YouTube channel
-
Bullettu Bandi Song: బుల్లెట్ బండి సాంగ్.. వెయ్యి మందితో రికార్డు
Bullettu Bandi Song New Record: ‘నీ బుల్లెట్ బండెక్కి వచ్చేత్త పా’ పాట.. తెలుగు రాష్ట్రాల్లో ఎంత పాపులర్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మోహన భోగరాజు పాడిన ఈ సాంగ్.. బారాత్లో ఓ పెళ్లికూతురి డ్యాన్స్తో సోషల్ మీడియా దృష్టిని ఆకట్టుకుంది. ఆపై రకరకాల వెర్షన్లతో క్రేజీ సాంగ్గా మారిపోయింది. తాజాగా ఈ సాంగ్ మరో ఫీట్ అందుకుంది. ఈ పాటకు జగిత్యాల పట్టణంలో 1000 మందితో నృత్యం చేయించి మరో మెట్టు ఎక్కించారు. ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో భాగంగా రవి మచ్చ యూట్యూబ్ ఛానెల్ ఆధ్వర్యంలో స్థానిక మినీ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ నృత్య ప్రదర్శనలో మహిళలు, యువతులు, చిన్నారులు మొత్తం వెయ్యి మందికి పైగా పాల్గొన్నారు. జగిత్యాల, చొప్పదండి ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, సుంకే రవిశంకర్, కరీంనగర్ ఎమ్మెల్సీ ఎల్ రమణ, జెడ్పీ చైర్పర్సన్ దావ వసంతా సురేష్, జిల్లా కలెక్టర్ జి. రవి, మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ భోగ శ్రావణి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బుల్లెట్ బండి సాంగ్ను రచయిత లక్ష్మణ్ రాయగా.. ఎస్కే బాజి సంగీతం అందించారు. -
నరేంద్ర మోదీ.. తగ్గేదేలే!
One Crore Subscription Completed For Modi Youtube: సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాజాగా అరుదైన రికార్డు ఆయన సొంతం అయ్యింది. ప్రపంచంలోని టాప్ లీడర్స్కు సాధ్యం కానీ మైలురాయిని చేరుకున్న మోదీ. ఆయన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. యూట్యూబ్లో అత్యధిక సబ్స్క్రైబర్లతో దూసుకుపోతోంది నరేంద్ర మోదీ యూట్యూబ్ ఛానెల్. తాజాగా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కోటి దాటేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రధాన నాయకుల యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబర్ల సంఖ్యలో మోదీనే టాప్. ఆయన దరిదాపుల్లో ఏ ప్రపంచ నేత కూడా లేకపోవడం విశేషం. రెండో ప్లేస్లో 36 లక్షల యూట్యూబ్ సబ్స్క్రైబర్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బోల్సోనారో ఉన్నారు. 30.7 లక్షల సబ్స్క్రైబర్లతో మెక్సికో అధినేత ఆండ్రెస్ మాన్యువల్ లోపెజ్ ఒబ్రాడోర్ మూడో స్థానంలో ఉండగా.. 28.8 లక్షల సబ్స్క్రైబర్లతో ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో మూడో స్థానంలో ఉన్నారు. అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ల సంఖ్య కేవలం 7.03 లక్షలు మాత్రమే. ఇటు.. దేశంలో మోదీ తర్వాత అత్యధిక సబ్స్క్రైబర్లు కలిగిన నేతలను గమనిస్తే.. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి 5.25 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్కి 4.39 లక్షలు, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి 3.73 లక్షలు, తమిళనాడు సీఎం స్టాలిన్కి 2.12 లక్షలు, ఢిల్లీ మంత్రి మనీష్ సిసోడియాకు 1.37 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. 2007 అక్టోబరు 26న నరేంద్ర మోదీ పేరిట యూట్యూబ్ ఛానెల్ పప్రారంభమైంది. ఆ సమయంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో మోదీకి సంబంధించిన చాలా అంశాల వీడియోలతో పాటు, బాలీవుడ్ ప్రముఖలతో పాల్గొన్న పలు వీడియోలు, కరోనా విజృంభణ సమయంలో వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన వీడియోలు ఉన్నాయి. మిగతా వాటిల్లోనూ.. యూట్యూబ్తో పాటు ఇతర సోషల్ మీడియా దిగ్గజ ప్లాట్ఫామ్ల్లోనూ ప్రధాని మోదీకి ఫాలోవర్లు ఎక్కువే. మోదీ ట్విట్టర్ను ఫాలో అయ్యేవారి సంఖ్య 7.53 కోట్లు కాగా, ఆయన ఫేస్బుక్ను 4.68 కోట్ల మంది అనుసరిస్తున్నారు. -
ఉగ్గబట్టుకుని చూడాల్సిన వీడియో! ఏది నిజం.. ఏది వైరల్!
Driver Takes Impossible u-turn On Narrow Hillside Road: ర్యాష్ డ్రైవింగ్కి సంబంధించిన పలు వైరల్ వీడియోలు చూశాం. కొన్ని వీడియోల్లో అయితే వీడి పని అయిపోయింది అనుకునేంతగా వీడియోలు చూశాం. కొంత మంది బస్సు కింద పడిన ఏ మాత్రం గాయాలుపాలు కాకుండా బయటపడిన వీడియోలు చూశాం. అయితే కొండ అంచున ఒక డ్రైవర్ యూటర్నింగ్ తీసుకుంటున్న వీడియో ఒకటి ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లోనూ, ట్విట్టర్లోనూ తెగ వైరల్ అవుతుంది. కానీ ఈ వీడియో చూడాలంటే మాత్రం చాలా టెన్షన్గా, ఏం అవుతుందో అని ఉగ్గబట్టుకుని భయం భయంగా చూడాలి. అసలు విషయంలోకెళ్తే...ఒక కొండల వద్ద ఘాటీ రోడ్డులో వెళ్లేందుకు ఒక మార్గం వచ్చేటప్పడూ ఒక మార్గం ఉంటుంది. ఎందుకంటే కొండల వద్ద ఎదురుగా ఇంకో వాహనం ఏదీ రాదు. అలాగే ఇరుకైన కొండల అంచున రోడ్డుపై యూటర్న్ తీసుకోవడం అసలు కుదరదు. కానీ ఈ వీడియోలో డ్రైవర్ తన బ్లూ కార్తో అంత ఇరుకైన పర్వత రోడ్డు వద్ద చాలా నైపుణ్యం ప్రదర్శించి యూ టర్న్ తీసుకున్నాడు. పైగా అతనికి ఈ యూటర్న్ తీసుకోవడానికి సుమారు 80 నిమిషాలు పట్టింది. దీంతో నెటిజన్లు ఆ డ్రైవర్ నైపుణ్యాన్ని తెగ ప్రశసింస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు. అయితే ఈ వీడియోని డ్రైవింగ్స్కిల్ అనే యూట్యూబ్ ఛానెల్ గత ఏడాది డిసెంబర్లో మొదటిసారి షేర్ చేసింది. అంతేకాదు కారు నడిపే వ్యక్తి చాలా ఇరుకైన రహదారిపై యూ టర్న్లు ఎలా చేయాలో ప్రదర్శించే నిపుణుడు అని పేర్కొంది. అయితే మళ్లీ ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవ్వడమే కాక నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. The perfect 80 point turn! pic.twitter.com/bLzb1J1puU — Dr. Ajayita (@DoctorAjayita) January 23, 2022 ఇక ఇంటర్నెట్లో మరో వీడియో కూడా వైరల్ అవుతోంది. ఇది పై వీడియోకి ఒరిజినల్ అనే ప్రచారం నడుస్తోంది. సో.. ఈ రెండిటిలో ఏది నిజం? ఏది వైరల్? అనేది నిర్ధారించడం కొంచెం కష్టమే అవుతోంది. (చదవండి: రూ.500 కోసం జుట్టు జుట్టు పట్టుకుని....చెప్పులతో కొట్టుకున్నారు: వైరల్ వీడియో) -
జైభీమ్ చిత్రానికి మరో అరుదైన గౌరవం.. 'ఆస్కార్' ఛానెల్లో
Suriya Jai Bhim Features On The Oscars Official Youtube Channel: మాస్ పాత్రల్లోనే కాకుండా, క్లాస్, వైవిధ్యమైన రోల్స్లో అదరగొడుతుంటాడు తమిళ స్టార్ హీరో సూర్య. ఇటీవల సూర్య నటించిన చిత్రం 'జైభీమ్'. సినిమా అంటే మూడు ఫైట్లు, నాలుగు పాటలు, హీరోయిన్తో ప్రేమాయణం, ఐటెం సాంగ్లు కాదని నిరూపించి, సూపర్ డూపర్ హిట్ కొట్టిన చిత్రం జైభీమ్. సినిమాకు సామాజిక బాధ్యతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మరోసారి తట్టిలేపింది. ఒక ఆడబిడ్డ నిజజీవిత గాథను, పోరాటాన్ని ప్రయోగాత్మకంగా తెరకెక్కించి సత్తా చాటింది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కించుకుంది. అంతేకాకుండా ఐఎండీబీ రేటింగ్స్లో హాలీవుడ్ క్లాసిక్ హిట్ 'ది షాషాంక్ రిడంప్షన్' చిత్రాన్ని అధిగమించి 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకూ ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. అలాగే గోల్డెన్ గ్లోబ్ 2022 పురస్కారానికి కూడా నామినేట్ అయిన సంగతి తెలిసిందే. వాస్తవ సంఘటనల ఆధారంగా కోర్టు డ్రామా కథాశంతో తెరకెక్కిన 'జైభీమ్' చిత్రానికి మరో అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్లో 'సీన్ ఎట్ ది అకాడమీ' పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను ఉంచారు. అకాడమీ యూట్యూబ్ వేదికగా ఒక తమిళ చిత్రానికి సంబంధించిన వీడియో క్లిప్ను ఉంచటం ఇదే మొదటిసారి. కాగా అకాడమీ యూట్యూబ్ ఛానెల్లో జైభీమ్ సినిమా వీడియో ఉండటంపై చిత్రబృందంతోపాటు అభిమానులు సంతోషపడుతున్నారు. 'జైభీమ్' ఇండియన్ సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించిందని పండుగ చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని 'జస్టిస్ చంద్రు' జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇదీ చదవండి: సూర్య ‘జై భీమ్’ మూవీ ఎలా ఉందంటే..? #Suriya's #JaiBhim scenes uploaded to #Oscars Official YouTube channel.👍👏@Suriya_offl ➡️ https://t.co/AXQwY2av72 pic.twitter.com/QmgFrz827n — Suresh Kondi (@SureshKondi_) January 18, 2022 • #JaiBhim is now the only Tamil Movie to be shown in The Academy #Oscars YouTube channel 🔥💯 Ever Proudful @Suriya_offl na 😇❤️ pic.twitter.com/3JhxVZhX1q — CHENTHUR (@ck__tweetz) January 18, 2022 #JaiBhim getting bigger and bigger 🔥 First Tamil movie scenes to shown in #Oscars utube ❤@Suriya_offl #EtharkkumThunindhavan#VaadiVaasal pic.twitter.com/qJcs0TsIQd — Mass Syed 💥 (@SuriyaFanstren4) January 18, 2022 -
ఇంద్రభవనం లాంటి మంచు మోహన్బాబు ఇంటిని చూశారా?
