిశగా ‘మంగారాణి లెస్సన్స్’ పేరుతో ఆమె నిర్వహిస్తున్న యూట్యూబ్ చానల్కు సుమారు 100కు పైగా దేశాల్లో ఏడు కోట్ల మంది వీక్షకులతో పాటు రెండు లక్షల మంది సభ్యులు చేరారు. ఒక ఉపాధ్యాయ యూట్యూబ్ చానల్కు రెండు లక్షల మంది సభ్యులు ఉండడం చాలా అరుదు. చదవండి: అలా గిన్నిస్ రికార్డు ‘అల్లు’కుపోయారు మంగారాణి ప్రాథమిక స్థాయి విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో గేయాలు, యానిమేషన్ చిత్రాలతో వీడియో పాఠాలను రూపొందించి తన యూట్యూబ్ చానల్ ద్వారా అనేక మంది ఉపాధ్యాయులకు అందజేస్తున్నారు. ఈ పాఠాలను రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం ప్రారంభించిన దీక్ష ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా ప్రస్తుత నూతన పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్ కోడ్లతో కూడా మంగారాణి అనుసంధానించారు. ఈ సందర్భంగా మంగారాణిని అర్బన్ రేంజ్ డీఐ బి.దిలీప్ కుమార్, పలువురు ఉపాధ్యాయులు అభినందించారు. -
ఆ యూట్యూబ్ ఛానెళ్లు బ్యాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఫేక్ న్యూస్, విద్వేషాలు రెచ్చగొట్టేలా వీడియోలు పోస్ట్ చేస్తున్న పలు యూట్యూబ్ ఛానెళ్లపై కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఐటీ చట్టం 2021 నిబంధనల ప్రకారం.. 10 యూట్యూబ్ ఛానెల్స్కు సంబంధించిన 45 వీడియోలను బ్లాక్ చేసినట్లు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ఈ ఛానెళ్లు మార్పింగ్ వీడియోలు, ఫోటోలను ఉపయోగించి భారత జాతీయ భద్రతకు, విదేశీ సంబంధాలు దెబ్బతినేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్నిపథ్, ఆర్మీ, కశ్మీర్ అంశాలపై తప్పుడు వార్తలు వ్యాప్తి చేస్తున్నట్లు గుర్తించి ఈ చర్యలు తీసుకున్నామని తెలిపారు. ‘తప్పు వార్తల ద్వారా భారత్కు ఇతర దేశాలతో సంబంధాలను దెబ్బతీసేలా వీడియోలు చేస్తున్న యూట్యూబ్ ఛానెళ్లను ప్రసార, సమాచార శాఖ బ్యాన్ చేసింది. దేశ భద్రతా అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నాం. భవిష్యత్తులోనూ ఇలాంటి చర్యలు తీసుకుంటాం. భారత సార్వభౌమత్వం, సమగ్రతను, జాతీయ భద్రత, విదేశీ సంబంధాలు, ప్రజా సంబంధాలను దెబ్బతీసేందుకు చేసే కుట్రను అణచివేసేందుకు కేంద్రం కట్టుబడి ఉంది.’ అని తెలిపారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్. ఇదీ చదవండి: రసవత్తరంగా రాజస్థాన్ రాజకీయ సంక్షోభం: గెహ్లాట్ను రేసు నుంచి తప్పించాలంటూ ఫిర్యాదు -
‘సహనానికి పరీక్ష’, యూట్యూబ్ యూజర్లకు భారీ షాక్!
ప్రముఖ వీడియో షేరింగ్ దిగ్గజం యూజర్లకు యూట్యూబ్ భారీ షాక్ ఇచ్చింది. యూజర్ల సహనానికి పరీక్ష పెడుతూ సెప్టెంబర్ నెల ప్రారంభం నుంచి సైలెంట్గా కొత్త యాడ్ ఫార్మాట్ను ప్రారంభించింది. ఈ కొత్త యాడ్ ఫార్మాట్ ప్రకారం.. యూట్యూబ్ ప్రీమియం తీసుకోని యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ యూజర్లకు అదనంగా యాడ్స్ జోడించింది. యూట్యూబ్ ఫ్రీ వెర్షన్ వాడే వారికి వీడియో ఆరంభంలో 2యాడ్స్ మాత్రమే కనిపించేవి. కానీ ఇకపై యూజర్ల సహనానికి మరింత పరీక్ష పెట్టేలా 5యాడ్స్ను తీసుకొని రానుంది. ఇప్పటికే ఈ కొత్త యాడ్ మోడల్ ఎంపిక చేసిన యూజర్లకు ప్లే అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఓ యూజర్ తాను వీడియో చూస్తున్నప్పుడు 5యాడ్స్ ప్లే అవుతున్నాయి. ఆ యాడ్స్ పట్ల అసౌకర్యానికి గురవుతున్నామని, వివరణ ఇవ్వాలని కోరుతూ ట్వీట్ చేశాడు. ఆ ట్వీట్పై యూట్యూబ్ యాజమాన్యం స్పందించింది. ఇలా 5 యాడ్స్ ప్లే అయితే వాటిని బంపర్ యాడ్స్ అంటారు. ఒక్కోటి 6 సెకన్లు ఉంటుందని వివరణిచ్చింది. ప్రస్తుతం ఈ నిర్ణయంపై యూట్యూబ్ యూజర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
విలేజ్ కుకింగ్ ఛానెల్తో మరోసారి..
కన్యాకుమారి: విలేజ్ కుకింగ్ ఛానెల్.. యూట్యూబ్లో వంట వీడియోలను చూసేవాళ్లకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని ఛానెల్. ప్రకృతి ఒడిలో పచ్చటి పొలాల నడుమ.. సహజసిద్ధమైన వాటితోనే సంప్రదాయరీతిలో వంటలు చేస్తూ, ఆ రుచుల్ని వాళ్లు మాత్రమే ఆస్వాదించడమే కాకుండా.. వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలకు వడ్డిస్తూ దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఒక తమిళ కుకింగ్ ఛానెల్. తాజాగా ఈ ఛానెల్ సభ్యులు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని కలిశారు. కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్రలో భాగంగా పాదయాత్ర చేస్తున్న రాహుల్ గాంధీని శుక్రవారం ఈ ఛానెల్ సభ్యులు కలుసుకున్నారు. వాళ్లను ఆప్యాయంగా పలకరించిన రాహుల్ గాంధీ.. కాసేపు ముచ్చటించారు. ఈ క్రమంలో కాంగ్రెస్ యాత్రకు విలేజ్ కుకింగ్ ఛానెల్ సభ్యులు మద్దతు ప్రకటించారు. అయితే.. Shri @RahulGandhi meets the members of the Village cooking channel during the yatra. The village cooking channel is having - 17.9 M subscribers.#BharatJodoYatra#villagecookingchannel pic.twitter.com/fjlBuxQPWA — Arjunreddy Thodigala (@AThodigala) September 9, 2022 ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. విలేజ్ కుకింగ్ ఛానెల్కు పాన్ ఇండియా గుర్తింపు దక్కింది ఇంతకు ముందు రాహుల్ గాంధీని కలిసిన తర్వాతే. గతంలో ఈ కుకింగ్ ఛానెల్ వీడియోలో మష్రూమ్ బిర్యానీ సెషన్లో పాల్గొన్నారు రాహుల్. అప్పటిదాకా సౌత్కు మాత్రమే పరిమితమైన వీళ్ల ఫేమ్.. రాహుల్ పాల్గొనడంతో నార్త్కు సైతం పాకింది. విలేజ్ కుకింగ్ ఛానెల్ను కేటరింగ్ చేసి ఆపేసిన పెరియాతంబీ అనే పెద్దాయన తన మనవళ్ల సాయంతో 2018లో సరదాగా ప్రారంభించారు. టైంపాస్గా ప్రారంభించిన ఈ ఛానెల్.. తక్కువ టైంలో, అందునా కరోనా టైంలో బాగా పాపులర్ అయ్యింది. అరుస్తూ చేసే గోలతో ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. తమిళనాడులో 10 మిలియన్ల సబ్స్క్రయిబర్స్ పూర్తి చేసుకున్న తొలి యూట్యూబ్ ఛానెల్ ఇదే కావడం గమనార్హం. ఈ బృందం ఈ మధ్యే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో కమల్ హాసన్ లీడ్ రోల్ చేసిన ‘విక్రమ్’ సినిమాలోనూ ఓ సీక్వెన్స్లో సందడి చేసింది. ప్రస్తుతం ఈ ఛానెల్కు 18 మిలియన్ల సబ్స్క్రయిబర్స్పైనే ఉన్నారు. ఎల్లారుం వాంగా.. ఆల్వేస్ వెల్కమ్స్ యూ అంటూ అంటూ వాళ్లు ఆహ్వానించే విధానం గత నాలుగేళ్ల నుంచి ప్రధానంగా ఆకట్టుకుంటోంది కూడా. ఇదీ చదవండి: మోదీ సూట్ Vs రాహుల్ టీ షర్ట్ -
అభిమానులకు యూట్యూబ్ స్టార్ కుచ్చుటోపీ.. రూ. 437 కోట్లు ముంచేసి
తన డ్యాన్స్ వీడియోలతో అభిమానుల్లో క్రేజ్ తెచ్చుకుంది. యూట్యూబ్లో లక్షలాది మంది ఫాలోవర్స్ను సంపాదించుకుంది. చివరికి వీదేశీ మారకపు వ్యాపారం పేరుతోవేలాది మంది అభిమానులను నట్టేట ముంచింది. తమ పెట్టుబడులపై భారీ రాబడి ఇప్పిస్తానని మాటిచ్చి సుమారు 55 మిలియన్ డాలర్లకు(భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 437కోట్లు) కుచ్చుటోపీ పెట్టింది. వివారల్లోకి వెళితే.. (Photo Credits: Nutty Instagram) థాయ్లాండ్కు చెందిన నత్తమోన్ ఖోంగోచక్ అనే యుయవతి తన డ్యాన్స్ వీడియోలు యూట్యూబ్లో పోస్టు చేయడం ద్వారా లక్షలాది అభిమానులను సంపాదించుకుంది. ముద్దుగా నట్టి అని పిలుచుకునే ఈ బ్యూటీకి ప్రస్తుతం 8,44,000 ఫాలోవర్స్ ఉన్నారు. దీంతో అతి తక్కువ కాలంలోనే యూట్యూబ్ స్టార్గా ఎదిగింది. అంతేగాక తన ఇన్స్టాగ్రామ్ పేజ్లో ఔత్సాహిక ఫారెక్స్ వ్యాపారుల కోసం ప్రైవేట్ కోర్సులకు ప్రచారం కూడా చేపట్టింది. దీని ద్వారా ఆమె పొందిన లాభాలను సైతం పోస్టు చేసింది. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) అయితే విదేశీ మారకంలో పెట్టుబడి పెడితే 35 శాతం అధికంగా లాభాలు వస్తానని అభిమానులను, ఫాలోవర్లను నమ్మించింది. నట్టి మాటలను నమ్మిన ఆమె ఫాలోవర్స్ దాదాపు 6వేల మంది డబ్బులు పెట్టుబడి పెట్టడానికి ముందుకొచ్చారు. అయితే ఉన్నట్టుండి నట్టి తన చివరి ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో.. మే నెలలో పెట్టుబడిదారులకు తాను 1 బిలియన్ భాట్ (27.5 మిలియన్ డాలర్లు) బకాయిపడ్డానని చెప్పింది. చదవండి: పెళ్లి కోసం నడి రోడ్డులో వధూవరుల ఛేజింగ్.. వీడియో వైరల్ (Photo Credits: Nutty Instagram) అంతేగాక బ్రోకర్గా వ్యవహరించిన వ్యక్తి గత మార్చి నుంచి తన ట్రేడింగ్ను ఖాతాను, నిధులను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. ఫాలోవర్స్ను మోసం చేయడం తన ఉద్ధేశ్యం కాదని త్వరలోనే వారి పెట్టుబడులు తిరిగి చెల్లించేందకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొంది. అయితే అధిక మొత్తంలో లాభాలు ఇప్పిస్తానని మాటిచ్చి.. నట్టి మోసం చేసిందని బాధితులు థాయ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇప్పటివరకు 102 మంది 30 మిలియన్ భాట్లు(6 కోట్ల 50 వేలు) కోల్పోయినట్లు ఫిర్యాదు చేయగా.. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని పోలీసులు తెలిపారు. (Photo Credits: Nutty Instagram) View this post on Instagram A post shared by 🎬𝗬𝗼𝘂𝘁𝘂𝗯𝗲: Nutty’s Diary (842k) (@nutty.suchataa) మరోవైపు నట్టిని అరెస్ట్ చేసేందుకు థాయిలాండ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో గత వారం వారంట్ జారీ చేసింది. అయితే జూన్ నుంచి నట్టి సోషల్ మీడియాలో యాక్టివ్గా లేకపోవడంతో ఆమె దేశం విడిచి పారిపోయినట్లు భావిస్తున్నారు. కానీ ఇమ్మిగ్రేషన్ రికార్డుల ద్వారా ఆమె థాయ్లాండ్ విడిచి వెళ్లలేదని తెలుస్తుందని అధికారులు పేర్కొన్నారు. -
కాంగ్రెస్ యూట్యూబ్ చానల్ తొలగింపు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన యూట్యూబ్ చానల్ ‘ఇండియన్ నేషనల్ కాంగ్రెస్’ ఆన్లైన్ నుంచి తొలగించబడింది. దీనిపై యూట్యూబ్ సంస్థ ఇంకా ఎలాంటి వివరణ రాలేదు. అయితే, ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. యూట్యూబ్ సంస్థ ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరుపుతున్నామని పేర్కొంది. ‘విద్రోహులు కావాలనే చానల్ను తొలగించారా? లేక సాంకేతిక పొరపాటే ఇందుకు కారణమా? అనేది తేలుస్తాం. ఇందుకు సంబంధించి గూగుల్/ యూట్యూబ్ సంస్థల ఉన్నతాధికారులతో సంప్రతింపులు జరుపుతున్నాం. సమస్యను వెంటనే పరిష్కరించి ఛానల్ను పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమయ్యాం’ అని పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో బుధవారం పేర్కొంది. ఇదీ చదవండి: స్వతంత్ర మీడియాని అణచివేసేందుకు యత్నాలు -
Panchakshari Nagini: టాలెంట్కు మూ'ల'కం
కోవిడ్ పుణ్యమాని ఆన్లైన్ క్లాసుల పేరిట పిల్లలందరికీ స్మార్ట్ఫోన్లు అలవాటైపోయాయి. కానీ చాలా మంది వాటిని టైమ్పాస్గానే వాడేవారు. నెట్టింట తెగ హడావిడి చేసేవారు. స్మార్ట్ ఆలోచనతో ఆన్లైన్లో రికార్డ్ల వేట ప్రారంభించింది కామారెడ్డి జిల్లా పంచాక్షరి నాగిని. ఇంటర్మీడియెట్ చదువుతున్న నాగిని ఇటీవల 118 రసాయన మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించింది. యూట్యూబ్ ఛానల్ ద్వారా మోటివేటర్గా మారింది. ఆట, పాట, క్విజ్, హ్యాండ్ రైటింగ్.. అన్నింటా తానే ఫస్ట్ అని నిరూపించుకుంటున్న నాగిని కృషి తోటివారికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కృషి, పట్టుదల ఉంటే సాధ్యంకానిది ఏదీ లేదని నిరూపిస్తోంది ఇంటర్ విద్యార్థిని పంచాక్షరి నాగిని. రసాయన శాస్త్రంలో మూలకాల గురించి అడిగితే చాలు నోటి వెంట పదాలు పరుగులు తీస్తూనే ఉంటాయి. ఒకటికాదు రెండు కాదు ఏకంగా 118 మూలకాల పేర్లు 22 సెకన్లలో చెప్పి కలాం వరల్డ్ రికార్డు సాధించింది. కామారెడ్డి జిల్లా బీబీపేట మండలం జనగామ గ్రామానికి చెందిన పంచాక్షరి శ్రీనివాస్, లక్ష్మీ సంధ్యల కూతురు నాగిని ఇంటర్ సెకండియర్ చదువుతోంది. హైడ్రోజన్, హీలియం, లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్.. ఇలా 