Manchu Mohan Babu Home Tour Video : మంచు లక్ష్మీ.. పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. నటిగా, నిర్మాతగా, టెలివిజన్ హోస్ట్గా చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో యూట్యూబర్గా అవతారం ఎత్తిన మంచు లక్ష్మీ క్రియేటివ్ వీడియాలతో ఆకట్టుకుంటుంది. లక్ష్మీ మంచు పేరుతో ఉన్న ఆమె యూట్యూబ్ ఛానల్కి ఇప్పటికే లక్షా 60వేలకు పైగా సబ్స్రైబర్స్ ఉన్నారు. తన ఛానెల్ ద్వారా బ్యూటీ, ఫ్యాషన్, ఫోటో షూట్ లాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు రూపొందించిన లక్ష్మీ తాజాగా తన నాన్న, నటుడు మంచు మోహన్ బాబు ఇంటిని నెటిజన్లకు పరిచయం చేసింది. ఇది తన తండ్రి 6వ ఇల్లని పేర్కొంది. ఇక కిచెన్, ఆఫీస్, హోం థియేటర్ సహా ఇల్లు మొత్తాన్ని వివరించే ప్రయత్నం చేస్తుండగా మోహన్ బాబు ఎంట్రీ ఇచ్చారు. ఏంటి ఇల్లు మొత్తం చూపిస్తున్నావా అని అడగ్గా..ఆల్రెడీ వాళ్లు చూశారు కదా నాన్న అని లక్ష్మీ ఆన్సర్ ఇచ్చింది. దీంతో ఫోటోలు తీయకూడదు..ఇల్లు చూపించకూడదు అంటూ మంచు లక్ష్మీపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేయి చేసుకోబోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇక సకల సౌకర్యాలతో ఇంద్ర భవనంలా మెరిసిపోతున్న మోహన్ బాబు ఇంటిని మీరు కూడా చూసేయండి. -
యూట్యూబ్లో దూసుకుపోతున్న అజయ్.. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!
ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు ఊహించెదరు....పాట గురించి గుజరాతీ కుర్రాడు అజయ్కి తెలియకపోవచ్చు. కాని అతడికి బాగా తెలుసు... ప్రతి నిమిషం ఇష్టమైన పనిపై దృష్టి పెడితే సక్సెస్ను కరెక్ట్గా ఊహించవచ్చు అని. అందుకే అజయ్ అలియాస్ అజ్జూభాయ్ విజేత అయ్యాడు. ‘టాప్ 10 ఇండియన్ యూట్యూబ్ క్రియేటర్స్–2021’ గేమర్స్ జాబితాలో టాప్లో ఉన్నాడు... అజ్జూభాయ్గా ప్రసిద్ధుడైన అహ్మదాబాద్కు చెందిన అజయ్ ఇంటర్మీడియట్ తరువాత ‘ఇక చదువుకోవడం నా వల్ల కాదు’ అనుకున్నాడు. అలా అని ఖాళీగా తింటూ కూర్చోలేదు. బలాదూర్గా తిరగలేదు. సాఫ్ట్వేర్కు సంబంధించిన విషయాలంటే అతడికి చాలా ఇష్టం. ఆన్లైన్ వేదికగా సొంతంగా ఎన్నో విషయాలు నేర్చుకున్నాడు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన అజయ్ బాల్యం ‘స్కూల్ టు హోమ్....హోమ్ టు స్కూల్’ అన్నట్లుగా ఉండేది. అలాంటి అజయ్ చదువు మధ్యలోనే మానేయడం తల్లిదండ్రులకు నచ్చిందో లేదో కానీ వారు పెద్దగా ఏమీ అనలేదు. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ‘గ్రోత్ హ్యాకర్’గా పనిచేశాడు అజయ్. తనకు గేమింగ్ అంటే చా...లా ఇష్టం. అయితే తన ఫ్రెండ్స్, పరిచయస్తులలో గేమ్స్ గురించి పెద్దగా తెలిసినవాళ్లు, బాగా ఇష్టపడేవాళ్లు లేరు. గేమర్స్ తమదైన గేమింగ్ కమ్యూనిటీని ఎలా క్రియేట్ చేసుకుంటారు? అనే సందేహం అతనికి ఎప్పుడూ వచ్చేది. ఇక తానే సొంతంగా ఆన్లైన్లో తనలాంటి ఆసక్తి ఉన్నవారిని పరిచయం చేసుకొని గేమ్స్ ఆడేవాడు. మొదటిసారి యూట్యూబ్లో ‘ఫ్రీ ఫైర్’ గేమ్స్ చూసినప్పుడు బాగా ఆకర్షితుడయ్యాడు. ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాడు. ఒకరోజు తన సోదరుడితో అన్నాడు... ‘యూట్యూబ్ గేమింగ్ చానల్ మొదలుపెడదామనుకుంటున్నాను. ఎలా ఉంటుంది?’ ‘నీకంత సీన్ లేదు’ అని ఆ సోదరుడు వెక్కిరించి ఉంటే ఎలా ఉండేదోగానీ ‘బాగుంటుంది. నువ్వు బ్రహ్మాండంగా చేయగలవు’ అని ధైర్యం ఇచ్చాడు. అలా మన అజయ్ ‘టోటల్ గేమింగ్’ అనే యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఇది సూపర్ హిట్టు. దీనిలో గేమింగ్ కంటెంట్ ఎప్పటికప్పుడూ అప్లోడ్ చేస్తుంటారు. ‘టీజీ టోర్నమెంట్స్’ అనే రెండో చానల్ మొదలుపెట్టాడు. అది కూడా సూపర్డూపర్ హిట్ అయింది. ఇందులో ఫ్రీ ఫైర్ టోర్నమెంట్స్ నిర్వహిస్తుంటారు. వెరైటీస్ ఆఫ్ గేమింగ్, ఎంటర్టైనింగ్, మోటివేషనల్....మొదలైనవాటితో కంటెంట్ క్రియేటర్గా సక్సెస్ఫుల్గా దూసుకుపోతున్నాడు అజ్జూభాయ్. అతడి ఖాతాలో 30.2 మిలియన్ల సబ్స్క్రైబర్స్!! మన దేశంలో ‘లీడింగ్ గేమర్’గా పేరు తెచ్చుకున్న అజ్జూభాయ్ విజయరహస్యం ఏమిటి? అతని మాటల్లోనే చెప్పాలంటే... ‘క్లీన్ కంటెంట్’ స్మార్ట్టీవిలు మొదలైన తరువాత కుటుంబంతో కలిసి గేమ్స్ ఆడే కాలం వచ్చేసింది. ఈ నేపథ్యంలో క్లీన్ కంటెంట్ ఉండాలని, అభ్యంతరకరం కాని భాష ఉండాలనేది అతని నమ్మకం. ఆ నమ్మకమే అతడిని విజేతను చేసింది. కర్వ్డ్ హెచ్డీ టచ్స్క్రీన్ ∙40 ప్లస్ డైలీ లైవ్క్లాసెస్. పాప్లర్ మ్యూజిక్. బ్యాలెన్స్డ్ డిజైన్. మాగ్నెటిక్ రెసిస్టెన్స్. డ్యుయల్ బాటిల్ హోల్డర్స్. బ్లూటూత్ రెసిస్టెంట్ కంట్రోల్.సూపర్ఫాస్ట్ స్ట్రీమింగ్ స్క్రాచ్. రెసిస్టెన్స్ బరువు: 56కిలోలు చదవండి: ఫిమేల్ ఆర్జే: అహో... అంబాలా జైలు రేడియో! -
నెలకు కోటి రూపాయల జీతం వదిలేసి మరీ..
Korea Man Quits Crores Salary Job And Became Youtuber Because Of Mother: కంపెనీలో చేరిన ఏడాదికే ఇంక్రిమెంట్. అది అలాంటి ఇలాంటిది కాదు. నెలకు కోటికి పైగా(మన కరెన్సీలో) జీతం. ప్రొఫెషనల్ కెరీర్ను పీక్స్కు చేర్చే టైం అది. కానీ, ఆ సమయంలో ఉద్యోగం వదిలేయాలనే ఆలోచన ఎవరికైనా వస్తుందా?.. దక్షిణ కొరియాకు చెందిన బెన్ చోన్(28) ఆ నిర్ణయం తీసేసుకున్నాడు మరి!. అయితేనేం తనకు తెలిసిన విద్యతో లక్షలు(మన కరెన్సీలోనే) సంపాదిస్తూ.. సొంతంగా బాస్గా ఉండడంలో కిక్కును వెతుక్కుంటున్నాడు. జేపీ మోర్గాన్.. అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం. ప్రపంచవ్యాప్తంగా పేరుంది. అలాంటి కంపెనీలో 2017లో చేరాడు బెన్ చోన్. పుట్టి, పెరిగింది దక్షిణ కొరియాలోనే అయినా. స్కాలర్షిప్ మీద అమెరికాలో మంచి యూనివర్సిటీలో చదివి.. జాబ్ తెచ్చుకున్నాడు. ఏడాది తిరగకుండానే అతని టాలెంట్కి భారీ ప్యాకేజీ ఆఫర్ చేసింది జేపీ మోర్గాన్. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ అనలిస్ట్గా ప్రమోషన్తో పాటు నెలకు లక్షా యాభై వేల డాలర్ల జీతం(అదనంగా బోనస్) ఇవ్వాలని నిర్ణయించుకుంది. అయితే రెండు నెలల జీతం అందుకున్నాడో లేదో.. పిడుగులాంటి వార్త అతని చెవిన పడింది. తల్లి ప్రమాదకరమైన వ్యాధి బారినపడిందన్న విషయం అతన్ని స్థిమితంగా ఉంచలేదు. ఆ సమయంలో అతనికి తల్లే ప్రపంచంగా కనిపించింది. ఆమె పక్కనే ఉండి.. ఎలాగైనా రక్షించుకోవాలనుకున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి.. సొంతూరికి బయలుదేరాడు. అక్కడ ఓ చిన్న బట్టల దుకాణంలో కొంతకాలం పని చేశాడు. బట్టల షాపులో.. దాచుకున్న సొమ్మంతా కేవలం మూడు నెలల్లోనే తల్లి ట్రీట్మెంట్కి ఖర్చైంది. బ్యాంకింగ్ సలహాలిచ్చే బెన్ చోన్.. సొంతూరులోనే ఓ బట్టల షాపులో పని చేశాడు. ఆపై ఇంట్లో బట్టల దుకాణం తెరిచాడు. కొన్నాళ్లు పోయాక తల్లి మందులకు ఖర్చులు పెరిగాయి. ఆ టైంలోనే యూట్యూబ్ ఛానెల్ ద్వారా ఆదాయం సంపాదించొచ్చనే విషయం అతనికి గుర్తొచ్చింది. యూట్యూబ్లో రోజూ రకరకాల వీడియోలు అప్లోడ్ అవుతుంటాయి. వాటిలో చాలావరకు వీడియోలను చూసి తిట్టుకుంటాం.. నవ్వుకుంటాం. కొన్నింటిని చూడకుండానే స్కిప్ చేస్తుంటాం. కానీ, వాటి వ్యూస్ ద్వారా యూట్యూబర్లకు ఆదాయం వస్తుంది. అంటే.. ఏదో ఒకరకంగా తమ శ్రమను పెట్టుబడిగా పెట్టి సంపాదిస్తున్నారు వాళ్లు. అలా బెన్ చోన్ మాత్రం తనకు తెలిసిన విద్యతోనే యూట్యూబ్ ఛానెల్ మొదలుపెట్టాడు. తెలిసిన విద్యతోనే.. 