118 మూలకాల గురించి అతి తక్కువ సమయంలో చెప్పి, రికార్డులను సృష్టించింది. ఇంజినీరింగ్ చదివి ఆపై సివిల్స్లో సత్తా చాటాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్న నాగిని జ్ఞాపకశక్తిలోనే కాదు మాటల్లోనూ దిట్టే అని పేరు సాధించింది. మంచి వక్తగా రాణిస్తోంది. తాను చదువుకునే కాలేజీలోనే మోటివేషన్ క్లాసులు ఇస్తోంది. అంతేకాదు, స్కూళ్లకు వెళ్లి విద్యార్థులకు మోటివేటర్గా క్లాసులు చెబుతుంటుంది. స్కూల్ నుంచి ఇస్రోకు మొదటి నుంచి చదువులో చురుకుగా ఉంటున్న నాగిని తొమ్మిదో తరగతిలో ఇస్రో నిర్వహించిన యువికా–2020 యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రాంలో పాల్గొనడం ద్వారా గుర్తింపు పొందింది. రాష్ట్ర స్థాయిలో మ్యాథ్స్ టాలెంట్ పోటీల్లో మొదటి స్థానంలో నిలిచింది. పదో తరగతిలో స్టేట్ లెవల్ సైన్స్ ఫేయిర్లో పాల్గొని మొదటి బహుమతి సంపాదించింది. కరోనాను వెళ్లిపొమ్మంటూ ‘గోబ్యాక్ కరోనా’ అన్న పాట స్వయంగా రాసి, పాడింది. అలాగే స్పీచ్ కాంపిటీషన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. హ్యాండ్ రైటింగ్లోనూ గోల్డ్మెడల్ సాధించింది. ఖోకో, వాలీబాల్, కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయిలో క్రీడల్లో పాల్గొని, బహుమతులు గెల్చుకుంది. టాలెంట్ టెస్ట్ కరోనా సమయంలో ఇంటి వద్ద ఆన్లైన్ పాఠాలు వింటున్న నాగిని దృష్టి మూలకాల మీద పడింది. మొదట్లో కొంత ఇబ్బందిపడ్డా మెల్లమెల్లగా టార్గెట్ పెట్టుకుని ముందుకు సాగింది. 118 మూలకాల పేర్లను తొలుత 27 సెకన్లలో చదివి భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరును నమోదు చేసుకుంది. ఆ తర్వాత తన టాలెంట్ను మెరుగు పరుచుకునే ప్రయత్నం చేసింది. కొంతకాలానికే 22 సెకన్లలో 118 మూలకాల పేర్లు చదివి కలాం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 470 మార్కులకు గాను 463 మార్కులు సాధించింది నాగిని. ఆన్లైన్లో జరిగిన నేషనల్ మ్యాథమెటిక్స్ టాలెంట్ టెస్ట్లో ఫస్ట్ ర్యాంక్ సాధించింది. ‘లర్న్ సంథింగ్ విత్ నాగిని’ అనే పేరుతో యూట్యూబ్లో చానల్ నిర్వహిస్తోంది. మోటివేటర్గా పనిచేస్తోంది. తన జూనియర్లకు క్లాసులు చెబుతోంది. ఆన్లైన్ రికార్డులు నా లక్ష్యం సివిల్స్ వైపే. ఆ దిశగా ఇప్పుడే ప్రణాళికలు వేసుకుంటున్నాను. ఇలాంటి ఆలోచనలు నాలో కలగడానికి కరోనా నాకు టర్నింగ్పాయింట్లా ఉపయోగపడింది. కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసుల కోసం స్మార్ట్ఫోన్ చేతిలో పట్టుకోవడం, దాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్రయత్నాలు చేశాను. దాని ద్వారానే రికార్డుల సాధనకు మరింత సులువు అయ్యింది. – పంచాక్షరి నాగిని – ఎస్.వేణుగోపాలాచారి, సాక్షి, కామారెడ్డి -
Chicago Shooting: నరనరాన హింస.. క్లాస్రూమ్లోనే అలాంటి వీడియోలు
యువకుడు.. మొరటోడు.. హింసను ప్రేరేపించేలా ర్యాప్లు.. పైగా దూకుడు స్వభావం.. ఇవేం చాలవన్నట్లు పేరులోనే ‘క్రైమ్’ ఉంది అతనికి. చికాగో హైల్యాండ్ పార్క్లో జులై4న జరిగిన స్వాతంత్ర దినోత్స పరేడ్లో నరమేధం తాలుకా అనుమానితుడి ఫ్రొఫైల్ నుంచి పోలీసులు సేకరించిన ఆసక్తికర విషయాలు ఇవి. రాబర్ట్ బాబీ క్రైమో III(22).. చికాగో ఇల్లినాయిస్ హైల్యాండ్ పార్క్ పరేడ్ నరమేధంలో ఆరుగురిని మట్టుపెట్టడంతో పాటు 36 మందిని గాయపరిచాడన్న ఆరోపణల మీద అరెస్ట్ అయ్యాడు. అయితే అతని గురించి దర్యాప్తు చేపట్టిన పోలీసులకు విస్తూ పోయే విషయాలు తెలిశాయి. రాబర్ట్ బాబీ క్రైమో.. ఈ ప్రపంచానికి కొత్తగా పరిచయం కావొచ్చు. కానీ, అక్కడి ప్రజలకు మాత్రం అతనిలో పేరుకుపోయిన హింసాత్మక ప్రవర్తన గురించి చాలాకాలంగానే తెలుసు!. ఎలాగంటారా?.. ర్యాపర్ అయిన క్రైమో తన యూట్యూబ్ ఛానెల్స్ ద్వారా బాగా ఫేమస్. హింసను ఉసిగొల్పే లిరిక్స్, కాల్పులు, చావులు, హింసకు సంబంధించిన కంటెంట్నే ఎక్కువగా ప్రమోట్ చేస్తాడు అతను. Robert "Bobby" Crimo III ha sido identificado como la persona de interés en el tiroteo masivo mortal en #HighlandPark, Illinois- Chicago. Seis muertos y decenas de heridos en la masacre del desfile festivo del #4deJulio. Video que muestra algo de su aturdida personalidad.#EEUU. pic.twitter.com/OWGdZ01YqM — MikyRodriguezOficial (@MikyRodriguezO1) July 4, 2022 కాల్పుల ఘటన తర్వాత అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. అతని ఛానెల్స్ మొత్తాన్ని యూట్యూబ్ నుంచి డిలీట్ చేయించారు. సోషల్ మీడియా అకౌంట్లను తొలగించారు. అయినప్పటికీ.. అతనికి సంబంధించిన వీడియోలు కొన్ని ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ‘అవేక్ ది ర్యాపర్’ పేరుతో అతని వీడియోలన్నీ హింసను ప్రొత్సహించేవిగా ఉండడం గమనార్హం. క్రైమో వీడియోల్లో యూట్యూబ్ కూడా నిబంధనల ఉల్లంఘన కింద తీసేయని వీడియోలు చాలానే ఉన్నాయి. హెల్మెట్, బుల్లెట్ఫ్రూఫ్ కోట్ ధరించి తరగతి గదిలోనే యువతను రెచ్చగొట్టే వీడియోలు చాలానే తీశాడు అతను. ఒంటి నిండా టాటూలతో విచిత్రమైన వేషధారణలతో ర్యాప్లు కడుతూ.. వాటి లిరిక్స్లోనూ తనలో పేరుకుపోయిన హింసా ప్రవృత్తిని చూపిస్తుంటాడు అతను. హోండా ఫిట్ కారు రూఫ్టాప్ నుంచి హై పవర్డ్ రైఫిల్తో క్రైమో కాల్పులు జరిపాడన్నది హైల్యాండ్ పార్క్ పోలీసులు వాదన. ఇక ఘటన జరిగిన తర్వాత.. సుమారు ఐదు మైళ్ల పాటు రాబర్ట్ను పోలీసులు ఛేజ్ చేశారని, ఆపై అదుపులోకి తీసుకున్నారని తెలుస్తోంది. అమెరికాలో పేట్రేగిపోతున్న గన్ కల్చర్, ఇంటర్నెట్ కంటెంట్పై సరైన ఆంక్షలు, నియంత్రణ లేకపోవడం.. మరో యువకుడితో మారణ హోమం సృష్టించిందన్న వాదన వినిపిస్తోంది ఇప్పుడు. ఇలాంటి వాళ్లను ముందస్తుగానే గుర్తించి.. నిలువరిస్తే నరమేధాలు జరగవన్న అభిప్రాయమూ వ్యక్తం అవుతోంది. -
యూట్యూబ్ చానెల్ పేరుతో ఇంట్లోకి చొరబడి, షూట్ చేస్తూ..
మైసూరు(బెంగళూరు): యూట్యూబ్ చానెల్ పేరుతో ఇంట్లోకి చొరబడి డబ్బు డిమాండ్ చేసిన ఐదుమందిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. నగరంలోని అశోక రోడ్డులో ఈ ఘటన జరిగింది. కర్ణాటక పబ్లిక్ వాయ్స్ న్యూస్ చానెల్స్ (కేవీపీ న్యూస్)కు చెందిన బసవరాజు, అభిలాష, మణి, నవీన్కుమార్, ప్రదీప్లు ఉమర్ షరీఫ్ అనే వ్యక్తి ఇంటికి కారులో వచ్చారు. కెమెరాలతో షూట్ చేస్తూ మీ ఇంటిలో అక్రమంగా గ్యాస్ రీ ఫిల్లింగ్ జరుగుతోందని ఒకరు, తాము పోలీసులమని మరొకరు అతనిని గద్దించారు. డబ్బు ఇస్తే వెళ్లిపోతామని చెప్పారు. ఇంతలో స్థానికులు వారిని నిర్బంధించి పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేశారు. చదవండి: పెళ్లయిన కొత్తలో విడిపోయి.. 52 ఏళ్ల తర్వాత ఒక్కటయ్యారు! -
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను: ఉదయభాను భావోద్వేగం
స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే యాంకర్ ఉదయభాను. అప్పట్లో బుల్లితెరను ఓ ఊపు ఊపేసిందామె. తన మాటలతో, నవ్వులతో షోలో కొత్త వెలుగులు నింపేది. ఒకప్పుడు తెలుగులో టాప్ యాంకర్గా రాణించిన ఆమె కొన్నేళ్లుగా యాంకరింగ్కు దూరంగా ఉంది. తాజాగా ఆమె కమ్బ్యాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇన్స్టాగ్రామ్లో కొద్దిరోజులుగా వరుసగా వీడియోలు పోస్ట్ చేస్తూ యూట్యూబ్లో ఎంట్రీ ఇస్తున్నట్లు వెల్లడించింది. ఉదయభాను పేరుతో కొత్త యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన యాంకర్ 'మీ ప్రేమే నా బలం' పేరుతో మొట్టమొదటి వీడియోను వదిలింది. 'మీ అభిమానం నేను సాధించిన వరం, మీ ప్రేమ అభివర్ణించలేని అద్భుతం, నా ప్రతి అడుగులో నాకు తోడుగా నిలబడింది, నాకు ధైర్యమే నిలిచింది మీరే.. అంటూ అభిమానుల కోసం ఉద్వేగపూరితంగా మాట్లాడింది ఉదయభాను. మీ అభిమానంతో నన్ను ఎప్పుడూ పడిపోకుండా పట్టుకున్నారు, గుండెల్లో పెట్టుకున్నారు. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలను? మీకు మరింత చేరువయ్యే ప్రయత్నం చేయడం తప్ప.. అందుకే వస్తున్నా మీ ఉదయభాను' అంటూ వీడియోను ముగించింది. ఇన్నాళ్ల తర్వాత మాకోసం యూట్యూబ్లో అడుగుపెట్టినందుకు థ్యాంక్స్ అంటూ ఫ్యాన్స్ సంతోషంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. మీ గొంతులోనే ఏదో తెలియని మ్యాజిక్ ఉందని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: తమన్నాతో గొడవ నిజమే, రెండు రోజులు..: అనిల్ రావిపూడి రికార్డులు బద్ధలు కొడుతున్న విక్రమ్, ఇప్పటిదాకా ఎంత వచ్చిందంటే? -
యూట్యూబ్లో దుమ్ములేపుతున్న‘ ధూంధాం’.. పల్లె నుంచి ప్రపంచస్థాయికి..