2019లో రేర్లిక్విడ్ rareliquid పేరుతో యూట్యూబ్ఛానెల్ మొదలుపెట్టాడు బెన్. ఇన్వెస్ట్మెంట్, కెరీర్ గైడెన్స్ వీడియోలతో నెమ్మదిగా ఫేమ్ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్న క్రిప్టోకరెన్సీ గురించి, బ్లాక్ చెయిన్ మార్కెట్ తీరు తెన్నులు, టిప్స్తో పాటు టెక్, మార్కెటింగ్ సలహాలు అందిస్తాడు. ‘‘ జేపీ మోర్గాన్లో చేరిన తొలినాళ్లలో వారానికి 70 నుంచి 110 గంటల పని. ఒక్కోసారి ఏకధాటిగా 28 గంటలు పని చేయాల్సి వచ్చేది. ఇప్పుడు నాకు నేనే బాస్. నాకు తెలిసిన విద్య. కోట్ల జీతం పోతేనేం.. నాకు ఉన్న వనరులతో, తక్కువ శ్రమతో సంతోషం, మనశ్శాంతిని సంపాదించుకుంటున్నా. నాలాగే ప్రతీ ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. మనసు పెడితే డిజిటల్ ప్రపంచంతో సంపాదించుకోవచ్చు.. ఒక అడుగు ముందుకేసి అద్భుతాలూ చేయొచ్చు. సిగ్గు-మొహమాటం పడాల్సిన అవసరం అస్సలు లేదు. నా వరకు నేను బాగానే సంపాదిస్తున్నా. అన్నింటికి మించి మా అమ్మ పక్కనే ఉంటున్నా. ఇది చాలాదా నాకు’’ అంటున్నాడు బెన్ చోన్. ప్రస్తుతం rareliquid ఛానెల్లో టెక్, మార్కెట్, క్రిప్టోకరెన్సీ తీరు తెన్నులపైనా అతని సలహాలు, డెమో వీడియోలు ఉంటాయి. రెజ్యూమ్(సీవీ) సలహాలు, రకరకాల కోర్సుల గురించి వివరిస్తాడు. ఇదంతా చిన్న చిన్న వ్యాపారాల కలయికగా చెప్తాడు బెన్ చోన్. క్రియేటివ్ వేలో మరికొందరికి పాఠాలు, సలహాలు ఇవ్వడం సంతోషాన్ని ఇస్తుందని అంటున్నాడు ఈ యూట్యూబర్. యూట్యూబ్ వ్యూస్ ప్రకారం.. జులైలో బెన్ జీతం 19, 161 డాలర్లుకాగా, నవంబర్లో 26,000 డాలర్లు సంపాదించాడు. మన కరెన్సీలో ఇది 17 లక్షల రూపాయలు. -సాక్షి, వెబ్స్పెషల్ -
గూగుల్ అదిరిపోయే శుభవార్త, ఇక యూట్యూబ్లో చెలరేగిపోవచ్చు
యూట్యూబ్ క్రియేటర్లకు గూగుల్ ఇండియా అదిరిపోయే శుభవార్త చెప్పింది. భారత్లో యూట్యూబ్ షార్ట్స్ టైమ్ డ్యూరేషన్ పై కీలక ప్రకటన చేసింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ క్రియేటర్లలో కొత్త ఉత్సాహాన్ని నింపినట్లైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. యూట్యూబ్ షార్ట్స్లో టైమ్ డ్యూరేషన్ తక్కువే 2020 సెప్టెంబర్లో గూగుల్ సంస్థ యూట్యూబ్ షార్ట్స్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ షార్ట్స్ లో ఇన్సిడెంట్ ఏదైనా కట్టే కొట్టే తెచ్చే అన్న చందంగా 60 సెకన్ల వ్యవధి వీడియోను చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఆ షార్ట్స్ వీడియోస్లో 15 సెకన్లు, అంతకంటే తక్కువ టైమ్ డ్యూరేషన్ ఉన్న వీడియోల్ని చేసేందుకు అనుమతిస్తున్నట్లు ఈరోజు జరిగిన ఓ ఈవెంట్లో గూగుల్ ఇండియా అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటనతో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. యూట్యూబ్ షార్ట్స్తో లాభాలు యూట్యూబ్ షార్ట్స్ వల్ల నిర్వహకులకు అనేక లాభాలున్నాయి. ముఖ్యంగా ఆన్లైన్లో డబ్బులు సంపాదించాలనుకునేవారికి ఈ ప్లాట్ ఫాం సువర్ణ అవకాశమనే చెప్పుకోవాలి. నిమిషాల వ్యవధి వీడియోల కంటే సెకన్ల వ్యవధి వీడియో చేయడం చాలా ఈజీ. అదే సమయంలో వ్యూస్, ఛానల్ బ్రాండింగ్ వేగం పెరిగిపోతుంది. ఈ జనరేషన్ క్రియేటర్స్, ఆర్టిస్ట్ల క్రియేటివిటీని బిజినెస్గా మలచడంలో సహాయపడుతుంది. క్రియేటర్లకు వంద మిలియన్ డాలర్లు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా గుర్తింపు పొందిన కంటెంట్ క్రియేటర్లకు ప్రతినెలా డబ్బులు సంపాదించుకోవచ్చు. టిక్.. టాక్ గత సంవత్సరం ‘క్రియేటర్స్ ఫండ్’ పేరుతో రెండు వందల మిలియన్ డాలర్లను కేటాయించింది. అదే బాటలో యూట్యూబ్ కూడా కంటెంట్ క్రియేటర్ల కోసం వంద మిలియన్ డాలర్లు (2021–2022) కేటాయించింది. ఇప్పుడు మనదేశంలో టిక్... టాక్ లేకపోవడంతో చాలామంది క్రియేటర్లు యూట్యూబ్ షార్ట్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే వారిని మరింత ప్రోత్సహించేందుకు గూగుల్ భారీ ఎత్తున ఫండ్ను కేటాయించింది. చదవండి: హాయ్ గైస్...నేను మీ షెర్రీని..!! -
యూట్యూబర్ మరోసారి అరెస్ట్.. పవిత్ర స్థలంలో వీడియో చిత్రీకరణ
మధుర: యూట్యూబర్లు పర్యటక ప్రాంతాలు, ట్రావెల్, టెంపుల్స్ సందర్శనకు సంబంధించిన వీడియోలను తీసి తమ యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ చేస్తుంటారు. అయితే ఓ యూట్యూబర్ తీసిన వీడియో అతన్ని వివాదంలోకి నెట్టడమే కాక అరెస్ట్ అయ్యేలా చేసింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉత్తరప్రదేశ్ బృందవనంలోని పవిత్ర స్థలంగా భావించే ‘నిధివన్ రాజ్’ స్థలాన్ని గౌరవ్ శర్మా అనే యూట్యూబర్ వీడియో తీశాడు. చదవండి: మెక్డొనాల్డ్స్ ‘టాయిలెట్’ వివాదం ఆ స్థలం రాధాకృష్ణులకు సంబంధించిన ఏకాంత స్థలమని నిధివన్ రాజ్ పూజారుల నమ్మకం. అయితే అక్కడ రాత్రి సమయంలో వీడియోలు చిత్రీకరించడం నిషేధంలో ఉంది. గౌరవ్ శర్మా అక్కడ రాత్రి సమయంలో తీసిన వీడియోను తన యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మళ్లీ డిలీట్ కూడా చేశాడు. అయితే ఆ వీడియో అప్పటికే వైరల్గా మారటంతో కొంతమంది పూజారులు నిరసన తెలిపి అభ్యంతరం వ్యక్తంచేశారు. నిధివన్ రాజ్ పూజారి రోహిత్ గోస్వామి ఫిర్యాదు మేరకు బృందావనం పోలీసులు గౌరవ్శర్మాను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గౌరవ్ను జ్యుడీషియల్ కస్టడికి తరలించినట్లు పోలీసు అధికారి మార్తాండ్ ప్రకాశ్సింగ్ వెల్లడించారు. నవంబర్ 6వ తేదీ తన సోదురుడు ప్రశాంత్, స్నేహితులు మోహిత్, అభిషేక్లో కలిసి గౌరవ్ శర్మా నిధివన్రాజ్ను చిత్రీకరించినట్లు పోలీసులు తెలిపారు. అయితే గౌవర్ శర్మా గతంలో తన పెంపుడు కుక్కకు బెలూన్లు కట్టి గాల్లోకి ఎగరవేసిన ఘటనలో అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. -
నిద్రపోతున్నా సరే అతడి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూనే ఉంది
గాంధీ అనే యువకుడు (చిరంజీవి) ఓ నిరుద్యోగి. ఒక రోజు పేపర్లో ఉద్యోగ ప్రకటన చూసి ఇంటర్వ్యూకు వెళ్తాడు. అక్కడ యజమాని రామ్మోహన్ రావు (రావు గోపాలరావు) డబ్బు అహంకారంతో అతడిని అవమానిస్తాడు. దాంతో చిరంజీవి ఓ ఛాలెంజ్ చేస్తాడు. అది ఏంటంటే 'ఐదు సంవత్సరాలలో 50 లక్షల రూపాయలు సంపాదించి చూపిస్తానని ఆ తరువాత చట్టబద్దంగా 50 లక్షల రూపాయలు సంపాదించి చూపెడతాడు. ఓ మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలడు అని నిరూపిస్తాడు. ఆ ఛాలెంజ్ నిలుపుకునే పాత్రలో చాలా బాగా ఒదిగిపోయారు చిరంజీవి. ప్రతి నాయకుడి పాత్రలో రావు గోపాలరావు నటన మరచిపోలేం. సినిమాలోలా ఛాలెంజ్ లు, గట్రా కాకుండా చట్టబద్దంగా డబ్బులు సంపాదించవచ్చా'అంటే అవుననే అంటున్నాడు 27ఏళ్ల యువకుడు. అలా అనడమే కాదు. నిరూపిస్తున్నాడు కూడా. దిగ్గజ సంస్థల సీఈఓలకు వచ్చే వేతనాలకు సరిసమానంగా అర్జిస్తున్నాడు. ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రతి ఒక్కరికి ఉద్యోగంతో పాటు ప్రత్యామ్నాయంగా డబ్బులు సంపాదించడం చాలా అవసరం. అందుకే టెక్నాలజీని ఉపయోగించి యూట్యూబ్ ద్వారా డబ్బు ఈజీగా సంపాదించవచ్చని నిరూపిస్తున్నాడు. అంతేందుకు తాను నిద్రపోతున్నా తన బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగిపోతుందని చెబుతున్నాడు. అయితే ఆ బ్యాంక్ లెక్కలతో పాటు ఈ 27 ఏళ్ల యువకుడి యూట్యూబ్ కథాకమామిషు ఏంటో తెలుసుకుందాం. పదండి..! ట్రెడీషనల్ జాబ్స్ను సెలక్ట్ చేసుకోవడం, రిటైర్ అయ్యేదాకా అదే జాబ్లో కొనసాగే రోజులు పోయాయి. కంటెంట్ ఉంటే చాలు కటౌట్తో పనిలేకుండా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ప్రముఖ టెక్ కంపెనీల సీఈఓ'ల కంటే ఎక్కువగానే డబ్బులు సంపాదిస్తున్నారు. అంతేకాదు కోట్లాది మంది అభిమానులతో ఆన్లైన్ స్టార్స్గా కీర్తిప్రతిష్టలు సంపాదిస్తున్నారు. అలాంటి కోవకే చెందుతాడు 27 అమిత్ భదనా. ఇతనో యూట్యూబ్ క్రియేటర్. ఒక్క వీడియోతో లక్షలు సంపాదిస్తాడు. అతని ఆస్తులు కోట్లలో ఉన్నాయని యూట్యూబ్ లెక్కలు చెబుతున్నాయి. అమిత్ భదానా ఎవరు? అమిత్ భదానా 27 ఏళ్ల యూట్యూబ్ కంటెంట్ క్రియేటర్. సౌత్ ఢిల్లీకి చెందిన జోహ్రీపూర్ నివాసి. పాఠశాల విద్యను యమునా బీహార్ పాఠశాలలో, న్యాయశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశాడు. ప్రస్తుతం అమిత్ 'అమిత్ భదానా' అనే యూట్యూబ్ ఛానెల్లో ఎంటర్టైన్మెంట్ వీడియోస్ను అప్లోడ్ చేస్తున్నాడు. అలా అప్లోడ్ చేసిన వీడియోలకు కోట్లలో వ్యూస్ వస్తున్నాయి. వాటికి వచ్చే వ్యూస్, డిస్ప్లే అయ్యే యాడ్స్ కారణంగా భారీ మొత్తంలో డబ్బుల్ని సంపాదిస్తున్నాడు. 2017లో ప్రారంభం అమిత్ భదానా తన పేరుతోనే యూట్యూబ్ ఛానెల్ ను ప్రారంభించాడు. అక్టోబర్ 24, 2012న ఛానెల్ని ప్రారంభించినా 2017వరకు ఎలాంటి వీడియోలు పెట్టలేదు. కానీ 'ఎగ్జామ్ బీ లైక్ బోర్డ్ ప్రిపరేషన్ బీ లైక్' పేరుతో తొలి వీడియోను 2017లో అప్లోడ్ చేశాడు. అలా ప్రారంభమైన ఛానల్కు ఇప్పుడు 23.5 మిలియన్ల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు. అమిత్ భదానా సంపాదన మీడియా నివేదికల ప్రకారం, అమిత్ భదానా తన యూట్యూబ్లో పోస్ట్ చేసే ప్రతి వీడియోకి రూ. 10 లక్షలు సంపాదిస్తాడు. అమిత్ తన ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా ఖాతాల ద్వారా కూడా సంపాదిస్తున్నాడు. అమిత్ భదానా నికర ఆస్తి ఒక్కో వీడియోకి రూ.10 లక్షలకు పైగా సంపాదిస్తున్న అమిత్ భదానా నికర ఆస్తి కాకుండా, మొత్తం నికర ఆస్తి దాదాపు రూ. 52 కోట్లుగా ఉంది. చదవండి: ఇదేం యాపారం సామి..! జీన్స్ కొంటే ఫోన్ ఫ్రీ..టెక్ దిగ్గజం కొత్త ఐడియా -
ఫిజిక్స్లోని ఒక ప్రశ్నకోసం .... హెలికాఫ్టర్నే అద్దెకు తీసుకున్నాడు
న్యూయార్క్: ఏదైనా పరీక్షలో ప్రశ్నకు సమాధానం తెలియక వదిలేస్తే మనం టీచర్నో లేక మన సీనియర్స్నో అడుగుతాం. కానీ ఈ యూట్యూబర్ ఫిజిక్స్ పరీక్షలోని ఒక ప్రశ్నకు సమాధానం కోసం హెలికాఫ్టర్నే అద్దెకు తీసుకుని కనుకున్నాడు. అసలు ఏంటిది అని ఆశ్చర్యంగా ఉందా. (చదవండి: ఒకప్పడు ‘అడవి’ మనిషి... ఇప్పడు రియల్ హీరో) వివరాల్లోకెళ్లితే.....వెరిటాసియం అనే యూట్యూబ్ చానెల్ని నడుపుతున్న డెరెక్ ముల్లర్ తనను కలవరపెడుతున్న ఫిజిక్స్ ప్రశ్నను పరిష్కరించడానికి హెలికాప్టర్నే అద్దెకు తీసుకుని ప్రయాణించాడు. 2014 యూఎస్ ఫిజిక్స్ ఒలింపియాడ్ అర్హత పరీక్షలో 19వ ప్రశ్నకి సమాధానం కోసం నిజంగానే ఆచరణాత్మక ప్రయోగం చేశాడు. ఆ ప్రశ్న ఏంటంటే " ఒక హెలికాప్టర్ స్థిరమైన వేగంతో అడ్డంగా ఎగురుతోంది. హెలికాప్టర్ కింద ఒక సంపూర్ణ అనువైన యూనిఫాం కేబుల్ సస్పెండ్ చేయబడింది. కేబుల్పై గాలి రాపిడి చాలా తక్కువ కాదు. హెలికాప్టర్ గాలిలో కుడివైపుకి ఎగురుతున్నప్పుడు ఈ క్రింది రేఖాచిత్రాలలో ఏది కేబుల్ ఆకారాన్ని బాగా చూపుతుంది?". అయితే ఈ ప్రశ్న కోసం కాగితం లేదా కంప్యూటర్లో లెక్కించడానికి బదులుగా, ముల్లర్ దానిని ఆచరణాత్మకంగా పరిష్కరించాలని నిర్ణయించుకోవడం విశేషం. ఈ మేరకు ముల్లర్ హెలికాప్టర్ను అద్దెకు తీసుకుని 20-పౌండ్ల కెటిల్ బెల్తో పాటు ఛాపర్ నుండి ఒక కేబుల్ను క్రిందికి వేలాడిదిపి అది ఎలా ఎగురుతుందో చూశాడు. పైగా ఆ ప్రయోగం ఆ ప్రశ్నకి సమాధానం 'డీ' గా భావించాడు. కానీ ఆ సమాధానం కూడా సృతప్తినివ్వక మళ్లా మళ్లా అదే ప్రయోగం చేశాడు. ఈ మేరకు అతను ఆ ప్రయోగానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశాడు. దీంతో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ (ఏఏపీటీ) సోషల్ మీడియాలో "కేబుల్పై గాలి రాపిడి ఉన్నందున, హెలికాప్టర్కు కేబుల్ జోడించే శక్తికి క్షితిజ సమాంతర భాగంలో ఉండాలి." అని ఒక పరిష్కారాన్ని పోస్ట్ చేసింది. (చదవండి: వివాహం అయిన ఐదు నెలలకే తన భార్యకు మళ్లీ పెళ్లి) -
ఎక్కడికెళ్లినా నిరాదరణే.. కట్ చేస్తే.. కోట్లు సంపాదిస్తున్నాడు..!
న్యూఢిల్లీ: ప్రతి మనిషి జీవితంలో తాను కోరుకున్న రంగంలో మంచి స్థాయిలో స్థిరపడాలని ఆశిస్తాడు. అందుకు తగ్గట్టే ప్రయత్నాలు చేస్తాడు. కొందరికి వెంటనే అవకాశాలు లభిస్తాయి.. ఇక కొందరికేమో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్న ఫలితం లభించదు. నిరాశవాదులైతే.. మాకింతే ప్రాప్తం అనుకుని వదిలేస్తారు. మరికొందరు ఉంటారు.. అపజయాలు ఎదురైన కొద్ది.. వారిలో కసి పెరుగుతుంది. తమకు ఎదురైన అడ్డంకులునే సోపానాలుగా మార్చుకుని విజయం సాధిస్తారు. ఈ కోవకు చెందిన వ్యక్తే యూట్యూబర్ పంకజ్ శర్మ. పేరు గుర్తుపట్టడం కాస్త కష్టమే కానీ ‘బక్లోల్ వీడియో’ అని యూట్యూబ్ చానెల్ పేరు చెప్తే టక్కున గుర్తుపడతారు చాలా మంది. అతడి సక్సెస్ స్టోరీ ఎందరికో ప్రేరణగా నిలుస్తోంది. ఆవివరాలు.. ఢిల్లీకి చెందిన పంకజ్ శర్మ గురుగోబింద్ సింగ్ ఇంద్రప్రస్థ యూనివర్శిటీ నుంచి బీసీఏ, ఎంబీఏ పూర్తి చేశాడు. ఆ తర్వాత 15 వేల రూపాయల జీతానికి గురగావ్లో ఉద్యోగంలో చేరాడు. కానీ ఉద్యోగం అతడికి సంతృప్తినివ్వలేదు. సినిమాల్లోకి వెళ్లాలనేది పంకజ్ కోరిక. (చదవండి: నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్) ఆ ఆలోచన మార్చింది... ఈ క్రమంలో ఉద్యోగం వదిలిపెట్టి.. అవకాశాల కోసం సినీ కార్యాలయాల చుట్టూ తిరగడం ప్రారంభించాడు. కానీ వెళ్లిన ప్రతి చోటా నిరాదరణే. ఇవేవీ పంకజ్ని కుంగదీయలేదు. మరింత పట్టుదలగా ప్రయత్ం చేశాడు. ఈ క్రమంలో అతడికి ఓ ఆలోచన వచ్చింది. అవకాశాల కోసం తిరిగేబదులు.. తనకు తానే అవకాశాలు సృష్టించుకోవడం మంచిది అనుకున్నాడు. యూట్యూబ్ చానెల్ ప్రారంభం... దానిలో భాగంగా బక్లోల్ వీడియో అనే యూట్యూబ్ చానెల్ని ప్రారంభించాడు. మొదటి సంపాదన 9800 రూపాయలు. రెండేళ్లు పట్టు వదలకుండా ప్రయత్నించడంతో చానెల్కి సబ్స్ర్కైబర్లు పెరిగారు. వ్యూస్ కూడా పెరిగాయి. ఈ క్రమంలో పంకజ్ తీసిన దేశీ బచ్చే వర్సెస్ ఆంగ్రేజ్ మీడియం వీడియో ఏకంగా 78 మిలియన్ల వ్యూస్ సంపాదించింది. (చదవండి: యూట్యూబ్ను దున్నేస్తున్నారు, రోజూ 1,500 కోట్ల షార్ట్ వీడియోస్) డైమండ్ బటన్... 10 మిలియన్ల సబ్స్క్రైబర్స్ దాటితే.. ఆ చానెల్కి డైమండ్ బటన్ ఇస్తారు. పంకజ్ యూట్యూబ్ చానెల్ కూడా డైమండ్ బటన్ పొందింది. ప్రసుత్తం పంకజ్ చానెల్కి 10.2మిలియన్ల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇన్స్టాగ్రామ్లో కూడా ఇతడి చానెల్కి 305కే, ఫేస్బుక్లో 4.1మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. ఒకప్పుడు నిరాదరణను ఎదుర్కొన్న పంకజ్ ఇప్పుడు కోటీశ్వరుడు అయ్యాడు. చదవండి: జాబ్ వదిలేసి పాత డ్రమ్ములతో వ్యాపారం.. అతని జీవితాన్నే మార్చేసింది -
మీడియా అంటే సాయికి క్రేజ్!