తెలంగాణ యాస.. పక్కా పల్లెటూరి భాష.. చిల్.. బ్రో.. యో..యో.. పదాలకు ఇప్పుడు ఈ గ్యాంగ్ బ్రాండ్ అంబాసిడర్. మారుమూల పల్లెటూరు నుంచి ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారీ చిచ్చరపిడుగులు. ఏడేళ్ల పిల్లాడి నుంచి డెబ్బైఏళ్ల ముసలావిడ వరకు టాలెంట్ ఎవరిసొత్తు కాదంటూ.. ప్రతిభకు చదువుకు సంబంధం లేదని తమ నటనతో చాటి చెబుతున్నారు. వీడియో విడుదలైన గంటల్లోనే లక్షల వ్యూస్తో అదరగొడుతున్నారు. ఉన్న ఊరిలోనే లొకేషన్లు వెతుక్కుంటూ ఏకధాటిగా షూటింగ్లు చేస్తున్నారు. నాలుగేళ్ల కాలంలోనే 17.57కోట్ల అభిమానులను సంపాదించుకున్న జగిత్యాల జిల్లా లంబాడిపల్లి ‘ధూం..ధాం’ పోరగాళ్లపై సండే స్పెషల్.. – మల్యాల(చొప్పదండి) ► యూట్యూబ్ చానల్ ధూంధాం ► ప్రారంభం: 2018 ► తీసిన వీడియోలు: 150 ► చందాదారులు: 8.50లక్షల మంది ► వీక్షకులు: 17.57 కోట్ల మంది ► చానల్లో యాక్టర్లు: 11 మంది.. ప్రారంభం ఇలా.. మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామానికి చెందిన అలువాల రాజు 2018లో ధూంధాం యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. షూటింగ్లకోసం డిగ్రీ చదువును మధ్యలో ఆపేశాడు. లంబాడిపల్లిలోని మట్టిలోనే సహజ నటన ఉంది. ఇప్పటికే చాలామంది యూట్యూబ్ ద్వారా మంచి గుర్తింపు పొందారు. ‘కికికికిక్’ ద్వారా పేరు సంపాదించిన తిరుపతి కీరోల్గా రసూల్, భీమన్న, గవాస్కర్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్, రాజవ్వ తమ సహజసిద్ధ నటనతో ‘ధూంధాం’లో ఆకట్టుకుంటున్నారు. ప్రజల జీవన విధానమే కథలుగా తెరకెక్కిస్తున్నారు. లంబాడిపల్లి ప్రకృతి, పరిసరాలనే షూటింగ్లకు ఆవాసం చేసుకుంటున్నారు. 150 వీడియోలు.. 17.57 కోట్ల వీక్షకులు ధూంధాం చానల్ ద్వారా ఇప్పటివరకు 150 వీడియోలు చిత్రీకరించారు. వీటిలో గ్రామంలో జులాయిగా తిరిగే వ్యక్తి సైన్యంలో చేరి, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీడియో గంట 40 నిమిషాలు, మల్లిగాడు గంట 30నిమిషాల నిడివి గల వీడియోలతో చానల్ ప్రాచూర్యం పొందింది. కౌసుగాళ్లు, మల్లిగాడు, హోలీ, జవాన్ జర్నీ, చిల్ బ్రో, బడి దొంగలు, దుబాయ్ నుండి వస్తే.. పిలువని పేరంటానికి పోతే.. పల్లెటూరి ప్రేమకథ, ఆర్టీసీ బస్, విలేజ్ ఫ్యాషన్, కొత్తబండి, ఐఫోన్ వంటి 150వీడియోలు తీయగా, ఇప్పటి వరకు 17.57కోట్ల మంది వీడియోలను వీక్షించారు. చిల్ బ్రోలో రసూల్గా నటించిన మణివర్షిత్ డైలాగులతో చానల్కు ఆదరణ పెరిగింది. ఒకే రోజు 3లక్షల మంది వీక్షకులు చూశారు. మరో వీడియో హోలీకి ఒక్కరోజులో 1 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ప్రతిభకు పట్టం ధూంధాం చానల్ టీంలో ఎవరూ పెద్దగా చదువుకున్నవారు లేరు. ఎవరి పనివారు చేసుకుంటూనే నటిస్తున్నారు. స్వయం ఉపాధితో పాటు పదిమందికి ఉపాధి కల్పిస్తున్నాడు రాజు. ఈ యువకుడు డిగ్రీ డిస్కంటిన్యూ చేయగా, అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తూ, మల్లిగాడులో నటించిన గవాస్కర్ అదే తోవలో నడిచాడు. పిల్లి తిరుపతి వ్యవసాయం చేసుకుంటూ నటిస్తున్నాడు. పిల్లలందరూ బడికిపోయే వారే. చిచ్చరపిడుగులు ధూంధాం చానల్లో 11మందిలో ఆరుగురు చిన్నారులే. పిల్లల సహజ నటనకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. బడికి వెళ్లే వయసులోనే సంపాదిస్తూ తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నారు రసూల్, చిన్నూ, ధనుష్, సూరజ్, మణి, కరుణాకర్. ప్రతీ నెలా వారి పాత్రలకు అనుగుణంగా కొంతమొత్తం వస్తుండడంతో తల్లిదండ్రులు సైతం ప్రోత్సహిస్తున్నారు. డైలాగ్ కింగ్ అంటరు మాది లంబాడిపల్లి. అమ్మానాన్న పెంట సురేశ్, రాజమణి. తాటిపల్లి జిల్లా పరిషత్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న. బడికి పోయి వచ్చినంక నటిస్తున్న. ఎంత పెద్ద డైలాగ్ అయిన ఆగకుండా చెప్పుత. డైలాగ్ కింగ్ అంటరు నన్ను. వీడియోల్లో నటిస్తే వచ్చే డబ్బు ఇంటికి ఆసరాగా ఉంటోంది. అమ్మానాన్న కూడా ప్రోత్సహిస్తున్నారు. – సూరజ్, ఏడో తరగతి ఎవుసం చేసుకుంటూనే.. పదో తరగతి సదివిన. ఇప్పటి దాకా 80వీడియోల్లో నటించిన. రోజూ ఎవుసం పనిచేసుకుంటూనే వీడియోలు చేస్తా. ఆర్టీసీ బస్ మొదటి వీడియో పేరు తెచ్చింది. ఆర్మీ జవాన్ వీడియో మంచి పేరు తెచ్చింది. అందరం ఒకే కుటుంబంగా ఉంటాం. అన్నదమ్ముల్లా మెదులుతాం. – పిల్లి తిరుపతి, లంబాడిపల్లి అమ్మానాన్నప్రోత్సాహం వీడియోలు తీయాలని ఉందని చెబితే అమ్మానాన్న నర్సవ్వ, చంద్రయ్య రూ.లక్ష ఇచ్చి ప్రోత్సహించారు. డిగ్రీ మధ్యలోనే ఆపేశా. నటించాలనే కోరికతో చానల్ ప్రారంభించిన. స్క్రిప్ట్ రైటింగ్, డైరెక్షన్, ఎడిటింగ్ అన్నీ నేనే చేస్తా. నటించడం కన్నా డైరెక్షన్ చేయడం చాలా అవసరం అనిపించింది. ఇప్పటి వరకు 150 వీడియోలు తీసిన. – అలువాల రాజు, ధూంధాం చానల్ నిర్వాహకుడు సదువుకుంటు.. సంపాదిస్తున్న మాది గంగాధర మండలం కురుమపల్లి. అమ్మానాన్న తొట్ల తిరుపతి, లావణ్య. చానల్ ప్రారంభం నుంచి నటిస్తున్న. మాది వ్యవసాయ కుటుంబం. అమ్మమ్మ ఊరు లంబాడిపల్లి. ఇక్కడే ఉండి చదువుకుంటున్న. ఇప్పటి వరకు సుమారు 70వీడియోల్లో నటించా. సదువుకుంటూనే వీడియోల్లో నటిస్తున్న. వచ్చే ఆదాయంతో అమ్మానాన్నకు ఆసరాగా ఉంటున్నా. – రసూల్(మణివర్షిత్) -
అనగనగా ఘనమైన యూ ట్యూబ్ విలేజ్.. కలర్ఫుల్ వంటల పండుగ!