సాక్షి, హైదరాబాద్: తెలుగు అకాడమీకి చెందిన రూ.64.5 కోట్ల ఫిక్సిడ్ డిపాజిట్లు (ఎఫ్డీ) కాజేసిన కేసుల్లో సూత్రధారిగా ఉన్న అంబర్పేట వాసి చుండూరి వెంకట కోటి సాయికుమార్కు మీడియా అంటే మహా క్రేజ్ ఉన్నట్లు తెలుస్తోంది. మీడియా చాలా శక్తి మంతమైందని తెలుసుకున్న ఇతడు తానే సొంతంగా ఓ చానల్ ఏర్పాటు చేయాలని భావించాడు. తెలుగు అకాడమీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసుల విచారణలో సాయికుమార్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. పదేళ్ల క్రితం ఏబీసీ టీవీ పేరుతో చానల్ ఏర్పాటుకు.. తాజాగా కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్ కేంద్రంగా శ్రావ్య మీడియా అంటూ ఓ యూట్యూబ్ చానల్ ఏర్పాటుకు విఫలయత్నం చేశాడు. గత పదేళ్ల కాలంలో వివిధ సంస్థలకు సంబంధించి దాదాపు రూ.200 కోట్ల ఎఫ్డీలు కొల్లగొట్టినా.. సాయికి మాత్రం చానల్ పెట్టాలన్న కోరిక మాత్రం తీరలేదు. 2012లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్కు చెందిన రూ.55.47 కోట్ల ఎఫ్డీలను సాయి, వెంకటరమణ తదితరులు కాజేశారు. అప్పట్లో విజయా బ్యాంక్లో మైనార్టీస్ కార్పొరేషన్ పేరుతో నకిలీ ఖాతా తెరిచారు. ఆ కార్పొరేషన్కు–బ్యాంకులకు దళారిగా వ్యవహరించిన ఈసీఐఎల్ కమలానగర్ వాసి కేశవరావు సహాయంతో ఆ కథ నడిపాడు. దాదాపు 240 నకిలీ చెక్కులతో 16 బోగస్ సంస్థల పేర్లతో తెరిచిన ఖాతాల్లోకి ఆ మొత్తాన్ని మళ్లించారు. వీటిలో దాదాపు రూ.20 కోట్లు వరకు సాయి తన వాటాగా తీసుకున్నాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాం: స్కాన్.. ఎడిట్.. ప్రింట్!) సీఐడీకి చిక్కడంతో.. మైనారిటీస్ కార్పొరేషన్ కుంభకోణంలో వచ్చిన రూ. 20 కోట్లనుంచి సాయి .. రూ.8 కోట్లను ఏబీసీ టీవీ పేరుతో ఓ టీవీ చానల్ ఏర్పాటు చేయడానికి వెచ్చించాడు. దానికోసం హైదరాబాద్లో ఓ భవనాన్ని లీజుకు తీసుకుని దాన్ని ఆధునీకరించడంతో పాటు కావాల్సిన ఫర్నిచర్ కూడా సిద్ధం చేసుకున్నాడు. ఇందులో పనిచేయడానికోసం వివిధ మీడియా సంస్థల్లో పనిచేస్తున్నవారికి జీతాల అడ్వాన్సులుగా భారీ మొత్తాలు చెల్లించాడు. అయితే ఆ చానల్ కార్యరూపం దాల్చకముందే మైనార్టీ కార్పొరేషన్ స్కామ్లో ఉమ్మడి రాష్ట్ర సీఐడీకి చిక్కాడు. (చదవండి: తెలుగు అకాడమీ స్కాంలో వెలుగుచూసిన కొత్త కోణం) ఆ కేసు దర్యాప్తులో చానల్ ఏర్పాటు యత్నాలను సీఐడీ అధికారులు గుర్తించారు. తాజాగా తెలుగు అకాడమీ ఎఫ్డీల నుంచి కాజేసిన సొమ్ములో దాదాపు రూ.20 కోట్ల వరకు తీసుకున్న సాయి కుమార్ ఇందులోంచి కొంత డబ్బును యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్కు అడ్డా అయిన కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ఏర్పాటు కోసం వెచ్చించాడు. తెలుగు అకాడమీ స్కామ్కు అడ్డా అయిన కొండాపూర్లోని సైబర్ రిచ్ అపార్ట్మెంట్స్లోని రెండు ఫ్లాట్స్లోనే చానల్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. తొలుత యూట్యూబ్ చానల్ ప్రారంభించి మరో స్కామ్ చేసినప్పుడు సంపాదించే సొమ్ముతో దాన్ని శాటిలైట్ చానల్గా మార్చాలని సాయి పథకం వేసినట్లు తెలిసింది. చదవండి: తెలుగు అకాడమీ స్కాం: మరో రూ.20 కోట్లకు స్కెచ్! -
ఛీ! యాక్!! మూడేళ్లగా పచ్చిమాంసం మాత్రమే తింటున్నాడు.. ఒక్క రోజు కూడా..
ఈ మధ్యకాలంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ కాన్షియస్ తెగ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ తమదైన శైలిలో రకరకాల ఆహార అలవాట్లు ఆచరిస్తున్నారు. ఐతే భిన్న ఆహార అలవాట్లు భిన్న ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటాయనడంలో సందేహం లేదు. పచ్చి మాంసాన్ని రోజు వారీ ఆహారంగా తినడం అటువంటి ప్రత్యేక ఆహార అలవాట్లలో ఒకటి. అవును.. మీరు సరిగ్గానే చదివారు! ఓ వ్యక్తి గత మూడేళ్లగా పచ్చిమాంసం తింటూ ఎటువంటి అనారోగ్యం తలెత్తకుండా సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానంటూ చెబుతున్నాడు. అతనెవరో.. అది ఎలా సాధ్యమయ్యిందో తెలుసుకుందాం.. అమెరికాలోని నెబ్రస్కాకు చెందిన వెస్టన్ రో అనే వ్యక్తి మూడుళ్లుగా వండకుండా లేదా వేడిచేయకుండా మాంసం, చికెన్, గుడ్లు.. వంటి మాంస ఉత్పత్తులను పచ్చిగానే తింటున్నాడట. ఔరా! అని ముక్కు మీద వేలేసుకుంటున్నారా? అంతేకాదు.. తన విచిత్ర ఆహార అలవాట్లపై 'ది నేచురల్ హ్యూమన్ డైట్' పేరుతో యూట్యూబ్ ఛానెల్లో డాక్యుమెంట్ కూడా చేశాడట. సాల్మన్ అనే చేప, చికెన్ ఆర్గన్స్, పచ్చి మాంసం.. మొదటైన వాటిని పచ్చిగా తినడం మనం అతని వీడియోల్లో చూడొచ్చు. పచ్చి మాంసం తినే అలవాటు మీకు కొంత విడ్డూరంగా అనిపించినా... వెస్టన్ రో మాత్రం ఈ ఆహారంతో రోజంతా ఎనర్జిటిక్గా ఉంటున్నట్లు చెబుతున్నాడండీ!! రో తన మానసిక, శారీరక ఆరోగ్యం పూర్తిగా స్థిమితంగానే ఉందనీ, ఈ పచ్చి మాంసం ఆహారంగా తినడం ప్రారంభించిన తర్వాత ఒక్కసారి కూడా అనారోగ్యం బారీన పడ్డదాకలాలు లేవని, ఇంతవరకు ఏ ఆరోగ్య సమస్యలు తలెత్తలేదనీ.. తన ఆరోగ్యంపై పచ్చి మాంసం ఎలాంటి ప్రభావాన్ని చూపిందో ది ఇండిపెండెంట్ అనే ఆన్లైన్ న్యూస్ పేపర్కు వివరించాడు. కల్టివేట్ (వ్యవసాయం) చేసిన మాంసం, చికెన్, గుడ్లు.. క్రమంతప్పకుండా తింటున్నానని, ఉడికించిన ఆహారంతో పోలిస్తే మరింత శక్తినిస్తుందని డైలీ మెయిల్ అనే బ్రిటీష్ డైలీ మిడిల్ మార్కెట్ న్యూస్పేపర్కు వెల్లడించాడు. ముడి చికెన్ తరచుగా తింటే ‘సాల్మొనెల్లా’ అనే ఇన్ఫెక్షన్ బారీన పడే అవకాశం ఉంది. ఇది సాధారణంగా కలుషిత ఆహారం, నీళ్ల కారణంగా సోకుతుంది. ఎప్పుడైనా ఈ వ్యాధితో బాధపడ్డావా అని అడిగినప్పుడు, ఇది చాలా వివాదాప్సదమైన అంశం. కానీ పచ్చి మాంసంలోని బాక్టీరియా మన శరీరంలో సహజ సమతుల్యతకు దారి తీస్తుందని, ఎటువంటి హాని కలగదని న్యూయార్క్ పోస్ట్తో చెప్పడు. ఇతని పచ్చి మాంసం ఆహార అలవాట్ల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే అతని యూట్యూబ్ చానెల్లో తెలుసుకోవచ్చు. చదవండి: World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు.. -
నెలకు రూ.95 లక్షలు సంపాదిస్తున్న యూట్యూబర్
న్యూఢిల్లీ: యూట్యూబ్(YouTube).. ఇది కేవలం వినోదాన్ని మాత్రమే కాదు.. ఆదాయాన్ని అందించే అద్భుత వనరు. ప్రస్తుతం యూట్యూబ్లో సొంతంగా చానెల్ కలిగి ఉండి.. దాని ద్వారా ఇంట్లో కూర్చునే ఆదాయం సంపాదిస్తున్నారు చాలా మంది. కొందరు యూట్యూబర్స్ నెలకు ఏకంగా ఎంఎన్సీ కంపెనీల సీఈఓల కన్నా అధిక ఆదాయాన్ని పొందుతున్నారంటే అతిశయోక్తి కాదు. ఈ కోవకు చెందిన యూట్యూబరే భువన్ బామ్. భువన్ బామ్ తన యూట్యూబ్ చానెల్ ద్వారా నెలకు ఏకంగా సుమారు 95 లక్షల రూపాయల ఆదాయం ఆర్జిస్తున్నాడు. ఈ విషయాలను కానాలెడ్జ్.కామ్ (caknowledge.com) అనే సైట్ వెల్లడించింది. ఇదే కాక భువన్ బామ్ పేరుమీద మరో రికార్డు కూడా ఉంది. భారతదేశంలో 10 మిలియన్ల సబ్స్క్రైబర్స్ సాధించిన తొలి యూట్యూబర్గా రికార్డు సృష్టించాడు భువన్. అతడి సక్సెస్ స్టోరీ వివరాలు.. (చదవండి: జాబ్ వదిలేసి పాత డ్రమ్ములతో వ్యాపారం.. అతని జీవితాన్నే మార్చేసింది) న్యూఢిల్లీకి చెందని భువన్ బామ్ గ్రీన్ ఫీల్డ్స్ స్కూల్లో చదువు పూర్తి చేసుకున్నాడు. షాహీద్ బాగ్ సింగ్ కాలేజీ నుంచి డిగ్రీ పూర్తి చేశాడు. అనంతరం బీబీ కి వైన్స్ పేరుతో యూట్యూబ్ చానెల్ స్టార్ట్ చేశాడు. చఖ్నా ఇష్యూ అనే వీడియో వైరల్ అవ్వడంతో భువన్ బామ్ చానెల్ సబ్స్క్రైబర్స్ పెరగడం ప్రారంభం అయ్యింది. ప్రస్తుతం ఇతడి చానెల్కు ఏకంగా 22 మిలియన్ల మంది కన్న ఎక్కువ మంది సబ్స్క్రైబ్ చేశారు. అర్థవంతమైన కంటెంట్తో నెటిజనలును అలరిస్తుంటాడు భువన్ బామ్. కొన్ని షార్ట్ ఫిల్మ్స్లో కూడా నటించాడు భువన్ బామ్. (చదవండి: కమ్మని ‘అమ్మచేతి వంట’!) ఇక యూట్యూబ్ చానెల్ ద్వారా భువన్ బామ్ ఏడాది ఏకంగా 22 కోట్లు సంపాదిస్తున్నాడని.. నెలకు సుమారు 95 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నాడని.. కానాలెడ్జ్.కామ్ వెల్లడించింది. ఇదే కాక మింత్ర డీల్ ద్వారా మరో 5 కోట్ల రూపాయలు, మివి ద్వారా 4 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నాడని తెలిపింది. ఇవే కాక భువన్ బామ్ ఆర్కిటిక్ ఫాక్స్, లెన్స్కార్ట్, మివి, బియర్డో, టిస్సాట్, టేస్టీట్రిట్స్ వంటి వాటికి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నాడు. చదవండి: కోటి మంది సబ్స్క్రైబర్లతో రికార్డు సృష్టించిన కుకింగ్ చానెల్ -
యూట్యూబ్తో లక్షలు సంపాదిస్తున్న కేంద్రమంత్రి!
కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తన యూట్యూబ్ ద్వారా నెలకు ఎంత సంపాదిస్తున్నారో తెలుసా?. అక్షరాల నాలుగు లక్షలకు పైనేనంట. అంతేకాదు తనకు పిల్లనిచ్చిన మామ ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు ఇచ్చారట. అది ఎందుకో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని పంచుకున్నారు. హరియాణాలో ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పనుల్ని సమీక్షించడానికి వెళ్లిన గడ్కరీ.. ఓ ఈవెంట్కు హాజరై కింది వ్యాఖ్యలు చేశారు. ‘‘కరోనా టైంలో ఇంటికే పరిమితమైన నేను రెండే పనులు చేశా. ఒకటి వంట చేయడం, రెండోది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉపన్యాసాలు ఇవ్వడం. ఆన్లైన్లో చాలా క్లాసులు తీసుకున్నా నేను. అంతేకాదు యూట్యూబ్లోనూ అప్లోడ్ చేశా. వాటిని వ్యూస్ ఎక్కువ రావడంతో యూట్యూబ్ నెలకు నాకు నాలుగు లక్షలు చెల్లిస్తోంది’’ అని చెప్పుకొచ్చారు గడ్కరీ. ఇది చదవండి: టోల్ గేట్ల ధరలపై నితిన్ గడ్కరీ విచిత్ర వ్యాఖ్యలు ఇక పెళ్లైన కొత్తలో తన భార్య కాంచనకు తెలియకుండా.. రోడ్డు మధ్యలో ఉన్న ఆమె తండ్రి ఇంటిని కూల్చేయాలని ఆదేశాలు జారీ చేశానని గుర్తు చేసుకున్నారాయన. ఈ విషయాన్ని తోటి అధికారులు తన దృష్టిని తీసుకొచ్చారని, అయినా కూడా ఆ పని చేయాల్సిందేనని ఆదేశించాలని చెప్పినట్లు నితిన్ గడ్కరీ నవ్వుతూ చెప్పారు. క్లిక్ చేయండి: ‘హారన్’ సౌండ్లు మార్చేస్తాం: గడ్కరీ -
సరికొత్త వీడియోతో.. రాకింగ్ స్టార్ డాటర్స్..
సాక్షి, హైదరాబాద్: ‘ఏ అండ్ ఎస్' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతున్న లిటిల్ రాక్ స్టార్స్ తాజా వీడియోతో సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నారు. ఇటీవల గోవా హాలిడే ట్రిప్లో ఎంజాయ్ చేసిన ఈ పిడుగులిద్దరూ తమదైన శైలిలో ఒక వీడియోను తీసుకొచ్చారు. ఇంతకీ ఆ పిడుగులు మరెవ్వరో కాదు స్టార్ డాటర్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు తనయ సితార, స్టార్ దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య. ఈ తాజా వీడియోను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విటర్లో షేర్ చేశారు. To how it all began! My favourite duo is back.. taking us through Goa this time! Loved the video as always! Rock on my girls 🤗🤗🤗 #AadyaAndSitara pic.twitter.com/XS4MELMEbU — Mahesh Babu (@urstrulyMahesh) August 28, 2021 -
Youtube Studio: డిజిటల్ వరల్డ్ మీకు నచ్చేలా మీరు మెచ్చేలా..
యూట్యూబ్ తెలిసినంతగా చాలామందికి యూట్యూబ్ స్టూడియో తెలిసి ఉండకపోవచ్చు. ఆ స్టూడియోలో ఏం ఉంటాయి? క్రియేటర్లకు దారి చూపించే విశ్లేషణ పరికరాలు ఉంటాయి. మన బండికి వేగం పెంచే ఇంధనాలు ఉంటాయి... ‘యూట్యూబ్ స్టూడియో’ క్రియేటర్స్కు ఇల్లులాంటిది. ఆ ఇంటిలో చిన్నవాళ్లకు విలువైన సలహాలు ఇచ్చే పెద్దమనిషిలాంటిది. భరోసా ఇచ్చే బాస్లాంటిది. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం చాలా వీజి. దాన్ని నిలబడేలా చేయడం, పరుగెత్తేలా చేయడం శానా కష్టం. ఇది ఎందరికో అనుభవంలో ఉన్న విషయం. యూట్యూబ్ ఛానల్ హిట్టు,ఫట్టు వెనుక ‘అదృష్టం’ పాత్ర ఏమీ ఉండదు. మన పాత్రే ఉంటుంది. ఆ పాత్ర రక్తి కట్టాలంటే, మీరు విజయపథంలో దూసుకెళ్లాలంటే.. మీకు అవసరమైనది యూట్యూబ్ స్టూడియో. ఆడియన్స్ ఇంటరాక్షన్ నుంచి ఛానల్ డెవలప్మెంట్ వరకు రకరకాలుగా ఉపయోగపడుతుంది. యూట్యూబ్ స్టూడియోలో.. ఛానల్ డ్యాష్బోర్డ్, వీడియోస్, ప్లేలిస్ట్, ఎనాలిటిక్స్, కామెంట్స్, సబ్టైటిల్స్, మోనిటైజేషన్, కస్టమైజేషన్, ఆడియోలైబ్రరీ.. మొదలైన ఫీచర్లు ఉంటాయి. ఇందులో ముఖ్యమైనవి ప్లేలిస్ట్, ఎనలిటిక్స్. ఛానల్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఉండాలంటే ప్లేలీస్ట్లు తప్పనిసరి. యూట్యూబ్ స్టూడియోలో ప్లేలీస్ట్లు క్రియేట్ చేయడానికి... 1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. లెఫ్ట్ మెను, సెలెక్ట్ ప్లేలీస్ట్ 3. క్లిక్–న్యూ ప్లే లీస్ట్ 4.ఎంటర్–ప్లే లీస్ట్ టైటిల్ 5. సెలెక్ట్–ప్లేలీస్ట్ విజిబిలిటీ సెట్టింగ్స్ 6. క్లిక్ ఆన్ క్రియేట్ ఎడిట్ చేయడానికి...1.సైన్ ఇన్ యూట్యూబ్ స్టూడియో 2. సెలెక్ట్ ప్లేలీస్ట్ 3.ఎడిట్–క్లిక్ 4. డిస్క్రిప్షన్–క్లిక్ 5.సేవ్ ఛానల్ స్పీడ్ అందుకోవడానికి, కంటెంట్ స్ట్రాటజీని రీడిజైన్ చేసుకోవడానికి ‘ఎనాలిటిక్స్’ కావాలి. ఇందులోకి వెళ్లాలంటే...1.మీ ఎకౌంట్లోకి లాగ్ అవ్వాలి 2. క్లిక్–ప్రొఫైల్ ఐకాన్ 3.సెలెక్ట్–యూట్యూబ్ స్టూడియో 4. క్లిక్–గో టూ ఛానల్ ఎనాలిటిక్స్ 5. సెలెక్ట్–ఎనాలిటిక్స్ (లెఫ్ట్ హ్యాండ్ మెనూ) బిగ్గెస్ట్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ యూట్యూట్ కంటెంట్ క్రియేటర్లకు ఉపయోగపడే వినూత్నమైన అప్డెట్స్తో ముందుంటుంది. ‘యూట్యూబ్ స్టూడియో’కి సంబంధించి తాజా అప్డ్ట్ల విషయానికి వస్తే.. హైలీ రిక్వెస్టెడ్ ఫీచర్గా చెప్పుకునే ‘డార్క్మోడ్’ ఫీచర్ యూట్యూబ్కు మాత్రమే కాకుండా ‘యూట్యూబ్ స్టూడియో’కు వచ్చేసింది. ఫ్రెష్లుక్ ఇవ్వడమే కాదు కళ్లకు భారం పడకుండా తేలిగ్గా ఉంటుంది. బ్యాటరీ సేవ్ అవుతుంది. రియల్టైమ్ కార్డ్స్ను మెరుగుపరిచారు. గతంలో ఈ కార్డ్స్ ‘బేసిక్ వోవర్ వ్యూ డాటా’ డిస్ప్లేకే పరిమితం. తాజా అప్డేట్తో సబ్స్క్రైబర్ కౌంట్స్, వీడియో వ్యూస్.. ఇలా అప్–టు–ది–మినిట్ డాటా డిస్ప్లే అవుతుంది. యూట్యూబ్ స్టూడియోలోని ‘మెన్షెన్ ఇన్బాక్స్’తో క్రియేటర్లు యాక్సెస్ కావచ్చు. దీని ద్వారా మీ ఛానల్ ఎక్కడెక్కడ మెన్షెన్ అయిందనే విషయం తెలుసుకోవచ్చు. ఉదా: మరో ఛానల్ వీడియో కామెంట్ సెక్షన్లో మీ ఛానల్ ట్యాగ్ అయితే దాని గురించి తెలుసుకోవచ్చు. ‘మీ సినిమా ఆడాలంటే మీకు నచ్చగానే సరిపోదు. ప్రేక్షకులకు మీకంటే బాగా నచ్చాలి’ అనేది అత్యంత పాత విషయం అయినప్పటికీ ఎప్పటికప్పుడు కొత్తగా మరిచిపోతూనే ఉంటాం. ఛానల్ వ్యవహారం కూడా అంతే. ‘చేసిందంతా చేసేశాను. ఇంకేటి సేత్తాం’ అనుకోవద్దు. ‘యూట్యూబ్ స్టూడియో’పై లుక్కేయండి. ఆడియెన్స్ నాడి కనిపెట్టండి. సరదిద్దుకోండి. దూసుకుపోండి. -
అదరగొడుతున్న ఆయు, పిహు... కోటిన్నర సబ్స్క్రైబర్స్
తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏదైనా సరే ‘ది బెస్ట్’ ఇవ్వాలనుకుంటారు. ఈ క్రమంలో పిల్లల కోసం కష్టపడడమేగాక, మరికొన్నిసార్లు వాళ్లు కూడా చిన్నపిల్లల్లా మారిపోతుంటారు. అచ్చం ఇలాగే మారిపోయిన... ఆయు, పిహు తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద యూట్యూబ్ ఛానల్ ప్రారంభించారు. అందులో పిల్లలతోపాటు తాము కూడా వివిధ రకాల ఆటలలో పాల్గొంటూ ఆ వీడియోలను తమ ఛానల్లో అప్లోడ్ చేస్తున్నారు. కంటెంట్ ఆసక్తికరంగా ఉండడంతో ప్రస్తుతం వీరి ఛానల్ కిడ్స్ విభాగంలో దాదాపు కోటిన్నర సబ్స్క్రైబర్స్తో టాప్టెన్లో దూసుకుపోతోంది. రాజస్థాన్లోని కోటా నగరానికి చెందిన పియూష్, రుచి కల్రా దంపతులకు 2007 ఏప్రిల్ 2న ప్రకృతి(పిహు), 2013 ఆగస్టు 27న ఆయుష్(ఆయు)లు పుట్టారు. ఆయుకు మూడున్నర ఏళ్లు ఉన్నప్పుడు తన తండ్రి ఆన్లైన్లో చూసే అన్ బాక్సింగ్, రివ్యూ వీడియోలను ఆసక్తిగా గమనించేవాడు. రోజూ తను చూసే వీడియోలను ఆయు ఇష్టపడుతుండడంతో పిల్లలకు సంబంధించిన వీడియోలు ఏవైనా ఆయుకు చూపించాలని పియూష్కు అనిపించింది. అయితే పిల్లల వీడియోలు దాదాపు అన్నీ యానిమేటెడ్వే కావడం, కొన్ని హిందీలో లేకపోవడంతోపాటు లైవ్గా ఎవరైనా యాక్షన్ చేసి చెప్పేవి కూడా ఏవీ కనిపించలేదు. పిల్లలకు మరిన్ని విషయాలు నేర్పించాలంటే మాతృ భాషలోనే ఉంటే బావుంటుందని ఆయన 2017 మేలో ‘ఆయు అండ్ పిహు షో’ పేరిట యూట్యూబ్ ఛానల్ను ప్రారంభించారు. ఈ షోలో ఐదేళ్ల ఆయు, పదకొండేళ్ల పిహులు పిల్లలకు నచ్చే నీతి కథలు, మంచి అలవాట్లు, వివిధ రకాల పోటీలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేసేవారు. పిల్లలతో ప్రారంభించిన ఛానల్ అయినప్పటికీ ప్రొఫెషనల్గా తీర్చిదిద్దేందుకు లైటింగ్, కెమెరా, హై ఎండ్ గేమింగ్ ల్యాప్ టాప్ను ఏర్పాటు చేసి, పిల్లలు కంటెంట్ను క్రియేట్ చేస్తుంటే పియూష్, రుచిలు వాటిని షూట్ చేయడం, స్క్రిప్ట్ రెడీ చేయడం, ఎడిట్ చేయడంతోపాటు, షోలో లోటుపాట్లను సరిచేసేవారు. వాస్తవికథలతో... ప్రారంభంలో కుకింగ్ పాఠాలు, మంచి అలవాట్ల పైన వీడియోలు రూపొందించి ఛానల్లో అప్లోడ్ చేసేవారు. మేలో ఛానల్ ప్రారంభించినప్పటికీ మరుసటి ఏడాది మార్చివరకు సబ్స్కైబర్స్ సంఖ్య వెయ్యి లోపే ఉండేది. నీతికథలను మరింత బాగా చెప్పగలిగితే వ్యూవర్స్ సంఖ్య పెరుగుతుందన్న ఆలోచన రావడంతో...అప్పటి వరకు వినని హిందీ నీతి కథలను ప్రత్యేకంగా రూపొందించి వినిపించడం ప్రారంభించారు. నిజజీవితంలో జరిగిన కొన్ని సంఘటనలను కథలుగా చెప్పడం, నీతితోపాటు కాస్త కామెడీ కూడా ఉండేలా కథలను తయారు చేసి ఛానల్లో అప్లోడ్ చేసేవాళ్లు. దీంతో ఛానల్ బాగా పాపులర్ అయ్యింది. ‘ఏక్ జూట్’(అబద్దం) వీడియోకు ఏకంగా 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కోటికి పైగా సబ్స్క్రైబర్స్... నీతికథల వీడియోలు షూట్ చేయడానికి ఎక్కువ సమయం పడుతుండడంతో.. వీటితోపాటు ఛాలెంజింగ్ వీడియోలు చేసి అప్లోడ్ చేసేవారు. ప్రతి గురువారం కొత్త వీడియో, లఘు చిత్రాలు, చాలెంజింగ్ గేమ్లు, ఫ్యామిలీ కామెడీ, యాక్టివిటీ లెర్నింగ్ కామెడీ వీడియోలను అప్లోడ్ చేయడంతో.. 2018 జూన్ నాటికి ఆయు అండ్ పిహు షో లక్షమంది సబ్స్క్రైబర్ల ను దాటేసింది. సెప్టెంబర్ వచ్చేటప్పటికి ఈ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. వీరి ఛానల్ వేగంగా పాపులర్ అవ్వడానికి కారణం ఆయు, పియూలే. అక్కాతమ్ముడు అన్ని యాక్టివిటీల్లో చురుకుగా పాల్గొని వ్యూవర్స్ను ఆకట్టుకోవడంతో సబ్స్క్రైబర్స్ సంఖ్య కోటీ నలభైలక్షలకు చేరింది. ఆయు పిహులతోపాటు తల్లిదండ్రులు పియూష్, రుచిలుకూడా యాక్టివిటీల్లో పాల్గొనడం విశేషం. ఇప్పటికే వీరి ఛానల్కు సిల్వర్, గోల్డ్, డైమండ్ బటన్లు కూడా వచ్చాయి. ప్రస్తుతమున్న కిడ్స్ యూ ట్యూబ్ ఛానళ్లల్లో టాప్ ప్లేస్లో దూసుకుపోతున్న వాటిలో ఆయు అండ్ పిహు షో కూడా ఒకటిగా ఉంది. చదవండి: వరకట్న హత్యలు: జాగ్రత్త... ఉద్యోగం ఊడుతుంది -