‘యూ ట్యూబా, అదేమిటి?’ అని అడిగినవాళ్లే ఇప్పుడు తమ వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ‘దీన్ని ఎలా ఉపయోగిస్తారు?’ అని కెమెరాను చూస్తూ అమాయకంగా అడిగిన వాళ్లే ఆ కెమెరాను ఆపరేట్ చేస్తూ ‘సూపర్’ అనిపించుకుంటున్నారు. ‘చిన్న ఊరు’గా ఒకప్పుడు ఆ ఊరికి చిన్నపేరే ఉంది. ఇప్పుడు మాత్రం ‘యూట్యూబ్ విలేజ్’గా పెద్దపేరు వచ్చింది. దీనికి ప్రధాన కారణం ఆ గ్రామ మహిళలు... పచ్చటిపంట పొలాలు పలకరింపుగా నవ్వుతున్నాయి. పిల్లలు గోలగోలగా ఆడుకుంటున్నారు. సుమారు పదిహేనుమంది మహిళలు వంటపనుల్లో నిమగ్నమయ్యారు. మగవాళ్లు వారికి సహాయపడుతున్నారు. అంతా సందడి సందడిగా ఉంది. అలా అని అది పెళ్లికి సంబంధించిన విందు కార్యక్రమం కాదు. జస్ట్... యూట్యూబ్ షూటింగ్! బంగ్లాదేశ్లోని కుష్తియ జిల్లాలోని షిములియ గ్రామం ‘యూట్యూబ్ విలేజ్’గా ఫేమస్ అయింది. ఈ గ్రామ నేపథ్యంగా ఘుమఘుమలాడే బిర్యానీ వంటకాల తయారీ నుంచి చేపలను సులభంగా ఎలా పట్టాలి?... వరకు ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ‘యూట్యూబ్ విలేజ్’ నుంచి తెలుసుకోవచ్చు. షూట్ పూర్తయిన తరువాత వేడివేడి వంటకాలను పేదలకు పంచుతారు. కెమెరా హ్యాండిల్ చేయడం, ఎడిటింగ్, షూట్, డైరెక్షన్... మొదలైన విషయాలను శ్రద్ధగా నేర్చుకున్న షిములియ గ్రామ మహిళలు తమ వంటల వీడియోలతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. ఈ ఛానల్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని గ్రామ అభివృద్ధికి, పేదల అవసరాల కోసం వినియోగిస్తున్నారు. ఫ్లాష్బ్యాక్లోకి వెళితే... మీర్పూర్లో ఐటీ కంపెనీ నడిపే లిటన్ అలి స్వగ్రామం షిములియ. ఊరికి వచ్చినప్పుడల్లా తన చేతిలో ఉన్న కెమెరాతో చేపలమార్కెట్ సందడి, పిల్లకాలువలు, పెద్దచెరువు అందాలు, చేతివృత్తుల పనితనం, గొర్రెల కాపరి పాడే పాట... ఇలా రకరకాల దృశ్యాలను వీడియోలో బంధించి ‘ఎరౌండ్ మీ బీడి’ పేరుతో యూ ట్యూబ్లో అప్లోడ్ చేసేవాడు. ఆ సమయంలోనే ‘ఎరౌండ్ మీ బీడి’ని ఉపాధికి ఉపయోగపడే ఛానల్గా మార్చాలని రంగంలోకి దిగాడు అలి. మొదట్లో ఎలా ఉండేదోగానీ మహిళలు ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయిన తరువాత సీన్ మారిపోయింది. వారు తమ నైపుణ్యం, సృజనాత్మక ఆలోచనలతో ‘యూట్యూబ్ విలేజ్’ను ఎక్కడికో తీసుకువెళ్లారు. దీంతో షిములియ పేరు ‘యూట్యూబ్ విలేజ్’గా మారిపోయింది. ‘ఎప్పుడోగానీ ఊరంతా ఒకచోట కలుసుకునే అవకాశం ఉండదు. అయితే ఛానల్ పుణ్యమా అని అందరం తరచు ఒకచోట కలుసుకునే అవకాశం దొరుకుతుంది. ఊరంతా కలిసి విందు చేసుకుంటున్నట్లుగా ఉంటుంది. సంతోషాలు పంచుకోవడమే కాదు సమస్యల గురించి కూడా మాట్లాడుకుంటున్నాం’ అంటుంది 38 సంవత్సరాల మహేర. ‘మా వంటల రుచులతో ప్రపంచంతో మాట్లాడే అవకాశం దొరికింది’ అంటుంది రియా. కంటెంట్ సక్సెస్ కావడం ఒక ఎత్తయితే, ఆ సక్సెస్ను నిలుపుకోవడం మరో ఎత్తు. ఎప్పటికప్పుడు విభిన్నమైన ఎపిసోడ్స్ను రూపొందించాల్సి ఉంటుంది. ఈ బాధ్యతను భుజాన వేసుకొన్న గ్రామ మహిళలు కాలగర్భంలో కలిసిపోయిన అరుదైన, రుచికరమైన వంటకాలను బయటికి తీస్తున్నారు. దీంతోపాటు కొత్త వంటకాలను సృష్టిస్తున్నారు. ‘యూట్యూబ్ విలేజ్’ అనేది బిజినెస్ మోడల్గా మారడమే కాదు ఎన్నో ఊళ్లకు స్ఫూర్తి ఇస్తుంది. ఇప్పుడు మనదేశంతో సహా పాకిస్థాన్, ఇండోనేషియా... మొదలైన దేశాల్లో ‘యూట్యూబ్ విలేజ్’ అనేది ఒక ట్రెండ్గా మారింది. చదవండి👉🏾ఆమె వస్తే... పెళ్లి ఆగాల్సిందే -
దేశం మొత్తం ఒక్కటే డీఎన్ఏ
శ్రీనగర్కాలనీ: దేశం మొ త్తం ఒక్కటే డీఎన్ఏ ఉం దనే విషయాన్ని ఒవైసీకి చెప్పానని, టెస్ట్ చేయించుకోవడానికి రమ్మని సవాల్ విసిరినా, ఆయన ముందుకు రాలేదని మాజీ పార్ల మెంట్సభ్యుడు డాక్టర్ సుబ్రమణ్యస్వామి అన్నారు. కాశీ విశ్వనాథస్వామి ఆలయాన్ని ముట్టుకోవద్దని ఒవైసీ అంటున్నారని, అక్కడ పూజించే హక్కు తమకు ఉందని స్పష్టం చేశారు. హైదరాబాద్ శ్రీనగర్కాలనీ సత్యసాయి నిగమాగమంలో ఇస్కాన్ సంస్థకు చెందిన ‘కౌఇజం’ యూ ట్యూబ్ చానల్ ప్రారంభోత్సవం జరిగింది. దీనికి ముఖ్యఅతిధిగా హాజరైన ఆయన మాట్లాడుతూ... ప్రపంచంలో చెక్కు చెదరకుండా బతికున్న సంస్కృతి, హిందూ సంస్కృతి మాత్రమేనన్నారు. దేశంలోని ప్రతి ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత హిందువులపై ఉందని తెలిపారు. మన సంస్కృతి, నాగరికత ఆవు తోనే ముడిపడి ఉందని చెప్పారు. గోవును జాతీయ జంతువుగా చేయాలని పోరాడుతున్నామన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తు ఆవు అని, స్వలాభం కోసం మార్పులు చేసుకుని హస్తం గుర్తుగా పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో ఇస్కాన్ చైర్మన్ డాక్టర్ సహదేవ దాసా, బీఎస్ఎఫ్ మాజీ అడిషనల్ డీజీ పి.కె.మిశ్రా పాల్గొన్నారు. -
భార్యకు యూట్యూబ్ చానల్.. రూ.4 కోట్ల ఆదాయం.. ఆ భర్త ఏంచేశాడంటే?