నంద్యాలలో విలేకరి దారుణహత్య
బొమ్మలసత్రం: కర్నూలు జిల్లా నంద్యాలలో యూట్యూబ్ చానల్ వీ5 విలేకరి కేశవను ఆదివారం రాత్రి దారుణంగా హత్యచేశారు. పదేళ్లుగా విలేకరిగా పనిచేస్తున్న అతడిపై కక్షగట్టిన కానిస్టేబుల్ సుబ్బయ్య, అతడి సోదరుడు పదునైన ఆయుధంతో వీపు వెనుకభాగంలో పొడిచి హత్యచేసినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు, మృతుడి కుటుంబసభ్యుల సమాచారం మేరకు.. కేశవ వారం కిందట గుట్కా వ్యాపారితో టూటౌన్ కానిస్టేబుల్ సుబ్బయ్యకు ఉన్న సంబంధాలను బట్టబయలు చేశారు. దీనిపై సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఈ విషయం తెలుసుకుని జిల్లా ఎస్పీ సుధీర్కుమార్రెడ్డి కానిస్టేబుల్ సుబ్బయ్యను సస్పెండ్ చేశారు. దీన్ని జీర్ణించుకోలేని కానిస్టేబుల్ సుబ్బయ్య ఆదివారం రాత్రి మాట్లాడాలని చెప్పి కేశవను ఎన్జీవోస్ కాలనీలోని ఆటోస్టాండ్ వద్దకు పిలిపించాడు. కేశవ తోటి రిపోర్టర్ ప్రతాప్తో కలిసి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లారు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు. కానిస్టేబుల్ అవినీతి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన విలేకరిని హత్యచేయటం పట్ల జర్నలిస్ట్ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. కేశవ మృతదేహాన్ని డీఎస్పీ చిదానందరెడ్డి, తాలుకా సీఐ మురళిమోహన్రావు పరిశీలించారు. డీఎస్పీ మాట్లాడుతూ నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. -
తీన్మార్ మల్లన్నపై మరో కేసు.. చిలకలగూడ పీఎస్లో హాజరు
హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జ్యోతిష్యుడు లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదుతో తీన్మార్ మల్లన్నపై పోలీసులు మరో కేసు నమోదు చేశారు. దీంతో తీన్మార్ మల్లన్న చిలకలగూడ పీఎస్లో విచారణకు హాజరయ్యారు. కాగా తనను తీన్మార్ మల్లన్న బెదిరిస్తున్నాడని లక్ష్మీకాంత్ శర్మ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఇక క్యూస్ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద పోలీసులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. -
తీన్మార్ మల్లన్నకు నోటీసులు
సాక్షి, హైదరాబాద్: యూ ట్యూబ్ ఛానల్ క్యూ న్యూస్ వ్యవస్థాపకుడు చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బుధవారం నోటీసులు జారీ చేశారు. ఆ సంస్థ మాజీ ఉద్యోగిని ప్రియాంక ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో నిందితుడిగా పరిగణిస్తూ సీఆర్పీసీ 41ఏ సెక్షన్ కింద వీటిని ఇచ్చారు. పీర్జాదిగూడలోని సంస్థ కార్యాలయంలో బుధవారం రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు మొత్తం 12 హార్డ్ డిస్క్లు స్వాధీనం చేసుకున్నారు. వీటిని పరీక్షల నిమిత్తం రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీకి పంపనున్నారు. ఆ నివేదికతో పాటు దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన ఆధారాలను బట్టి న్యాయస్థానానికి నివేదిక అందజేస్తారు. -
2 యూట్యూబ్ చానెళ్లు.. 2 కోట్ల మంది అభిమానులు
నిరుపేద కుటుంబం.. పెద్దగా చదువుకోలేదు. పెళ్లై పిల్లలతో గృహిణిగా స్థిరపడిపోయింది. మధ్యలో ఆగిపోయిన చదువును కొనసాగించాలనుకుంది. కానీ పిల్లల చదువులు గుర్తొచ్చాయి. దీంతో తనకు వచ్చిన వంటలను వంట రాని వారికి నేర్పిస్తూ రెండు కోట్లమందికి పైగా అభిమానుల్ని ఆకట్టుకుంటోంది పూనమ్ దేవనాని. రెండు యూ ట్యూబ్ చానళ్లతో చిన్నచిన్న చిట్కాలతో వంటలు ఎలా చేయాలో కోట్ల మందికి నేర్పిస్తూ సోషల్ మీడియాలో తనకంటూ ఒక గుర్తింపును ఏర్పర్చుకుంది పూనమ్. మధ్యప్రదేశ్లోని నిరుపేద కుటుంబంలో పుట్టిన పూనమ్ దేవనానికి అమ్మన్నా... ఆమె చేసే వంటకాలన్నా ఎంతో ఇష్టం. దీంతో చిన్నప్పటి నుంచి అమ్మతోనే ఎక్కువ సమయాన్ని గడిపేది. పూనమ్కి ఎనిమిదేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దీంతో అమ్మ చెప్పినట్లు వింటూ బుద్ధిగా చదువుకునేది. ఏ మాత్రం ఖాళీ దొరికినా వంటింట్లో అమ్మ చేసే వంటలను గమనించేది. ఆమె వంటలను ఎలా చేస్తుందో తెలుసుకోవాలన్న ఆసక్తి పూనమ్కు బాగా ఉండేది. ఈ క్రమంలోనే ఎనిమిదో తరగతిలో ఉండగా ఒకరోజు న్యూస్ పేపర్లో వచ్చిన వంటకం చూసి దానిలో ఉన్నట్లుగానే చేసింది. ఆ వంటకం బాగా రావడంతో ఒకపక్క చదువుకుంటూనే మరోపక్క కిచెన్లో రకరకాల వంటల ప్రయోగాలు చేస్తుండేది. కుటుంబ పరిస్థితులు సరిగా లేకపోవడం, దానికితోడు మంచి సంబంధం రావడంతో బిఏ చదువుతుండగానే పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్లాల్సి వచ్చింది. అందరు గృహిణుల్లాగే సంసారాన్ని చూసుకునేది. తొలి ఆదాయం... పూనమ్కి ఇంటి పనులన్నీ అయ్యాక చదువుకోవాలనిపించేది. కానీ పిల్లల చదువులకే ఆదాయం సరిపోవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా చదువుకోగలనా అనిపించింది తనకు. ఏదైనా చేసి డబ్బు సంపాదించాలనుకుంది. కానీ చేతిలో కనీసం డిగ్రీ సర్టిఫికెట్ కూడా లేదు! ఎలా సంపాదిస్తాను? అనుకుంది. అప్పుడే పూనమ్కు ‘నాకు వంట చేయడం వచ్చు కదా దానిని నేను ఎందుకు ఉపయోగించుకోకూడదు..?’ అనే ఆలోచన వచ్చింది. దాంతో 2004లో కాలనీలో ఖాళీగా ఉన్న కొందరు అమ్మాయిలకు వంటలు ఎలా చేయాలో నేర్పించడం మొదలు పెట్టింది. ఆమె వంటలు నేర్పించే విధానం నచ్చడంతో పూనమ్ దగ్గర వంట చేయడం నేర్చుకునే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. తన స్టూడెంట్స్కు వంటల గురించి మరింతగా వివరించేందుకు వివిధ రకాల పుస్తకాలు చదివి మరీ వారడిగే సందేహాలకు సమాధానాలు చెప్పేది. ఇలా రోజూ ఆరు నుంచి ఎనిమిది గంటల పాటు వంటల క్లాసులు చెబుతూ.. సాయంత్రం పెళ్లిళ్లు, పార్టీలలో ఇచ్చే గిఫ్టులను ప్యాకింగ్ చేసేది. అవి అందరికీ నచ్చడంతో ఆమె ఆ పనిని మరింత క్రియేటివ్గా చేసేది. పూనమ్ వంటల క్లాసులు బాగా పాపులర్ అవడంతో ఆమెని వంటల కార్యక్రమాల్లో జడ్జిగా పిలిచేవారు. తన డిగ్రీ సగంలో ఆగిపోయిన కాలేజీకి వంటల క్లాసులు చెప్పడానికి వెళ్లడం విశేషం. అక్కడ కాలేజీ యాజమాన్యం ఇచ్చిన పారితోషికాన్నే పూనమ్ తొలి ఆదాయంగా అందుకొంది. మసాలా కిచెన్... 2004లో ప్రారంభమైన పూనమ్ వంటల జర్నీ సాఫీగా సాగుతూ వచ్చినా, గంటల తరబడి నిలబడి క్లాసులు చెబుతుండడంతో కాళ్లు వాచి, నొప్పులు రావడం మొదలైంది. దీనికితోడు జార్ఖండ్, ముంబై, నోయిడా, ఢిల్లీ, భోపాల్ వంటి ప్రాంతాల నుంచి కూడా తమకు క్లాసులు చెప్పమని అడిగేవారి సంఖ్య పెరుగుతుండడంతో ఇలా లాభం లేదని ‘మసాలా కిచెన్’ పేరుతో యూట్యూబ్ చానల్ ప్రారంభించి ఆన్లైన్ క్లాసులు చెప్పడం మొదలు పెట్టింది. అయితే చాలా కాలం పాటు ఆ చానల్కు ఆదాయం ఏమీ రాలేదు. అయినా నిరాశ చెందలేదు. వీడియోలు చేయడం మానలేదు. ఓసారి పూనమ్ అప్లోడ్ చేసిన ‘బ్రెడ్తో కేక్ తయారీ’ వీడియో బాగా పాపులర్ అవడంతో అప్పటి నుంచి యూ ట్యూబ్ ఆదాయం రావడం మొదలైంది. ప్రస్తుతం మసాలా కిచెన్కు దాదాపు మూడు కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మా ఏ కైసే కర్నా? చాలామందికి బయట తినే అలవాటు కావడం లాక్డౌన్ సమయంలో బయట ఏమీ దొరకకపోవడంతో.. చాలామంది ఇంట్లోనే రకరకాల వంటకాలు చేసుకోవడానికి ప్రయత్నించేవారు. ఈ క్రమంలో వంటరాని బ్యాచిలర్స్, కొత్తగా పెళ్లయిన వారు... ‘అమ్మా ఇది ఎలా చేయాలి? అది ఎలా చేయాలి?’ అని అడిగే ప్రశ్నలు ఎక్కువగా వినిపించేవి పూనమ్కు. దీంతో వీళ్లందరి ప్రశ్నలకు జవాబులు చెప్పేలా ‘మా ఏ కైసే కర్నా’ పేరుతో వంటలకు సంబంధించి మరో యూట్యూబ్ చానల్ను ప్రారంభించి.. సులభమైన కిచెన్ టిప్స్ చెప్పడం మొదలు పెట్టింది.. ఈ చానల్కు మంచి ఆదరణ లభించింది. ప్రస్తుతం ఈ చానల్కు కోటీ ముప్ఫై లక్షలకుపైనే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. -
అవార్డు రెడీ! అమౌంట్ రెడీయేనా!!
దిగాలుగా కూర్చున్న శోభను చూస్తూ ‘ఏమైంది..?’ అడిగింది లలిత. ముందు కొంచెం సంశయించినా అసలు విషయం చెప్పక తప్పింది కాదు శోభకి. ∙∙∙ ఆర్నెల్లుగా శోభ యూ ట్యూబ్లో వంటల ఛానెల్ నడుపుతోంది. వారంలో రెండు రకాల వంటలైనా అప్లోడ్ చేస్తుంటుంది. ఛానెల్ మానిటైజేషన్కు దగ్గరలో ఉంది. సబ్స్క్రైబర్ల జాబితా ఇంకాస్త పెరిగితే అనుకున్న టార్గెట్ పూర్తవుతుందనే ఆనందంలో ఉంది శోభ. ఓరోజున వీడియో షూట్లో బిజీగా ఉన్న శోభ ఫోన్ రింగయ్యింది. కొత్త నెంబర్. ఫోన్ చేసినవారు తమని తాము పరిచయం చేసుకున్నారు. విషయం విన్న శోభ మొహం వెలిగిపోయింది. రూల్స్ అన్నీ నోట్ చేసుకుంది. పని పూర్తయ్యాక నోట్ చేసుకున్న వెబ్సైట్లో తన వివరాలన్నీ ఇచ్చి, రిజిస్ట్రేషన్ చేసుకుంది. మరుసటి రోజు మరో కొత్త నెంబర్ నుంచి ఫోన్. శోభ ఇచ్చిన వివరాలన్నీ చాలా బాగున్నాయని, కార్పోరేట్ çసంస్థలతో డీల్కి ఈ ప్రొఫైల్ వెళ్లాలంటే ది బెస్ట్ అవార్డు ఒకటుండాలని, అది తమ కంపెనీ ఇస్తుందంటూ ఇప్పటి వరకు అవార్డు వచ్చినవారు ఏ స్థాయిలో ఉన్నారో ఊరిస్తూ చెప్పారు. అందుకు సంబంధించిన వివరాలతో మెయిల్ పంపించాం చెక్ చేయండి అని చెబుతూ... అవార్డుకి రెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సి ఉంటుంద’న్నారు. ముందు కొంచెం తటపటాయించినా, ‘పెద్ద స్థాయి కంపెనీల నుంచి స్పాన్సర్స్ వస్తే ఛానెల్ పాపులర్ అవుతుంది, ఆదాయమూ పెరుగుతుంది. కదా..‘ఇంట్లోవారికి చెబితే ఈ డిజిటల్ గోల వారికి అర్ధం కాదు. పైగా ఎన్నో ప్రశ్నలు వేసి విసిగిస్తారు, వద్దులే!’ అనుకుంది. అవార్డు కంపెనీ పెట్టిన నిబంధనలకు ఓకే చెబుతూ.. వారు చెప్పిన అమౌంట్ను ట్రాన్స్ఫర్ చేసింది. వారం రోజులుగా అవార్డ్ కంపెనీ నుంచి ఫోన్ వస్తుందని, మెయిల్ వస్తుందని ఎదురు చూస్తూనే ఉంది. ఈ విషయమంతా శోభ ద్వారా విన్న లలిత... ‘నువ్వు మోసపోయావు శోభా! డబ్బు సెండ్ చేసే ముందు ఒక్క మాటైనా నాకు చెప్పాలింది. సోషల్ మీడియాలో ఇటీవల ‘అవార్డు ఇస్తామహో..’ అనే మోసాలు ఎక్కువగా పుట్టుకు వస్తున్నాయి. పాతిక వేల నుంచి పాతిక లక్షల వరకు టోపీ పెడుతున్నారు అవార్డ్ ఫ్రాడ్స్.. అంటూ ఏయే విధంగా సోషల్ మీడియాలో ఈ తరహా మోసాలు జరుగుతున్నాయో వివరించింది లలిత. టార్గెట్ ఇలా మొదలు ► కరోనా మొదలైనప్పటి నుంచి ఇలా అవార్డ్ ఫ్రాడ్ చేసే వారి సంఖ్య పెరిగింది. మహిళలను, టీనేజర్స్ను టార్గెట్ చేసుకొని అవార్డు గాలం వేస్తుంటారు. ► ఛానెల్ మానిటైజేషన్కి అంచున ఉన్నవారు మొదటి టార్గెట్. ► సోషల్ ప్రొఫైల్స్లో పూర్తి వివరాలున్నవారు, సోషల్ యాక్టివిటీస్ ఎక్కువగా ఉన్నవారు రెండవ టార్గెట్. ► మీరు, మీ వర్క్ చాలా బాగుంది అంటూ మాటలు కలుపుతారు. మీకు బెస్ట్ అవార్డు తప్పక వస్తుందని నమ్మబలుకుతారు. ► తమ కంపెనీ నుంచి తీసుకున్న అవార్డుతో జాతీయ స్థాయిలో ఫేమస్ అవుతారని, అలా ఇప్పటివరకు ఫేమస్ అయినవారి జాబితా చూపుతారు. అవార్డు తీసుకుంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మీరు మరింత ఫోకస్ అవుతారని మాటల్లో పెడతారు. ముంబయ్ లేదా ఢిల్లీ వంటి నగరాలలో పెద్ద స్థాయి వేదికల మీద వచ్చి అవార్డు ఫంక్షన్ అంటారు. ► మా దగ్గర మీరు అవార్డు తీసుకుంటే మీ ప్రొఫైల్ కార్పోరేట్ స్పాన్సర్స్కు వెళుతుందని, అప్పుడు వారు మీకు స్పాన్సర్షిప్ ఇస్తారని చెబుతారు. ► సిల్వర్, గోల్డ్, ప్లాటినమ్.. ఇలా అవార్డ్కి ఒక రేటు చొప్పున చెబుతారు. డబ్బులు ఎక్కువ ఇచ్చేవారుంటే డైమండ్ అవార్డ్ ఎర వేస్తారు. ► ఇంకా లొంగిపోతే మీ ఛానెల్ని ముందుకు తీసుకెళ్తాం.. అంటూ ఇంకా డబ్బులు లాగుతారు. సోషల్ ఇంజనీరింగ్ ఫ్రాడ్స్ ఎప్పుడూ ఈ తరహా పనిలో ఉంటారు. మేం కన్ఫర్మ్ చేసుకుంటాం అంటూ... రెండు, మూడు వీడియోలు కూడా లైవ్ లో చేయిస్తారు. రిజిస్ట్రేషన్కే 5 నుంచి 10 వేల రూపాయలు కట్టించుకుంటారు. ∙ లింక్స్ను గుడ్డిగా క్లిక్ చేయకూడదు వాస్తవానికి పెద్ద పెద్ద కార్పొరేట్ డీల్స్తో ఒక వీడియో చేస్తే పాతికవేల ఆదాయం వస్తుంది. వీరు కూడా అలాగే ఆలోచించి రెండు వీడియోలు చేసినా యాభై వేలు వస్తుంది కదా! అనుకుంటారు. అందుకు అవార్డు ఒక అర్హతగా నమ్ముతారు. అలాగే డబ్బులు పోగొట్టుకుంటారు. మోసగాళ్లు పాష్ ఇంగ్లిష్ మాట్లాడే ఒకరిద్దరిని అపాయింట్ చేసుకొని ఈ తరహా ఫ్రాడ్కి తెర లేపుతుంటారు. అందుకే ఒకే నెంబర్ నుంచి కాకుండా కొత్త కొత్త నెంబర్ల నుంచి ఫోన్లు వస్తుంటాయి. డబ్బులు ఇచ్చి అవార్డు ఇస్తున్నారంటేనే అది పెద్ద స్కామ్ అనుకోవాలి. అలాంటి లింక్స్ ఏవైనా వచ్చినా క్లిక్ చేయకూడదు. – అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ అత్యాశకు పోకూడదు ఈ తరహా ఫ్రాడ్స్ గురించి కేసులు ఫైల్ అవలేదు. కానీ, నేరాలు జరుగుతున్నాయనేది మాత్రం వాస్తవం. డబ్బులిచ్చి అవార్డు తీసుకోవడం అనేదే పెద్ద స్కామ్ అని గుర్తించాలి. నిజమైన అవార్డు ఇచ్చేవారెవరూ డబ్బులు తీసుకోరని గుర్తుంచుకోవాలి. డిజిటల్ మార్కె టింగ్ గురించి కూలంకషంగా తెలుసుకొని, జాగ్రత్త వహించాలి. కానీ, ఆత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోకూడదు. – జి.ఆర్. రాధిక, ఎస్పీ, (సైబర్ క్రైమ్ విభాగం), ఏపీ పోలీస్ -
ఐటీ మంత్రి కేటీఆర్ను దూషిస్తున్న వ్యక్తిపై కేసు
హిమాయత్నగర్: మంత్రి కేటీఆర్ను తిడుతూ ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న పోస్టుల ను సుమోటోగా తీసుకుని అతగాడిపై శనివారం సిటీ సైబర్క్రైం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చే శారు. కొద్దిరోజులుగా మంత్రి కేటీఆర్ను దూషి స్తూ యూట్యూబ్లో ఘర్షణ అనే చానల్ టెలికాస్ట్ చేస్తుంది. మంత్రితో పా టు, ముఖ్యమంత్రి కేసీఆర్ను సైతం తిడుతున్న ట్లు పోలీసులు తెలిపారు. దీంతో సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేసినట్లు ఏసీపీ కేవీఎన్ ప్రసాద్ తెలిపారు.