నరసరావుపే టౌన్(పల్నాడు జిల్లా): ఛీటింగ్ కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ ఎస్.వెంకట్రావు మంగళవారం తెలిపారు. వివరాలు.. బరంపేటకు చెందిన పోతుల విక్రమ్, లక్ష్మీజ్యోతి భార్యాభర్తలు. విక్రమ్ ఆదిత్య పేరిట లక్ష్మీజ్యోతి యూట్యూబ్ చానల్ను 2014లో నుంచి నిర్వహిస్తోంది. సుమారు ఈ చానల్కు 10 లక్షల మంది సబ్ స్క్రెబర్లు ఉన్నారు. రెండేళ్ల క్రితం లక్ష్మీజ్యోతి హైదరాబాద్కు చెందిన వ్యాకుడ్ ఆవుట్ కంపెనీతో తన యూట్యూబ్ చానల్ ద్వారా యాడ్స్ ఇచ్చేందుకు ఒప్పదం కుదుర్చుకుంది. ఈ క్రమంలో భర్త విక్రమ్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి వేర్వేరుగా జీవిస్తున్నారు. చదవండి: పెళ్లి చేసుకో.. లేకపోతే ఫోటోలు, వీడియోలు బయటపెడతా.. అయితే లక్ష్మీజ్యోతి సంతకాన్ని ఫోర్జరీ చేసి వ్యాకుడ్ అవుట్ కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని భర్త విక్రమ్ రద్దు చేశాడు. యూట్యూబ్ చానల్ ద్వారా ప్రతినెల వచ్చే ఆదాయాన్ని తన రెండో భార్య తమ్ముడు వావిళ్ళపల్లి సంతోష్ అకౌంటుకు మళ్లించాడు. రెండేళ్ల నుంచి సుమారు 4 కోట్ల రూపాయలు మోసం చేసి దారి మళ్లించినట్లు లక్ష్మీజ్యోతి గ్రహించి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ను అరెస్టు చేసి అతడి బ్యాంక్ ఖాతాలను సీజ్ చేశారు. కేసులో ప్రధాన నిందితుడు విక్రమ్ కోసం గాలిస్తున్నట్లు సీఐ వెంకట్రావు తెలిపారు. -
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన నిత్యా మీనన్
'అలా మొదలైంది' సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన మలయాళ ముద్దుగుమ్మ నిత్యా మీనన్. చేసినవి కొన్ని సినిమాలే అయినా అందం, నటనతో ప్రేక్షకులను అలరిస్తున్న నిత్యా మీనన్ రీసెంట్గా భీమ్లా నాయక్ సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఓ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోంది. ఇప్పుడీ మల్టీ ట్యాలెంటెడ్ హీరోయిన్ తాజాగా సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టింది. నిత్య అన్ఫిల్టర్డ్’(Nithya Unfiltered)పేరుతో యూట్యూబ్ వరల్డ్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. తన 12ఏళ్ల సినీ కెరీర్కి సంబంధించిన విషయాలను ఫస్ట్ వీడియోలో షేర్ చేస్తూ తన వ్యక్తిగత,వృత్తిపరమైన జీవిత విశేషాలపై మరిన్ని వీడియోలతో త్వరలోనే మీ ముందుకు రాబోతున్నానంటూ పేర్కొంది. ఇక యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన కాసేపటికే వేలమంది ఫాలోవర్లు వచ్చి చేరారు. -
దేశ భద్రతకు ముప్పు.. 16 యూట్యూబ్ ఛానళ్లు బ్లాక్!
దేశ భద్రతకు ముప్పుగా పరిణమించిన 16 యూట్యూబ్ ఛానళ్లను భారత ప్రభుత్వం నిషేధించింది. దేశ భద్రత, సమగ్రతలకు సంబంధించి తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్నందన ఈ నిర్ణయం తీసుకుంది. తాగాగా నిషేధం విధించిన ఛానళ్లలో 6 పాకిస్తాన్కి చెందినవి ఉన్నాయి. యూట్యూబ్ ఛానళ్లతో పాటు ఫేస్బుక్ అకౌంట్ని కేంద్ర ప్రసార శాఖ బ్లాక్ చేసింది. తాజాగా నిషేధిత జాబితాలో చేరిన యూ ట్యూబ్ ఛానళ్లకు రికార్డు స్థాయిలో 68 కోట్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. భారీ స్థాయిలో చందాదారులను కలిగిన ఈ ఛానళ్లు అదే పనిగా భారత విదేశాంగ విధానం, అంతర్గత వ్యవహారాలు, దేశ సమగ్రతకు సంబంధించిన అంశాల్లో తప్పుడు సమాచారాన్ని వెదజల్లుతున్నట్టు కేంద్ర ప్రసార శాఖ గుర్తించింది. దీంతో వాటిపై నిషేధం విధించింది. నిషేధించిన యూట్యూబ్ ఛానళ్లు ఎస్బీబీ న్యూస్, తహ్ఫుజ్ ఈ దీన్ ఇండియా, ది స్టడీ టైం, లేటెస్ట్ అప్డేట్, హిందీ మే దేఖో, డిఫెన్స్ న్యూస్ 24/7, టెక్నికల్ యోగేంద్ర, షైనీ ఎడ్యుకేషనల్ రీసెర్చ్, ఆజ్ తే న్యూస్, ఎంఆర్ఎఫ్ టీవీ లైవ్ వంటి ఇండియా ఛానళ్లు ఉన్నాయి. ఇక పాకిస్తాన్ బేస్డ్ ఛానళ్ల విషయానికి వస్తే బోల్ మీడియా బోల్, ఖైసర్ ఖాన్, ది వాయిస్ ఆఫ్ ఏషియా, డిస్కవర్ పాయింట్, రియాల్టీ చెక్, ఆజ్తక్ పాకిస్తాన్ ఛానళ్లు ఉన్నాయి. వీటితో పాటు తహ్ఫుజ్ ఈ దీన్ మీడియా సర్వీసెస్ ఇండియా అనే ఫేస్బుక్ అకౌంట్ కూడా ఉంది. చదవండి: Truecaller: గూగుల్ షాకింగ్ నిర్ణయం..ఇకపై ట్రూకాలర్లో ఈ ఫీచర్ పనిచేయదు. -
కేంద్రం కొరడా.. 22 యూట్యూబ్ ఛానళ్లపై నిషేధం.. వాటి లక్ష్యమదే!
తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝుళిపించింది. దేశ భద్రత, జాతీయ సమగ్రత, విదేశీ సంబంధాలకు భంగం కలిగిస్తున్నాయన్న కారణంతో 22 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్ర సమాచార, ప్రసార శాఖ నిషేధించింది. ఇందులో 18 భారతీయ, 4 పాకిస్థాన్కు చెందినవి ఉన్నాయి. ఈ మేరకు మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం నిషేధించిన యూట్యూబ్ ఛానెళ్లలో మొత్తం వ్యూయర్షిప్ 260 కోట్లకు పైగా ఉన్నట్టు తేలింది. సంబంధిత యూట్యూబ్ చానళ్లు టెలివిజన్ లోగోలు, యాంక్లరను ఉపయోగించి, తప్పుడు థంబ్నెల్స్తో వీక్షకులను తప్పుదారి పట్టిస్తున్నారని కేంద్రం తెలిపింది. ఐటీ రూల్స్ 2021ను ఉల్లంఘించిన కారణంతో తొలిసారిగా 18 యూట్యూబ్ చానెళ్లను బ్లాక్ చేసినట్లు వెల్లడించింది. వీటితోపాటు మూడు ట్విటర్ అకౌంట్లు, ఒక ఫేస్బుక్ అకౌంట్లను బ్లాక్ చేసింది. ఈ చానళ్లు భారత ఆర్మీ, జమ్మూ కశ్మీర్ వివాదం వంటి అంశాలపై సామాజిక మధ్యమాల ద్వారా భారత్కు వ్యతిరేకంగా తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నట్టు కేంద్రం పేర్కొంది. చదవండి: విషాదం మిగిల్చిన ఫోటోషూట్.. పెళ్లైన రెండు వారాలకే.. అంతేగాక ఉక్రెయిన్లో కొనసాగుతున్న పరిస్థితులకు సంబంధించి కూడా కొన్ని భారతీయ యూట్యూబ్ ఛానెల్లు తప్పుడు కంటెంట్ను పబ్లిష్ చేస్తున్నారని, ఇవన్నీ ఇతర దేశాలతో భారత్కున్న విదేశీ సంబంధాలను దెబ్బతీసే లక్ష్యంతో పనిచేస్తున్నాయని గుర్తించినట్లు తెలిపింది. ఇవి పాకిస్థాన్ వేదికగా పనిచేస్తున్నట్టు పేర్కొంది. నిఘా వర్గాల సహకారంతో సమాచార, ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. చదవండి: Viral Video: మండుటెండలో కోతి దాహం తీర్చిన పోలీస్.. ‘హ్యాట్సాఫ్ సార్’ -
ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది!
నిజం చెప్పాలంటే, శ్లోక్ శ్రీవాస్తవ ఇంతలా ఎప్పుడూ కృంగిపోలేదు. దిల్లీలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన శ్రీవాస్తవకు ఐఐటీ,దిల్లీలో సీటు రాకపోవడం శరాఘాతంలా పరిణమించింది. తల్లిదండ్రులు ఏమీ అనకపోయినా, ధైర్యం చెప్పినా తనలో అంతులేని బాధ. అలా రెండు నెలలు...దుఃఖమయ సమయం. Forbes India 30 Under 30 in 2022: తనను తాను చీకటిగుహలో నుంచి వెలుగు వాకిట్లోకి తీసుకురావడానికి విజేతల ఆత్మకథలు చదవడం మొదలు పెట్టాడు. వాళ్లెవరూ పుట్టు విజేతలు కాదు. జీవితంలో ఎన్నో ఢక్కామొక్కీలు తిన్నవాళ్లు. విజేతలకు సంబంధించి రకరకాల పుస్తకాలు తిరగేస్తున్నప్పుడు... ‘నీ లక్ష్యం మీద నీకు స్పష్టత ఉంటే నీ దగ్గరకు విజయం...నడిచిరావడం కాదు పరుగెత్తుకు వస్తుంది’ అనే వాక్యం తనకు బాగా నచ్చింది. ఆ సమయంలో ఆలోచించాడు ‘అసలు నా లక్ష్యం ఏమిటీ?’ అని. ఆ విషయంపై తాను ఎప్పుడూ దృష్టి పెట్టలేదు. అభిరుచి నుంచి లక్ష్యం పుడుతుంది...అంటారు. తన అభిరుచి విషయంలో మాత్రం స్పష్టత ఉంది. తనకు గ్యాడ్జెట్స్ అంటే ఇష్టం. యూట్యూబ్ వీడియోలు రూపొందించడం అంటే ఇష్టం. వీటిలో ఏముంది ప్రత్యేకత? ప్రత్యేకత ఆవిష్కరించడమే కదా విజేత పని! ∙∙ చెన్నైలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో శ్లోక్కు అడ్మిషన్ దొరికింది. యూనివర్శిటీలో ఉన్న కాలంలో...ఒకవైపు చదువుపై శ్రద్ధ పెడుతూనే మరోవైపు డిజైన్, థియేటర్, కోర్స్ మేకింగ్ యూట్యూబ్ వీడియోలను చేయడం మొదలుపెట్టాడు. గ్యాడ్జెట్లను పరిచయం చేయడానికి ‘టెక్ బర్నర్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించాడు. గ్యాడ్జెట్ల పరిచయం వ్యాపార ప్రకటనల్లా కాకుండా...ఎంటర్టైనింగ్, స్టోరీ టెల్లింగ్ పద్ధతుల్లో పరిచయం చేసేవాడు. తన గ్రాడ్యుయేషన్ పూర్తయింది. అప్పుడప్పుడే ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి. ఉద్యోగం చేయకుండా పూర్తిస్థాయిలో సమయాన్ని చానల్కు కేటాయించాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఇది వారి కుటుంబసభ్యులకు నచ్చలేదు. సర్దిచెప్పాడు. కెమెరా ముందు ఆకట్టుకునేలా ఎలా మాట్లాడాలి? నాణ్యమైన వీడియోలు ఎలా రూపొందించాలి....మొదలైన విషయాలపై మరింత శ్రద్ధ పెట్టాడు. చానల్ సూపర్డూపర్ హిట్ అయింది! ప్రతి నెల 50 మిలియన్ల వ్యూయర్షిప్ వచ్చింది. ఈ ఉత్సాహంలో రెండు వెబ్సైట్లు, బర్నర్ మీడియా బ్యానర్పై ఆన్లైన్ అప్లికేషన్లు లాంచ్ చేశాడు. ‘టెక్ బర్నర్’ అనేది అతడి పేరుకు ప్రత్యామ్నాయం అయింది. ఈ పేరుతోనే అతడిని పిలుస్తుంటారు. ‘ఉద్యోగం వద్దు అనుకున్నప్పుడు...రిస్క్ చేస్తున్నావు అని ఎంతోమంది హెచ్చరించారు. రిస్క్ అని వెనక్కి తగ్గితే ఏమీ చేయలేము అనే విషయం తెలుసు. దీనికి కారణం నేను చేస్తున్న పనిపై నాకు ఉన్న సంపూర్ణ నమ్మకం. బరిలో మంచి టాలెంట్ ఉన్న ఎంతోమంది యూట్యూబర్స్ ఉన్నారు. అయితే నాకు ఒక నమ్మకం... నాకంటూ ఎక్కడో ఒకచోట స్థానం ఉంటుందని. దానికోసం వెదికాను. విజయం సాధించాను’ అంటున్న శ్లోక్ శ్రీవాస్తవ ‘ఫోర్బ్స్’ ఇండియన్ ‘ఫోర్బ్స్ 30 అండర్ 30’ జాబితాలో చోటు సంపాదించాడు. -
ఉక్రెయిన్ లో రష్యా మారణ హోమం, కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్!!
ఉక్రెయిన్పై రష్యా చేస్తున్న మారణ హోమం నేపథ్యంలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకుంది. యూట్యూబ్ పరిధిలోని రష్యన్ మీడియాకు సంబంధించిన అడ్వెర్టైజ్మెంట్లును నిషేధిస్తున్నట్టు ప్రకటించింది. యూట్యూబ్ శనివారం రష్యా ప్రభుత్వ పరిధిలో ఉన్న మీడియా సంస్థ రష్యా టుడే-(ఆర్టీ)తో పాటు ఇతర రష్యాకు చెందిన యూట్యూబ్ అకౌంట్లను సస్పెండ్ చేసినట్లు యూట్యూబ్ అధికారిక ప్రతినిధి ధృవీకరించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ఉక్రెయిన్పై పూర్తి స్థాయి దాడికి అనుమతి ఇచ్చినందుకు ప్రతిస్పందనగా ఈ తొలగింపు జరిగినట్లు యూట్యూబ్ తెలిపింది. రష్యాలో ఇప్పటికే మోసపూరిత పద్ధతులకు వ్యతిరేకంగా యూట్యూబ్ ప్రైవసీ పాలసీ విధానాల్ని ఉల్లంఘించే వీడియోలను తొలగిస్తున్నట్లు యూట్యూబ్ ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఉక్రెయిన్లో అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో మేము అనేక చర్యలు తీసుకుంటున్నాం. ఇటీవలే అమలు చేసిన ఆంక్షల కారణంగా రష్యన్ ఛానల్తో సహా యూట్యూబ్లో డబ్బులు ఆర్జించే అనేక ఛానెల్స్ ను నిషేధిస్తున్నట్లు ఆ రిపోర్ట్లో పేర్కొంది. కాగా ఫేస్బుక్(మెటా)తో రష్యా మీడియా ఆదాయ వనరుల్ని నిలిపిస్తున్నట్లు ఫేస్బుక్ సెక్యూరిటీ పాలసీ హెడ్ నథానియల్ గ్లీచెర్ ట్వీట్ చేశారు. ఇప్పుడు మెటా దారిలో యూట్యూబ్ కీలక నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. అయితే ఈ నిర్ణయం రష్యాలో శాస్వతంగా కొనసాగుతుందా? లేదంటే తాత్కాలికంగా నిషేధం విధించారా? అనే విషయం తెలియాల్సి ఉంది. -
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మంది స్టెప్పులు! వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు